Osmania University
-
ఆ విషయంపై వివరణ ఇవ్వండి.. ఓయూ రిజిస్ట్రార్కు హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఆందోళనకు అనుమతి లేకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ ఉస్మానియా వర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసిన న్యాయస్థానం.. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉస్మానియా రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఉస్మానియా వర్సిటీలో నిరసనలకు అనుమతి లేదంటూ రిజిస్ట్రార్ ఈ నెల 13న జారీ చేసిన సర్కులర్ చట్టవిరుద్ధమంటూ ఓ విద్యార్థి పిటిషన్ దాఖలు చేశారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1), 21ను ఉల్లంఘించినట్లేనని.. ఆ సర్కులర్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ బీ.విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉస్మానియాలో నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్న స్టాండింగ్ కౌన్సిల్.. అయితే కాలేజీ ఆవరణల్లో, డిపార్ట్మెంట్లో ఆందోళనలను నిలిపివేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిజస్ట్రార్కు న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు. -
ఉస్మానియా ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ: ఆందోళనలు.. రాస్తారోకోలు.. దిష్టి»ొమ్మ, బడ్జెట్ ప్రతుల దహనాలు.. సంతకాల సేకరణ.. విద్యార్థి నాయకుల అరెస్టులతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బుధవారం అట్టుడికింది. క్యాంపస్లో నిరసన ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ జారీచేసిన సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి, వైస్చాన్స్లర్కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సర్క్యులర్ను వెనక్కు తీసుకునేలా వర్సిటీ యాజమాన్యాన్ని ఒప్పించాలని ఎమ్మెల్సీ ప్రొ.కోదండరామ్ను కలసి విద్యార్థి జేఏసీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఇదే డిమాండ్తో ఏబీవీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని మాల స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో తక్కువ శాతం నిధులు కేటాయించారని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఓయూలో 2018లో ప్రవేశం పొందిన పీహెచ్డీ స్కాలర్స్కు మరో ఏడాదిపాటు గడువు పొడింగించేలా వీసీతో మాట్లాడాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం సమర్పింపంచారు. ఆందోళన చేపట్టిన 23 మంది విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి ఓయూ, అంబర్పేట, లాలాగూడ పోలీసు స్టేషన్లకు తరలించినట్లు సీఐ రాజేందర్ తెలిపారు. కాగా, నిషేధాజ్ఞల సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో వామపక్ష విద్యార్థి సంఘాలు గురువారం ఓయూ బంద్కు పిలుపునిచ్చాయి. ఐదు రోజులుగా వీసీ ఆఫీస్ గేటు మూసివేత క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనతో వీసీ కార్యాలయం ప్రధాన ప్రవేశ ద్వారాన్ని గత ఐదు రోజులుగా మూసివేశారు. కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో వివిధ పనులపై వీసీ, రిజి్రస్టార్, ఇతర అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. పట్టు వీడని విద్యార్థులు.. బెట్టు వీడని అధికారులు ఓయూలో ఆందోళనలపై విధించిన నిషేధాజ్ఞలను వ్యతిరేకిస్తూ వర్సిటీ క్యాంపస్లో ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తుండగా, అధికారులు ససేమిరా అంటున్నారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సాధారణ విద్యార్థులు కోరుతున్నారు. ఓయూలో జరుగుతున్న పరిణామాలపై వీసీ ప్రొ.కుమార్ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
OUలో ఆంక్షలు విధించడంపై కేటీఆర్ మండిపాటు
-
ఓయూలో ‘పదోన్నతుల’ రగడ!
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో పదోన్నతుల రగడ కొనసాగుతోంది. అధిక వేతనం కోసం కొంతమంది ప్రొఫెసర్లు (Professors) అడ్డదారిలో ప్రమోషన్లు పొందారనే అంశం ఓయూ అధ్యాపక, విద్యార్థి వర్గాల్లో కలకలం రేపుతోంది. తప్పుడు సమాచారం ఇచ్చి 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు పొందినట్లు ‘ఔటా’ ఫిర్యాదు చేయగా, మాజీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొఫెసర్ బాలకిషన్ పదోన్నతులను రద్దు చేస్తూ యూజీసీ (UGC) ఉత్తర్వులు జారీ చేసింది.కొత్తగా సీనియర్ ప్రొఫెసర్ హోదా.. యూనివర్సిటీల్లో బోధన, పరిశోధనలకుగాను ప్రొఫెసర్లను నియమిస్తారు. ప్రొఫెసర్ కంటే ముందుగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లేదా రీడర్ హోదాలు ఉంటాయి. అయితే బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టాక సీనియర్ ప్రొఫెసర్ అనే మరో హోదాను సృష్టించింది. సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందాలంటే యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్గా 10 ఏళ్ల సరీ్వస్, 10 పరిశోధనా పత్రాలు(పబ్లికేషన్స్), ఇద్దరు విద్యార్థులకు పీహెచ్డీ పర్యవేక్షకులు(గైడ్షిప్)గా ఉండాలి. సీనియర్ ప్రొఫెసర్కు నెలకు రూ.3.40 లక్షల వరకు వేతనంతోపాటు పింఛను, ఇతర అలవెన్సులు ఉంటాయి.తొలిసారి 51 మందికి అవకాశంఓయూ మాజీ వైస్ చాన్స్లర్ ప్రొ.రవీందర్ హయాంలో మూడుసార్లు జరిగిన కెరియర్ అడ్వాన్స్డ్ స్కీమ్(సీఎస్ఎస్) పదోన్నతుల్లో 51 మంది సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. కానీ, అందులో కొందరికి యూజీసీ నిబంధనల ప్రకారం పరిశోధనా పత్రాలు 10 కంటే తక్కువగా ఉన్నాయని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(ఔటా) నాయకులు ఫిర్యాదు చేశారు. ఔటా ఫిర్యాదు మేరకు ఓయూ మాజీ వీసీ ప్రొ.తిరుపతిరావు అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. అయితే కమిటీ విచారించిన అంశాలను బహిర్గతం చేయాలని ఔటా నాయకులు కోరినా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ‘గతం గతః భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడాలి’అని కమిటీ విచారణలో పేర్కొన్నట్లు తెలిసింది. ఇద్దరి పదోన్నతులు చెల్లవు: యూజీసీ ఓయూలో ఇద్దరు సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతులు చెల్లవని యూజీసీ తేల్చి చెప్పింది. మాజీ వీసీ ప్రొ.రవీందర్, సైన్స్ మాజీ డీన్ ప్రొ.బాలకిషన్కు యూజీసీ నిబంధనల ప్రకారం 10 పరిశోధనాపత్రాలు లేవని తేలడంతో వారి పదోన్నతులు రద్దు చేయాలని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరో 40 మందికి కూడా 10 పరిశోధన పత్రాలు లేవని ఔటా, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినవారికి ఇంతకాలం చెల్లించిన వేతనం, పింఛన్ రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.చదవండి: పాతబస్తీ మెట్రో పనులు.. చకచకా!నిబంధన మేరకే..: ప్రొ.రవీందర్ ఓయూలో తొలిసారిగా చేపట్టిన సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మాజీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ వివరణ ఇచ్చారు. ప్రొఫెసర్ బాలకిషన్పై వచ్చిన ఆరోపణలను విచారించి ఆయనకు ఇచ్చిన పదోన్నతిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తనకు 10 పబ్లికేషన్స్ ఉన్నాయని, తప్పుడు తడకగా సమాచారాన్ని ఆర్టీఏ ద్వారా సేకరించి తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా, అక్రమ పదోన్నతులను రద్దు చేసి, ఇంతవరకు పొందిన వేతనం, పింఛన్ను రికవరీ చేయాలని ఔటా అధ్యక్షుడు ప్రొ.మనోహర్, ఏఐఎస్ఎఫ్ నేత నెలి సత్య డిమాండ్ చేశారు. -
యూనివర్సిటీల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా.. విశ్వవిద్యాలయాల పరిపాలనకు తగిన విధంగా వాటిని పునర్వ్యవస్థీకరించలేదు. దీంతో ఆయా జిల్లాల విద్యార్థులు, అఫిలియేషన్ కలిగిన కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం కొత్త జిల్లాలు, మూడేళ్ల క్రితం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వర్సిటీల పరిధి విషయంలో మాత్రం అవసరమైన మార్పులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే కొత్తగా శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ఆయా ఉమ్మడి జిల్లాల పరిధికి మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో గతం నుంచే ఉన్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలపై మాత్రం భారం అలాగే ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని పలువురు కోరుతున్నారు.ప్రత్యేక కమిటీ నివేదిక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆయా కళాశాలల అఫిలియేషన్ విషయమై.. జిల్లాల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గతంలోనే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయగా.. ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే కళాశాలల అఫిలియేషన్ విషయానికి వస్తే.. తెలంగాణ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, శాతవాహన వర్సిటీ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి.అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ మాత్రం.. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను ఆనుకున్న నిజామాబాద్లోని తెలంగాణ వర్సిటీని దాటుకుని ఆయా జిల్లాల వారు సుదూరంలోని వరంగల్ కాకతీయ వర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్లోని శాతవాహన వర్సిటీని అనుకున్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు కరీంనగర్ మీదుగానే వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. అయితే గతంలోనే ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయా వర్సిటీలు, కొత్త జిల్లాల మధ్య దూరం, కళాశాలల సంఖ్యను బట్టి పరిధి మార్పుపై ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాల ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు తెలంగాణ వర్సిటీ పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు, శాతవాహన వర్సిటీ పరిధిలోకి ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాలను కేటాయించేలా నివేదికలో ప్రతిపాదించారు.చదవండి: ‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లుగతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉస్మానియా పరిధిలో ఉండగా.. కొత్త ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా మాత్రమే ఆ వర్సిటీ పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఉస్మానియా వర్సిటీ పరిధిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు ఉండేలా ప్రతిపాదించారు. ఇక కాకతీయ వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండేలా నిర్ణయించారు. ఇక మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లాలు, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్నగర్ పరిధిలోని ఐదు జిల్లాలు యధావిధిగా ఉండేలా నివేదికలో ప్రతిపాదించారు. కాగా ఇందుకు సంబంధించి విధాన నిర్ణయం విషయంలో జాప్యం జరుగుతోంది.పరిధులపై ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు..ఉస్మానియా: రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, వికారాబాద్ కాకతీయ: వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ శాతవాహన: కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట మహాత్మాగాంధీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి పాలమూరు: మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట -
రేపు ఓయూలో జాబ్మేళా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా వర్సి టీలోని ఎంప్లాయ్మెంట్ బ్యూరో, అపోలో ఫార్మసీ సంయుక్తంగా ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న ఎంప్లాయ్మెంట్ బ్యూరో కార్యాలయంలో జాబ్మేళా జరగనుంది. అపోలో ఫార్మసీల్లోని 100 ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టు పోస్టులను.. జాబ్మేళా లో భర్తీ చేయనున్నారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డిగ్రీ చేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న అభ్యర్థులకు అవకాశం కల్పిస్తు న్నట్లు వర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. వేతనం రూ.14,800 నుంచి 25 వేల వరకు ఇవ్వను న్నారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్సు ప్రతు లతో యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరోకు హాజరుకావాలని సూచించారు. -
పరీక్షల వేళ.. ఫీజుల పేచీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మళ్లీ ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పలు యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాలని నిర్ణయించాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకూ ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఇంతకుముందే గత నెల 14 నుంచి నాలుగు రోజుల పాటు ప్రైవేటు కాలేజీలను యాజమాన్యాలు మూసివేశాయి. 17వ తేదీన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వారంలో బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో... ఆందోళన విరమిస్తున్నట్టు యాజమాన్యాలు ప్రకటించాయి. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని, దీనితో పరీక్షలు బహిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మంగళవారం నుంచి, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలేజీల తీరుపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 7 లక్షల మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందంటూ.. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, సిబ్బందికి వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే నాలుగైదు నెలలుగా సిబ్బందికి సరిగా వేతనాలు చెల్లించలేదని.. భవనాల అద్దె, ఇతర ఖర్చులకూ ఇబ్బంది నెలకొందని పేర్కొంటున్నాయి. పరీక్షలు జరగనివ్వండి ప్లీజ్: ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరిపారు. ఈ వివరాలను ఆయన మీడియాకు తెలిపారు. పరీక్షలు బహిష్కరిస్తే విద్యార్థులు ఆందోళన చెందే అవకాశం ఉందని.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఆందోళనకు దిగవద్దని కాలేజీలను కోరానని తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సీఎం కలవాలని సూచించినట్టు చెప్పారు. వారు పరిస్థితిని అర్థం చేసుకుంటానే నమ్మకం కలిగిందన్నారు. బకాయిలు చెల్లించాలి గత నెలలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ మేరకు ఆందోళన విరమించాం. కానీ ఆ హామీ నిలబెట్టుకోలేదు. కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. మా నిరసన తెలియజేయడానికే నవంబర్ 19 నుంచి కాలేజీల్లో నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించాం. – డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు -
రక్షణ రంగంలో సైంటిస్ట్ సూరి భగవంతం సేవలు అమోఘం
దేశ రక్షణ రంగంలో ఎనలేని సేవలు అందించిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సూరి భగవంతం 115వ జయంతి వేడుకలకు త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్ర సేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి మాట్లాడుతూ..‘డాక్టర్ సూరి భాగవతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాలను ఖగోళ శాస్త్రం, సముద్ర శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించారు. రక్షణ రంగానికి విశేష సేవలందించారు. సైబర్ నేరాలు, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం, ఏఐ/ఎంఎల్ సాంకేతికతలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని శాస్త్రవేత్తలకు డాక్టర్ సూరి భగవంతం అసాధారణ సహకారాలు అందించారని ప్రశంసల వర్షం కురిపించారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీ వో) మాజీ చైర్మన్ డా.జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ సూరి భగవంతం అనేక రక్షణ పరిశోధన రంగాలకు సహకరించారు. చైనా యుద్ధం తర్వాత భారత్లో లేహ్, తేజ్పూర్లో ప్రయోగశాలను, హైదరాబాద్లో డీఆర్డీఎ్ల్,ప్రయోగశాలలను స్థాపించారు. రాడార్, బెంగుళూరులోని ఎన్ఎస్టీఎల్లు, అలాగే రక్షణ సాంకేతికతలలో పని చేయడానికి 25 కంటే ఎక్కువ ల్యాబ్లను స్థాపించేలా కృషి చేశారు. సంబంధిత పరిశోధనా రంగాలపై దృష్టి సారించడం కోసం ఆ ప్రాంతంలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలతో నేటి రక్షణ సాంకేతికత, వ్యవస్థల పురోగతికి పునాది వేశారని అన్నారు. డాక్టర్ సూరి భగవంతం జయంతి వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. -
‘ఓయూ’లో ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) చేపట్టిన చలో ప్రొఫెసర్ కోదండరాం ఇంటి ముట్టడి కార్యక్రమంతో బుధవారం ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలికొంది. ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్కుమార్ యాదవ్తో మరో ఇద్దరు విద్యార్థి నేతలను ఉదయం 7.30 నిమిషాలకు హాస్టల్ అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్ తరలించి సాయంత్రం 6 గంటలకు విడిచి పెట్టారు. అనంతరం అశోక్కుమార్ మాట్లాడుతూ వర్సిటీలకు తక్షణం వీసీలను నియమించేలా టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం సీఎం రేవంత్రెడ్డిపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా, ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ విద్యరంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా, కోదండరాం మౌనం వహించడం దారుణమని చెప్పారు.ఈ నెల 20వ తేదీలోగా వీసీలను నియమించకుంటే 10 విశ్వవిద్యాలయాల బంద్ చేపడుతామని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న విద్యార్థులను ఓయూ అధికారుల అనుమతి లేకుండా హాస్టళ్లలోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మూడో రోజుకు చేరిన డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట మూడో రోజు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డీఎస్సీ అభ్యర్థుల నడుమ వాగ్వాదం చోటు చేసుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డీఎస్పీ అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన్నట్టు సీఐ రాజేందర్ తెలిపారు. మీడియా వర్గాలపై దాడి డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనను కవర్ చేస్తున్న ఓ చానల్ రిపోర్టర్ శ్రీ చరణ్, కెమెరామెన్ సాగర్ పై పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. గాయపడిన రిపోర్టర్ శ్రీ చరణ్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ రాత్రి ఓయూ పోలీస్స్టేషన్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఓయూ ఏసీపీ జగన్ హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ధర్నా విరమించారు. జర్నలిస్టులపై దాడిని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ, ఎస్ఎఫ్ఐ నేత రవినాయక్, పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఎస్.నాగేశ్వర్రావు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఖండిచారు. -
ఓయూలో జర్నలిస్టుల అక్రమ అరెస్టులా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం దారు ణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం?’అని నిలదీశారు. గాయపడిన జర్నలిస్టు శ్రీచరణ్ను కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు.సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్ డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు అక్కడకు వెళ్లిన జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ ఖండించింది. దీనిపై సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని వర్సిటీలు పోలీసుల లాఠీదెబ్బలతో రక్త మొడినట్టే.. మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఓ ప్రకటనలో మండిపడ్డారు. » ఓయూలో జర్నలిస్టుల అరెస్ట్ను ఖండిస్తూ టీయూడబ్ల్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, సచివాలయ జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. » మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు. » డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం అప్రజాస్వామిక మని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ విమర్శించారు. పార్టీ నాయకులు రాకే‹Ùకుమార్, పల్లా ప్రవీణ్, కడారిస్వామి, పడాల సతీ‹Ùతో కలిసి బుధవారం తెలంగాణభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. » బీఆర్ఎస్పీ నేతలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి, వారిని సరీ్వస్ నుంచి తొలగించా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉందని బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం మంచిది కాదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓయూ ఫేక్ సర్క్యూలర్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అరెస్ట్పై బుధవారం ఆయన స్పందించారు. అధికారం శాశ్వతం కాదని, తప్పకుండా మేము బదులు చెబుతామన్నారు. వడ్డీతో సహా చెల్లించే సమయం వస్తుందని తెలిపారు. క్రీషాంక్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన సర్క్యులర్ తప్పుడు అయితే తాను చంచల్ గూడా జైలుకు వెళ్ళడానికి సిద్ధమని అన్నారు. ఒకవేళ సర్క్యులర్ నిజమని తాము రుజువు చేపిస్తే సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసులు కొత్తేమి కాదని, దైర్యంగా ఎదుర్కొంటామని, తమది ఉద్యమ పార్టీ అని కేటీఆర్ అన్నారు.‘‘బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్పై ఒక పనికిమాలిన కేసు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తుంది. అసలు తప్పు చేసి రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సింది పోయి, బయట తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు పెట్టిన సర్క్యూలర్, క్రిశాంక్ పెట్టిన సర్క్యూలర్ను నిపుణుల ముందు పెడతాం. ఏదీ ఒరిజినల్? ఏదీ డూప్లికేటో తేలుద్దాం. ఆ తర్వాత ఎవరు చంచల్గూడలో ఉండాలో తేలిపోతది. క్రిశాంక్ పోస్ట్ చేసిన సర్క్యూలర్ తప్పా..! చేయని తప్పుకు క్రిశాంక్ను జైల్లో వేశారు. క్రిశాంక్ను ఉద్దేశ పూర్వకంగానే జైల్లో వేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని చేసిన తప్పును సరిదిద్దుకో. సర్కార్ చేసిన వెదవ పనికి వెంటనే క్షమాపణ చెప్పండి. ఏ తప్పు చేయని క్రిశాంక్ను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఓయూ పేరిట ఫేక్ సర్క్యూలర్ను సోషల్ మీడియాలో సర్యూలేట్ చేసిన కేసులో మన్నె క్రిశాంక్పై పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలులో ఉన్నారు.క్రిషాంక్ బయట పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను చంచల్ గూడ జైలుకు వెళ్ళడానికి సిద్దం.. నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా? - రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/Eq0BjbD3tx— BRS Party (@BRSparty) May 8, 2024 -
సీఎం వస్తే ప్రారంభమే..
ఓయూలో నిరి్మంచిన సెంటినరీ పైలాన్ ప్రారంభానికి సీఎం రేవంత్రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 2017లో జరిగిన ఓయూ వందేళ్ల శతాబ్ది ఉత్సవాల గుర్తింపుగా పైలాన్ను నిరి్మంచాలని నిర్ణయించారు. వివిధ కారణాలతో పైలాన్ నిర్మాణంలో జాప్యం జరిగింది. మీడియా కథనాలతో వీసీ ప్రొ.రవీందర్ గతేడాది పైలాన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఓయూ చరిత్రలో నిలిచిపోయేలా రూ.1.58 కోట్లతో నిర్మించిన పైలాన్ను సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులను విద్యార్థి నేతల కోరగా సీఎంను కలిసేందుకు అనుమతి కోసం ప్రత్నిస్తున్నారు. నిరంతర కార్యక్రమాలతో సీఎం రేవంత్రెడ్డి బిజిబిజిగా ఉండటంతో ఓయూ అధికారులు కలవలేకపోతున్నారు. ఈ లోపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పైలాన్ ప్రారంభం మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని త్వరితగతిన ప్రారంభించాలని విద్యార్థి నేతలు కోరుతున్నారు. –ఉస్మానియా యూనివర్సిటీ -
ఎంతిచ్చినా ఓయూ రుణం తీరదు..
ఉస్మానియా యూనివర్సిటీ: తండ్రి స్కూల్ టీచర్. అయినా..8 మంది కుటుంబ సభ్యుల కారణంగా పేదరికం..పస్తులు తప్పలేదు. ఇంటర్ వరకు కాళ్లకు చెప్పులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. అయినా ఎక్కడా రాజీపడకుండా బాగా కష్టపడి చదువుకొని..లక్ష్యాన్ని సాధించి అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వవిద్యార్థి గోపాల్ టీకే కృష్ణ. 77వ ఏట ఓయూలో తను చదివిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం విద్యార్థుల తరగతి గది భవన నిర్మాణం కోసం రూ.5 కోట్ల విరాళాన్ని అందచేసి చరిత్ర సృష్టించారు. 107 ఏండ్ల ఓయూలో సుమారు కోటి మందికి పైగా విద్యార్థులు చదవుకున్నారు. దేశ ప్రధాని మొదలు సీఎంలు, మంత్రులు, ఇతర పెద్ద హోదాలలో స్థిరపడ్డారు. కానీ ఇంత వరకు ఎవరు కూడా వ్యక్తిగతంగా రూ.5 కోట్లను విరాళంగా ఇవ్వలేదు. గోపాల్ టీకే కృష్ణ తొలిసారి ఓయూకు రూ.5 కోట్ల చెక్కును అందచేసి ‘ఎంతిచి్చనా ఓయూ రుణం తీర్చుకోలేను. ఇక్కడ చదివిన చదువే నాకు ఎంతగానో తోడ్పడింది’ అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. పేదరికం నుంచి ఎదిగి.. గోపాల్ టీకే కృష్ణ పూర్వీకులది ఏపీలోని ఏలూరు జిల్లా. కానీ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థిరపడ్డారు. కొన్నేళ్లు వారి కుటుంబం హైదరాబాద్లోని నారాయణగూడలో నివాసం ఉన్నారు. గోపాల్ కృష్ణ తండ్రి టీకే శ్రీనివాస చారి, తల్లి లక్ష్మీరాజమళ్. వీరికి 6 మంది సంతానం. అందులో నలుగురు అబ్బాయిలు. ఇద్దరు అమ్మాయిలు. శ్రీనివాసచారి తల్లిదండ్రులు కూడా కలిసి మొత్తం ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఒకే ఇంట్లో ఉండేవారు. శ్రీనివాస చారి అబిడ్స్లో మెథడిస్ట్ హైసూ్కల్లో టీచర్గా పని చేశారు. రెండో సంతానం అయిన గోపాల టీకే కృష్ణ దేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో 1947, ఫిబ్రవరి 16న జన్మించారు. ఆ సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగే ఉద్యమాలు, అల్లర్ల కారణంగా నారాయణగూడలోని ఇంటికి వెళ్లకుండా మెథడిస్ట్ స్కూల్లోనే 18 నెలల పాటు తలదాచుకున్నారు. తండ్రికి నెలకు రూ.270 వేతనం వలన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అయినా కుటుంబంలో ముగ్గురు ఇంజినీర్లు, ఒకరు డాక్టర్ కోర్సు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డారు. నిజాం ట్రస్ట్ ఫండ్తో అమెరికాకు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి 1969లో అమెరికాకు వెళ్లినట్లు గోపాల్ టీకే కృష్ణ తెలిపారు. సెమిస్టర్కు రూ.99 ఫీజు, నెలకు రూ.100 నేషనల్ ఫెలోషిప్తో సెమిస్టర్కు రూ.99 ఫీజుతో ఇంజినీరింగ్ పూర్తి చేసి, రూ.10 వేల అప్పుతో పాటు నిజాం ట్రస్ట్ ఫండ్ రూ.1500 ఆరి్థక సహాయంతో అమెరికాకు వెళ్లినట్లు చెప్పారు. తర్వాత రూ.5 లక్షలను నిజాం ట్రస్ట్కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. రిపబ్లికన్ పార్టీ చైర్మన్గా.. అమెరికాలోని అయోవా స్టేట్లో రిపబ్లికన్ పారీ్టకి మూడు సార్లు చైర్మన్గా ఎన్నికయినట్లు తెలిపారు. ఎనిమిది భాషలు తెలిసిన గోపాల్ కృష్ణ అయోవాలో కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు. తన ముగ్గురు కొడుకులు డీన్ లాయర్గా, గోల్డెన్ గూగుల్ ఉద్యోగిగా, ఆల్విన్ నిర్మాణ రంగంలో పని చేస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఓయూకు రూ.5 కోట్లను అందచేసినట్లు తెలిపారు. -
కిటికీలు తొలగించి.. చొరబాటు
సనత్నగర్: యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ (ఉస్మానియా యూనివర్సిటీ) ఉమెన్స్ హాస్టల్లోకి శుక్రవారం రాత్రి ముగ్గురు ఆగంతకులు చొరబడి హంగామా సృష్టించారు. హాస్టల్ కిటికీలు తొలగించి లోపలికి ప్రవేశించడంతో విద్యారి్థనులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ వెంటనే అప్రమత్తమై ముగ్గురిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్యారడైజ్ సమీపంలోని వాటర్వర్క్స్ కార్యాలయంలో వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా పని చేసే శ్రీకాంత్తో పాటు మరో ఇద్దరు స్నేహితులు మద్యం తాగి శుక్రవారం అర్ధరాత్రి పీజీ కాలేజ్ హాస్టల్ వద్దకు వచ్చారు. కిటికీలను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. విద్యారి్థనులు పట్టుకునేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ ఒక్కడే చిక్కడంతో 100కు సమాచారం అందించారు. బేగంపేట పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితుల పేర్లను శ్రీకాంత్ వెల్లడించడం లేదు. ఆందోళన.. ఉద్రిక్తత.. తమకు రక్షణ కరువైందంటూ హాస్టల్ విద్యారి్థనులు శనివారం ఆందోళనకు దిగారు. వీసీ వచ్చి హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా ససేమిరా అంటూ ధర్నా కొనసాగించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హాస్టల్లోసీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, స్టాటి క్ సెక్యూరిటీ ఫోర్స్ నియమించాలని, రెండు కిటికీలను మరమ్మతులు చేయించాలని, ప్రహరీగోడ ఎత్తు పెంచాలనే డిమాండ్లను వ్యక్తంచేశారు. నార్త్జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ రామలింగరాజు, సీఐ భాస్కర్లు పరిస్థితిని సమీక్షించి యూని వర్సిటీ అధికారులతో మాట్లాడారు. ప్రిన్సిపాల్ రవికుమార్తో కలిసి డీసీపీ రోహిణి ప్రియదర్శిని విద్యారి్థనులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ ఉమెన్స్ హాస్టల్ లో ఉద్రిక్తత
-
ఉస్మానియా ఆస్పత్రిలో కరోనాతో వ్యక్తి మృతి
-
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
డాక్టరేట్ అందుకున్న శంతను నారాయణ్
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: అమెరికాకు చెందిన అడోబ్ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. మంగళవారం క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్లర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పద్మశ్రీ శంతను నారాయణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్కు ఎంపిక చేసినట్లు వీసీ ప్రొ.రవీందర్ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శంతను నారాయణ్ మూడో ఓయూ పూర్వవిద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓయూలో అన్ని విభాగాలలో బంగారు పతకాలను ప్రవేశపెట్టాలని, అందుకు పూర్వవిద్యార్థులు సహకరించాలన్నారు. నేడు (31న) తన పెళ్లిరోజు అయినప్పటికీ మీ కోసం పాండిచ్చేరినుంచి వచ్చానని ఆమె చెప్పారు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు. బంగారు పతకాలలో మహిళల రికార్డు.. ఓయూలో అత్యధికంగా బంగారు పతకాలు సాధించి మహిళలు రికార్డు సృష్టించారు. ప్రకటించిన 46 మంది పీజీ విద్యార్థుల్లో 40 మంది మహిళలు కాగా కేవలం ఆరుగురు మాత్రమే పురుషులు ఉన్నారు. వివిధ విభాగాలలో 1,024 మంది పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి, వీసీ ప్రొ.రవీందర్, రిజి్రస్టార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.రాములు తదితరులు పాల్గొన్నారు. మా ఇంట్లో మూడో పీహెచ్డీ: శంతను నారాయణ్ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ శంతను నారాయణ్ గవర్నర్ తమిళిసై, వీసీ ప్రొ.రవీందర్ చేతుల మీదుగా డాక్టరేట్ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మా, నా భార్య పీహెచ్డీ డాక్టరేట్లు కాగా తనతో మూడోదన్నారు. ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులు అవకాశాలను ఎంచుకోవాలన్నారు. అనంతరం పీహెచ్డీ డాక్టరేట్ డిగ్రీలను సాధించిన 1,024 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డాక్టరేట్ అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ‘భారతదేశంలో శాసనసభ్యుల శాసనాధికారాలు–వాటిపై న్యాయ సమీక్ష’ అనే అంశంపై న్యాయశాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను బాలరాజుకు పీహెచ్డీ పట్టా లభించింది. అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్ అందుకున్నారు. డాక్టరేట్ల ఆనందం... ఓయూ నుంచి పీహెచ్డీ డాక్టరేట్లు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్ డిగ్రీలను అందుకున్న వారిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేసేవారే అధికంగా ఉన్నారు. పీహెచ్డీలో ప్రవేశం పొంది ఉద్యోగాలు రావడంతో 10, 15 సంవత్సరాల క్రితం చదవులను వదిలేసి ఇక డాక్టరేట్ను అందుకోలేమని అనుకున్న మాకు వీసీ వన్టైం ఛాయిస్తో పరిశోధనను పూర్తి చేసే అవకాశం కల్పించారని అనేక మంది విద్యార్థులు పేర్కొన్నారు. -
ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
-
అంతర్గత ప్రతిభకే అందలం
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో మూల్యాంకన విధానం పూర్తిగా మారబోతోంది. సంప్రదాయ పద్ధతులకు ఇక స్వస్తి పలకనున్నారు. మార్కులే కొలమానం కాకుండా, విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీసి, దాని ఆధారంగా అతని క్రెడిట్స్ నిర్ణయిస్తారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని పోస్టు– గ్రాడ్యుయేట్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును ఓయూ మొదలు పెట్టింది. అధ్యాపకులకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యార్థులను కూడా ముందుగానే సమాయత్తం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఓయూ పరిధిలో పీజీ కోర్సులు చేసే దాదాపు 30 వేల మంది సరికొత్త మూల్యాంకన పరిధిలోకి వస్తారు. కొత్త మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి గత ఏడాది ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) చేత అధ్యయనం చేయించింది. ఈ సంస్థ ఇచ్చిన సిఫారసులను మండలి ఆమోదించి అమల్లోకి తెస్తోంది. ప్రతిభకు అన్నివిధాలా పరీక్ష ఇప్పటివరకూ ఏడాది మొత్తం చదివిన విద్యకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానాలు. కొత్త విధానంలో విద్యార్థి అంతర్గత నైపుణ్యాన్ని గుర్తిస్తారు. ఈ ప్రక్రియలో బోధకులు అత్యంత కీలకంగా మారనున్నారు. విద్యార్థి ఏ కోర్సులో చేరినప్పటికీ ఏడాది పొడవునా అతను అనుసరించే విధానాలనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో అటెండెన్స్కు సైతం కొన్ని మార్కులుంటాయి. ప్రతి చాప్టర్లో పాఠాన్ని విద్యార్థి ఏమేర అర్థం చేసుకున్నాడో గుర్తించాల్సి ఉంటుంది. దీనికోసం విద్యార్థులకు అధ్యాపకులు కొన్ని ప్రశ్నలు వేస్తారు. సబ్జెక్టుపై పట్టు కోసం తరగతి గదిలో స్వల్పకాలిక చర్చలు నిర్వహిస్తారు. నెలవారీ పరీక్షలూ నిర్వహిస్తారు. విద్యార్థి తాను చదివే సబ్జెక్టుల్లో ఎక్కడ ప్రతిభ కలిగి ఉన్నాడు? ఎక్కడ వెనుకబడ్డాడు? అనేది గుర్తించి మార్కులు వేస్తారు. మరోవైపు అనుభవ పూర్వక విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థి థియరీ కాకుండా, ప్రాక్టికల్గా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మెరుగైన ఫలితాలిస్తాయని పారిశ్రామిక రంగం కోరుకునే నిపుణులు తయారయ్యే వీలుందని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ప్రతిభను వెలుగులోకి తేవడానికే : ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి ఛైర్మన్) మూల్యాంకన విధానంలో మార్పుల వల్ల విద్యార్థి కేవలం థియరీకే పరిమితం అయ్యే అవకాశం లేదు. అతనిలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నత విద్య చేసినా, ఉపాధి కోసం వెతుక్కునే పరిస్థితి ఉండకూడదనే ఈ సరికొత్త విధానం అనుసరిస్తున్నాం. అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నాకే ముందుకెళ్ళాం. మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. అధ్యాపకులనూ సన్నద్ధం చేశాం : ప్రొఫెసర్ రవీందర్ (ఓయూ వీసీ) ఈ ఏడాది పీజీ కోర్సుల్లో కొత్త మూల్యాంకన విధానం అమలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా అధ్యాపకులను సన్నద్ధం చేశాం. క్లాసులు ప్రారంభమైనప్పట్నుంచే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సిసలైన ప్రతిభ వెలికి తీసే విధానం కాబట్టి విద్యార్థులకూ మేలు జరుగతుంది. -
ఉన్నతప్రమాణాలు..మరింత ప్రశాంతత
సాక్షి, హైదరాబాద్: మరింత ప్రశాంతతకు, ఉన్నత విద్యా ప్రమాణాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కాబోతోందని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. యూనివర్సిటీలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా దేశవ్యాప్తంగా క్లోజ్డ్ క్యాంపస్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ఓయూకు ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందని, బయటి వ్యక్తులు క్యాంపస్ నుంచి ప్రయాణించకుండా బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల కేవలం విద్యార్థులే ప్రాంగణంలో తిరుగుతారన్నారు. ఓయూలో మహిళా విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందని, క్లోజ్డ్ క్యాంపస్ ఏర్పాటు వల్ల వారికి మరింత పటిష్టమైన భద్రత చేకూరుతుందని చెప్పారు. మరోవైపు వర్సిటీలో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వివరించారు. రెండేళ్లుగా మౌలిక వసతులకు రూ.145 కోట్లు ఖర్చు చేశామన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హాస్టళ్లు.. సరికొత్త క్లాస్రూమ్లు సైఫాబాద్లోని యూనివర్సిటీ కాలేజీలో 300 మందికి సరిపడా బాలుర హాస్టల్ నిర్మాణం. నిజాం కాలేజీలో 284 మంది బాలికల కోసం హాస్టల్ ఏర్పాటు. సెంటినరీ హాస్టల్ను 500 మందికి సరిపడేలా నిర్మాణం. ఓయూ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్టుల ఏర్పాటు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సరికొత్త క్లాస్ రూంల ఏర్పాటుకు శ్రీకారం. పరిశోధనలకు వీలు కల్పించేలా పూర్తి స్థాయి సాంకేతిక విద్యా విధానం అందుబాటులోకి తెచ్చేందుకు వ్యూహరచన. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యతలో భాగంగా పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఓయూకు నిధులు సమకూరాయి. అమెరికాలోని 12 నగరాలను ప్రొఫెసర్ రవీంద్ర సందర్శించారు. అక్కడ పూర్వ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఓయూలో వారి అనుభవాలు వివరించేందుకు అంగీకారం కుదిరింది. మారుతున్న విద్యా విధానంలో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీసెస్ అమలు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు వర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేందుకు అనుమతి. ఈ ఏడాది నుంచి నిరంతర పరీక్షా విధానం అమలు. ఎప్పటికప్పుడు మధ్యంతర పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో సమీక్ష ఉస్మానియా యూనివర్సిటీ: నిరంతర పరీక్షా విధానంపై ప్రొఫెసర్ రవీందర్ వివిధ కాలేజీల ప్రిన్సిపల్స్, ప్రొఫెసర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇతర కోర్సులకు ఇంటర్నల్ పరీక్షలు, ప్రాక్టికల్స్తో పాటు ప్రతి ఆరు నెలలకు ఒక సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. యూజీసీ ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనల ప్రకారం సెమిస్టర్ పరీక్షలతో పాటు 15 రోజులకు ఒకసారి పరీక్షలను నిర్వహించేందుకు వర్సిటీ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల అభిప్రాయాలు, అభ్యంతరాలు, సందేహాలను వీసీ తెలుసుకున్నారు. -
తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
బోధన.. వేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యాప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జాతీయ ర్యాంకింగ్లో యూనివర్సిటీలు వెనకబడుతున్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్–2023)లో దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64కు పడిపోయింది. గతేడాది ఓయూ 46వ ర్యాంకులో నిలిచింది. జేఎన్టీయూహెచ్ గతేడాది 76వ ర్యాంకుతో ఉంటే ఈ ఏడాది 98వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. అధ్యాపకుల కొరతే ఈ పరిస్థితికి కారణమని అన్ని వర్గాలూ భావిస్తున్నా ప్రభుత్వం మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. గతేడాది తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించినా అది ఇంకా గవర్నర్ వద్దే పెండింగ్లో ఉంది. ఈ ఫైల్ను రాష్ట్రపతి పరిశీలనకు పంపామని గవర్నర్ పేర్కొన్నారు. 1,869 పోస్టులు ఖాళీ.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లోనూ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్నిచోట్లా కాంట్రాక్టు అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి 31 నాటికి 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉండగా వాటిలో ఏకంగా 1,869 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. అంటే కేవలం 968 (34.12 శాతం) మందే రెగ్యులర్ ఆధ్యాపకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 157 మంది ప్రొఫెసర్లు ఉండగా మరో 238 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండగా మరో 781 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుండగా 850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మూడేళ్ల కిందటే ఆమోదం తెలిపినా ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదు. ప్రొఫెసర్లేరి? ♦ రాష్ట్రంలో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. అవి శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. శాతవాహన, రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ), బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లే లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరే ఉన్నారు. మెుత్తంగా చూస్తే 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. మరోవైపు 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండగా 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నత విద్యాశాఖ లెక్కలు వేసింది. ♦వందేళ్లకుపైగా చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీలో సగానికిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఇప్పుడు కేవలం ఒక్కరే ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒక్కరంటే ఒక్కరూ లేరు. తెలుగు యూనివర్సిటీలో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్తోనే నెట్టుకొస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఆర్కిట్చెర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు బోధన సాగిస్తున్నారు. క్రమబద్ధీకరణ చేయరా? గత కొంతకాలంగా రెగ్యులర్ చేయాలని ఆందోళన చేస్తున్న యూనివర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ ఆదివారం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావులను కలిసింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేసేందుకు కృషి చేయాలని వినతిపత్రం అందించింది. సోమవారం జరిగే కేబినేట్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరింది. -
హైదరాబాద్లో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ: హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ కార్యదర్శి అల్కేష్ కుమార్ శర్మ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్రం, వివిధ పరిశ్రమలు రూ.70 కోట్ల వ్యయంతో దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ఈ అత్యాధునిక నేషనల్ సెంటర్ ఫర్ అడిటివ్ మాన్యుఫాక్చరింగ్ (3డీ ప్రింటింగ్ సెంటర్)ను ఏర్పాటు చేసిన్నట్లు వారు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జాతీయ 3డీ ప్రింటింగ్ కేంద్రంలో ఏరోస్పేస్, డ్రోన్లు, మానవ కృత్రిమ అవయవాలు, ఆటోమొబైల్ పరికరాలు, అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగపడే వస్తువులను తయారుచేస్తారని కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ చెప్పారు. 3డీ ప్రిటింగ్ రూపకర్త ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీ మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ 2002 నుంచి 3డీ ప్రింటింగ్ సబ్జెక్టును ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ సబ్జెక్టుపై అనేక పరిశోధనలు చేసిన ఆయన 2007లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి రూ.కోటి ప్రాజెక్టును పొందారు. దీంతో ప్రత్యేకంగా పరికరాలను, యంత్రాలను కొనుగులు చేసి 3డీ సెంటర్ను అభివృద్ధి చేశారు. ఆ విధంగా ఓయూలో అంకురించిన 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ నేడు జాతీయస్థాయి ప్రింటింగ్ కేంద్రం స్థాపనకు దోహదపడిందని అధికారులు చెప్పారు. -
ఓయూ కీర్తి ప్రతిష్టలు పెంచేందుకు కృషి
లాలాపేట: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపుగా రూ. 120 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ తెలిపారు. రీఫార్మ ఫర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్లో భాగంగా రెండేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణల ప్రగతిని వచ్చే ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. ఓయూ వైస్ చాన్స్లర్గా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బుధవారం ఓయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఇనిషి యేటివ్స్.. ఈవెంట్స్... అచీవ్మెంట్స్ 2021–23 పేరుతో రూపొందించిన ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం అకడమిక్ పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయడం, విద్యా పరిశోధనా రంగాల్లో మేటిగా నిలపడమే ధ్యేయంగా తాము చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ చాన్స్లర్గా పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. మరో వందేళ్ల పాటు ఓయూ తన కీర్తి ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్రావు, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో యూనివర్సిటీని విద్యారంగంలో అగ్రగామిగా నిలిపే కార్యక్రమం కొనసాగతోందని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో ఓయూ 22వ స్థానాన్ని సాధించడం, డబ్ల్యూసీఆర్సీ లీడర్స్ ఆసియా వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 యూకేలోని హౌస్ ఆఫ్ లార్డ్స్లో అవార్డు అందుకోసం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. రూ. 120 కోట్లతో బాయిస్ హాస్టల్స్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్తో పాటు అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వీసీ వివరించారు. ఓయూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు తక్ష పేరుతో ప్రత్యేకంగా మూడు రోజుల కార్యక్రమాలతో పాటు ఉస్మానియా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించామన్నారు. అకడమిక్ కేలండర్ను సరిదిద్దడం, ఏటా స్నాతకోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని వీసీ వెల్లడించారు. మార్కెట్కు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగు పరచడంతో పలు కొత్త కోర్సులు ప్రవేశపెట్టామన్నారు. ఇంజినీరింగ్లో కృత్రిమ మేధ మిషన్ లెరి్నంగ్, మైనింగ్, బీఏ హానర్స్, డిగ్రీలో ఏ కోర్సు చదివిన వారైనా ఆర్ట్స్ సోషల్ సైన్సెస్లో పీపీ చేసే వినూత్న అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చామని వీసీ వివరించారు. ఇది సివిల్ సర్విసెస్ వైపు వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. వివిధ అంశాలపై దాదాపు 10 విదేశీ యూనివర్సిటీలతో ఎంఓయూ చేసుకున్నామన్నారు. ఎలాంటి ఫైరవీలు, ఒత్తిళ్లకు తావు లేకుండా ఆన్లైన్ అర్హతా పరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగా అర్హులైన వారికే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించామన్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, బోధన, బోధనేతర సిబ్బంది యూనివర్సిటీ తీసుకునే నిర్ణయాల్లో భాగస్వాములై ఉస్మానియా యూనివర్సిటీ పతాకాన్ని ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు కలిసి రావాలనీ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్లు స్టీవెన్సన్, జి.మల్లేషం, శ్రీరాం వెంకటేష్, గణేష్, వీరయ్య, ప్యాట్రిక్, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సీనియర్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. -
ఓయూలో మెట్ల బావిని బాగు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి
-
టీఎస్ పీఎస్సీని రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్
-
ఓయూలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: విద్యార్థి సంఘాల జేఏసీ నిరసనలతో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అట్టుడికిపోయింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కమిషన్ చైర్మన్ను బర్తరఫ్ చేయాలని, అదే సమయంలో జ్యూడీషియల్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన దీక్ష ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలకు దారి తీసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. విద్యార్థి నిరుద్యోగ మార్చ్ పేరుతో ర్యాలీకి పిలుపు ఇచ్చాయి విద్యార్థి సంఘాలు. అయితే.. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ఓయూ క్యాంపస్ గేట్లు మూసేశారు. అయినప్పటికీ దీక్షకు దిగేందుకు యత్నించారు విద్యార్థులు. దీంతో.. పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు యత్నించగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలో నగేష్ అనే విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు, పలువురి విద్యార్థులను అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. -
ఉస్మానియా యూనివర్సిటీ: నేడు రేపు క్యాంపస్లో హై అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై ఉస్మానియా విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యూడిషియల్ విచారణకి పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు నేడు, రేపు ఆర్ట్స్ కాలేజీ ముందు మహా దీక్షకి ప్లాన్ చేశారు. ఓ వైపు దీక్షకి పర్మిషన్ లేదంటూ యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా.. మరో వైపు దీక్ష చేస్తే కేసులు తప్పవని ఓయూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి సంఘాలు మాత్రం తాము దీక్ష చేసి తీరుతామని స్పష్టం చేశాయి. క్యాంపస్లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రం వారి రాకను స్వాగతిస్తున్నాయి. పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీస్తున్న క్రమంలో విద్యార్థులను ఓయూ పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో క్యాంపస్లోకి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేసింది. -
HYD: ‘ఓ సారూ.. మమ్మల్ని పట్టించుకోండ్రి’
సాక్షి,హైదరాబాద్: కనీస సదుపాయాల లేమిపై.. సైఫాబాద్ సైన్స్ కాలేజీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా.. కనీసం తాగటానికి కూడా నీరు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. యాజమాన్యం తీరును నిరసిస్తూ.. కాలేజీ మెయిన్గేట్ ఎదుట ఆందోళనకు దిగారు. హాస్టల్లో నిత్యావసరాలు కరువయ్యాయని వాపోయారు వాళ్లు. వాడడానికి కాదు కదా.. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు వాళ్లు. అలాగే కాలేజీ బాయ్స్ హాస్టల్లో చాలా మంది విద్యార్థులు వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నా.. ఎవరూ స్పందించకపోవటం దారుణమన్నారు. హాస్టల్ పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకపోవటమే కాదు.. డ్రైనేజీ పొంగిపొర్లుతూ.. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా.. కాలేజీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన చెందారు. కాలేజీ యాజమాన్యం త్వరగా స్పందించి.. సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులు డిమాండ్ చేశారు. -
TS SET: టీఎస్ సెట్ పరీక్ష రీషెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోని సెట్ కార్యాలయం అలర్ట్ జారీ చేసింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మార్చి 13న జరగాల్సిన పరీక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే 14, 15వ తేదీల్లో జరగాల్సిన టీఎస్ సెట్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య మరళీకృష్ణ స్పష్టం చేశారు. అదే విధంగా వాయిదా వేసిన పరీక్షకు మార్చి 17వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారాయన. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 10 వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఓయూ పౌర సంబంధాల అధికారి పేరిట ఒక ప్రకటన వెలువడింది. వివిధ సబ్జెక్టులకుగానూ టీఎస్ సెట్ కోసం 50 వేల మందికిపైగా దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల కోసం తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేయనున్నారు. -
TS SET 2022: మార్చి 13 నుంచి టీఎస్సెట్ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): అధ్యాపక ఉద్యోగాల అర్హతకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్సెట్–2022)లను మార్చి 13, 14, 15 తేదీల్లో నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రటరీ మురళీకృష్ణ గురువారం తెలిపారు. ఈనెల 25న చివరి తేదీ గడువు ముగిసేనాటికి వివిధ సబ్జెక్టులకు 49 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.1,500 అపరాధ రుసుముతో ఈనెల 30 వరకు, రూ.2,000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 5 వరకు, రూ.3,000 అపరాధ రుసుముతో 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తెలంగాణలో పది పరీక్షా కేంద్రాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, విజయవాడలో 4 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వివరాలను టీఎస్సెట్–2022 వెబ్సైట్లో చూడవచ్చన్నారు. (క్లిక్ చేయండి: ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని) -
నాయకత్వాభివృద్ధికి హార్వర్డ్ కిటుకులు!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు ఎక్కువగా పాఠ్యాంశాల అభ్యసనకే పరిమితమవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజ జీవితంలో, వృత్తి పరమైన అంశాల్లో ఎదుగుదలకు సబ్జెక్టు ఉంటేనే సరిపోదు. నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకువచ్చే అవకాశాలుంటాయి. ఈ ఉద్దేశంతోనే మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్), బీసీ సంక్షేమ శాఖలు ఆ దిశగా సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చాయి. ‘2023 ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫికల్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ (పీఎస్ఐఎల్)’ పేరిట గురుకుల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపుదల కోసం అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ది లక్ష్మీ మిట్టల్ అండ్ ఫ్యామిలీ సౌత్ ఏషియా ఇన్స్టిట్యూట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో బీసీ గురుకుల సొసైటీ అవగాహన కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 108 మంది బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు, బీసీ హాస్టల్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి ప్రత్యేకంగా ఐదుగురు ఇన్స్ట్రక్టర్లు, ఓయూ నుంచి ఐదుగురు ఇన్స్ట్రక్టర్ ఫెలోస్ విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అవగాహన కుదుర్చుకున్న మూడు సంస్థల ప్రతినిధులతో పాటు బీసీ గురుకుల సొసైటీ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. వివిధ అంశాలపై చర్చా కార్యక్రమాలు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లలోని ఎనిమిదో తరగతి, ఆపై తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల్లో చురుకైన 108 మందిని బీసీ గురుకుల సొసైటీ గుర్తించి ఎంపిక చేసింది. ఇందుకోసం అంతర్గతంగా ప్రత్యేక పరీక్షను నిర్వహించింది. తొలిదశలో ఇలా ఎంపికైన విద్యార్థులకే ప్రత్యేక అవగాహన, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సైంటిఫిక్ రేసిజం, ది ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఇఫ్ స్టార్ట్స్ విత్ అన్ అబ్జర్వేషన్, ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్, సినిమా అండ్ సోషల్ చేంజ్ అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వా లీబాల్, రగ్బీ వంటి క్రీడలతో పాటు నృత్యం, ఆ త్మరక్షణ, కరాటేపై కూడా సామూíßæ క చర్చలు జరిపి స్తున్నారు. శిక్షణా నంతరం సంబంధిత ఇన్స్ట్రక్టర్లు, ఇన్స్ట్రక్టర్ ఫెలోస్తో నిరంతర అనుసంధాన వ్యవస్థను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ఇలా శిక్షణ పొందిన గురుకుల విదార్థులను జిల్లాల వారీగా విభజించి గురుకుల పాఠశాలల్లోని పిల్లలకు రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తూ వాటిల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహింపజేయనున్నారు. మొత్తంగా ప్రతి గురుకుల విద్యార్థిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించేందుకు బీసీ సంక్షేమ శాఖ, బీసీ గురుకుల సొసైటీ ముందుకు సాగుతున్నాయి. ఆలకించడం, భావ వ్యక్తీకరణ కీలకం ఇతరులు చెప్పే విషయాల్ని ముందుగా శ్రద్ధగా వినాలి. ఆ తర్వాత మనం చెప్ప దలచుకున్న విషయాన్ని ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా తెలియజేయాలి. ఈ నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటే ఎక్కడైనా, ఎలాంటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలననే నమ్మకం కుదిరింది. – సాయికిరణ్, బీసీ గురుకుల పాఠశాల, జైనథ్, ఆదిలాబాద్ జిల్లా ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.. స్టేజీపైన మాట్లాడాలంటే ఎంతో ఆందోళన చెందేదా న్ని. ఈ ప్రత్యేక కార్యక్రమంతో నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇతరులతో మాట్లాడే విధానం, బాడీ లాంగ్వేజీ, భాషపై పట్టు పెంచుకోవడంలో మెళకువలెన్నో నేర్చుకుంటున్నా. – సంఘవి, బీసీ గురుకులం, రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లా -
విశ్వవేదికపై చెదరని ఖ్యాతి ఓయూ సొంతం
సాక్షి, హైదరాబాద్: వందేళ్లు దాటిన మహోన్నత చరిత్ర కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తనకు తానే ఒక బ్రాండ్ ఇమేజ్ అని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యా లయాల్లో చెక్కుచెరదరని స్థానం కలిగి ఉందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.రవీందర్ అన్నారు. గతేడాది రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాల యాల జాబితాలో ఉస్మా నియా 22వ స్థానంలో ఉందని చెప్పారు. ఇటీవల వరకు ఉద్యమాల గడ్డగా ఉన్న ఉస్మానియా వర్సిటీ ఇప్పుడు ఉద్యోగాల అడ్డాగా మారిందని పేర్కొ న్నా రు. ‘ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అలుమ్నై మీట్–2023’ వేడుకలు మంగళవారం వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమ య్యాయి. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మినారాయణ స్వాగతోపన్యా సం చేశారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలలో పాల్గొనేందుకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వేలాదిమంది ‘ఉస్మానియన్స్’ తరలివచ్చారు. వైస్ చాన్సలర్ మాట్లాడుతూ టీచింగ్, లెర్నింగ్ మెథడ్స్, రీసెర్చ్ రంగంలో అత్యున్నత ప్రమాణాలను అభి వృద్ధి చేసినట్లు, అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఓయూ నిర్వహించిన ‘నిపుణ’కార్యక్రమంలో 250 క్యాంపస్లు పాల్గొన్నా యని, 55 వేలమంది విద్యార్థులు హాజరయ్యారని, సుమారు 16 వేలమందికి ఉద్యోగాలు లభించా యని వివరించారు. ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీ పూర్వ విద్యా ర్థులను ఒక వేదికపైకి తీసుకురాగలిగినట్లు చెప్పా రు. వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వవిద్యా ర్థుల సహాయ సహకారాలతో అనేక అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టినట్లు వివరించారు. కార్య క్రమంలో ఆయన ఉస్మానియా టీవీని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 46 చానళ్లతో త్వరలోనే ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. చదువులమ్మ చెట్టు నీడలో... పూర్వవిద్యార్థుల ప్యానెల్ సమావేశంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఫ్యూజీ సీఈవో మనోహర్రెడ్డి, ఓఎస్డీ రాజశేఖర్ వర్సిటీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కడో నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగిన తనను ఉస్మానియా కన్నతల్లిలా చేరదీసి ఆదరించిందని చెప్పారు. ఆర్ట్స్ కళాశాలలో 1989–91లో ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్న తాను ఉస్మానియన్గా చెప్పుకొనేందుకు గర్విస్తున్నానని సీవీ ఆనంద్ అన్నారు. ఉస్మానియా వర్సిటీకి సైతం అలుమ్నైలు బలమైన వెన్నుదన్నుగా నిలవాలని బుర్ర వెంకటేశం అభిప్రాయపడ్డారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ఉస్మానియా గాలిలోనే ఒక వైబ్రేషన్ ఉందన్నారు. అమ్మకు, ఆవకాయకు ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ అవసరం లేనట్లుగానే ఉస్మాని యా కు అవసరం లేదన్నారు, ఉస్మానియా ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విజయ్ దేవరకొండ, సీఏబీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. -
Osmania University: గ్లోబల్ ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ఎప్పుడంటే..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని జనవరి 3, 4 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వెల్లడించారు. గురువారం ఓయూ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేళంలో ఆయన మట్లాడారు. ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఉస్మానియా గ్లోబల్ అలుమ్నీ మీట్–23లో హాజరయ్యేందుకు ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. విశ్వవిద్యాలయం చరిత్రలో విభాగాల వారీగా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారని వివరించారు. రెండు రోజుల పాటు సమ్మేళనం ఇలా.. గ్లోబల్ అలుమ్ని మీట్ జనవరి 3న మధ్యాహ్నం ప్రారంభమవుతుందన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృందలతో చర్చలు ఉంటాయన్నారు. సాయంత్రం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లోని లాన్లో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. రెండో రోజున పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంటారన్నారు. మధ్యాహ్నం వివిధ అంశాలపై ఉపన్యాసాలుంటాయని వివరించారు. (క్లిక్ చేయండి: ప్రయాణికులకు ఊరట.. పోలీసుల కీలక ఆదేశాలు) -
ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా సాను
సాక్షి, హైదరాబాద్: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా వీపీ సాను, ప్రధాన కార్యదర్శిగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నిక కాగా, వారిలో 19 మందితో కార్యదర్శి వర్గం (ఆఫీస్ బేరర్స్) ఎన్నికైంది. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు, శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేషనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఉపాధ్యక్షుడు, ప్రెసిడెంట్లుగా నితీశ్ నారాయణ్ (ఢిల్లీ సెంటర్), ప్రతికుర్ రహమన్ (బెంగాల్), తాళ్ల నాగరాజు (తెలంగాణ), అశోక్ (ఏపీ), అనుశ్రీ (కేరళ), సంగీతాదాస్ (అసోం), సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంట, దీప్సితాధర్ (ఢిల్లీ సెంటర్), శ్రీజన్ భట్టాచర్య (బెంగాల్), పీఎం అశ్రో (కేరళ), సందీపన్ దాస్ (త్రిపుర), ఆదర్శ్ ఎం.సాజీ (సెంటర్) ఎన్నికయ్యారు. కార్యదర్శి వర్గ సభ్యులుగా నిరుబన్ చక్రవర్తి (తమిళనాడు), ఐషీఘోష్ (ఢిల్లీ), సుభాష్ జక్కర్ (రాజస్థాన్), అమత్ ఠాకూర్ (హిమాచల్ప్రదేశ్)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్.ఎల్.మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు (హెచ్సీయూ)లకు కమిటీలో చోటు లభించింది. (చదవండి: ఇప్పుడేం చేద్దాం? ఢిల్లీ వెళ్లాలా? లేఖ రాయాలా) -
అ‘న్యాయం’గా ఫీజులు పెంపు!
సాక్షి, హైదరాబాద్: పేదవిద్యార్థులకు న్యాయవిద్య ఫీజులు భారంగా మారాయి. ఫలితంగా వారు న్యాయవిద్యకు దూరమవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మునుపెన్నడూ లేనంతగా ఫీజులు పెంచిందని న్యాయశాస్త్ర విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఐదేళ్ల న్యాయవిద్య కోర్సు వార్షిక ఫీజును రూ.5,460 నుంచి రూ.16 వేలకు పెంచారు. రెండేళ్ల కాలపరిమితి ఉండే ఎల్ఎల్ఎం ఫీజును రూ.4,500 నుంచి రూ.20,100కు పెంచారు. ఎంఎల్ఎం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులు రెండింతలు పెరిగాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.15 వేల నుంచి రూ.33,000 పెంచారు. ప్రభుత్వ అధీనంలో ఉండే ఉస్మానియా లా కోర్సుల్లో ఫీజులు ఇప్పుడు ప్రైవేటు కాలేజీలతో సమానంగా ఉన్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల బెంబేలుతో చేరని విద్యార్థులు లా కోర్సు చదువుదామనుకున్న విద్యార్థులు భారీ ఫీజుల కారణంగా కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా పేద విద్యార్థులు వెనక్కు తగ్గుతు న్నారు. ఈ విద్యాసంవత్సరం 6,724 సీట్లు అందుబాటులో ఉండగా, 12,301 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 5,747 మంది మాత్రమే కౌన్సెలింగ్లో సీట్లు పొందారు. మూడేళ్ల ఎల్ఎల్బీలో 4,064 సీట్లు అందుబాటులో ఉండగా, 3,598 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల ఎల్ఎల్బీలో 1,784 సీట్లకు 1,440 సీట్లు కేటాయించారు. 876 ఎల్ఎల్ఎం సీట్లకు 709 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. గడువు ముగిసే నాటికి దాదాపు వెయ్యి మంది వరకూ కాలేజీల్లో చేరేందుకు ఇష్టపడలేదని అధికారులు చెబుతున్నారు. ప్రకటన లేకుండానే పెంపు వర్సిటీ అధికారులు ఇష్టానుసారంగా ఫీజుల పెంచారనే విమర్శలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత కాలేజీలకు ఖర్చు పెరిగిందని, ప్రభుత్వం నుంచి ఇందుకు తగ్గట్టుగా నిధులు రావడం లేదని, అందుకే ఫీజులు పెంచాల్సి వచ్చిందని అధికారులు అంటున్నారు. లాసెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఓయూ న్యాయ కళాశాలలో సీట్లు పొందుతారు. ఇప్పుడు సాధారణ ర్యాంకులతో ప్రైవేట్ కాలేజీల్లో చేరినవారు, ఓయూ కళాశాలలో సీట్లు పొందినవారు దాదాపు సమానంగా ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉస్మానియా వర్సిటీ న్యాయ కళాశాలల్లో రెగ్యులర్ కోర్సుల ఫీజు పెరగడాన్ని ఓయూ జేఏసీ అధ్యక్షుడు కురవ విజయ్కుమార్ ఖండించారు. ఫీజులపెంపు వల్ల ప్రతిభ గల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు న్యాయవిద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన లా కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఓయూ పాలకవర్గం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘జింబో’ రాజేందర్కు ఉస్మానియా పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ జడ్జి, రచయిత మంగారి రాజేందర్ (జింబో) ‘పోలీసు అధికారాలు–సమన్యాయ పాలన– ఎన్కౌంటర్ మరణాలు’ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మంగారి రాజేందర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, కథలతోపాటు, యాభై వరకు ‘లా’ పుస్తకాలను తెలుగులో అనువదించారు. లా సంబంధిత వ్యాసాలు రాశారు. ప్రజలకు అర్థమయ్యేలా కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ‘మా వేములవాడ కథలు, జింబో’ కథలతో తనదైన ముద్ర వేశారు. -
రావినూతల శశిధర్కు న్యాయశాస్త్రంలో పీహెచ్డీ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటి న్యాయశాఖ విభాగంలో ‘‘యాంటి టెర్రరిజం లాస్ ఇన్ పోస్ట్ 9/11 వరల్డ్ అండ్ ఇండియన్ లాస్ - ఎ కంపారేటివ్ స్టడీ’’ అనే అంశంపై ప్రొఫెసర్ ఎస్. బీ. ద్వారకానాథ్ గారి పర్యవేక్షణలో పరిశోధన చేసిన రావినూతల శశిధర్కు ఉస్మానియా యూనివర్సిటి డాక్టరేట్ను ప్రదానం చేసింది . అమెరికా జంట టవర్ల పేలుళ్ళ అనంతరం తీవ్రవాదాన్ని అణిచివేయడానికి వివిధ ప్రపంచ దేశాలు చేసిన తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలు మరియు వాటి పనితీరు, ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు వాటి ప్రభావం , ఐక్య రాజ్య సమితి వివిధ విభాగాల ఏర్పాటు మరియు వాటి పనితీరు, భారత దేశంలో వివిధ రూపాలలో ఉన్న తీవ్రవాద మూలాలు, తీవ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ లో ప్రస్తుతం ఉన్న చట్టాల పనితీరు, నూతన చట్టాల ఆవశ్యకత, తీవ్రవాద వ్యతిరేఖ చట్టాల అమలులో భారతదేశ కోర్టుల పాత్ర, కఠిన చట్టాల ఆవశ్యకత - మానవ హక్కులు రక్షణ తదితర అంశాలపై లోతైన అధ్యయనంతో కూడిన పరిశోధన థిసిస్ను రావినూతల శశిధర్ సమర్పించారు. ఈ పరిశోధనకు సంబంధించిన పలు అంశాలపై రావినూతల శశిధర్ వ్రాసిన పలు ఆర్టికల్స్ను ప్రముఖ లీగల్ జర్నల్స్ ప్రచురించాయి, పరిశోధనలో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించిన పలు జాతీయ స్థాయి సెమినార్లలో కూడా శశిధర్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య తీవ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రస్తుత చట్టాల పనితీరుపై విస్తృత పరిశోధన చేసి అంతర్జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై మరియు భారత దేశంలోని చట్టాలలో రావాల్సిన మార్పులపై ఈ పరిశోధనలో చేసిన పలు సూచనలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు శశిధర్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రంలో అనేక విద్యార్థి ఉద్యమాలకు మరియు సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించిన రావినూతల శశిధర్.. తీవ్రవాద వ్యతిరేఖ చట్టాలపై విస్తృత పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అవార్డు సాధించడం పై పలువురు అభినందించారు. -
ఓటర్ల కాళ్లు మొక్కుతూ.. మునుగోడులో ఓయూ విద్యార్థుల ప్రచారం
సాక్షి, మునుగోడు: టీఆర్ఎస్ను ఓడించాలని కోరుతూ మునుగోడులో ఓయూ జేఏసీ విద్యార్థులు వినూత్న ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసగిస్తున్న టీఆర్ఎస్కు ఓటు వేయొద్దంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని, ఓటర్ల కాళ్లు మొక్కారు. చండూరులో ఆదివారం ఈ వినూత్న ప్రచారం కనిపించింది. ‘సాలు దొర ఇక సెలవు..’, ‘కేసీఆర్ను ఓడిద్దాం.. నిరుద్యోగుల జీవితాలను కాపాడుకుందాం’ అనే నినాదాలతో నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రచారం నిర్వహించినట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని, ఓటర్లు మేల్కొనాలని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిస్తే ఉరే శరణ్యమని వాపోయారు. రొట్టె చేస్తా.. ఓట్లు అడుగుతా.. మంత్రి సత్యవతి రాథోడ్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం గరకతండాలోని ఓ గిరిజన ఇంట్లో రొట్టె చేశారు. వారితో కలిసి రొట్టెతిన్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని వారిని కోరారు. -
Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్ఎల్ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్–2022 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. పీజీ ప్రవేశ పరీక్షలో (సీపీజీఈసెట్–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్ తిరస్కరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్–2లో 200 స్టార్టప్ల కార్యకలాపాలు ప్రారంభం) -
Hyderabad: ఆన్లైన్లో బిట్స్ పిలానీ బీఎస్సీ డిగ్రీ
సాక్షి, హైదరాబాద్: జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ క్యాంపస్ లో ‘కొర్సెరా’ భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్లైన్ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్) సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్ డైరెక్టర్ జి.సుందర్ తెలిపారు. 12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్ పిలానీతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీ వాండెన్ బోష్ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం బిట్స్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఓయూ పీజీ కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్లాగ్, ఇంప్రువ్మెంట్కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబసైట్లో చూడవచ్చు. (క్లిక్: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల) -
12, 13న నిరుద్యోగుల నిరాహార దీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ: రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకోసం సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు ఎస్సీ, బీసీ నిరుద్యోగులు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కు లు తగ్గించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై 11న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, ఈ నెల 12, 13 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఓయూలోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్లో శనివారం జరిగిన విద్యార్థి సంఘాల రౌండ్టేబుల్ సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేయాలనే ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావును తొలగించాలని డిమాండ్ చేశారు. -
సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నాగేశ్వర్రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్ లభించింది. ఆచార్య చంద్రశేఖర్రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్రావుకు ఓయూ డాక్టర్ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే విలువలు కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచీకరణతో ప్రపంచ సంస్కృతి వైపు మనం వెళుతున్నామని, ప్రపంచ సంస్కృతి యావత్తు ప్రపంచాన్ని చుట్టుముడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఈ వైవిధ్యాన్ని కొనసాగిస్తూనే మన విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ తమిళిసై సౌందర రాజన్.. సీజేఐ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. నేటి యువత అనేక సవాళ్లను ఎదర్కొంటోందని, మన జీవన విధానం భారీ పరివర్తనకు గురయ్యిందని జస్టిస్ రమణ పేర్కొన్నారు. మన తిండి, భాష, బట్టలు, ఆటలు, పండుగలు వగైరాలు మన గతంతో పెనవేసుకుపోయాయన్నారు. సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం యునెస్కో 2021 నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచంలోమాట్లాడే 7 వేల భాషల్లో సగం భాషలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, దీంతో భాష, సాహిత్యాన్ని కోల్పోవడంతో పాటు, జానపద కథలు, తరాల వారసత్వంగా లభించిన విజ్ఞానాన్ని కోల్పోతామని జస్టిస్ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం క్రమంగా మారుతోందని, కొత్త వంగడాల రాకతో అనేక మార్పులొచ్చాయని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మార్పులకు లోనవడంతో పంటలు మార్పులకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యార్థులు ప్రాథమిక చట్టాలు, సూత్రాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం, పరిపాలనపై సబ్జెక్టులను ప్రవేశపెట్టాల్సిన అవసరముందన్నారు. పౌరులు రాజ్యాంగంతో అనుసంధానించబడాలని, రాజ్యాంగమే మనకు అంతిమ రక్షణ కవచమని చెప్పారు. విద్యార్థులంతా ఉత్తరాలు రాయాలని, పుస్తకాలు చదవాలని సీజేఐ రమణ ఉద్బోధించారు. ఉత్తరాలు రాస్తే మీలో ఉన్న కవులు బయటకు వస్తారని ఆయన సూచించారు. పీవీ, కేసీఆర్ ఓయూ ప్రొడక్ట్లే.. ఉస్మానియా యూనివర్సిటీ దక్షిణ భారతదేశంలోనే మూడో పురాతన విశ్వవిద్యాలయమని, హైదరాబాద్ రాష్ట్రంలో మొదటిదని గుర్తుచేశారు. బ్రిటిష్ వలస పాలన, ఆంగ్లభాష ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ప్రాంతీయ భాషల్లో బోధనను ఓయూ ప్రారంభించి ఉన్నత విద్యలో కొత్త యుగానికి నాంది పలికిందన్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్ర భారత్గా అవతరించే వరకు వెలుగురేఖలు పంచిందన్నారు. ఎంతో మంది దార్శనికులను తయారు చేసిందని, సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్దడం ఓయూ ప్రత్యేకత అని కొనియాడారు. రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలంగాణ సీఎం కేసీఆర్లు ఓయూ ప్రొడక్ట్లేనని గుర్తు చేశారు. ఓయూలో చేరాలనుకున్నా.. ఆధునిక భారతదేశాన్ని నిర్మించడంలో ఓయూ పాత్ర గణనీయమైందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్, రాజగోపాలాచారి, నెహ్రూ, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్, అంబేడ్కర్ వంటి 42 మంది మహనీయులు ఓయూ నుంచి గౌరవ డాక్టర్ను స్వీకరించారని చెప్పారు. ఓయూ కాలేజీలో చేరాలనుకున్నా తనకా అవకాశం దక్కలేదని, కోరిక నెరవేరలేదని గత స్మృతులను నెమరేసుకున్నారు. ఈ సందర్భంగా కాళోజీ, దాశరథి కవితలు చదివి జస్టిస్ రమణ మాతృ భాషపై గల మమకారాన్ని చాటుకున్నారు.. హైకోర్టు సీజే ఉజ్జల్ భూయాన్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 44 గోల్డ్మెడల్స్, 211 పీహెచ్డీ అవార్డులను విద్యార్థులకు ప్రదానం చేశారు. లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలి విజయానికి సత్వర మార్గాలు ఉండవని, లక్ష్యాన్ని చేరుకునేలా కష్టపడాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ విద్యార్థులకు సూచించారు. చిన్నచిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలన్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఎదురుకోవాల్సిందేన్నారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సాధారణంగానే ఉండాలని, అసాధారణ పనులు చేయాలన్నారు. ప్రస్తుతం ఐదు నిమిషాలు కూడా మొబైల్ని పక్కకు పెట్టే పరిస్థితి లేదని, ఫోన్లను దూరంగా పెట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. -
నేడు జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానం చేయనున్నట్లు వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. గురువారం ఆయన వర్సిటీ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్లర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన వర్సిటీ క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ను అందజేయనున్నట్లు చెప్పారు. ఇది ఓయూ 48వ గౌరవ డాక్టరేట్ అని, 21 ఏళ్ల అనంతరం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా దానిని ప్రదానం చేస్తున్నామని వివరించారు. 361 మందికి పీహెచ్డీ డిగ్రీలు, వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు 55 బంగారు పతకాలు అందచేయనున్నట్లు వీసీ తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీనగేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఓయూలో పీహెచ్డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పర్యవేక్షణకు (గైడ్) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు సుమారు 200 మంది పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ గైడ్షిప్ అర్హత లేదు. గైడ్షిప్ గల 162 మంది పర్మనెంట్ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు. ఆరేళ్ల తర్వాత.. ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్డీ గైడ్షిప్ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్టైం, ఫుల్టైం పీహెచ్డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్డీ అవకాశం దక్కేలా లేదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న 15 అటానమస్ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్షిప్ను రద్దు చేశారు. (క్లిక్: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!) పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కొనసాగించాలి ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్డీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం. – కొర్ర శరత్నాయక్ పరిశోధనలు కుంటుపడతాయి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చదివితే హాస్టల్ వసతి, ఫెలోషిప్లకు అవకాశం ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు. దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి గైడ్షిప్కు అవకాశం కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి. – బైరు నాగరాజుగౌడ్ ఓయూ విద్యార్థులపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్ఫోర్స్ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్ఫోర్స్ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మలక్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్: హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ) -
ఓయూ పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఇప్పటి వరకు జరుగుతున్న, జూలై 11న జరగనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించినందున ఓయూలో జరగనున్న వివిధ కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు పీజీ ఇంటర్నల్ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ తేదీలు, ఇతర వివరాలకు విద్యార్థులు రోజూ ఓయూ వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు. -
‘ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా తప్పుడు సమాచారం’
ఉస్మానియా యూనివర్శిటీ: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అందించిన సమాచారం అధారంగా ప్రజలు అభిప్రాయాలను ఏర్పాటు చేసుకుంటారు గనుక.... కలుషితం లేని వాస్తవిక సమాచారాన్ని ప్రజలకు అందించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల గుర్తింపు కోసం జర్నలిస్టులు వినియోగించాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై… యూఎస్ కాన్సులేట్ జనరల్, ఉస్మానియా జర్నలిజం విభాగం సంయుక్తంగా ఓయూ సీఎఫ్ఆర్డీ లో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో పాల్గొని డేవిడ్ మోయర్ ప్రసంగించారు. దురుద్దేశం లేకపోయినా... దురదృష్టవశాత్తు కొన్ని సార్లు చట్టబద్దమైన మీడియా సంస్థల నుంచే తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుందని అన్నారు. సమాచార సముద్రంలో ఈదుతున్న పాత్రికేయులు ఒక్కో సందర్భంలో అబద్ధానికి వాస్తవానికి వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారని.... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి పరిస్థితిని కట్టడి చేసుకోవాలని హితవు పలికారు. ఇందుకోసం అందరం కష్టించి పనిచేయాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జర్నలిస్టులకు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కొనే నైపుణ్యాలను అందించేందుకు ముందుకు వచ్చిన ఉస్మానియా యూనివర్శిటీ జర్నలిజం విభాగాన్ని ఈ సందర్భంగా మోయర్ అభినందించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవటం అత్యవసరమని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. జర్నలిజంలో వస్తున్న ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని... ఇందుకు ఉస్మానియా జర్నలిజం విభాగం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి సెషన్స్ ద్వారా బాధ్యతాయుతమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార వరద నుంచి వాస్తవాలను జల్లెడ పట్టడానికి క్లిష్టమైన ఆలోచనా పద్దతులను వర్తింపజేయాలని డేటాలీడ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ సయ్యద్ నజాకత్ అన్నారు. టెక్నికల్ టూల్స్ పై అతిగా ఆధారపడటం కన్నా... పరిశీలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం మంచిదని బూమ్ లైవ్ దక్షిణాది న్యూస్ ఎడిటర్ నివేదిత నిరంజన్ కుమార్ జర్నలిస్టులకు సూచించారు. తప్పుడు సమాచారం, అభిప్రాయం, హాస్యాలకు వ్యత్యాసం ఏమిటో గుర్తించాలని చెప్పారు. ఏదైనా సమాచారానికి సంబంధించి అది అబద్ధమా, లేదా సందర్భం మారిందా, వ్యంగమా గమనించాలని స్పష్టం చేశారు. కేవలం వైరల్ అయిన సమాచారానికి మాత్రమే కాకుండా ప్రతి చిన్న సమాచారానికి కూడా ఫ్యాక్ట్ చెక్ అవసరమని వివరించారు. ఓయూ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ కె. నరెందర్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ కె. స్టీవెన్ సన్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రముఖ జర్నలిస్టు ఉడుముల సుధాకర్ రెడ్డి, ప్యాక్ట్ చెకర్ సత్యప్రియ రచించిన ఫ్యాక్ట్ చెకింగ్ పుస్తకాన్ని డేవిడ్ మోయర్తో కలిసి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ విడుదల చేశారు. -
భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): భర్త ఆటో డ్రైవర్.. అయితేనేం అతని భార్య పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. మహబూబ్నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు) -
డిగ్రీ ఫీజు గడువుపై వీసీని ఒప్పించా: ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్: ఈ నెల 10న ముగిసిన డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును వర్సిటీ 14వ తేదీ సాయంత్రం వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆ మేరకు అమెరికాలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ రవీందర్తో ఫోన్లో మాట్లాడి ఒప్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులు కట్టే వరకు కాలేజీ యాజమాన్యాలు పరీక్ష ఫీజులు తీసుకోవడం లేదన్నారు. సర్దుబాటు చేసి కట్టేలోగా ఫీజు గడువు ముగిసిందని, దీంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని వందలాది మంది విద్యార్థులు బీసీ భవన్కు వచ్చి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారని కృష్ణయ్య తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఉస్మానియా వీసీలతో ఫోన్లో మాట్లాడి విద్యార్థులకు ఓ అవకాశం ఇవ్వాలని తాను కోరగా, వారు సానుకూలంగా స్పందించారన్నారు. రేపు హాల్టికెట్లు: రిజిస్ట్రార్ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే బీఏ, బీకాం, బీఎ స్సీ, బీబీఏ, బీఎస్డబ్ల్యూ కోర్సుల రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు నేడు(జూన్14) అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యార్థుల విజ్ఞప్తి మేర కు ఫీజు చెల్లింపు గడువును సడలిస్తూ ఒక్కరోజు అవకాశమిచ్చినట్లు చెప్పారు. బుధవా రం (15న) నుంచి హాల్టికెట్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. -
ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా క్యాంపస్లో అత్యాధునిక సమీకృత పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అడోబ్ ముందుకొచ్చిందని ఉస్మానియా యూని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ డి.రవీందర్ తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో, ఉస్మానియా పూర్వవిద్యార్థి శంతను నారాయణ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ అక్కడ ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్ ద్వారా పంచుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో శంతను నారాయణ్తో భేటీ అయినట్టు తెలిపారు. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో విద్యార్థులు, పరిశోధకులకు ఉప యోగపడేలా ప్రతిపాదనలు రూపొందించాలని అడోబ్ సీఈవో కోరినట్టు తెలిపారు. శాన్ఫ్రాన్సి స్కోలో పలువురు పూర్వ విద్యార్థులను కలసి ఓయూ నిధుల సమీకరణపై చర్చించినట్టు చెప్పా రు. ఎంఐటీ, హార్వర్డ్ సహా ఇతర అమెరికన్ వర్సిటీలు ఆర్థిక సమీకరణ కోసం ఉపయోగించే ఎండోమెంట్లను అధ్యయనం చేయాలని, ఉస్మాని యాకు సైతం ఓ క్రమబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించుకోవాలని శంతను నారాయణ్ ప్రతి పాదించినట్టు రవీందర్ చెప్పారు. ఓయూ మరో పూర్వవిద్యార్థి, ప్రఖ్యాత అప్లైడ్ మెటీరియల్ శాస్త్ర వేత్త, అప్లైడ్ వెంచర్స్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఓంకారం నలమాసతో కూడా చర్చించి నట్టు తెలిపారు. 21–పాయింట్స్ అజెండా, క్లస్టర్ సిస్టమ్, ఫ్యాకల్టీ పబ్లికేషన్లకు వీసీ అవార్డును ప్రవేశపెట్టడం, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు, సంక్రమిత త్రీడీ తయారీ కేంద్రం ఏర్పాటు సహా వివిధ సంస్కర ణల గురించి వివరించినట్టు చెప్పారు. సిలికాన్ వ్యాలీలో పన్నెండు మంది పూర్వ విద్యార్థులు, వివిధ కంపెనీల సీఈవోలతో భేటీ అయినట్టు చెప్పారు. ఓయూకు సహకరించేందుకు వారు సమ్మతిం చినట్టు తెలిపారు. -
14న చికాగోలో ఓయూ ఫౌండేషన్ డే
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని చికాగో నగరంలో ఈ నెల 14న ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే నిర్వహించనున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఓయూ అలూమ్ని ఆఫ్ చికాగో ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి అమెరికా పర్యటనలో ఉన్న వీసీ ప్రొఫెసర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. శనివారం ఉత్తర అమెరికా ఉస్మానియా అలూమ్ని బోస్టన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ రవీందర్ పాల్గొని 21 అంశాలతో ఓయూలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించినట్లు అధికారులు విడుదల చేసి ప్రకటనలో పేర్కొన్నారు. (క్లిక్: పంచతత్వ పార్కు.. ఆకర్షణ, ఆరోగ్యం దీని ప్రత్యేకత) -
ఓయూ ప్రైవేట్ కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో పీహెచ్డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా కొనసాగనుంది. రీసెర్చ్ సెంటర్ల అనుమతికి ఆన్లైన్ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ సీటు ఒక్కటి కూడా లేదు. దీంతో ఐదేళ్లుగా పీహెచ్డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్డీ ప్రవేశాలకు రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో కూడా పీహెచ్డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్íÙప్ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్ సెంటర్కు అనుమతి ఇవ్వనున్నారు. ఓయూ ద్వారానే పీహెచ్డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్ రీసెర్చ్ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్డీ పరీక్షలు, వైవా (సెమినార్) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్ కాలేజీల్లో పీహెచ్డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్లో హాస్టల్ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు. -
కోఠి మహిళా కళాశాల అధ్యాపకుడి అరాచకాలు.. ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సాక్షి, కరీంనగర్: సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో యువతిని, ఆమె కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తోన్న యువకుడిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోటి ఉమెన్స్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తోన్న ఆదిత్య భరద్వాజ్, కరీంనగర్లోని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో 2019 నుంచి 2021 వరకు పీజీ కలిసి చదువుకున్నారు. కొద్దిరోజుల స్నేహం తర్వాత యువతిని ప్రేమిస్తున్నానని తెలుపగా ఆమె నిరాకరించింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న భరద్వాజ్ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో యువతి కుటుంబ సభ్యులతో తీయించుకున్న పాత ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధించసాగాడు. వీలైన ప్రతి చోటా ఆన్లైన్లో యువతికి, కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవాడు. పెళ్లి చేసుకోకుంటే యాసిడ్పోస్తానని బెదిరింపులకు గురిచేసేవాడు. తెలంగాణ మోడల్ స్కూల్ గంగాధర సోషల్ మీడియా అకౌంట్ను ట్యాగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టేవాడు. అతడి వేధింపులు భరించలేని యువతి ఈ నెల 10న గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా విచారించిన పోలీసులు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. భరద్వాజ్ కదలికలపై దృష్టి పెట్టారు. వనపర్తిలోని ఓ ఫంక్షన్కు వెళ్లగా అక్కడే అరెస్టు చేశారు. వేములవాడ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పోలీసులు అరెస్టు చేయగా కొందరు వీడియో తీసినవి సోషల్ మీడియాలో రావడంతో కిడ్నాప్ అంటూ వార్తలు వచ్చా యి. దీనిపై వనపర్తిలోని ఒక పోలీసు అధికారి కిడ్నాప్ కాదు ఓ కేసులో అరెస్టు చేసినట్లు వివరించారు. చదవండి: Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ.. -
విద్యార్థిగా చేరి.. నాయకుడిగా వెళ్లండి
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆలోచనలతో, ఆధునిక సంస్కరణలతో ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఓయూ ఉప కులపతి దండెబోయిన రవీందర్ అన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చి నిజాం కాలేజీ, విశ్వవిద్యాలయ మహిళా కళాశాల సహా 9 కళాశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రవీందర్ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ పురోగతిని ఆయన వివరించారు. ఆయన చెప్పిందేంటంటే... సివిల్ సర్వీస్ అకాడమీ.. ♦హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. దీనివల్ల ఉద్యోగాల కల్పన తేలికవుతుంది. కంపెనీలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు తర్ఫీదునిచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విద్యా అవకాశాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తోంది. ♦పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేశాం. విద్యార్థిగా ఓయూలో చేరి నాయకత్వ లక్షణాలతో బయటకు వెళ్లాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. విద్యార్థి సమన్వయ కేంద్రం, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు సత్ఫలితాలనిస్తుంది. ♦సెమినార్లు, సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రదర్శనలు సహా ఇతర ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టూడెంట్ డిస్కోర్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. క్యాంపస్లో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇది అమలులో ఉంటుంది. విద్యార్థులకు యునీక్ ఐడీ.. ♦సెంటినరీ హాస్టల్ విద్యార్థులకు యునీక్ ఐడెంటిటీ సంఖ్యను కేటాయించి ప్రతి ఒక్కరికీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. సెంటినరీ హాస్టల్ బిల్డింగ్ చుట్టూ 120 సీసీ కెమెరాలు అమర్చి విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశాం. క్యాంపస్లో ప్రశాంత వాతావరణం కల్పించి శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసే బాధ్యతను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు అప్పగించాం. ♦రూ. 11 కోట్లతో 300 మంది నిజాం కళాశాల విద్యార్థినుల కోసం నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించాం. రూ.26 కోట్లతో 500 మంది బాలుర కోసం నిర్మించిన హాస్టల్ భవనాన్ని విద్యార్థినుల కోసం కేటాయించాం. మరిన్ని బాలికల నూతన హాస్టల్ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. విద్యార్థినులకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించాం. ♦క్యాంపస్లోని ఓయూ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండో పసిఫిక్ స్టడీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సోషల్ సైన్సెస్లో పరిశోధనలకు ఊతమిచ్చేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రీసెర్చ్ సెంటర్, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కేంద్రాలు నెలకొల్పాం. ♦‘ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాల వాడకం’ హైబ్రిడ్ మాస్టర్ ప్రోగ్రామ్ను నిర్వహించడానికి ఫ్రాన్స్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం. -
తెలంగాణ విద్య, ఉద్యోగ సమాచారం
ఓయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు 18 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ దూరవిద్య బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల పరీక్షలు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 17 వరకు జరగనున్నట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల టైంటేబుల్ వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చన్నారు. గూప్స్పై రేపు 21వ సెంచరీ అవగాహన సదస్సు సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆదివారం ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ అశోక్నగర్లోని తమ అకాడమీలో ఈ కార్యక్రమం ఉంటుందని, సిలబస్, ప్రిపరేషన్, వ్యూహాలు, నోట్స్ తయారీ, సమయపాలన వంటి అంశాలపై నిష్ణాతులైన అధ్యాపకులు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు 9133237733 లో సంప్రదించవచ్చని సూచించారు. పీజీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 10నుంచి ప్రారంభంకానున్న వివిధ రెగ్యులర్ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ కంట్రోలర్ ప్రొ.అంజయ్య శుక్రవారం పేర్కొన్నారు. ఎం.ఎ, ఎం.కాం, ఎమ్మెస్సీ, ఇతర పీజీ కోర్సులు చదివే ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నేటి నుంచి ఆయా కాలేజీల్లో హాల్ టిక్కెట్లను పొందవచ్చన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్సైట్లో చూడవచ్చని తెలిపారు. జూలై 23న డీసెట్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి జూలై 23న ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 9 నుంచి జూన్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు డీసెట్ వెబ్సైట్కు లాగిన్ కావాలని సూచించారు. ‘మనూ’లో యూజీ కోర్సుల దరఖాస్తు 22 వరకు గచ్చిబౌలి: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచారు. శుక్రవారంతో ముగియనున్న గడువు తేదీని మే 22 వరకు పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ద్వారా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు కలిపి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకారం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు దారులు సీయూఈటీ వెబ్సైట్ను పరిశీలించి దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తులు ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాగా, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఆన్లైన్ అడ్మిషన్స్ రెగ్యులర్ మోడ్ కింద ఎంట్రన్స్ ఆధారంగా సీట్లు కేటాయించే కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 1 చివరి తేదీగా ప్రకటించారు. అలాగే మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించే వాటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 30 చివరి తేదీగా పేర్కొన్నారు. దరఖాస్తులు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. సింగరేణిలో గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల ఫలితాలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో 665 గిరిజన బ్యాక్లాగ్ పోస్టుల పరీక్షాఫలితాలను యాజమాన్యం విడుదల చేసింది. 2017 జూలైలో నోటిఫికేషన్ జారీ చేసిన ఈ పోస్టులకు 60 వేల మందికి పైగా దర ఖాస్తు చేసుకున్నారు. 2018 జూన్ 10న నిర్వహించిన పరీక్షలో 27,279 మంది అభ్యర్థులు హాజర య్యారు. అన్ని విధాలుగా అర్హులైన 665 మందికి నెలరోజుల్లోగా నియామక ఉత్తర్వులు అందజేస్తామని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని యాజమాన్యం భావించినప్పటికీ కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందన్నారు. గిరిజనులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో కేసుల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేయడం హర్షణీయమని పలువురు పేర్కొన్నారు. మే 7న బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల వెబ్ కౌన్సెలింగ్కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దంత కళాశాలల్లో బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిందని తెలిపింది. కన్వీనర్ కోటాలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ అడిషనల్ మాప్ అప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నామని వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 7వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అదే రోజు రాత్రి 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చునని సూచించింది. గత విడత కౌన్సెలింగ్లో సీట్ పొంది చేరకపోయినా, చేరి మధ్యలో మానేసినా, అల్ ఇండియా కోటాలో ఇప్పటికే సీటు పొందిన అభ్యర్థులూ ఈ కౌన్సెలింగ్కు అనర్హులని స్పష్టం చేసింది. -
7న ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ గాంధీ టూర్ టెన్షన్ పట్టుకుంది. రాహుల్గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న నేతలు.. హైకోర్టును ఆశ్రయిం చినప్పటికీ ఊరట లభించలేదు. తొలుత.. రాహుల్గాంధీ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా వీసీని కోర్టు ఆదేశించిందంటూ వచ్చిన వార్తలతో సంబరపడిన నేతలు.. ఆ తర్వాత పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసిందని తేలడంతో నిరాశలో మునిగిపోయారు. రాహుల్ సందర్శనను అనుమతిం చాల్సిందిగా ఓయూ వీసీని ఆదేశించలేమని హైకోర్టు చెప్పడం, రాహుల్ టూర్ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఏడో తేదీన రాహుల్ షెడ్యూల్పై మల్లగుల్లాలు పడుతోంది. మరోమారు వీసీని కలిసి విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ వర్గాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ను ఓయూ కు తీసుకెళ్లాలా వద్దా అన్న అంశంపై గురువారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మార్పులతో గురువారం నాడే పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతమున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్న రాహుల్ ఏడో తేదీన ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్లో పర్యటిస్తారు. ముందుగా పలువురు ప్రముఖులు, అమరవీరుల కుటుం బాలతో సమావేశం కానున్నారు. తర్వాత గాంధీభవన్కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఉస్మానియాకు వెళ్తారని, లేదంటే నేరుగా చంచల్గూడ జైలుకు వెళ్లి ఎన్ఎస్యూఐ నాయకులతో ములాఖత్ అవుతారని తెలుస్తోంది. చలో ప్రగతి భవన్ను అడ్డుకున్న పోలీసులు రాహుల్ ఓయూ సందర్శనకు మంగళవారం వరకు అనుమతి రాకపోవడం, వీసీ, గవర్నర్లు అందుబాటులో లేని నేపథ్యంలో బుధవారం చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సాయంత్రం ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగ్గారెడ్డి బృందం గాంధీభవన్ ప్రాంగణంలోనే నిరసనకు దిగింది. తమను అనుమతించేంతవరకు అక్కడే ఉంటామని చెప్పి లోపల బైఠాయించారు. ఈ సమయంలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం రావడంతో ఆందోళన విరమించుకున్నారు. అనంతరం ఓయూ విద్యార్థి నాయకులతో కలిసి జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాహుల్ను ఓయూకి అనుమతించకుండా ఇబ్బంది పెట్టడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబం పట్ల కేసీఆర్కు కృతజ్ఞతాభావం లేదని అర్థమయిందని చెప్పారు. ఓయూలో కొనసాగుతున్న ఆందోళనలు రాహుల్ సందర్శనకు అనుమతి ఇవ్వాలంటూ ఓయూలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మ న్ చనగాని దయాకర్గౌడ్, ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రికత్తకు దారి తీసింది. మరోవైపు వామపక్ష విద్యార్థి నేతలు ఆర్ఎన్ శంకర్, రవినాయక్, నాగేశ్వర్రావు, శరత్నాయక్, స్వాతిలను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్కు తరలించారు. ఓయూలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని సీఐ రమేష్నాయక్ చెప్పారు. -
Rahul Gandhi: హైకోర్టులో కాంగ్రెస్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, నిర్ణయం తీసుకోవాల్సింది వైస్ చాన్స్లరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఉస్మానియా రిజిస్ట్రార్.. రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించడంపై మానవతారాయ్ సహా మరో ముగ్గురు లంచ్ మోషన్ను పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలు, మతపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని 2021లో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసిందని, దీని ప్రకారం రాహుల్గాంధీ నిర్వహించే రాజ కీయ కార్యక్రమానికి అనుమతి సాధ్యం కాదని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తరఫు న్యాయవాది వాదించారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానాన్ని పిటిషనర్లు సవాల్ చేయలేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదని చెప్పారు. రాహుల్గాంధీతో ముఖాముఖి కార్యక్రమానికి అనుమతి కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన వారెవ్వరూ వర్సిటీలో చదివే రెగ్యులర్ విద్యార్థులు కాదన్నారు. ఇలాంటి వాళ్లు కోరే సమావేశానికి అనుమతిస్తే బయట వ్యక్తులు కూడా ముఖాముఖికి హాజరయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా సిబ్బంది ఎన్నికలు కూడా జరగనున్నాయని చెప్పారు. పిటిషనర్లు నిర్వహిస్తామని చెబుతున్న ఠాగూర్ ఆడిటోరియానికి, ఎంబీఏ పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు కేవలం రెండు కిలోమీటర్లలోపే దూరమని, పిటిషన్ను అనుమతిస్తే దాని ప్రభావం పరీక్షలు రాసే విద్యార్థులపై ప్రతికూలంగా పడే అవకాశం ఉంటుందన్నారు. రాహుల్గాంధీతో విద్యార్థుల ముఖాముఖీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్ను కొట్టేయాలని కోరారు. అనంతరం ఈ అభ్యంతరాలపై పిటిషనర్ల తరుఫు అడ్వొకేట్లు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంకాం పరీక్షలు నడుస్తున్నాయని.. రాహుల్ పర్యటనతో శాంతిభద్రతల సమస్యలు వస్తాయన్న వీసీ స్టాండింగ్ కౌన్సిల్ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ పిటిషన్ను కొట్టివేసింది. అయితే దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని చెప్పారు. -
ఓయూలో రాహుల్గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియా విశ్వవిద్యాలయం (హైదరాబాద్): ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకోవడం వల్లే తెలంగాణలో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పోరాడేందుకు సమస్యలు లేకనే రాహుల్ గాంధీ రాకను రాజకీయం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. -
మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే పిలుస్తారు
హనుమకొండ: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ నేపాల్లోని కఠ్మాండులో పబ్లకు వెళతారు.. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెబుతారని అనుకుంటున్నారని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఎర్రబెల్లి పైవిధంగా బదులిచ్చారు. ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలా.. వద్దా.. అనేది ఆ యూనివర్సిటీ చూసుకుంటుందన్నారు. ప్రభుత్వానికి అనుమతితో సంబంధం లేదని స్పష్టంచేశారు. ‘ఓయూకు వచ్చి పబ్ల గురించి చెబితే విద్యార్థులు చెడిపోతారనే భావన కూడా అనుమతి ఇవ్వకపోవడానికి ఒక కారణం కావొచ్చు. ఎవరు వస్తే విద్యార్థులు బాగుపడతారు.. ఎవరు వస్తే విద్యార్థులు చెడిపోతారు.. అనే అంశాలపై ఓయూ యాజమాన్యం ఆలోచించి ఆహ్వానిస్తుంది. మేధావులు, క్యారెక్టర్ ఉన్న వారినే ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు పిలుస్తారు’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. -
Rahul Gandhi OU Visit: ఓయూలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ(మంగళవారం) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓయూ సందర్శనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ నాయకులు మళ్లీ ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్యూఐ నేతలు కొందరు కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడంతో.. కౌంటర్గా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసి.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈపర్యటనలో భాగంగా.. ఈ నెల 7న హైదరాబాద్, తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి.. విద్యార్థులతో ఆయన ముఖాముఖి చేపట్టాలనుకున్నారు. అయితే ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అందుకు అనుమతులు నిరాకరించింది. మరోవైపు అక్కడ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వబోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళనలకు దిగుతోంది. ఇక హైకోర్టు సైతం రాహుల్ సభ నిర్వాహణ నిర్ణయాన్ని దాదాపుగా ఓయూకే వదిలేసింది. సంబంధిత వార్త: ఓయూ రగడ.. ఆగని అరెస్టులు -
ఓయూ రగడ.. ఆగని అరెస్టులు
సాక్షి, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్శిటీ/ చంచల్గూడ: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటన వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన సభ విషయమై విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. మరోవైపు ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో పాటు మరో 17 మంది నేతల విషయంలో ఏం చేయాలనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా పలువురు నేతలు చంచల్గూడ జైల్లో ఉన్న వెంకట్ తదితరులను పరామర్శించారు. ఓయూలో విద్యార్థుల అరెస్టు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై రాష్ట్ర వ్యాప్తం గా నిరసన తెలియజేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమ వారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వీసీ రవీందర్, సీఎం కేసీఆర్లకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్, ఓయూ పరిశోధక విద్యార్థి చనగాని దయాకర్గౌడ్, నవ తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు బైరు నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడారు. ఓయూ పాలక మండలి చేసిన నిబంధనలు కేవలం కాంగ్రెస్ పార్టీకేనా? టీఆర్ఎస్, బీజేపీలకు వర్తించవా? అని ప్రశ్నించారు. ఓయూలో 7న రాహుల్ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతరాయ్, అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తదితరులు స్పష్టం చేశారు. కాగా ఓయూలో రాహుల్గాంధీ పర్యటనకు ఎలాంటి అనుమతి లేదని వీసీ సోమవారం మరోమారు తేల్చి చెప్పారు. క్యాంపస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు భారీగా మోహరించారు. రాహుల్ ఓయూ వెళతారు: రేవంత్రెడ్డి సోమవారం ఉదయం సీఎల్పీలో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్లు బల్మూరి వెంకట్ తదితరుల అరెస్టుపై చర్చించారు. తర్వాత పార్టీ నేతలు అంజన్కుమార్ యాదవ్, గీతారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎం.ఆర్.జీ.వినోద్రెడ్డి, అనిల్కుమార్యాదవ్, ఫిరోజ్ఖాన్లతో కలిసి చంచల్గూడ జైలుకు వెళ్లి వెంకట్ తదితరులతో ములాఖత్ అయ్యారు. ఈనెల 7వ తేదీని ములాఖత్ కోసం రాహుల్ గాంధీ వస్తారని, సమయం ఇవ్వాలని కోరుతూ జైలు సూపరింటెండెంట్ శివకుమార్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ రాహుల్గాంధీ ఓయూకు ఖచ్చితంగా వెళ్తారని చెప్పారు. అలాగే విద్యార్థి నేతలతో ములాఖత్ కోసం జైలుకు కూడా వస్తారని తెలిపారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సీటీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వర్సిటీని సందర్శించి అక్కడి విద్యార్థులతో మమేకం కావాలని నిర్ణయిం చుకున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సమాచారం సేకరించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని భావిం చినట్లు తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రాహుల్ను ఓయూకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లేందుకు భయపడుతున్న కేసీఆర్ కుట్రపూరి తంగానే రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుం టున్నారని విమర్శించారు. -
ఓయూ మహిళల టెన్నిస్ జట్టుకు స్వర్ణం
బెంగళూరు: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2–0తో రాజస్తాన్ యూనివర్సిటీ జట్టును ఓడించింది. ఫైనల్ మ్యాచ్లోని తొలి సింగిల్స్లో సామ సాత్విక 6–2, 6–2తో సాచి శర్మను ఓడించి ఓయూకు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–0తో రెనీ సింగ్పై గెలిచి ఓయూ విజయాన్ని ఖాయం చేసింది. రష్మిక, సాత్వికలతోపాటు అవిష్క గుప్తా, పావని పాథక్లు కూడా ఓయూ జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఓయూ జట్టుకు సి.నాగరాజ్ కోచ్గా, సయ్యద్ ఫారూఖ్ కమాల్ మేనేజర్గా వ్యవహరించారు. చదవండి: Uber Cup 2022: ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు -
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అరెస్ట్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లగా.. అక్కడ ఎమ్మెల్యేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. గేట్లు ఎక్కి ఓయూ ఆడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాయకులు వీసీ వైఖరికి నిరసనగా గాజులు, చీరలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఓయూ ముట్టడికి యత్నించిన ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్ట్ చేశారు. దీనిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రాహూల్ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేశారని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కష్టం అంత ఆవిరి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియాలో చదివిన వారు చాలా మంది ఎమ్యెల్యేలు అయ్యారని, ఒక్కరు కూడా కేసీఆర్ను యూనివర్సిటీకి ఎందుకు తీసుకుపోలేదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని ఓయూకి తీసుకెళ్తామని, ఈ అంశంపై సోమవారం 3 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ వరకు వెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ‘వీసి గారు ఇది ముగింపు కాదు. సందర్శన మాత్రమే. ఓ ఎంపీగా చూడటానికి వస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టతను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకునేందుకు ఎవరు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో లేని జీఓలు ఎలా తీస్తారు. కృతజ్ఞత లేని రాష్ట్రంగా తెలంగాణ ఎందుకు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురి కావాలా. రాహుల్తో ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ప్రజా ప్రతినిధులం ఉస్మానియాలో సందర్శిస్తాం. ఈ నెల 7న ఎట్టిపరిస్థితిలో రాహుల్ గాంధీని ఉస్మానియాకు తీసుకెళ్దాం.’ అని జగ్గారెడ్డి తెలిపారు. చదవండి: రోజుకు 10 నిమిషాలు నవ్వితే.. ఎన్ని కేలరీల కొవ్వు కరుగుతుందో తెలుసా! -
ఇంజనీరింగ్ ఫీజుల పెంపుపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఏమేర పెంచాలనే దిశగా అధికారులు చర్చించారు. ప్రతి మూడేళ్లకోసారి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్ఎఫ్ఆర్సీ) సమీక్షిస్తుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి, కాలేజీల ప్రతిపాదనలు స్వీకరించింది. గడచిన మూడేళ్లలో మౌలిక వసతులు, కంప్యూటర్ కోర్సుల వల్ల నిర్వహణ వ్యయం పెరిగిందని ప్రైవేటు కాలేజీలు ఆడిట్ రిపోర్టులు సమరి్పంచాయి. అయితే, కాలేజీలు సూచించిన స్థాయిలో ఫీజుల పెంపు సరికాదన్న వాదన ప్రభుత్వ వర్గాల నుంచి విని్పస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజులపై సలహాలు ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి నేతృత్వంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి సభ్యులుగా ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశమై ప్రాథమిక అంశాలను చర్చించింది. త్వరలో అన్ని విషయాలపైనా సమగ్రంగా చర్చించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్లోనే కాదు సివిల్స్లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్తో పోలిస్తే పోస్ట్గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్గా చదివితే కోచింగ్ సెంటర్కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
ఉస్మానియా ఎరుపెక్కిన వేళ...
కాసింత ఆహారం, దుస్తులు, వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలని అర్ధ శతాబ్దం క్రితం ఒక యువ మేధస్సు ఆలోచించింది. ఆ లక్ష్య సాధనకై ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించి, అడుగులు వేస్తున్న నేపథ్యంలో 1972 ఏప్రిల్ 14న ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ కిన్నెర హాస్టల్ ప్రాంగణంలో... ప్రగతి నిరోధక, ఛాందస భావాల ప్రతినిధుల కుట్రలకు ఆ యువ కిశోరం ఎదురు నిలిచి పోరాడి నేలకొరిగింది. అతడే ప్రగతి శీల విద్యార్థుల ప్రియ నేత, ఉస్మానియా అరుణ తార, హైదరాబాద్ చేగువేరాగా పిలుచుకునే జార్జి రెడ్డి! 1947 జనవరి 15న కేరళలో జన్మించాడు జార్జి రెడ్డి. 1960–70ల్లో హైదరాబాద్లోని నిజాం కాలేజీ విద్యార్థిగా, ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్గా జార్జ్ చెరగని ముద్ర వేశాడు. క్లిష్టమైన అణు భౌతిక శాస్త్రంలో (న్యూక్లియర్ ఫిజిక్స్) గోల్డ్ మెడల్ సాధించాడు. విద్యార్థులకు విద్యతో పాటు మానసిక శారీరక దృఢత్వం తప్పనిసరి అని విశ్వసించే జార్జ్ తనని తాను బాక్సింగ్ ఛాంపియన్గా మలుచుకున్నాడు. అంతేగాక తోటి విద్యార్థులకు, విద్యార్థినులకు స్వీయ రక్షణ మెలకువలు బోధిస్తూ, వారిలో నూతన విశ్వాసాన్ని నింపేవాడు. నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ గిరిజన పోరాటాలు, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ గాలులు ఉస్మానియా గడ్డను తాకాయి. ఆ ప్రజా ‘తిరుగుబాట్లు’ ఉస్మానియా విద్యార్థులలో ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ నూతన పరిణామాలకు వేదికైంది. రైతాంగ పోరాటాలకు జడుచుకొని నగరాలలో స్థిరపడిన ఆధిపత్య సామాజిక వర్గాల వారసులు... చదువు సాకుతో ఉస్మానియా యూనివర్సిటీలో తిష్ఠ వేశారు. మరోవైపు నాటి ఉద్యమ విజయాలతో చదువుల ఒడిని చేరుకున్న మధ్యతరగతి, రైతు కూలీల బిడ్డలు, ఉన్నత విద్యకై ఉస్మానియా వర్సిటీలోకి అప్పుడప్పుడే చేరుకోవడం ఆరంభమైంది. (క్లిక్: మహిళల వద్దకే ఉద్యోగాలు) మొదటి బృందానికి నాటి పాలక పార్టీ, నేటి అధికార పార్టీ మాతృసంస్థలు దిశానిర్దేశం చేస్తూ... యూనివర్సిటీపై తమ తమ ఆధిపత్యాల కోసం వికృత మార్గాలు ఎంచుకున్నాయి. ఫలితంగా రెండో బృందం విద్యార్థులపై హాస్టళ్లలో, మెస్లలో, తరగతి గదులలో, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ల పేరుతో.. బల ప్రదర్శన, ఆధిపత్యం చేయడం ఆనవాయితీగా మారింది. యూనివర్సిటీ అధికారులపై, ఆచార్యులపై బెదిరింపులకు పాల్పడటం; విద్యార్థి సంఘాల ఎన్నికలలో ఆరోగ్యకరమైన పోటీ జరగకుండా భయభ్రాంతులు సృష్టించడం, తోటి విద్యార్థుల స్వేచ్ఛను హరించడం సర్వసాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ విద్యార్థిగా జార్జి రెడ్డి యూనివర్సిటీ గడ్డపై అడుగు పెట్టాడు. బిక్కుబిక్కుమంటున్న విద్యార్థి లోకానికి పెద్ద దిక్కై నిలిచాడు. క్యాంపస్లో విద్యార్థి హక్కుల రక్షణకై నిలబడ్డాడు. భౌతిక దాడులను తన బిగి పిడికిలితో తిప్పికొడుతూ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపాడు. సైద్ధాంతిక అధ్యయనం, చర్చలతో సహచరులలో స్ఫూర్తి రగిలించాడు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి బృందాన్ని నిర్మించి ఆనతి కాలంలోనే విద్యార్థుల ఆత్మీయ నేతగా ఎదిగాడు. సాధారణ విద్యార్థులను పోటీకి నిలవనివ్వని ‘ఆధిపత్యం’పై విద్యార్థి సంఘాల ఎన్నికలలో గెలిచి రికార్డు సృష్టించాడు. విజ్ఞానంలోనూ, నాయకత్వంలోనూ పతాక స్థాయికి చేరుకుంటున్న జార్జి ‘ఆధిపత్య వర్గాలకు’ కంటగింపుగా మారాడు. దీంతో ఛాందసవాదులు జార్జిని అమానుషంగా హత్య చేశారు. జార్జి త్యాగాన్నీ, ఆశయాలనూ ఎత్తి పడుతూ జార్జి స్థాపించిన పీడీఎస్ అనతికాలంలోనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ)గా దేశవ్యాప్తంగా విస్తరించింది. ‘జీనా హై తో మర్ నా సీఖో, ఖదం ఖదం పర్ లడ్నా సీఖో’ అంటూ మరణానంతరం కూడా యువ తరానికి దిశానిర్దేశం చేస్తున్న హీరో జార్జి రెడ్డి. (చదవండి: వ్యవస్థల్లో విపరీత ధోరణులు) - ఎస్. నాగేశ్వర్ రావు పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు (ఏప్రిల్ 14న జార్జి రెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా... నేడు ఓయూలో నిర్వహించే ‘రెడ్ షర్ట్’ కవాతు, బహిరంగ సభ నేపథ్యంలో) -
అన్ని రంగాల్లో గణితానిది కీలకపాత్ర
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ (ఏపీటీఎస్ఎంఎస్) 30వ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. వర్సిటీ క్యాంపస్ లోని ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో గణితశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఓయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ వీరయ్య అధ్యక్షత వహించగా ముఖ్య అతిథి వీసీ రవీందర్, గౌరవ అతిథి, ఏపీటీఎస్ ఎంఎస్ అధ్యక్షుడు, జేఎన్టీయూ అనంతపురం ఈసీ కేశవరెడ్డి, కన్వీనర్ కిషన్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమెటిక్స్ అండ్ ఐటీస్ రిలవెన్స్ టు సైన్స్ అండ్ ఇంజనీ రింగ్ అనే అంశంపై కేశవరెడ్డి మాట్లాడుతూ.. గణితశాస్త్రం అన్ని రంగాలకు విస్తరించి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోందన్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఎనాలిసిస్, మెషినరీ లర్నింగ్, స్టాటిస్టిక్స్లో గణితం కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ఓయూలో మూడ్రోజులు జరిగే ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరవ నున్నారు. 160 పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని, ఉత్తమ పరిశోధన పత్రానికి రూ. 5 వేల నగదు బహుమతి అందచేయనున్నామని సదస్సు కన్వీనర్ కిషన్ తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎస్ఎంఎస్ జనరల్ సెక్రటరీ భారతి తదితరులు పాల్గొన్నారు. -
ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలు, అబ్బాయిల హాస్టల్ కేటాయింపుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంగళవారం వీసీ కార్యాలయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అబ్బాయిల స్పోర్ట్స్ హాస్టల్ను అమ్మాయిలకు కేటాయించారు. తమ కోసం స్పోర్ట్స్ నిధులతో నిర్మించిన హాస్టల్ను ఖాళీ చేసేదిలేదని వ్యాయామ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు 12 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. ఓయూ వీసీని రీకాల్ చేయండి ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ను రీకాల్ చేయాలని బహుజన విద్యార్థి ఫెడరేషన్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తమిళి సైను కోరారు. సంస్కరణల పేరుతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తూ విద్యార్థులు, ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పలువురు అధికారులు యూనివర్సిటీ కాలేజీలు, కార్యాలయాల్లో అవసరం నిమిత్తం డైలీవేజ్, కాంట్రాక్టు ఉద్యోగులను నియమించగా తనకు నచ్చని అధికారులు, సిబ్బందిని వీసీ రవీందర్ అకారణంగా తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం 2014లో జారీ చేసిన సర్క్యులర్ ఆధారంగా ఓయూకు సంబంధం లేని ఆర్క్యూస్లో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తీసేయడం దారుణమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థి నేతలు వేల్పుల సంజయ్, కొత్తపల్లి తిరుపతి, పులిగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. (క్లిక్: కారులో కూర్చుని వెండితెరపై సినిమా చూడొచ్చు.. త్వరలో హైదరాబాద్లో..) -
ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 26 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని సోమవారం కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీనగేష్ తెలిపారు. ఈ నెల 26న డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాల రెగ్యులర్ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలు, 28న డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. (క్లిక్: త్వరలోనే విద్యుత్ సంస్థల్లో ఏఈ పోస్టుల భర్తీ) కోవిడ్ కారణంగా గతంలో 2 గంటల వరకు కుదించిన సమయాన్ని ఇక నుంచి డిగ్రీతో పాటు ఇతర కోర్సులకు సైతం పాత సమయాన్ని 3 గంటల వరకు పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. ఓయూలో పరీక్షల వాయిదా పడ్డాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విద్యార్థులకు సూచించారు. త్వరలో డిగ్రీ పరీక్షల టైం టేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. (క్లిక్: 25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం) -
ఓయూలో 14 నుంచి సెల్ట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం పీహెచ్డీ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఓయూ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. -
కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా
బంజారాహిల్స్: కరోనా విజృంభణతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు పరీక్షలను వాయిదా వేశాయి. కొన్ని పరీక్షలను రద్దు చేశాయి. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఏవీఎన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామన్నారు. పూర్తి వివరాలను విశ్వ విద్యాలయ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. జేఎన్టీయూ పరిధిలో... కేపీహెచ్బీ కాలనీ: జేఏన్టీయూహెచ్లో జరగనున్న అన్ని పరీక్షలను ఈ నెల 30వరకు వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ యం. మంజూర్ హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ వార్షిక పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు), మధ్యస్థ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షల రీషెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఓయూలో పరీక్షలు రద్దు.. ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పరీక్షలను రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా రెగ్యులర్, దూరవిద్య కోర్సుల సెమిస్టర్ పరీక్షలతో పాటు ఇంటర్నల్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. -
‘317 జీవోను రద్దు చేయండి’
ఉస్మానియా యూనివర్సిటీ: ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న 317 జీవోను రద్దు చేయాలని సీఎం కేసీఆర్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. ఉద్యోగుల బదిలీల కోసం జారీ చేసిన జీవో 317తో ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. స్థానికతను, రోస్టర్ను పట్టించుకోకుండా అధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తూట్లు పొడిచారన్నారు. సీనియర్ను జూనియర్గా మారుస్తూ సొంత జిల్లాల నుంచి ఇతర జిల్లాకు అన్యాయంగా బదిలీ చేస్తూ మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల విధులు నిర్వహిస్తే లోకల్ సమస్యతో పాటు వారి పిల్లలు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను ఒకే చోటుకు బదిలీ చేయడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అగౌరవపరచకుండా వారికి న్యాయం జరిగేలా ఉన్న జీవోపై కేసీఆర్ క్షుణంగా అధ్యయనం చేయాలని, బదిలీలపై గందరగోళ పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. -
8 నుంచి ఓయూ హాస్టళ్ల మూసివేత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్ వార్డెన్ శ్రీనివాస్రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత మెస్లను కూడా మూసివేస్తామని చెప్పారు. విద్యార్థులు హాస్టల్ గదుల్లోని తమ సామాన్లను వెంటతీసుకెళ్లాలని సూచించారు. హాస్టళ్లను తిరిగి ప్రారంభించే తేదీలను తర్వాత ప్రకటిస్తామన్నారు. పీజీఈసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ పీజీఈసెట్ ఈ నెల 6 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ పి.రమేష్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. 7వ తేదీ వరకూ ఆన్లైన్ రిజిష్ట్రేషన్ చేసుకోవచ్చని, 9 నుంచి 11 వరకూ వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు. 16వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని, 19వ తేదీ వరకూ సెల్ఫ్ రిపోర్టింగ్కు గడువుంటుందని వెల్లడించారు. ‘డిగ్రీ వన్టైమ్ చాన్స్’ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గతేడాది అక్టోబర్లో జరిగిన డిగ్రీ కోర్సుల వన్టైమ్ చాన్స్, బ్యాక్లాగ్ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేశారు. బీఏ, బీబీఏ కోర్సుల బ్యాక్లాగ్, వన్టైమ్ చాన్స్ ఫలితాలు.. బీఎస్సీ, బీఏ ఒకేషనల్, బీకాం ఆనర్స్, వార్షిక పరీక్షల ఫలితాలను ప్రకటించినట్లు కంట్రోలర్ శ్రీనగేశ్ తెలిపారు. (తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు) పీజీ ప్రవేశాల చివరి విడత వెబ్ కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని ఏడు వర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి విడత కౌన్సెలింగ్ షెడ్యూలును బుధవారం విడుదల చేశారు. సీపీజీఈటీ–2021లో భాగంగా ఈ నెల 6 నుంచి ఈ నెల 10వరకు చివరి విడత వెబ్కౌన్సెలింగ్ జరగనున్నట్లు కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఎన్సీసీ, దివ్యాంగులు, సీఏపీ అభ్య ర్థులు ఈ నెల 10న నేరుగా ఓయూ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగే సర్టిఫికెట్ల వెరి ఫికేషన్కు హాజరు కావాలన్నారు. ఈ నెల 12నుంచి 15వరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని, 16న ఎడిటింగ్, 19న వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన అభ్యర్థుల చివరి జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీట్లు లభించిన విద్యార్థులు 20 నుంచి 25 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలన్నారు. ఎస్టీ గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా సర్వేశ్వర్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడ బ్ల్యూఆర్ఈఐఎస్) అదనపు కార్యదర్శిగా వి.సర్వేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం సర్వేశ్వర్రెడ్డి గిరిజన సంక్షేమ శాఖలో అదనపు సంచాలకుడిగా, టీసీఆర్టీఐ (గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ) సంచాలకుడిగా కొనసాగుతున్నారు. గిరిజన గురుకుల సొసైటీ అదనపు కార్యదర్శిగా పనిచేసిన నవీన్ నికోలస్ కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్పై వెళ్లడంతో మంగళవారం రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో అదనపు కార్యదర్శిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు సర్వేశ్వర్రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. -
జనావాసాల్లో గాయపడ్డ విదేశీ కొంగ
సాక్షి, అంబర్పేట(హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ అడవికి ఆనుకొని ఉన్న బాగ్ అంబర్పేట మల్లికార్జున్నగర్లో ఓ విదేశీ పక్షి గాయపడింది. బుధవారం ఉదయం స్థానికులు గమనించి అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పక్షిని పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి జూ పార్కు అధికారులకు సమాచారం అందించారు. జూ పార్కు అధికారులు ఈ పక్షి నైబీరియా నుంచి వలస వచ్చినట్లుగా జూ పార్కు అధికారులు గుర్తించారు. గాలిపటం మాంజా కారణంగా ఈ పక్షి గాయపడి నేలపై పడ్డట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. జూ పార్కుకు తరలించి చికిత్స అందిస్తామని అధికారులు తెలిపారు. -
నీరాలో కేన్సర్ నిరోధకశక్తి
సాక్షి, హైదరాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ: తాటి, ఈత చెట్ల నుంచి లభించే నీరాలో పోషక విలువలతోపాటు కేన్సర్ వ్యాధి నిరోధకశక్తి ఉందని ఉస్మానియా యూనివర్సిటీ మైక్రోబయోలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ భీమా వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రమంత్రి శ్రీనివాస్గౌడ్ కలసి తన పరిశోధనల ద్వారా ఆరు నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసిన నీరాను అందచేసి, పరిశోధన అంశాలను వివరించారు. కిడ్నిలో రాళ్లు ఏర్పడకుండా కూడా నీరా ఉపయోగపడుతుందని తన అధ్యయనంలో తేలిందని పేర్కొన్నారు. ఈ మేరకు భీమాను మంత్రి అభినందించారు. శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ నీరా ప్రాముఖ్యతను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.20 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో నీరాకేఫ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జైగౌడ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు వట్టికోటి రామారావుగౌడ్, శాస్త్రవేత్తలు డా.చంద్రశేఖర్, డా.శ్రీనివాస్నాయక్ పాల్గొన్నారు. -
మూడవ రోజు ముమ్మరంగా..
నాంపల్లి/ ఉస్మానియా యూనివర్సిటీ: ఇంటర్ పరీక్షా ఫలితాల రగడ కొనసాగుతోంది. మూడవ రోజు కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఫెయిలై న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో ఎంజే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. ఉదయం నుంచే బోర్డు కార్యాలయం గేట్లు మూసివేయడంతో కార్యాలయం ఎదుటే బైఠాయించి వారు నిరసనలు వ్యక్తం చేశారు. దీనికి తోడు సోమవారం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు జాతీయ క్యాంపెయిన్ శిక్షా బచావో–దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు. గాంధీభవన్ నుంచి ర్యాలీగా ఇంటర్మీడియట్ బోర్డుకు వందలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. విద్యార్థులను, ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు దొరికినవారిని దొరికినట్టుగా వ్యాన్లో ఎక్కించి గోషామహల్ స్టేడియానికి తరలించారు. 90 మంది ఆందోళనకారులను బేగంబజార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులందరినీ పాస్ చేయాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల అద్దాలు ధ్వంసం.. కాగా బోర్డు కార్యాలయానికి తరలివెళ్లే క్రమంలో కొందరు యువకులు ట్రాఫిక్లో రెచ్చిపోయారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆందోళనకారుల చేతిలో రెండు ఆటోలు, రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు బంద్: ఏబీవీపీ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ కాలేజీలను బంద్ చేయనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్రెడ్డి తెలిపారు. -
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్లు ‘భయో’ పిక్లు, కాకూడదు) -
ఓయూలో సమాధి కలకలం.. దానిపై తాజా పూలు చల్లి ఉండటంతో..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమాధి కలకలం రేపింది. ఆదివారం ఉదయం వాకింగ్కు వెళ్లిన విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహం వెనుక అటవీ ప్రాంతంలో సమాధిని చూసి భయాందోళనకు గురయ్యారు. వారు తిరిగి వసతి గృహాలకు పరుగెత్తారు. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీహెచ్-1 వసతిగృహానికి దగ్గరగా చెట్ల మధ్య ఇది ఉంది. దానిపై తాజాగా చల్లిన పూలు ఉన్నాయి. చదవండి: ఓయూ క్యాంపస్లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్ అయితే అక్కడ జంతువును పూడ్చిపెట్టి ఉంటారని విద్యార్థులు అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపు బస్తిలో ఉండే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మూడు రోజుల కింద చనిపోతే దాన్ని ఆదివారం పూడ్చి పెట్టినట్లు ప్రత్యేక సాక్షి చెప్పడంతో.. ఓయూ అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు, విద్యార్థులందరూ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: హైదరాబాద్: స్విగ్గి డెలివరీ బాయ్స్ సమ్మె.. నిలిచిన ఫుడ్ డెలివరీ -
ఓయూ క్యాంపస్లో యూజర్ చార్జీలు.. ఇకపై నో ఫ్రీ వాకింగ్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్లో వాకింగ్ కోసం వచ్చే బయటి వారినుంచి యూజర్ చార్జీలు వసూలు చేయాలని వర్సిటీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. క్యాంపస్ విద్యార్థులతో పాటు దేశ, విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థుల్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా విశ్వవిద్యాలయం పరిసర ప్రాంతాల నుంచి అనేక వందల మంది ప్రజలకు, క్యాంపస్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ మరియు యోగా వంటి ఫిట్నెస్ కార్యకలాపాలకు వస్తుంటారు. అయితే వాకర్స్కు యూనివర్సిటీ షాక్ ఇచ్చింది. డిసెంబర్ నెల నుంచి యూనివర్సిటి గ్రౌండ్లో వాకింగ్ చేసే వారి నుంచి 200 రూపాయల యూజర్ చార్జీలను వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం క్యాంపస్లో స్విమింగ్పూల్, క్రికెట్ గ్రౌండ్ వాడుకునే వారి నుంచి యూజర్ చార్జీలు వసులు చేస్తున్నారు. అయితే బయటి వ్యక్తులు క్యాంపస్లోని వసతులను ఉచితంగా వాడుకోవడం వల్ల వాటి విలువ తెలియడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరిస్థితితులకు అనుకూలంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడాన్ని తప్పుపట్టలేమన్నారు. కొంతమంది క్యాంపస్కు పెంపుడు కుక్కలను తీసుకొచ్చి ఇక్కడే మలమూత్ర విసర్జన చేయించడాన్ని విద్యార్థులు తప్పు పడుతున్నారు. అంతేకాక చుట్టుపక్కల నివాసముండేవారు తమ కార్లను ఈ స్థలాన్ని పార్కింగ్స్థలంగా ఉపయోగించుకుంటున్నారు. రాత్రి వేళ అయితే క్రీడా మైదానాల్లో మద్యం తాగి..ఖాళీ సీసాలను పగులగొట్టి అలాగే వదలివేస్తారు. చదవండి: ‘మేము పోలీసులం.. డబ్బులు ఇస్తే కేసు నుంచి తప్పిస్తాం’ వాకింగ్కు ప్రముఖులు హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ, విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, రాంచందర్రావు, పలువురు విద్యావేత్తలు, విద్యా సంస్థల యజమానులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ తదితరులు వాకింగ్కు వస్తారు. వీరి భద్రత కూడ యూనివర్సిటీ చూసుకోవలసి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వ్యక్తులు కూడా క్యాంపస్లో తిరుగుతుంటారు. ఎవరు ఎందుకు వస్తున్నారో తెలుసుకునే అవకాశం లేదు. అందుకోసం యూనివర్సిటీ అధికారులు క్యాంపస్లోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. చదవండి: హడలెత్తిస్తున్న ఒమిక్రాన్.. సందిగ్ధంలో ప్రయాణికులు -
ఓయూలో సీఎంగా వ్యవహరించిన ఈటల రాజేందర్
సాక్షి, ఉస్మానియా యూనివర్సిటీ: ఇటీవల హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓయూలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన మాక్ అసెంబ్లీలో ఆయన సీఎం సీట్లో ఆసీనులై ఆదేశాలిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘భవిష్యత్తు తెలంగాణ వేదిక’ ఆధ్వర్యంలో ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రం ఆడిటోరియంలో ఈ మాక్ అసెంబ్లీ నిర్వహించగా.. ఈటల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సెషన్ను ప్రారంభించారు. గవర్నర్గా సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నాయకులు పేరాల శేఖర్రావు వ్యవహరించారు. చదవండి: ప్రజాస్వామ్య వ్యవస్థకు రాజ్యాంగమే దృఢమైన పునాది ముఖ్యమంత్రి హోదాలో ఈటల మాట్లాడుతూ మన రాజ్యాంగం సామాన్యులకు సైతం కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. ఇటీవలి హుజూరాబాద్ ఎన్నికల్లో తన ఓటమికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా ప్రజలు తనకు ఓటు వేసి ధర్మాన్ని గెలిపించారని చెప్పారు. మాక్ అసెంబ్లీ స్పీకర్లుగా ఎర్రబెల్లి రజినీకాంత్, సాయికృష్ణారావు, దేవికారెడ్డిని ఎన్నుకోగా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్, రాణిరుద్రమ దేవి పాల్గొన్నారు. చదవండి: యాదాద్రి గోపురానికి 2 కిలోల బంగారం విరాళం -
27 భాషల్లో ఓయూ వెబ్సైట్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ వెబ్సైట్ను ఇక నుంచి ఇంగ్లిష్తో పాటు 27 భాషల్లో చూడవచ్చు. ఈ మేరకు 27 భాషల్లో ఓయూ పోర్టళ్లను శుక్రవారం ఆవిష్కరించారు. తెలుగుతోపాటు 10 దేశీయ, 17 విదేశీ భాషల్లో యూనివర్సిటీ వెబ్సైట్లో సమాచారాన్ని పొందుపరిచారు. ఓయూ వెబ్సైట్కి వెళ్లి భాషల ఎంపికపై క్లిక్ చేస్తే 27 భాషల జాబితా లభిస్తుంది. ఎవరికి అవసరమైన భాష వారు ఎంపిక చేసుకోవచ్చు. ఓయూలో ప్రస్తుతం 90 దేశాల విద్యార్థులు ఉన్నారని, భవిష్యత్తులో ఇక్కడ చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు, మన దేశంలోని విద్యార్థులకు ఈ 27 భాషలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. -
ఓయూలో వైద్య పరికరాల కోర్సు!
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థగా ఖ్యాతిగాంచిన మెడ్ట్రానిక్... ఉస్మానియా యూనివర్సిటీతో జట్టు కట్టనుంది. ఓయూలో ఏడాది కాలవ్యవధిగల వైద్య పరికరాల పీజీ కోర్సు ఏర్పాటులో సాంకేతిక సహకారాన్ని అందించనుంది. ఇప్పటికే హైదరాబాద్లో ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన మెడ్ట్రానిక్... ఈ అంశంపై ఓయూ వైస్ చాన్స్లర్ సహా జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ తదితర విభాగాల ప్రొఫెసర్లతో చర్చించింది. ఈ విషయాన్ని మెడ్ట్రానిక్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నిరంజన్ ఎస్.గౌడ్ తెలిపారు. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఇందుకు సంబంధించిన అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏడాదిలోగా కోర్సు... ‘ఉస్మానియా యూనివర్సిటీలో మెడికల్ డివైజెస్పై ఏడాది పీజీ కోర్సు ప్రవేశపెట్టాలని సూచించాం. దీనివల్ల విద్యార్థులకు వైద్య పరికరాలకు సంబంధించి పూర్తి విజ్ఞానం అందుతుంది. ఇది రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగం పురోభివృద్ధికి దోహదపడుతుంది. ఏడాదిలోగా కోర్సును ప్రారంభించాలని యోచిస్తున్నాం. డివైజ్ అండ్ పేషెంట్ సేఫ్టీపై పీజీ కోర్సు ఉంటుంది. మేము యువ శాస్త్రవేత్తలను తయారు చేస్తాము. తత్ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ డివైజెస్ను విదేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలోనూ వాటి వినియోగం పెరిగింది. మేము చేస్తున్న కృషితో భవిష్యత్తులో రాష్ట్రంలో వైద్య పరికరాలను తయారు చేయడానికి మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల విదేశాల నుంచి ఖరీదైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వివిధ రకాల చికిత్సలు కూడా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి’ అని నిరంజన్ గౌడ్ తెలిపారు. జీవనశైలి వ్యాధులు పెరిగాయి ‘భారతీయుల జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా గుండెపోట్లు, మూత్రపిండాల వ్యాధులు అధికమయ్యాయి. ఇలాంటి వ్యాధుల బారినపడ్డ వారి జీవితకాలాన్ని పెంచేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను ఉపయోగిస్తారు. దీనివల్ల వారి జీవిత కాలాన్ని పెంచవచ్చు. ఈ తరహా పరికరాలు తయారు చేసే మా కంపెనీని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇటీవల ప్రారంభించాం. నూతన వైద్య పరికరాల భద్రతను మేం పరీక్షిస్తాం. అయితే వాటికి సంబంధించిన శాస్త్రవేత్తలు మన వద్ద లేరు. కొత్త వారికి శిక్షణ ఇవ్వడం, శాస్త్రవేత్తలను ఇక్కడ ఉంచాలనేది మా ప్రయత్నం’ అని నిరంజన్ గౌడ్ వివరించారు. -
వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించి ఏటా వేలాది మంది డిగ్రీలు అందుకుంటున్నారు. వీరిలో సుమారు 20 వేల మందికి పైగా పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో డిగ్రీలు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు అసలివా? నకిలీవా? అని తెలుసుకునేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు పరిశీలన కోసం ఢిల్లీలోని వివిధ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయి. (చదవండి: కోటితో ఆగను.. అదే నా స్వప్నం: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ విజేత) ఢిల్లీలోని ఏజెన్సీ సంస్థలు ఓయూకు రూ.500 చెల్లించి నేరుగా వెరిఫికేషన్కు దరఖాస్తు చేస్తాయి. హాల్టికెట్ నంబర్ ద్వారా సర్టిఫికెట్ డూప్లికేటా, ఒరిజినలా అని పరిశీలించి ఏజెన్సీ సంస్థలకు ఎయిర్లైన్స్ ద్వారా వెరిఫికేషన్ చేసి సర్టిఫికెట్ను చేరవేస్తారు. అలా ప్రతిరోజూ 50కిపైగానే వెరిఫికేషన్ కోసం ఎగ్జామినేషన్ బ్రాంచ్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తారని ఓయూ మాజీ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ వివరించారు. జూన్, జులై నెలల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. వెరిఫికేషన్లో జాప్యం కారణంగా ఎంతో మంది అభ్యర్థులు విదేశాల్లో ఉద్యోగాలకు దూరమవుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ బాలిక) -
ఓయూ పీజీ కోర్సుల ఫీజు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల ఫీజులను పెంచింది. పదేళ్ల తరువాత పెంచిన ఈ ఫీజులకు పాలక మండలి ఆమోదం లభించిందని, ఈ విద్యా సంవత్సరం(2021–22) నుంచి అమలు కానున్నాయని ఓయూ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పెంచిన ఫీజుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి... ఎంఏ(ఆర్ట్స్, సోషల్ సైన్సెస్) రెగ్యులర్ కోర్సులకు గతంలో ఏడాదికి రూ.2,800 ఉండగా ఈ సంవత్సరం నుంచి స్పెషల్ ఫీ, ట్యూషన్ ఫీజుతో కలిపి ఏడాదికి రూ.14 వేలకు పెంచారు. సెల్ఫ్ఫైనాన్స్ కోర్సులకు రూ.21 వేలు చేశారు. ఎమ్కాం రెగ్యులర్ కోర్సుకు రూ.30వేలు, సెల్ఫ్ఫైనాన్స్కు రూ.35 వేలు, ఎంసీజే రెగ్యులర్ కోర్సులకు రూ.20 వేలు, సెల్ప్ఫైనాన్స్కు రూ.30 వేలుగా నిర్ణయించారు. ఎమ్మెస్సీ (సైన్స్, మ్యాథ్స్, ఇతర) రెగ్యులర్ కోర్సులకు గతంలో రూ.3,800 ఉండగా ఈ ఏడాది నుంచి రూ.20,240 వరకు పెంచారు. సెల్ఫ్ఫైనాన్స్ ఎమ్మెస్సీ కోర్సులకు రూ.35వేల వరకు చెల్లించాలి. ఓయూ అనుబంధ ప్రవేటు కాలేజీల్లో సెల్ఫ్ఫైనాన్స్ ఎంఏ కోర్సులకు రూ.23,100, ఎమ్మెస్సీ కోర్సులకు రూ.33,000, ఎంఈడీ కోర్సుకు ఏడాదికి రూ.66 వేలు కాగా ఇప్పుడు రెండు సంవత్సరాలకు కలిపి రూ.1.36 లక్షలుగా నిర్ణయించారు. విద్యార్థులపై భారం పడకుండా, ప్రభుత్వం నుంచి లభించే ఫీజు రీయింబర్స్మెంట్కు అనుకూలంగా ఫీజులు పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. -
OU: 2016కు ముందు పీహెచ్డీ అడ్మిషన్లు రద్దు!
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): వచ్చే నెల చివరి నాటికి పీహెచ్డీ పరిశోధనలు పూర్తి చేయకుంటే 2016 కంటే ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేయనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం పీహెచ్డీ నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని విద్యార్థులకు రెండేళ్ల గడువు పొడిగిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరేళ్లు దాటిన పీహెచ్డీ విద్యార్థుల అడ్మిషన్లను రద్దు చేస్తామని, ఇంత వరకు పూర్తి చేయని అభ్యర్థులు వెంటనే థీసిస్ను సమర్పించాలని అన్నారు. బయోమెట్రిక్ లేకుంటే జరిమానా సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ గుర్తింపు ఉన్న అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అధికారులు మరో సారి గుర్తుచేశారు. ఈ నిబంధన అనుసరించని కాలేజీకి రూ.20 వేలు జరిమానా విధిస్తామని, అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేస్తామని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. హాజరు మొత్తం యూనివర్సిటీకి అనుసంధానమయ్యేలా ఏర్పా టు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 1 నుంచి బయోమెట్రిక్ హాజరును జేఎన్టీయూ హెచ్ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల గడువు 20 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మాకాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల ప్రవేశానికి గడువు పొడిగించినట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కాలేజీలను ఆదేశించింది. వాస్తవానికి యాజమాన్య కోటా సీట్ల భర్తీని గతనెల 30వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కంప్యూటర్ సైన్స్ సీట్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
ఘనంగా ఓయూ 81వ స్నాతకోత్సవం
-
ఓయూకు దసరా సెలవులు.. ఉద్యోగులకు రెండు రోజులే
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకి గురువారం(అక్టోబర్ 13) నుంచి ఈ నెల 19 వరకు ఆరు రోజులపాటు దసరా సెలవులను ప్రకటించారు. క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని పీఆర్వో డాక్టర్ సుజాత తెలిపారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్, పాలన భవనం కార్యాలయం, ఇతర కార్యాలయాలకు 14, 15 తేదీలలో (రెండు రోజులు) మాత్రమే దసరా సెలవులు వర్తిస్తాయన్నారు. ఈ నెల 20 నుంచి తిరిగి ఓయూ తెరుచుకోనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో అధికారులు పేర్కొన్నారు. ఓయూలో ఈ–ఆఫీస్ సిస్టమ్ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వ కాలేజియోట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ చేతుల మీదుగా ఈ– ఆఫీస్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రారంభమయ్యాయి. మంగళవారం పాలన భవనంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ–ఆఫీస్తో పనులు తొందరగా జరుగుతాయని, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్లో అధ్యాపకులు, విద్యార్థులు, ఉద్యోగుల పూర్తి వివరాలతో పాటు వివిధ కార్యాలయాల సమాచారం అందుబాటులో ఉంటుందని పీఆర్వో డాక్టర్ సుజాత వివరించారు. 18న ఓయూ పీజీ ప్రవేశ పరీక్షల ఫలితాలు సీపీజీఈటీ– 2021లో భాగంగా నిర్వహించిన వివిధ పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. వాల్యూయేషన్ల జాప్యంతో పాటు దసరా సెలవుల కారణంగా ఫలితాలను 18కి వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు. ఓయూ డిగ్రీ ఫస్టియర్ ఫలితాలు విడుదల ఓయూ పరిధిలో డిగ్రీ రెగ్యులర్ కోర్సుల ఫస్టియర్ (సీబీఎస్సీ) మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు. (చదవండి: నీట్ రద్దు.. మంత్రి కేటీఆర్తో డీఎంకే ఎంపీల భేటీ) -
29 నుంచి వన్టైం చాన్స్ డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ పూర్వవిద్యార్థులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ వన్టైం చాన్స్ నాన్సెమిస్టర్ పరీక్షలు ఈనెల 29నుంచి ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. వివిధ కాలేజీల్లో 1995 నుంచి నేటి వరకు బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే ఈ వన్టైం చాన్స్ పరీక్షలకు నగరంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్ నుంచి లేదా ఓయూక్యాంపస్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి హాల్టికెట్లను పొందవచ్చన్నారు. -
న్యాయశాస్త్రంలో పీజీ డిప్లొమా నోటిఫికేషన్
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా వర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న 6 పీజీ డిప్లొమా సాయంకాలం (6 నుంచి 8 గం. వరకు) కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాల వ్యవధితో 2సెమిస్టర్ పరీక్షలు గల ఈ పీజీ డిప్లొమా ప్రవేశాలకు 2022, జనవరి 2న ప్రవేశ పరీక్ష జరగనుంది. దీనికోసం ఈనెల 11 నుంచి నవంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వర్సిటీ క్యాంపస్లో కాలేజీతోపాటు బషీర్బాగ్ పీజీ న్యాయ కళాశాలలో సైబర్ లా, టాక్సేషన్ అండ్ ఇన్సూరెన్స్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్), మోడ్రన్ కార్పొరేట్ లా, అప్లైడ్ హ్యూమన్ రైట్స్ పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని అధికారులు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కన్వీనర్ అపర్ణ తెలిపారు. పూర్తి వివరాలకు 81066 78887కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్లాగ్లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఎడ్సెట్లో మహిళల హవా
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్సెట్లో 98.53 శాతం మంది అర్హత సాధించారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఉస్మానియా వర్సిటీ గత నెలలో ఎడ్సెట్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి శుక్రవారం విడుదల చేశారు. ఎడ్సెట్కు 42,399 మంది దరఖాస్తు చేసుకోగా, 34,185 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 33,683 మంది అర్హత సాధించారు. పురుషులు 7,737 మంది పరీక్ష రాస్తే, 7,700 మంది అర్హత సాధించారు. మహిళలు 26,448 మంది రాస్తే 25,983 మంది ఎడ్సెట్ అర్హత పొందారు. గతేడాదితో 70 శాతం అర్హత సాధిస్తే... ఈసారి 98.53 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఎడ్సెట్ కన్వీనర్ రామ కృష్ణ తెలిపారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు ఏరీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 11 యూనివర్సిటీల్లో ఏకంగా 1,869 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం బోధనా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లే లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. అధ్యాపకుల కొరత కొట్టొచ్చినట్టూ కన్పిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకుల ఖాళీలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 65 శాతం ఖాళీలున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దశాబ్దాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లాంటి వాటిలోనూ విద్యా ప్రమాణాలు పడిపోయి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీల ఉనికికే ప్రమాదం... రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పదేళ్లుగా అధ్యాపకుల నియామకం ప్రహసనంగా మారిందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆపై కుంటి సాకులతో వాయిదా వేయడం పరిపాటిగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో కాలం వెళ్లదీసినా ఆశించిన ఫలితాలు ఆమడ దూరంలోనే ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్య భూమిక పోషించే పరిశోధనలు సైతం ప్రొఫెసర్ల కొరతతో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 2,837 మంజూరైన పోస్టులు ఉంటే అందులో 1,869 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 968 మంది (34.12 శాతం) రెగ్యులర్ ఆధ్యాపకులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల సంఖ్య 157కాగా ఇంకా 238 ఖాళీలున్నాయి. అలాగే 129 మంది అసోసియేట్ ప్రొఫెసర్లుంటే ఇంకా 781 ఖాళీలున్నాయి. వర్సిటీల్లో 682 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తుంటే మరో 850 ఖాళీలున్నాయి. మొత్తంగా 1,869 ఖాళీల్లో 1,061 పోస్టుల భర్తీకి సర్కార్ మూడేళ్ల క్రితమే ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. ఇదీ దుస్థితి... ►శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, ఆర్జీయూకేటీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సి టీ, పొట్టి శ్రీరాములు తె లుగు యూనివర్సిటీ (మొ త్తం ఆరు)ల్లో ఒక్క ప్రొఫె సర్ కూడా లేరు. శాతవాహన, ఆర్జీయూకేటీ, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీల్లో ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ కూడా లేరు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకే ఒక్క అసోసియేట్ ప్రొఫెసర్ ఉన్నారు. ►రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 61.65 శాతం ప్రొఫెసర్ పోస్టులు, 85.82 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 55.48 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►ఉస్మానియా వర్సిటీలో సగానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండగా కాకతీయ యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ►జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో (జేఎన్ఏఎఫ్ఏయూ) ఉన్నది ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లే. -
వచ్చే నెల 18 నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)–2021ను వచ్చే నెల 18 నుంచి 27 వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి ఆదివారం తెలిపారు. 84 సబ్జెక్టులకు రాష్ట్రంలోని 12 జోన్లలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల షెడ్యూలును ఉస్మానియా, పీజీ అడ్మిషన్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఉదయం 9.30 నుంచి 11 వరకు, మధ్యాహ్నం ఒటి గంట నుంచి 2.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు మూడు విభాగాలుగా పరీక్షల సమయాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 40 వేలకు చేరిన మొత్తం సీట్లు రాష్ట్రంలోని పలు వర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కొత్తగా 7 వేల సీట్లు పెరగడంతో మొత్తం పీజీ కోర్సుల్లో సీట్ల సంఖ్య 40 వేలకు చేరిందని పాండు రంగారెడ్డి తెలిపారు. సీపీజీఈటీకు ఈ నెల 28తో దరఖాస్తు గడువు ముగిసిందని, ఇప్పటివరకు 75 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన వివరించారు. పరీక్షకు రూ.500 అపరాధ రుసుముతో సెప్టెంబర్ 6 వరకు, రూ.2000 అపరాధ రుసుముతో 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. -
ఓయూలో ఇరవైఏళ్లుగా ప్రకటించని గౌరవ డాక్టరేట్లు
ఉస్మానియా యూనివర్సిటీ వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ అందించే గౌరవ డాక్టరేట్లు మరుగునపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రతిష్టాత్మక ఈ డాక్టరేట్కు ఇరవై సంవత్సరాలుగా ఎవరినీ ఎంపిక చేయడం లేదు. జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసి 1917 నుంచి వర్సిటీ ప్రతి స్నాతకోత్సవానికి గౌరవ డాక్టరేట్లను అందించేది. ఆరుగురు నిజాం నవాబ్లతో పాటు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మాజీ ప్రధానులు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ మన్మోహన్సింగ్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, బాబు రాజేంద్రప్రసాద్, పీఎల్ఓ (పాలస్తీనా) అధ్యక్షుడు యాసర్ అరాఫత్ తదితరులకు ఈ గౌరవం దక్కింది. అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ అవకాశం వందేళ్ల శబాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకొని 104వ ఏడులోకి అడుగిడిన ఓయూ 80 స్నాతకోత్సవాలు జరుపుకొని 2001 వరకు 47 మందికి గౌరవ డాక్టరేట్లను అందచేసింది. కొన్ని స్నాతకోత్సవాల్లో ఒకటి కంటే ఎక్కువ గౌరవ డాక్టరేట్లను అందించిన ఘనత నాటి వీసీలకు, అధికారులకు దక్కింది. ఓయూలో 1982, 1986 సంవత్సరాలలో జరిగిన స్నాతకోత్సవాల్లో ఐదుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. యూనివర్సిటీ అధికారులు శ్రద్ధ చూపితే మళ్లీ ప్రతి స్నాతకోత్సవానికి జాతీయ, అంతర్జాతీయ, స్థానికంగా విశిష్టసేవలు అందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయవచ్చు. రాజకీయ జోక్యంతో వీసీ వెనుకడుగు ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 2017లో ప్రముఖ వ్యక్తులను గురించి గౌరవ డాక్టరేట్ను అందజేయాలని నాటి వీసీ ప్రొ.రామచంద్రం నిర్ణయించారు. కానీ రాజకీయ నాయకులు, విద్యార్థి నాయకుల జోక్యం వల్ల వీసీ వెనుకడుగు వేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తెలంగాణ పునఃనిర్మాణం, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ఓయూ గౌరవ డాక్టరేట్తో సత్కరించాలనుకున్నారు. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు గొడవ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అని, ఆమెకు ఓయూ గౌరవ డాక్టరేట్ను అందజేయాలని, ఎన్ఎస్యూఐ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయాలని టీజీవీపీ విద్యార్థి నాయకులు కోరారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ఇవ్వాలని జాగృతి విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. దీంతో గౌరవ డాక్టరేట్ ఎంపికను పక్కన పెట్టారు. అయితే అక్టోబరులో జరిగే 81వ స్నాతకోత్సవానికి గొప్ప వ్యక్తులను ఎంపిక చేసి ఓయూ గౌరవ డాక్టరేట్ను అందజేసి సంప్రదాయాన్ని కొనసాగించాలని పలువురు సీనియర్ ప్రొఫెసర్లు పేర్కొన్నారు. ఇంత వరకు ఓయూ గౌరవ డాక్టరేట్లు అందుకున్న వారిలో... ఓయూ గౌరవ డాక్టరేట్లను 1917 నుంచి 2001వ సంవత్సరం వరకు 47 మంది అందుకున్నారు. వారిలో జాతీయ, అంరత్జాతీయ, స్థానికంగా విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు. దేశ అధ్యక్షులు, ప్రధానులు, న్యాయమూర్తులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, సంఘ సేవకులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. -
కరోనాతో ఓయూ ప్రొఫెసర్ మృతి
ఉస్మానియా వర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జర్నలిజం అధ్యాపకుడు ప్రొఫెసర్ బాలస్వామి కరోనాతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శనివారం గుంటూరు జిల్లా అమరావతిలో అంత్యక్రియలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఎంఏ కమ్యూనికేషన్స్ పూర్తిచేశారు. అనంతరం అస్సాంలోని తేజ్పూర్ వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదేళ్లు పనిచేశారు. జర్నలిజంలో పీహెచ్డీ చేసిన తొలి దళిత అధ్యాపకుడిగా పేరున్న బాలస్వామి.. 2004లో ఓయూలో ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరారు. -
తెలంగాణ వైతాళికులు: నూకల నరోత్తమ్రెడ్డి
తెలంగాణ సమాజ చైతన్యానికి, వికాసానికి కృషి చేసిన మహానుభావుల్లో నూకల నరోత్తమ్రెడ్డి ముఖ్యులు. అరుదైన బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. నిరాడంబరంగా ఉండే నిశ్చల, నిశ్శబ్ద కార్యదక్షుడాయన. జనహితంలో చిన్న పనిచేసినా పెద్దగా ప్రచారం పొందడానికి ఎన్నో పాట్లు పడే మన వ్యవస్థలో.. ఏమాత్రం ప్రచారయావ లేకుండా , ప్రతిఫలాపేక్ష చూపకనే వివిధ రంగాలు, వర్గాల ప్రజలకు అపార సేవలు అందించిన మహనీయుడు. జర్నలిజం, సాహిత్యం, సాంస్కృతికం, క్రీడలు, విద్య, పరిపాలన, రాజకీయం... ఇలా ఎన్ని రంగాలో? కాలూనిన ప్రతిచోటా తనదైన ముద్రవేసిన ఆయన సామర్థ్యం గురించి వింటే ఎవరికైనా విస్మయమే! ఓ మనిషి, ఒక జీవిత కాలంలో ఇన్ని పనులు, ఇంత సమర్థంగా చేయడం అరుదు. అదీ మచ్చలేని రీతిలో పలువురు ప్రశంసించేలా నిర్వహించడం అసాధారణం. కానీ, నరోత్తమ్రెడ్డి తెలుగువారు మరచిపోని విధంగా ఆ కృషి చేసి చూపించారు. మహబూబాబాద్కు చెందిన ఆయన తెలంగాణ వైతాళికుల్లో ఒకరు. జర్నలిజం చదివి, దేశ స్వాతంత్య్రపు రోజుల్లో ముంబాయిలో నాటి ‘బొంబాయి క్రానికల్’కు పనిచేస్తున్నారు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకత్వం నుంచి తప్పుకున్నపుడు, కొత్వాల్ రాజ బహుదూర్ వెంకట్రామారెడ్డి సూచన మేరకు నరోత్తమ్రెడ్డి హైదరాబాద్ వచ్చి సదరు బాధ్యత చేపట్టారు. అలా.. గోల్కొండ సంపాదకులుగా (20 ఏళ్లు), రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా (10), ఆంధ్ర సారస్వత పరిషత్తు (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) కోశాధికారిగా, చైర్మన్గా (30), లలిత కళా అకాడమీ చైర్మన్గా (25), రాజా కృష్ణదేవరావ్ పేరిట ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ సంస్థ విద్యాకమిటీ నేతృత్వంలో (15), బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చైర్మన్గా (10), ఉస్మానియా విశ్వవిద్యాలయం సిండికేట్ సభ్యుడిగా, ఉప కులపతిగా కలిపి (20 ఏళ్లు) ఇలా, కొన్నిమార్లు ఏక కాలంలో వేర్వేరు బాధ్యతలూ నిర్వహించి నాయ కత్వానికి తానొక ప్రతీకగా నిలిచారు. ఇంకోరకంగా చెప్పాలంటే... బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అన్నీ కలగలిపిన 63 ఏళ్ల పరిపూర్ణ జీవితంలో అంతకు రెట్టింపు కంటే ఎక్కువ సంవత్సరాలు, సుమారు 130 ఏళ్ల (వేటికవిగా లెక్కిస్తే!) క్రియాశీల జీవితం గడిపిన ధన్యజీవి! పార్లమెంటు సెషన్ నడుస్తున్నా.. విధిగా హైదరాబాద్ వచ్చి సమావేశాలకు హాజరయ్యే ఉస్మానియా విశ్వవిద్యాలయం, సారస్వత పరిషత్తులు ఆయన జీవితంలో అవిభాజ్య అంగాల య్యాయి. ఆయన చొరవవల్లే ఉస్మానియాలో జర్నలిజం విభాగం ఏర్పడింది. ఉద్యోగాల్లో ఉన్నవారు తీరిగ్గా ఉండే సాయం వేళల్లో చేసుకోవడానికి వీలుగా ఎంబీఏ, లా కోర్సులు తీసుకురావడంలోనూ ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమాలతో, స్పర్థలతో ఓయూ ప్రాంగణం మూడేళ్లు కల్లోలితమై 300 మందికి పైగా అసువులు బాశారు. విద్య–విద్యార్థులు చెల్లా చెదురైనపుడు ‘సాంత్వనకు ఓ కులపతి‘ అని సమాజమే కోరి తెచ్చుకున్న ఘనాపాటి! నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తెలుగునాట చేసిన ప్రసంగాలకు వేదికలపై అనువాదకుడిగా ఉండేవారాయన. ముఖ్యమంత్రులు సంజీవయ్య, పీవీ నర్సింహారావు, ప్రధానమంత్రులు నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి అత్యున్నత వ్యక్తులతో సాన్నిహిత్యం ఉన్నా, పెరట్లో పనిచేసే తోటమాలికి కూడా సముచిత గౌరవం ఇచ్చే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన నూకల నరోత్తమ్రెడ్డిని, ఆయన శతజయంత్యుత్సవాలు జరుపుకుంటూ స్మరించు కోవడమంటే, మనని మనం గౌరవించుకోవడం. ఆయన బహుముఖ ప్రజ్ఙను భావితరాలకు వారసత్వ సంపదగా పదిలపరిచి, పంపిణీ చేయడం. తెలుగు నాట తరాలతరబడి చైతన్యం రగిలించే స్ఫూర్తిని మరింత పరివ్యాప్తం చేయడం. ఆయన విశేష ప్రతిభ చూపిన సాహిత్యం, జర్నలిజం, లలితకళలు, క్రీడలు, విద్య, పాలన, రాజకీయాలకు సంబంధించి కనీసం ఒక్కోటి చొప్పున ఏడాది పొడుగునా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఇదొక గొప్ప సందర్భం. – సవ్యసాచి (మార్చి 27న నూకల నరోత్తమరెడ్డి శతజయంత్యుత్సవాలు ప్రారంభం) -
టీఎస్ సీపీజీఈటీ-2020 ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నిర్వహించిన పరీక్ష ఫలితాలను ప్రొఫెసర్ పాపిరెడ్డి జనవరి 7వ తేదీన విడుదల చేశారు.ఈ పరీక్షలను ఉస్మానియా యూనివర్మిటీ డిసెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. 85270 మంది దరఖాస్తు చేసుకోగా.. 72467 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 70141 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కాగా దీనికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 12 నుంచి ప్రారంభం కానుంది. ఇంకా పూర్తి వివరాలకు www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com లో చూడొచ్చు. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఓయూ పరీక్షలు వాయిదా..
ఉస్మానియా విశ్వవిద్యాలయం: ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, ఇతర కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు, ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. -
31 వరకు విద్యాసంస్థలన్నీ మూతే: యూజీసీ
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలన్నింటిని ఈ నెల 31 వరకు బంద్ చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి రజనీశ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు ఈ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో తమ పరిధిలోని అన్ని కాలేజీలు, లైబ్రరీలను ఈ నెల 31 వరకు బంద్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. -
ఓయూ వివాదాస్పద స్థలంలో నిర్మాణాల కూల్చివేత
అంబర్పేట(హైదరాబాద్): ఓయూలోని వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేశారు. డీడీ కాలనీ ఉస్మానియా యూనివర్సిటీ మధ్యలో ఉన్న స్థలంపై ఓ రిటైర్డ్ న్యాయమూర్తికి, ఉస్మానియా యూనివర్సిటీ వారికి మధ్య వివాదం తలెత్తింది. ఇటీవల రిటైర్డ్ న్యాయమూర్తి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసి వారి బందోబస్తుతో వివాదాస్పద స్థలంలో గోడను నిర్మించారు. దీనిపై ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిర్మాణాన్ని పరిశీలించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఆ నిర్మాణానికి అనుమతిలేదని కూల్చివేయాలంటూ స్థానిక సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు అందాయి. సర్కిల్–16 టౌన్ప్లానింగ్ ఏసీపీ నర్సింగ్రావు నేతృత్వంలో వివాదాస్పద స్థలంలో నిర్మించిన ప్రహారీగోడలను సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది కూల్చివేశారు. గత కొన్నేళ్ల క్రితం ఈ స్థలంలో నిర్మాణం కోసం రిటైర్డ్ న్యాయమూర్తి కుటుంబం అనుమతులు పొందారని, ప్రస్తుతం వాటి కాలపరిమితి ముగిసిందని ఏసీపీæ తెలిపారు. తాజాగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో కూల్చివేశామన్నారు. తిరిగి నిర్మాణాలకు వారు దరఖాస్తు చేసుకుంటే అందుకు నిబంధనలు పాటిస్తూ పరిశీలిస్తామన్నారు. ఈ కూల్చివేతల బృందంలో టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ సాయిబాబా, చైన్మన్లు బాబామియా, రజ్వీలు కూడా ఉన్నారు. -
కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
-
16 నుంచి డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పరిధిలో జూన్, జూలై నెలలో జరగాల్సిన డిగ్రీ, పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షా ఫీజుల చెల్లింపు వివరాలను మంగళవారం వర్సిటీ పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ ఇతర డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజులలో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 16 నుంచి జూన్ 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు. రూ 200 అపరాధ రుసుంతో జూన్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షా ఫీజులను ఈ నెల 16 నుంచి వచ్చే నెల 8 వరకు చెల్లించాలని సూచించారు. రూ 300 అపరాధ రుసుంతో జూన్ 15 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ కోర్సులకు 2.20 లక్షల మంది విద్యార్థులు హాజరు కానుండగా వివిధ పీజీ కోర్సుల నాలుగవ సెమిస్టర్ పరీక్షలకు 10 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పూర్తి వివరాలు ఓయూ వెబ్సైట్లో ఈ నెల 15 నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. -
20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి అంతర్జాతీయ సెమినార్ జరుగనుంది. ‘వ్యాయామ విద్య, స్పోర్ట్స్ సైన్స్’లలో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 600 మంది క్రీడాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వీరితో పాటు వ్యాయామ విద్య ప్రొఫెసర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులు, కోచ్లు, ట్రెయినర్లు, స్పోర్ట్స్ డాక్టర్లు, వ్యాయామ విద్య స్కాలర్లు, టీచర్లు ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగరాజు, నిజాం కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బి. లక్ష్మయ్య , విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు . -
ఓయూ పీజీ హాస్టల్లో విద్యార్థి మృతి
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పీజీ హాస్టల్లో నర్సయ్య అనే జాగ్రఫీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రిన్సిపల్ ప్రతాప్రెడ్డితో మాట్లాడి.. కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం ఆధారంగా విచారణ చేస్తున్నారు. మనస్తాపంతో మరో విద్యార్థి.. గేట్ పరీక్షలో అర్హత సాధించలేననే మనస్తాపంతో గుజరాత్కు చెందిన హరీష్ బాయ్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూసారాంబాగ్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. -
‘విడిచిపెట్టే వరకు ఆందోళనలు’
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ అధ్యాపకుడు డా.కాశింను విడిచిపెట్టే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విద్యార్థి నాయకులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. గురువారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాశీం విడుదల కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రధాన కార్యదర్శి రవినాయక్ అధ్యక్షత వహించారు. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొ.లక్ష్మణ్, డా.అన్సారీ, ఎంఎల్ పార్టీ నేత గోవర్ధన్, రమా, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మేడిపాపయ్య, ఓయూ అధ్యాపకుడు డా.గాలి వినోద్కుమార్ పాల్గొని ప్రసంగించారు. కాశింపై కొత్త కేసులను బనాయించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయనపై ఉపా కేసు పెట్టి జైల్కు తరలించడం అన్యాయమని మండిపడ్డారు. కాశింపై పోలీసులు చేసిన ఆరోపణలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డా.గాలి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఓయూ బంద్ చేయనున్నట్లు విద్యార్థి సంఘాల నేతలు పేర్కొన్నారు. -
జార్జిరెడ్డిని తల్చుకోవడం అంటే..!
రెండు దశాబ్దాల పాటు ఉస్మానియా క్యాంపస్లో యువవిద్యార్థుల మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అసాధారణమైనది. అతడి భావజాలం సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. సమాజంలోనూ, క్యాంపస్లోనూ ఛాందస, కులోన్మాద భావజాలాలతో ఘర్షించటంలో జార్జిరెడ్డి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే వేలాదిమంది విద్యార్థులను కదిలించారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషించాలి తప్ప తుంచేయకూడదు. తెలుగు సినిమా ‘జార్జిరెడ్డి’ని ఎంతో ఆస క్తితో చూశాను. ప్రగాఢ అభినివేశంతో కూడిన అతడి అకడమిక్ పాండిత్య దృక్పథంతో ప్రభావితమైన వ్యక్తుల్లో నేనూ ఒకడిని. జార్జిరెడ్డిని పాశవికంగా హత్య చేసిన రెండేళ్ల తర్వాత అంటే 1974లో నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సులో చేరాను. నేను చదివిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ.. జార్జిరెడ్డి అనే అసాధారణ మేధావి ఫైర్ బ్రాండ్ తరహా కార్యాచరణకు ప్రధాన ఆకర్షణగా మారింది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతడు ఫిజిక్స్ విద్యార్థి. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆ రోజుల్లో రాజకీయ చర్చలకు, క్రియాశీల ఆచరణకు కేంద్రస్థానమై వెలుగొందుతుండేది. మరణం తర్వాత కూడా జార్జిరెడ్డి భావజాలం అనేకమంది సామాజిక శాస్త్రాల విద్యార్ధులపై బలమైన ప్రభావం వేస్తూ వచ్చింది. తదనంతర కాలంలో వీరే అనేక రంగాల్లో నాయకత్వం వహించారు. ప్రకృతి శాస్త్రాలు, ఇంజనీరింగ్, న్యాయశాస్త్ర విద్యార్థులు సైతం జార్జిరెడ్డి భావాలతో ప్రభావితులయ్యారు. సామాజిక సమస్యలపట్ల బాధ్యత ప్రదర్శిం చిన అనేకమంది విద్యార్థులు ఈ జ్ఞాన విభాగాలనుంచి కూడా ఆవిర్భవించారు. మరణించాక రెండు దశాబ్దాల పాటు ఓయూ క్యాంపస్లో యువ మనస్సులపై జార్జిరెడ్డి వేసిన ప్రభావం అనన్యసామాన్యమైంది. ఆనాటికి పెద్దగా రచనలు కూడా చేసి ఉండని ఒక పాతికేళ్ల విద్యార్థి మూడు అంశాలలో రాటుదేలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అవేమిటంటే, 1. జ్ఞానాన్ని ఆయుధంగా చేసుకోవడం. 2. దాన్ని అతి స్వల్ప కాలంలోనే పీడిత కులాల విముక్తికోసం ఉపయోగించడం. 3. తాను పోరాడిన పీడకుల చేతుల్లో అమరత్వం పొందడం. సోషలిస్టు విప్లవ సిద్ధాంతాన్ని పేదలకు, దిగువ కులాలకు అనుకూలమైనదిగా మల్చడంలో జార్జిరెడ్డి నిర్వహించిన పాత్ర సాధారణ ప్రజలను కూడా ఆకట్టుకునేలా చేయడంలో ‘జార్జిరెడ్డి’ సినిమా చక్కటి విజయం సాధించింది. సమాజంలోనూ, క్యాంపస్లోనూ సంఘ వ్యతిరేక, కులోన్మాద భావజాలాలతో భావోద్వేగంగా ఘర్షించ టంలో జార్జి సాగించిన వీరోచిత పోరాటానికి సినిమా చిత్రికపట్టింది. నాటి నుంచి నేటి దాకా ప్రభుత్వాలు, రాజకీయ శక్తులు సాగిస్తున్న విద్యా వ్యతిరేకమైన ఎజెండా నేటికీ అనేక క్యాంపస్లలో సమస్యగా కొనసాగుతూనే వస్తోంది. అలాంటి బాహ్య శక్తుల ప్రభావానికి సగటు విద్యార్థులు, కండబలం, అధికార బలం ఉన్న శక్తులు సులువుగా లోనయ్యేవారు. అయితే విద్యార్జనలో కానీ, భౌతిక పోరాటాల్లో కానీ అలాంటి శక్తులందరినీ జార్జిరెడ్డి తోసిపుచ్చేశాడు. ఆయనలోని ఈ మహామూర్తిమత్వాన్ని సినిమా చాలా చక్కగా ప్రదర్శించింది. 1970లలో జార్జిరెడ్డి, 2010లలో రోహిత్ వేముల ఈ కారణంతోనే యూనివర్సిటీ క్యాంపస్లలోని వేలాదిమంది విద్యార్థులను ప్రభావితం చేశారు. మనుషులను పీడించే వారి ఏజెంట్ల చేతుల్లో 1972 ఏప్రిల్ 14న హత్యకు గురయ్యేనాటికి జార్జి రెడ్డి వయస్సు సరిగ్గా పాతికేళ్లు. అదే పీడకుల దౌర్జన్యానికి నిరసన తెలుపుతూ రోహిత్ వేముల 2016 జనవరి 17న ఆత్మహత్య చేసుకున్నాడు. పీడన అనైతికం, సంఘ వ్యతిరేకమనే సామాజిక–ఆత్మిక, సాంస్కృతిక మూలాల విషయంలో ఈ ఇరువురి స్వభావం ఒక్కటే. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే భావం ఇద్దరిలోనూ రగులుతుండేది. తమ తల్లుల్లోని సానుకూల ఆధ్యాత్మిక నైతిక భావజాలం ప్రభావంతో వీరిరువురు పేదలకు, పీడితులకు అనుకూలమైన ఉమ్మడి లక్ష్యాన్ని కలిగి ఉండేవారు. జార్జి తల్లి లీల, రోహిత్ తల్లి రాధిక ఇద్దరూ ఆ ఆధ్యాత్మిక నైతికతతోనే వారిని ఉగ్గుపాలనుంచి పెంచి పోషించారు. ఆ రోజుల్లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలే జార్జిరెడ్డి అజెండాగా సినిమా ప్రదర్శించినప్పటికీ, పీడితుల పట్ల, పేదల పట్ల సానుభూతి చూపడంలో అతడి కుటుంబ నైతికత ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా చెలరేగిన సోషలిస్టు భావతరంగాలతో మిళితమైంది. సోవి యట్ యూనియన్ అగ్రరాజ్యంగా ఎదగడం, చైనాలో సాంస్కృతిక విప్లవం.. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా నాయకత్వంలో సాగిన క్యూబన్ విప్లవం వంటివి ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేస్తూ వచ్చాయి. ఇవి జార్జిరెడ్డిపై కూడా తీవ్రప్రభావం చూపాయి. ఆ రోజుల్లో ప్రపంచమంతటా విశ్వవిద్యాలయాల క్యాంపస్లలో సాగిన వియత్నాం అనుకూల, అమెరికన్ వ్యతిరేక ఉద్యమాలు ప్రజాతంత్ర పౌర హక్కులకు, సోషలిస్టు ప్రచారానికి ప్రేరణనిచ్చాయి. తీవ్రమైన మేధోపరమైన అభినివేశం కలవారు తరగతి గదుల్లో, లైబ్రరీల్లో లోతైన అధ్యయనాలు, చర్చలు జరుపుతూనే వీధి పోరాటాల్లో కూడా పాల్గొనేవారు. జార్జిరెడ్డి అసాధారణ మేధోశక్తికి ఇదే ప్రాతిపదిక అయింది. తనలోని ఈ అసాధారణ శక్తే మాలో అనేకమందిని ప్రభావితం చేసింది. కానీ అతడి తర్వాత ఈ రెండు శక్తులను ఏ ఒక్కరూ తమలో నిలుపుకోలేకపోయారు. ఆయన అనుయాయుల్లో అనేకమంది తర్వాత నక్సలైట్ ఉద్యమాలవైపునకు తరలిపోయారు. కొంతమంది సీరియస్గా అధ్యయనంపై దృష్టిపెట్టి పాక్షిక విజయాలు మాత్రమే సాధించారు. మాలో ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని విడి విడి రంగాల్లో తమ ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ ఒక్కరం కూడా జార్జిరెడ్డి తర్వాత అంతటి ప్రభావం కలిగించలేకపోయామన్నది వాస్తవం. జార్జిరెడ్డి ప్రతిభాపాటవాలను ప్రస్తుతతరం విద్యార్థుల ముందు ప్రదర్శించడానికి ఈ సినిమా గట్టి కృషి చేసింది. అంత చిన్న వయస్సులోనే అలాంటి అసాధారణ శక్తియుక్తులను ప్రదర్శించిన వారు మానవుల్లో చాలా తక్కువమందే ఉంటారు. వీరు ప్రపంచం దృష్టిలో అద్భుత వ్యక్తులుగా వెలుగొందుతుంటారు. అసాధారణమైన మానవుల్లో దేవుడు విభిన్నమైన బీజాలు నాటతాడు అని సామెత. సైన్స్, ఆర్ట్స్, నైతికత వంటివి ఇలాంటి వారి ద్వారానే ప్రకాశిస్తుంటాయి. ఇలాంటి అసాధారణమైన అమరుల జీవిత చిత్రాన్ని భారతీయ జీవిత చిత్రాల వారసత్వం చాలా అరుదుగా మాత్రమే చిత్రించింది. భారతీయ సినిమా పరిశ్రమ పాటలు, డ్యాన్స్ మాయాజాలానికి మించి ఎదగలేకపోయింది. జార్జిరెడ్డిపై వచ్చిన ఈ సినిమా ప్రాంతీయ చిత్రమే అయినప్పటికీ, అతి చిన్న బడ్జెట్తోనే పూర్తయినప్పటికీ, విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రంగా తన ముద్ర వేసింది. ఈ సినిమాలో గొప్పతనం ఏమిటంటే, బాల్యదశలో జార్జిరెడ్డిలో రూపొందిన విశిష్ట వ్యక్తిత్వంపై ఇది కేంద్రీకరించడమే. తన తల్లి నుంచి ప్రతివిషయంలోనూ అతడు సానుకూలమైన మానవీయ దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్నాడు. అదే సమయంలో తనలో అంతర్లీనంగా ఉండిన అపారమైన మానవీయ సహజాతాన్ని పాటించడంలో తల్లి ఊహలను కూడా అతడు మించిపోయాడు. సామాజికంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా అలాంటి సహజాత గుణంతో పెరిగి పెద్దవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కుటుంబం నుంచి పాఠశాలకు, యూనివర్సిటీకి ఎదిగే క్రమంలో తనలోని సృజ నాత్మకమైన ప్రోత్సాహక గుణాన్ని, మంచితనాన్ని, మేధోపరమైన అభినివేశాన్ని అట్టిపెట్టుకుని పెంచుకుంటూ రావడం చాలా ముఖ్యమైన విషయం. పిల్లల వ్యక్తిత్వాలను చంపేయడం, లేదా ఇలాంటి వ్యక్తుల ప్రధాన స్ఫూర్తిని చంపేయడాన్ని భారతీయ పౌర సామాజిక నైతిక చట్రాలు ఒక ధోరణిగా కలిగి ఉంటున్నాయి. ఇలాంటి స్ఫూర్తిని వారిలో చంపేశాక మన సమాజంలో ఆడ, మగ వ్యక్తులు ఎక్కువ కాలం బతకవచ్చు కానీ చరిత్రను మాత్రం సృష్టించలేరు. చిన్నవయసులోనే హత్యకు గురైనప్పటికీ జార్జిరెడ్డి, రోహిత్ వేముల మన జీవిత కాలంలోనే చరిత్ర సృష్టించారు. స్వాతంత్య్రపోరాటంలో భగత్సింగ్ అదే పని చేశారు. వీరు వదిలివెళ్లిన చరిత్ర అత్యంత శక్తివంతమైన సానుకూలతను కలిగి ఉంది, అనేకమంది తరుణ మనస్కులు అనుసరించదగిన సృజనాత్మక కార్యదీక్షను వీరు చరిత్రలో నిలిపివెళ్లారు. క్యాంపస్లలో అలాంటి చురుకైన మనస్సు కలవారు అడుగుపెట్టకుండా చేయడానికి ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబం, పాఠశాల, విశ్వవిద్యాలయం ప్రతిచోటా సంప్రదాయ జీవన వాతావరణం ఉంటున్న పరిసరాలు సృజనాత్మక ప్రయోగాలను అనుమతించడం లేదు. నూతన విషయాలపై ప్రయోగాలు చేయదలిచిన యువత ప్రతి సంప్రదాయానికి, ఛాందసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన వారితో చర్చించాలే తప్ప అణిచివేయకూడదు. సమాజంలో సమూల మార్పులను తీసుకొచ్చే మానసిక సమర్థతలను అణిచివేస్తే జాతికే నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఏ మారుమూలైనా జార్జి వంటి యువకులు పుట్టుకొస్తే వారిని పెంచి పోషిం చాలి. చివరగా ఈ సినిమాను అన్ని భాషల్లోకీ డబ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాసకర్త: ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
ఓయూ మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత
సాక్షి, నల్లకుంట: ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ (వీసీ), ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెదుల్ల రామకిష్టయ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో కన్ను మూశారు. దీంతో నల్లకుంట విజ్ఞానపురి కాలనీలోని ఆయన నివాసంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయనకు నరేందర్, శేఖర్, రమణ, మధు నలుగురు కుమారులతో పాటు ఓ కుమార్తె సుజాత ఉన్నారు. సాయంత్రం ఫిల్మ్నగర్లోని మహా ప్రస్థానంలో రామకిష్టయ్య పార్థివ దేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. బంధు మిత్రుల అశ్రు నయనాల నడుమ ఆయన పెద్ద కుమారుడు నరేందర్ రామకిష్టయ్య చితికి నిప్పంటించారు. నల్లగొండ జిల్లా మునుగోడులో 1932 అక్టోబర్లో జన్మించిన రామకిష్టయ్య 1996–99 వరకు ఓయూ వీసీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్గా పనిచేశారు. ఆయన భార్య రాధమ్మ కొన్నేళ్ల కిందట పరమపదించారు. రామకిష్టయ్య మృతికి సంతాపం తెలిపిన వారిలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు, విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు ఉన్నారు. -
పీజీ చేరికల్లో ఆమెదే హవా
ఉస్మానియా యూనివర్సిటీ: ఫలానా ఫలితాల్లో అమ్మాయిలే టాప్ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు చదువుకునేవారిలోనూ వారిదే పైచేయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువులోనూ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువట. పీజీలో 65 శాతం మంది అమ్మాయిలే అడ్మిషన్లు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని అధికారులే వెల్లడిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్యను దాటిపోయింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు పీహెచ్డీలో కూడా దూసుకుపోతున్నారు. డిగ్రీ, పీజీలతో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, దూరవిద్య కేంద్రం కోర్సుల్లో పురుషులకు సమానంగా అమ్మాయిలు చదువుతున్నారని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొ.కిషన్ తెలిపారు. ఓయూ పరిధిలో మొత్తం 728 కాలేజీల్లో మహిళలకు ప్రత్యేకంగా 110 కాలేజీలున్నాయి. మిగతా కాలేజీలన్ని కో–ఎడ్యుకేషన్లే. ఒక్క కోఠి మహిళా కాలేజీలోనే 4,500 మంది అమ్మాయిలు చదువుతున్నట్లు అధికారులు వివరించారు. క్యాంపస్లో పీహెచ్డీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్తో పాటు మరో ఐదు హాస్టళ్లు, మహిళా కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు రెండు హాస్టల్స్ను ఏర్పాటు చేశారు. మహిళా వర్సిటీ అవసరం ►ప్రతి ఏటా ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరుగుతోంది. కానీ వారికి ప్రత్యేకమైన వర్సిటీ ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర విభజన అనంతరం పద్మావతి మహిళా వర్సిటీ ఏపీకి వెళ్లగా కోఠి మహిళా కాలేజీలో వర్సిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి మొదటిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ ఇంత వరకు దాని ఊసే లేదు. పెరుగుతున్న మహిళల సంఖ్యకు అనుగుణంగా వివిధ కోర్సుల్లో సీట్లు పెరగనందున వందలాది మంది విద్యార్థినులు ఇంటికి పరిమితమవుతున్నారు. ►ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరగడానికి కారణాలు.. ►నేటి తరం తల్లిదండ్రుల ఆలోచనలో మార్పుతో పాటు భద్రత పెరగడం, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుదల, రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడం. ►ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా ఉపకార వేతనాలు, హాస్టల్ వసతి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాల పెరుగుదల. చదువుతో ఉద్యోగంతో పాటు జీవన విధానంలో మార్పు వస్తుందని మహిళలు భావించడం. ►తల్లిదండ్రులు అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా సమానంగా చదివిస్తున్నారు. వీరిలో ఆర్థిక స్తోమత బాగా ఉన్నవారు తమ పిల్లలను డాక్టర్, ఇంజనీరు తదితర వృత్తి విద్యా కోర్సులను చదివిస్తుండగా.. మధ్య తరగతి, సామాన్య కుటుంబాల వారు పిల్లలను డిగ్రీ, పీజీ కోర్సులను చదివిస్తున్నారు. ►గతంలో పురుషులు మాత్రమే ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు పొందేవారు. ఇప్పుడు మహిళలు కూడా ఆస్థాయి ఉద్యోగాలు అందుకుని రాణిస్తున్నారు. -
లైట్లు లేవు.. ప్లేట్లు లేవు..
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ హాస్టళ్లలో లైట్లు, ప్లేట్లు ఇతర సౌకర్యాలు లేవని, నాణ్యత, రుచి లేని ఆహారానికి ( నెలకు రూ.2000 నుంచి రూ.3000 వేలు) వరకు అధిక మెస్ బిల్లు వసులు చేస్తున్నారని, తిన్నా తినకున్న మెస్ బిల్లులు వస్తున్నాయని, నిత్యం సమస్యలతో చదువులు సాగడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ రోడ్డెక్కుతున్న విద్యార్థులకు సర్దిచెప్పలేక, నిధుల కొరత కారణంగా వసతులు కల్పించలేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఓయూ క్యాంపస్ కాలేజీల విద్యార్థులతో పాటు నిజాం, కోఠి మహిళా, సికింద్రాబాద్ పీజీ, సైఫాబాద్ పీజీ కాలేజీల విద్యార్థులు నిత్యం ఆందోళనకు దిగుతున్నారు. హాస్టళ్లు నిర్వహించలేక జిల్లా పీజీ కాలేజీల హాస్టల్స్ను ప్రాంభించకుండానే పక్కన పెట్టారు. ఉన్నత విద్య కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే విద్యార్థులు ఓయూ హాస్టళ్లు ఫైవ్ స్టార్ హోటళ్లకు తీసిపోవని కలగంటూ వర్సిటీలో అడుగుపెడతారు. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. కొత్తగా హాస్టల్లో చేరే విద్యార్థుల నుంచి ఎస్సీ, ఎస్టీలకు రూ.8000, బీసీలకు రూ.10 వేలు, ఓసీలకు రూ.12 వేలు డిపాజిట్ చేయిస్తున్నారు. గదుల కేటాయింపు, సౌకర్యాలు, వసతులు, ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు పేర్కొంటున్నారు. హాస్టళ్ల నిర్వహణలోమార్పు తేవాలి ఓయూ హాస్టల్స్ నిర్వహణలో మార్పు తేవాలని నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ (ఎన్టీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ అధికారులను కోరారు. ఓయూలో అనేక మార్పులు చోటు చేసుకున్న హాస్టల్స్ సాంప్రదాయ బద్దంగా పాత పద్దతిలోనే కొనసాగిస్తున్నారన్నారు. డిపాజిట్ పేరుతో వేల రూపాయాలను వసూలు చేస్తున్న అధికారులు అందుకు తగిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గదుల కేటాయింపు మొదలు ఆహారం వరకు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హాస్టల్స్ నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థుల చదువుకునే వాతావరణాన్ని కల్పించాలని కోరారు. – బైరు నాగరాజుగౌడ్ ఎన్టీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు -
ఓయూ పరిధిలో 19 నుంచి డిగ్రీ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఈనెల 19 నుంచి డిగ్రీ (రెగ్యులర్ కోర్సులు) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ మంగళవారం వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం 1, 3, 5 సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ముగిసినట్లు చెప్పారు. వాయిదా పడిన పరీక్షలు వచ్చే నెలలో.. ఆర్టీసీ కార్మికుల సమ్మె, బంద్ కారణంగా అక్టోబర్ 17, 18, 19 తేదీల్లో జరగాల్సిన వివిధ డిగ్రీ కోర్సుల బ్యాక్లాగ్ పరీక్షలు (పాత బ్యాచ్) వచ్చే నెల నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. సెలవు దినాలైన డిసెంబర్ రెండో శనివారం, ఆదివారం ఈ పరీక్షలు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. పూర్తి వివరాలకు విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ చూడాలన్నారు. -
నిధులు లేవు.. అభివృద్ధి పనులు జరగవు
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభు త్వం ఓయూకు కేటాయించే బ్లాక్గ్రాంట్స్ నిధుల్లో సగానికి సగం కోత విధించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయా యి. బ్లాక్గ్రాంట్స్ నిధులను వేతనాలు, పించన్లతో పాటు అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. గత మూడేళ్లులుగా అభివృద్ధి నిధులను నిలిపివేయడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అడిగినన్ని నిధులు విడుదల చేయనందున వివిధ వనరుల ద్వారా ఓయూకు లభించే ప్రతి పైసా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లకు వినియోగిస్తున్నారు. ఓయూ ఉద్యోగుల వేతనాలు, పించన్లకు ప్రతి నెలా రూ.30 కోట్లు, ఏడాదికి రూ.584 కోట్లు అవసరం. ఇందుకోసం ఓయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు బ్లాక్గ్రాంట్స్ నిధులు అడుగుతున్నారు.కానీ ప్రభుత్వం రూ.309 కోట్లను మాత్రమే విడుదల చేస్తోంది. ఈ నిధులు సరిపోకపోవడంతో మిగతా నిధులను ఓయూ సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధికి వినియోగించకుండా వేతనాలు, పించన్లకు వాడుతున్నారు. దీంతో ఓయూలో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. తగ్గుతున్న ఓయూ ఆదాయం ఓయూకు వివిధ వనరుల ద్వారా లభించే ఆదాయం ప్రతి ఏటా తగ్గుతుంది. గతంలో పీజీ అడ్మిషన్స్ కార్యాలయం, దూరవిద్యా కేంద్రం, విదేశీ విద్యార్థులు, ఎగ్జామినేషన్ బ్రాంచ్, క్రీడా మైదానాలు తదితరాల నుంచి కోట్లాది రూపాయాల ఆదాయం లభించేంది. ఈ ఆదాయాన్ని ఓయూలో వివిధ రకాల అభివృద్ధి పనులకు ఉపయోగించేవారు. తెలంగాణలో కొత్త వర్సిటీల రాకతో ఓయూకు ఆదాయం తగ్గింది. దీంతో ఉన్న నిధులు వేతనాలు, పించన్ల చెల్లింపులకే ఉపయోగిస్తున్నారు. మౌలిక వసతులు లేక నిలిచిన హాస్టల్ భవన ప్రారంభోత్సవం ఓయూ క్యాంపస్ ఐపీఈ ఎదురుగా 500 మంది పీజీ విద్యార్థుల వసతి కోసం పెద్ద హాస్టల్ భవనాన్ని నిర్మించారు. కానీ అందులో ఫర్నీచర్, మంచాలు (బెడ్స్) వంట సామాన్లు, ఫ్యాన్లు, టేబుల్స్, కుర్చీలు ఇతర మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పించేందుకు నిధులు లేకపోవడంతో భవనం ప్రారంభానికి నోచు కోకుండా పోయింది. హాస్టల్ గదుల కొరతతో విద్యార్థులు నిత్యం రోడెక్కి ఆందోళనలు చేస్తున్నారు. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మించిన మెగా హాస్టల్ భవనంలో వసతులు లేక ఉత్సవ విగ్రహంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అభివృద్ధి గ్రాంట్స్ను పూర్తిగా నిలిపి వేసింది. ప్రస్తుతం ఓయూకు లభించే ప్రతి పైసాను నిబంధనలకు విరుద్ధంగా బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. ఓయూకు నిధులు తగ్గడం, ప్రభుత్వం నుంచి లభించే బ్లాక్గ్రాంట్స్లో కోత విధించడంతో ప్రతి నెలా వేతనాల చెల్లింపు సవాల్గా మారి విద్యార్థుల అభివృద్ధికి కోసం వాడాల్సిన నిధులను సైతం వేతనాలు, పించన్ల చెల్లింపునకు ఉపయోగిస్తున్నారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్కి క్యాంపస్లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్ని ఊపేస్తోంది. అర్జున్రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. -
ఆసక్తికరంగా.. జార్జ్రెడ్డి ట్రైలర్
-
అలుపెరగని ‘అధ్యాపకుడు’!
ఉస్మానియా యూనివర్సిటీ: ప్రఖ్యాత ఓయూలో 20 ఏళ్లపాటు వివిధ రూపాల్లో సేవలందించి..అలుపెరగని అధ్యాపకుడిగా పేరొందిన ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఓయూ క్యాంపస్ సైన్స్ కాలేజీ కెమిస్ట్రీ విభాగం అధిపతి(హెడ్)గా ఉన్న ఆయన అధ్యాపకులుగా బోధన, పరిశోధనలతో పాటు తన 31 ఏళ్ల సర్వీసులో 20 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విశ్వవిద్యాలయాల టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా రెండుసార్లు కొనసాగారు. వందేళ్ల ఓయూలో దీర్ఘకాలం (20 ఏళ్లు) అధ్యాపకుడిగా వివిధ రూపాల్లో సేవలందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. సర్వీసు మ్యాటర్స్తో పాటు అధ్యాపకుల భద్రత, దాడులు జరిగినప్పుడు ప్రొఫెసర్లకు అండగా ఉండడం, ప్రమోషన్లు, వర్సిటీల బ్లాక్ గ్రాంట్స్ నిధుల పెంపు, నియామకాలు, భూముల పరిరక్షణ తదితర అంశాలపై సత్యనారాయణ నిరంతరం పోరాడారు. ఆయన ఉద్యోగ విరమణ నేపథ్యంలో వర్సిటీలో అక్టోబర్ 4న ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవనున్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఔటా అధ్యక్షులు ప్రొ.సత్యనారాయణ విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలోని రైతుకుటుంబానికి చెందిన లింగయ్య, రాజమ్మ దంపతుల నలుగురు కుమారుల్లో చిన్నవాడు. ఐదు వరకు బొమ్మకల్, పది, ఇంటర్ కరీంనగర్, బీఎస్సీ డిగ్రీ వరంగల్లోని ఎల్బీ కాలేజీలో పూర్తి చేసి ఓయూలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ పట్టా అందుకున్నారు. తొలుత ఇందిరా గాంధీ ఓపెన్ వర్సిటీలో అధ్యాపకులుగా పని చేశారు. 1989లో ఓయూలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందారు.కాగా అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తూనే నిత్యం బోధన, పరిశోధనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 75 పరిశోధన పత్రాలు, 16 మంది పీహెచ్డీలు పూర్తి చేయగా మరో 8 మంది విద్యార్థులు తన పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారు. హెచ్సీయూ పాలక మండలిలో రాష్ట్రపతి నామినీ సభ్యులుగా కూడా భట్టు కొనసాగుతున్నారు. అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలపై తాను సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయని ప్రొ.భట్టు సత్యనారాయణ ‘సాక్షి’కి వివరించారు. -
ఓవరాల్ చాంపియన్ అన్వర్ ఉల్ ఉలూమ్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి బెస్ట్ ఫిజిక్ చాంపియన్షిప్లో అన్వర్ ఉల్ ఉలూమ్ జట్టు సత్తా చాటింది. సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీలో అన్వర్ జట్టు 3 స్వర్ణాలు, 2 కాంస్యాలతో ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. 3 రజతాలు గెలుపొందిన అంజద్ అలీఖాన్ బిజినెస్ స్కూల్ రన్నరప్గా నిలవగా... గెలాక్సీ, వేద, సిద్ధార్థ డిగ్రీ కాలేజీ జట్లు సంయుక్తంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. అన్వర్ ఉల్ ఉలూమ్ జట్టు తరఫున మొహమ్మద్ జావీద్ ఖాద్రి (60 కేజీలు), అబ్దుల్లా హమామీ (65 కేజీలు), మొహమ్మద్ ఫిరోజ్ (90 కేజీలు) స్వర్ణాలను అందుకున్నారు. షేక్ ఒమేర్ (60 కేజీలు), మొహమ్మద్ అల్తాబ్ ఖాన్ (70 కేజీలు) కాంస్యాలను గెలుచుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఓయూ పురుషుల ఇంటర్ కాలేజి టోర్నమెంట్ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఇతర వెయిట్ కేటగిరీల విజేతలు 60 కేజీలు: 1. జావీద్ ఖాద్రి, 2. మొహమ్మద్ ఖాజా (ఇన్ఫాంట్ డిగ్రీ కాలేజి), 3. షేక్ ఒమేర్. 65 కేజీలు: 1. అబ్దుల్లా హమామి, 2. కె. రాజు (సిటీ కాలేజి), 3. రంజిత్ కుమార్ (అంబేడ్కర్ డిగ్రీ కాలేజి). 70 కేజీలు: 1. చింటు కుమార్ (సిద్ధార్థ), 2. అబ్దుల్ అల్తాఫ్ (అంజద్ అలీఖాన్), 3. అల్తాబ్ ఖాన్ 75 కేజీలు: 1. జి. వినయ్ సాయి (వేద డిగ్రీ కాలేజి), 2. మొహమ్మద్ ఖైరుల్ (అంజద్ అలీఖాన్), 3. ఫైజాన్ అలీఖాన్ (ఎంజే ఇంజనీరింగ్ కాలేజి). 80 కేజీలు: 1. మొహియుద్దీన్ (గెలాక్సీ డిగ్రీ కాలేజి), 2. బకీర్ హుస్సేన్ (అంజద్ అలీఖాన్), 3. శ్రియాస్ (ఎంవీఎస్ఆర్). 85 కేజీలు: 1. సలా బిన్ హుస్సేన్ (శ్రీ సాయి డిగ్రీ కాలేజి). 90 కేజీలు: 1. మొహమ్మద్ ఫిరోజ్. 90 ప్లస్ కేజీలు: 2. నవీన్ (అవంతి డిగ్రీ కాలేజి). -
జల్సాల కోసం చోరీల బాట
నేరేడ్మెట్: జల్సాల కోసం చోరీల బాట పట్టారు. నాలుగేళ్లలో పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. క్యాబ్లో తిరుగుతూ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇటీవల సంచలనం సృష్టించిన ఉస్మానియా యూనివర్సిటీలోని మహిళా హాస్టల్లోకి చొరబడి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో అగంతుకుడు చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 28.8తులాల బంగారం, 37 తులాల వెండి వస్తువులు, ఒక కారు, ఐదు సెల్ఫోన్లు, కత్తి, కటింగ్ ప్లేయర్, రూ.7,970 నగదు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ కమిషనరేట్లో సీపీ మహేష్భగవత్ వివరాలు వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా, చెదురవెల్లి గ్రామానికి చెందిన పొటేల్ రమేష్ బోడుప్పల్లోని అంబేడ్కర్ నగర్లో ఉంటూ కూలీ పనులు చేసుకునేవాడు. వనపర్తి జిల్లా, కొల్లాపూర్కు చెందిన గుండూరి కిరణ్ క్యాబ్ డ్రైవర్గా పని చేస్తూ బొడుప్పల్లోని ఇందిరానగర్లో నివసిస్తున్నాడు. ఇద్దరికి పరిచయం ఉండటంతో చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాందించేందుకు చోరీల బాట పట్టారు. 2013 నుంచి రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లలోని పలు ఠాణాల పరిధిలో 15 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. పలుసార్లు అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినా తమ పంథా మార్చుకోలేదు. క్యాబ్ బుక్ చేసిన ప్రయాణికుల కదలికలను గుర్తించి ఆయా ఇళ్లను లూటీ చేసేవారు. చోరీ సమయంలో ఒంటరి మహిళలను కత్తితో బెదిరించి అసభ్యంగా ప్రవర్తించేవారు. ప్రధాన నిందితుడి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం బోడప్పల్ కమాన్ వద్ద అతడిని అదుపులోకి మారుతీ డిజైర్ కారును తనిఖీ చేయగా కత్తి, రాడ్, కట్టింగ్ ప్లేయర్ లభించాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహిళా హాస్టల్ ఘటనతోపాటు ఇళ్ల చోరీలు వెలుగులోకి వచ్చినట్లు సీపీ చెప్పారు. నిందితుడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కేసు చేధించిన పోలీసు అధికారులకు సీపీ రివార్డులు అందజేశారు. సమావేశంలో భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి, క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అతనికి సహకరించింది సోని.. అదుపులో ‘ఆగంతుకుడు’
తార్నాక: ఉస్మానియా యూనివర్శిటీలో లేడీస్ హాస్టల్లో ప్రవేశించింది పాత నేరస్తుడు పొట్టేళ్ళ రమేష్గా తేలింది. పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడిని రాచకొండ పోలీసులు గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హాస్టల్లో చోరీకి అతడికి సహకరించిన మరో నిందితుడు సోనీని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. ఈ ఉదంతం నేపథ్యంలో లేడీస్ హాస్టల్కు భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ ద్వయం ఓయూ హాస్టల్లోకి ప్రవేశించడానికి కొద్దిసేపటి ముందు అదే పరిధిలో మరో సెల్ఫోన్ చోరీ చేసినట్లు పోలీసులు తేల్చారు. మహబూబ్నగర్ జిల్లా, వెల్దండకు చెందిన పొట్టేళ్ళ రమేష్ నగరానికి వలసవచ్చి బీఎన్ రెడ్డి నగర్లో ఉంటున్నాడు. వృత్తిరీత్యా కూలీ అయినా ఇతడి ప్రవృత్తి మాత్రం ఇళ్ళల్లో చోరీలు చేయడం. ఇప్పటికే ఇతడిపై మూడు కమిషనరేట్లలో పలు కేసులు నమోదయ్యాయి. మీర్పేట పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. రమేష్ తనకు జైల్లో పరిచయమైన కాచిగూడ వాసి సన్నీ అలియాస్ సోనీతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. సన్నీపై ముషీరాబాద్, నారాయణగూడ, సుల్తాన్బజార్ పరిధుల్లో అక్రమ మద్యం కేసులు ఉన్నాయి. నారాయణగూడ ఎౖMð్సజ్ పోలీసులు ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరద్దరూ కలిసి ఈ నెల 15 రాత్రి దొంగతనాలకు బయలుదేరారు. 16 తెల్లవారుజామున జామై ఉస్మానియా వద్ద ఉన్న గుడిసెల వద్దకు వెళ్ళారు. సోనీ బయటే ఉండిపోగా రమేష్ లోపలకు వెళ్ళి ఓ సెల్ఫోన్ పట్టుకుని వచ్చి అతడికి అప్పగించాడు. అక్కడి నుంచి వీరిద్దరూ నేరుగా ఉస్మానియా వర్శిటీ ప్రాంగణంలోకి చేరుకున్నారు. లేడీస్ హాస్టల్ భవనానికి ప్రాంతంలో కంచె సరిగ్గా లేకపోవడం రమేష్కు కలిసి వచ్చింది. అక్కడ ఉన్న ఓ చెట్టు సాయంతో గోడ దూకిన అతను లేడీస్ హాస్టల్ బాత్రూమ్లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి లోపలకు వెళ్ళి ఓ సెల్ఫోన్ తస్కరించాడు. తిరిగి బాత్రూమ్ ద్వారానే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుండగా... అటుగా వచ్చిన ఓ విద్యార్థిని కంట పడ్డాడు. అతడిని పట్టుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో పెనుగులాట జరిగి దాడి చేశాడు. వచ్చిన దారిలోనే పరారైన రమేష్ రెండో సెల్ఫోన్ను సోనికి ఇచ్చాడు. ఈ ఉదంతంపై ఉస్మానియా యూనివర్శిటీ ఠాణాలో కేసు నమోదు కావడంతో ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అప్పటికే రాచకొండలో జరిగిన అనేక చోరీ కేసుల్లో రమేష్ ప్రమేయం ఉంది. వివిధ ఘటనాస్థలాల్లో దొరికిన వేలిముద్రలు అతడే నేరాలు చేసినట్లు నిరూపించాయి. దీంతో రమేష్ కోసం మూడు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్న సరూర్నగర్ సీసీఎస్ పోలీసులు గురువారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ఓయూ కేసు దర్యాప్తు చేస్తున్న టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి సోనిని పట్టుకున్నారు. ఇతడి నుంచి మూడు చోరీ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు రమేష్ కోసం ఆరా తీయగా, అతడు రాచకొండ పోలీసుల అదుపులో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం అతడు చేసిన నేరాలకు సంబంధించిన రికవరీలు చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. త్వరలో రమేష్ను అధికారికంగా రాచకొండ పోలీసులు అరెస్టు ప్రకటించనున్నారు. ఆపై ఉస్మానియా వర్శిటీ పోలీసులు అతడిని పీటీ వారెంట్పై తీసుకువచ్చి ఓయూ లేడీస్ హాస్టల్ కేసులో అరెస్టు చూపించనున్నారు. -
అతనెవరో తెలిసిపోయింది..!
తార్నాక: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించి భీభత్సం సృష్టించిన అగంతుకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హాస్టల్లోకి ప్రవేశించి అతను ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డువచ్చిన ఇతర విద్యార్థినులను సైతం కత్తితో బెదిరించి సెల్ఫోన్తో పారిపోయిన సంఘటన ఇటీవల తీవ్ర కలకలం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఓయూ అధికారులు నిందితుడిని పట్టుకోవాలని పోలీసులపై ఒత్తిడి తేవడంతో సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. తాను సెల్ఫోన్కోసమే అర్దరాత్రి ఓయూ లేడీస్హాస్టల్లోకి ప్రవేశించినట్లు అతను పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కాగా తామెవరినీ అదుపులోకి తీసుకోలేదని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ఓయూ పోలీసులు పేర్కొన్నారు. -
కళ తప్పిన ‘ఆర్ట్స్’
ఉస్మానియా యూనివర్సిటీ: చారిత్రక ఆర్ట్స్ కళాశాలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. యూనివర్సిటీ కాలేజీల్లో అతిపెద్దదైన ఆర్ట్స్ కళాశాలలో ఆర్ట్స్, సోషల్ సైన్స్ విభాగాలలో 26 ఎంఏ కోర్సులు ఉన్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ కోర్సులు మినహా ఇతర 23 కోర్సులలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. నిబంధనల ప్రకారం ప్రతి విభాగంలో 6– 8 మంది అధ్యాపకులు ఉండాలి. అందులో ముగ్గురు ప్రొఫెసర్లు తప్పనిసరి. కానీ మూడు విభాగాలు మినహా మిగతావాటిలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు లేకుండాపోయారు. దీంతో విద్యార్థులు ఆయా కోర్సులలో చేరడం లేదు. విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖలలో కేవలం ఒకే అధ్యాపకుడు ఉన్నారు. తమిళ్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ విభాగాల్లో అధ్యాపకులు లేకపోవడంతో పీజీ కోర్సులను రద్దు చేశారు. చరిత్ర, తెలుగు, హిందీ, అరబిక్, సైకాలజీ, ఫిలాసఫీ, లైబ్రరీ సైన్స్ తదితర విభాగాల్లో ఒకరి నుంచి ముగ్గురు మాత్రమే అధ్యాపకులు పని చేస్తున్నారు. థియేటర్ ఆర్ట్స్ విభాగంతో పాటు మరికొన్ని విభాగాల్లో పర్మనెంట్ అధ్యాపకుల స్థానంలో కాంట్రాక్టు అధ్యాపకులతో కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను ఆరు సంవత్సరాల క్రితం రద్దు చేయడంతో ప్రస్తుతం పార్టుటైం అధ్యాపకులతో బోధన సాగుతోంది. ఓయూలో పని చేస్తున్న కాంట్రాక్ట్, పార్టుటైం అధ్యాపకులు కేవలం బోధనకు మాత్రమే చేస్తున్న పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వకపోవడంతో పరిశోధనలు కుంటుపడ్డాయి. ఓయూ పరిధిలోని ఇతర కాలేజీల్లో పని చేసే కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులకు ప్రిన్సిపల్ పదవులతో పాటు ఇతర ముఖ్యమైన పదవులను కూడ కట్టపెడుతున్నారు కానీ ఆర్ట్స్ కాలేజీలో పని చేసే వారికి కనీసం అదనపు బాధ్యతలు కూడా అప్పగించడం లేదు. వృథాగా మౌలిక వసతులు.. ఆర్ట్స్ కాలేజీలో అనేక విభాగాల తరగతి గదులు, కార్యాలయాలు, అధ్యాపకుల గదులు, సెమినార్ లైబ్రరీలు, ఇతర మౌలిక వసతులు వృథాగా ఉంటున్నాయి. ఇంగ్లిష్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, చరిత్ర, జర్నలిజం, సైకాలజీ విభాగాలు మినహా ఇతర 20 విభాగాల తరగతి గదులు, ఇతర గదులు ఎవరూ లేక బోసిపోతున్నాయి. ఆర్ట్స్ కాలేజీలోని కోట్లాది రూపాయల విలువైన మౌలిక వసతులను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడం లేదు. అండర్ గ్రౌండ్తో పాటు మరో రెండు అంతస్తులతో ఆర్ట్స్ కాలేజీని నిర్మించారు. ప్రస్తుతం విద్యార్థులు లేని కోర్సులకు అన్ని వసతులున్న ప్రవేశ ద్వారానికి దగ్గరఉన్న గదులను అలాగే కొనసాగిస్తున్నారు. నిత్యం తరగతులు జరిగే ఇంగ్లిష్ కోర్సును 2వ అంతస్తు చివర్లో, సైకాలజీ, జర్నలిజం కోర్సులను సెల్లార్ గదుల్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు లేకుండా నిరుపయోగంగా ఉన్న కోర్సులకు ప్రధాన గదులను కేటాయించారు. ప్రాధాన్యమున్న కోర్సులకు తరగతి గదులను సెట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆర్ట్స్ కాలేజీ తరగతి గదులను సెట్ చేయాలని విద్యార్థులు ఓయూ అధికారులను కోరుతున్నారు. ఇతర భాషా కోర్సుల్లో శూన్యం.. ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకుల కొరత కారణంగా పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. సంస్కృతం, పర్షియన్, మరాఠి, కన్నడ, ఉర్దూ, పురావస్తు శాఖ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్ తదితర కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదు. గతంలో ఇతర భాషా కోర్సులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యార్థుల ఆర్థిక సహాయం లభించేది. ఇప్పుడా అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల భాషా కోర్సుల్లో ఎవరూ చేరడం లేదు. -
మెడికల్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్–2019లో అర్హత సాధించిన అభ్యర్థులు కేటగిరీ బీ, సీ (ఎన్ఆర్ఐ) కోటాలో సీట్లకు బుధవారం ఉదయం 9 నుంచి 10వ తేదీ సాయంత్రం 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు జ్టి్టhttps:// tspvtmedadm. tsche. in లో ఉంటాయి. ఈ నెల 11న ప్రొవిజనల్ మెరిట్ లిస్టును.. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో నిర్వహిస్తారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దరఖాస్తుకు సంబంధించి ఎదురయ్యే సాంకేతిక సమస్యలకు 9502001583, 8466924522ను సంప్రదించాలి. పూర్తి సమాచారానికి వర్సిటీ వెబ్సైట్ www. knruhs. in, www. knruhs. telangana. gov. in ను చూడాలని వర్సిటీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఇదిలావుండగా 10 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద సీట్లు పెంచాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కి దరఖాస్తు చేశాయి. కానీ ఇప్పటివరకు సీట్ల పెంపుపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. ప్రైవేటులోని కన్వీనర్ కోటా సీట్లకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. వాటికి ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. కానీ అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. -
ఓయూలో పెట్రోల్ బంక్
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా క్యాంపస్లో సౌకర్యాలు కల్పించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో క్యాంపస్ విద్యార్థులకు సైకిల్ కూడా ఉండేది కాదన్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఐదుగురిలో ఒకరికి బైక్, అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయన్నారు. క్యాంపస్లోని 25 హాస్టళ్లలో సుమారు 2,500 బైక్లు, 8వేల స్మార్ట్ ఫోన్లు, 5వేల వరకు కంప్యూటర్లు ఉన్నాయని వివరించారు. వీటితో పాటు 300 వరకు కార్లు కూడా ఉన్నాయన్నారు. ఈ వాహనాలకు పెట్రోలు, సెల్ఫోన్లకు సిగ్నల్ సమస్య ఉందన్నారు. పెట్రోల్ కోసం విద్యార్థులు తార్నాక, విద్యానగర్ వైపు వెళ్లాల్సి వస్తోందన్నారు. యూటర్న్ కారణంగా ఎటు వెళ్లినా అర లీటర్ పెట్రోల్ అవుతుందన్నారు. అందుకే విద్యార్థులు, అధ్యాపకుల అవసరాలను గుర్తించి క్యాంపస్లో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ హెచ్పీసీఎల్తో ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపారు. గతంలో కబ్జాకు గురై ఇటీవల ఓయూకు దక్కిన మెకాస్టార్ ఆడిటోరియం పక్కనున్న సుమారు ఎకరం స్థలంలో బంక్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సెల్ టవర్స్, హాస్టల్ విద్యార్థుల వంటల కోసం గ్యాస్ పైప్లైన్, ఉచిత వైఫై, సౌర విద్యుత్తు తదితర వసతులు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే వసతులతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు లేనిపోని అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. పదేళ్ల లీజు.. ఓయూలో పెట్రోల్ బంక్ కోసం కేటాయించిన ఎకరం స్థలాన్ని హెచ్పీసీఎల్ సంస్థకు పదేళ్లకు లీజుకు ఇచ్చిన్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి చెప్పారు. ప్రతి ఐదేళ్లకు రెన్యూవల్ చేసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. ఏడాదికి రూ.50 లక్షల వరకు అద్దె లభిస్తుందన్నారు. గతంలో లీజుకిచ్చిన ఓయూ భూములను ప్రతి ఐదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకునేలా గత ఒప్పందాలను సవరించామన్నారు. క్యాంపస్లో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ఇటు ఓయూ, అటు ఇఫ్లూ విద్యార్థులకు, ఉద్యోగులకు, మాణికేశ్వర్నగర్ వాసులకు ఉపయోగపడుతుందన్నారు. ఓయూ భూముల లీజు వివరాలను అందరికీ తెలిసేలా బహిరంగ పర్చాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీశైలంగౌడ్ డిమాండ్ చేశారు. గతంలో లీజుకు ఇచ్చిన భూముల అద్దె చెల్లింపులు, విధివిధానాలు పారదర్శకంగా ఉండాలన్నారు. -
గౌరవ డాక్టరేట్ లేనట్టే!
చారిత్రక విశ్వవిద్యాలయం.. వందేళ్ల వైభవం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందినఉస్మానియా యూనివర్సిటీ ‘గౌరవం’ ఎవరికీ దక్కడం లేదు. 14 ఏళ్లుగా వర్సిటీ గౌరవడాక్టరేట్కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూస్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహించనున్న తొలి వేడుక ఇది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. తొలుతగౌరవ డాక్టరేట్ సీఎం కేసీఆర్కు ప్రదానం చేయాలని ప్రతిపాదించగా వ్యతిరేకత రావడంతో విరమించుకున్న అధికారులు.. ఆ తర్వాత మరెవరినీ ఎంపిక చేయలేదు. మరోవైపుస్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్ హాజరుకాకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం జరగనుంది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం లేదని తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి గౌరవ డాక్టరేట్ అందజేస్తారు. కానీ గత 14 ఏళ్లుగా ఓయూ గౌరవ డాక్టరేట్కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏదో ఒక రంగంలో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్తో సత్కరించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్కు ఓయూ గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ కొందరు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. మరొకరిని ఎంపిక చేయాలనే విషయంలో ఓయూ అధికారులు శ్రద్ధ చూపలేదు. నిబంధనలు కఠినం... స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఓయూ స్నాతకోత్సవం మొక్కుబడిగా జరగనుంది. గౌరవ డాక్టరేట్ ఎంపికకు నియమ నింబంధనలు అతి కఠినంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అవి ఈ కాలం నాటి వ్యక్తులకు ఉండాలంటే చాలా అరుదు అంటున్నారు. ఉన్న వారిలోనే మంచి వారిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ను అందజేయవచ్చు. కానీ ఓయూ అధికారులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని విస్మరిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కవి, గాయకులు అందెశ్రీని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. మారిన పరిస్థితితులకు అనుగుణంగా నిబంధనలు సడలించుకుంటే సమాజం, ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించేలా గౌరవ డాక్టరేట్ అందజేయొచ్చు. ‘ఓయూ గౌరవ డాక్టరేట్ ఎంపికకు ఈ కాలంలోనూ ప్లేటోలు, అరిస్టాటిల్స్ కనిపించరు కదా.!’ అని సీనియర్ అధ్యాపకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఉన్న వారిలోనే ఒకరిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ను అందచేస్తే ఓయూ విశిష్టత మరింత పెరుగుతుందన్నారు. ముఖ్య అతిథి ఎంపికపై అసంతృప్తి.. ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ పేరును ఖరారు చేయడంపై పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ నిత్యం ఓయూను సందర్శిస్తారని, తమ కంటే జూనియర్ అని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొన్నారు. వందేళ్ల ఓయూలో జరిగే 80వ స్నాతకోత్సవానికి జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారు. స్నాతకోత్సవానికి కేవలం గవర్నర్ మాత్రమే వస్తుండడం, సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై నిరాశతో ఉన్నారు. దేశమంతటా పర్యటించే సీఎం కేసీఆర్ ఓయూకు రాకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన దరఖాస్తులు.. ఓయూ స్నాతకోత్సవం నిర్వహణపై సరిగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. మే 31తో గడువు ముగియగా... డిగ్రీ, పీజీ పట్టాకు 600, పీహెచ్డీకి 380 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు 292 మందికి బంగారు పతకాలు అందజేయనున్నారు. గత ఆరేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు పాస్ కాగా సరైన సమాచారం లేక కొద్ది మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ నిర్వహణపై ఇంత వరకు ఓయూ వీసీ ప్రొ.రాంచంద్రం ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అయితే డిగ్రీ, పీజీకి రూ.200 అపరాధ రుసుముతో జూన్ 4 వరకు, పీహెచ్డీ అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ముందు దరఖాస్తు చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రతి కాలేజీకి చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారు. వేదికపై కేవలం పీహెచ్డీ అభ్యర్థులకు మాత్రమే పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఓవైపు పరీక్షలు... ఓయూలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో స్నాతకోత్సవ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆరేళ్లుగా స్నాతకోత్సవం జరగకపోవడంతో ప్రభుత్వం, విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జూలై 24తో వీసీ ప్రొ.రాంచంద్రం పదవీ కాలం ముగుస్తుంది. తాను పదవిలో ఉండగానే స్నాతకోత్సవం నిర్వహించాలని ఆయన భావించారు. సిబ్బంది కొరత, వేసవి సెలవులకు అధ్యాపకులు వెళ్లడంతో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమై ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఒక పక్క పరీక్షలు, ఫలితాలు, మరో పక్క స్నాతకోత్సవం పనులతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పేర్కొన్నారు. -
పిటీ సెంటర్లు!
ఉస్మానియా యూనివర్సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో నెలకొల్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయ పీజీ కేంద్రాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఒకవైపు సిబ్బంది, మరోవైపు మౌలిక వసతుల లేమితో కునారిల్లుతున్నాయి. దీంతో పలు పీజీ కోర్సులను సైతం రద్దు చేసిన స్థితికి దిగజారాయంటే ఇవి ఎంతటి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత, అసౌకర్యాల కారణంగా కోర్సుల్లో విద్యా ర్థులు చేరడం లేదు. పీజీ కేంద్రాల భవనాల అద్దెలు, సిబ్బంది వేతనాల వ్యయం భరించలేని స్థితిలో ఓయూ ఆర్థిక పరిస్థితి దీనంగా మారింది. దీంతో ఓయూ పరిధిలోని ఐదు పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సిబ్బంది విముఖత.. ఓయూ క్యాంపస్, అనుబంధ కాలేజీలు, కార్యాలయాల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులు బదిలీలపై విముఖత కనబరుస్తున్నారు. ఒకవేళ బదిలీ జరిగినా జంట నగరాల కాలేజీలు, కార్యాలయాలకు మాత్రమే వెళ్లడానికి మాత్రమే వారు ఆసక్తి చూపుతున్నారు. జంట నగరాలు దాటి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. దీంతో వివిధ జిల్లాల్లోని 5 యూనివర్సిటీ పీజీ కేంద్రాలలో పర్మనెంట్ ఉద్యోగులు కొరత కారణంగా కాంట్రాక్టు సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఓయూ ఉన్నతాధికారులు సరిపడా టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులను భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందనే ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లోని పీజీ కేంద్రాలను అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీయే దిక్కు.. పీజీ కేంద్రాలపై అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించినా అధికారులు మాత్రం సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు పీజీ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. ఆయా కేంద్రాల్లో అధ్యాపకులు లేక గెస్ట్ ఫ్యాకల్టీతోనే నెట్టుకొస్తున్నారు. విద్యార్థులు చేరకపోవడం, చేరినా ఫ్యాకల్టీ కొరతతో అడ్మిషన్లు రద్దు చేసుకోవడంతో కొన్ని కోర్సులను తొలగించాల్సి వస్తోంది. ఇటీవలే నర్సాపురం పీజీ కేంద్రంలో లైబ్రరీ సైన్స్ కోర్సును ర ద్దు చేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉండటం, నాన్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వెరసీ పీజీ కేంద్రాల్లో చేరే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఓయూ అధికారులు పీజీ కేంద్రాలపై దృష్టి సారించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, సొంత భవనాలను నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్నీ సమస్యలే.. ఓయూ పరిధిలోని సిద్దిపేట, మీర్జాపూర్, నర్సాపూర్, జోగిపేట, వికారాబాద్లలో పీజీ కోర్సులతో జిల్లా పీజీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్), ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), ఎంఏ జర్నలిజంతో పాటు లైబ్రరీ సైన్స్ కోర్సులు అందిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో ఉద్యోగుల కొరతతో పాటు సొంత భవనాలు, మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. పర్మనెంట్ ఉద్యోగులు వీటిలో పని చేసేందుకు అంతగా ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగులు వివిధ అవసరాలు, సౌకర్యాల కోసం నగరంలోనే తిష్టవేస్తున్నారు. దీన్ని ఓయూ వీసీ కూడా సీరియస్గా తీసుకోకపోవడంతో సిబ్బంది కొరతతో పీజీ కేంద్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వీటిని ప్రారంభించి ఏడేళ్లవుతున్నా ఇప్పటివరకూ వాటికి సొంత భవనాలే లేకుండాపోయాయి. విద్యార్థులకు కనీసం హాస్టల్ సౌకర్యం కూడా లేకపోవడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. -
ఎన్నికల దృష్ట్యా ఓయూ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల దృష్ట్యా సోమ, మంగళవారాల్లో (6,7వ తేదీలు) జరి గే ఓయూ పరిధిలోని పరీక్షలన్నీ వాయిదా వేసినట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. తిరిగి పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇతర పరీక్షల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
ఓయూ టు యూఎస్ నేరుగా సర్టిఫికెట్ల జారీ
వందేళ్ల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో దరఖాస్తుల విధానం మొదలు.. పరీక్షలు, ఫలితాలు,కౌన్సెలింగ్, మూల్యాంకనం, ఫీజుల చెల్లింపు, సర్టిఫికెట్ల జారీ తదితర సేవలన్నింటినీ ఆన్లైన్ చేశారు. ఓయూలో విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్లు పొందే ఏర్పాట్లు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ: వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ అన్ని అంశాల్లో ప్రపంచస్థాయి వర్సిటీలకు పోటీగా నిలుస్తోంది. శతాబ్ది ఉత్సవాల అనంతరం ఓయూలో అన్ని సేవలను ఆన్లైన్ చేశారు. దరఖాస్తు మొదలు పరీక్షలు, ఫలితాలు, కౌన్సెలింగ్, మూల్యాంకణం, ఫీజుల చెల్లింపు, సర్టిఫిక్కెట్ల జారీ తదితర సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఓయూలో విద్యాభ్యాసం చేసిన వారు అమెరికాతో సహా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టినట్లు ఓయూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎంత దూరంలో ఉన్న వారికైనా సర్టిఫికెట్లు అందించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఓయూలో చదివి మారుమూల ప్రాంతాలు, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులెవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విధానంలో 270 కోర్సుల సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు తెలిపారు. వెరీ అర్జెంట్ మోడ్లో దరఖాస్తు చేసిన విద్యార్థులకు కేవలం రెండు రోజుల్లో సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఎగ్జామినేషన్ విభాగంలో డిగ్రీ కోర్సుల ఆన్లైన్ మూల్యంకణం కోసం కొత్తగా 400 కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. ఓయూలో డబ్ల్యూఎస్ సేవలు ఓయూలో వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీస్ (డబ్ల్యూస్) సేవలు అందిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రాన్స్స్క్రిఫ్టులు, ఇతర సర్టిఫికెట్లను అంతర్జాతీయ స్పీడ్ పోస్టు ద్వారా విద్యార్థులకు చేరవేస్తున్నామన్నారు. వాటి వివరాలు తెలుసుకునేందుకు విద్యార్థులకు ట్రాకింగ్ ఐడీని ఇస్తామన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు మార్కుల జాబితాలు కాకుండా నేరుగా ప్రింట్ చేసి ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్ఎస్డీఎల్ సర్టిఫికెట్ల డిపాజిట్ ఎంహెచ్ఆర్డీ ఆదేశాల మేరకు నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ (ఎన్ఏడీ) స్కీమ్లో భాగంగా ఓయూలో చదివిన విద్యార్థుల అకాడమిక్ రికార్డులను ఆన్లైన్లో పొందపర్చనున్నట్లు కంట్రోలర్ పేర్కొన్నారు. ఓయూలోని 270 కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సర్టిఫికెట్లను నేషనల్ సెక్యురిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) వెబ్సైట్లో ఉచితంగా పొందపర్చామన్నారు. మొదటి విడతలో భాగంగా 2005 విద్యా సంవత్సరం నుంచి 10.20 లక్షల మంది విద్యార్థుల డిగ్రీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో ఉంచామని. భవిష్యత్తులో అంతకు ముందు విద్యార్థుల సర్టిఫికెట్లను సైతం ఆన్లైన్లో పెడుతామన్నారు. ఎన్ఎస్డీఎల్లో పొందపరచిన సర్టిఫిక్కెట్ల 17 విధాలుగా ఉపయోగించుకోవచ్చునని, అవసరమైతే ఎన్ఎస్డీఎల్ నుంచి డిజిటల్ సర్టిఫికెట్ పొందవచ్చునని తెలిపారు. దేశ, విదేశాల్లో ఓయూ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు ఎన్ఎస్డీఎల్ ద్వారా సర్టిఫికెట్లను నేరుగా వెరిఫికేషన్ చేసుకోవచ్చునన్నారు. అయితే దూరవిద్య డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులకు ఈ అవకాశం అందుబాటులో లేదన్నారు. ఇంటి నుంచే పీజీ, పీహెచ్డీ మూల్యాంకనం ఓయూలో ఇకపై పీజీ, పీహెచ్డీ కోర్సుల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యంకనం అధ్యాపకుల ఇల్లలోనే చేస్తారని కంట్రోలర్ తెలినారు. జవాబు పత్రాలను స్కాన్ చేసిన అనంతరం ఆయా సబ్జెక్టుల అధ్యాపకుల వెబ్సైట్లకు డౌన్లోడ్ చేస్తామని, ప్రతి అధ్యాపకుని పని తీరును ఓటీపీ నంబర్ ద్వారా తెలుసుకుంటామన్నారు. పీహెచ్డీ థిసీస్ను కూడ దేశ వ్యాప్తంగా అధ్యాపకులకు ఆన్లైన్ ద్వారా పంపించి పరిశీలించాలని కోరనున్నట్లు తెలిపారు. తద్వారా సమయం ఆదా కావడమే కాకుండా నాణ్యమైన పరిశోధనలు వెలుగులోకి వస్తాయన్నారు. విచారణ విభాగం పునరుద్ధరణ ఓయూ ఎగ్జామినేషన్ కార్యాలయంలో మూతపడిన విచారణ విభాగాన్ని పునరుద్ధరించినట్లు కంట్రోలర్ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చే విద్యార్థులకు తక్షణ సమాచారం కోసం ఎంక్వైరీ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈడీపీ విభాగం, కంట్రోలర్ పేషీలో రెండు కొత్త సెల్ నెంబర్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అవసరమైన వారు కంట్రోలర్ పేషీ నంబర్ 7569989081, ఈడీపీ సెక్షన్ నంబర్ 7569998409 సంప్రదించాలని సూచించారు. -
ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: ఒకే రాష్ట్రం.. ఒకే డిగ్రీ కోర్సు.. అయినా ఫీజులు మాత్రం ఒక్కో వర్సిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అంతేకాదు యాజమాన్యాలు కూడా ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీల బీఏ కోర్సుకు తక్కువ ఫీజు ఉంటే.. మరికొన్నింటిలో ఎక్కువ ఫీజులున్నాయి. ఈ మోతను నియంత్రించాల్సింది పోయి.. మరోభారీ ఫీజు వడ్డనకు ఉన్నతవిద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల్లో ఒకేరకమైన ఫీజు విధానం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇందులో సమస్యేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజు సమం పేరిట ఒక్కో కోర్సుపై రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని డిగ్రీలో చేరుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులపై ఫీజుల భారం తప్పేట్లు లేదు. డిగ్రీకి పేదలు దూరమే! కాకతీయ యూనివర్సిటీలో బీఏ కోర్సు వార్షిక ఫీజు ప్రస్తుతం రూ.6,170. ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నట్లు కనీసం రూ.5వేల పెంచితే అది రూ.11,170కి చేరుతుంది. అదే రూ.10వేలు పెంచితే ఫీజు కాస్తా రూ.16,170గా ఉండనుంది. అదే ఏటా రూ.13,520 ఉన్న బీఎస్సీ వంటి కోర్సుల్లో ఈ పెంపును వర్తింపజేస్తే.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ చదువులకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఉన్న తక్కువ ఫీజుతో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. పెంచిన ఫీజులు అమల్లోకి వస్తే.. పేదలకు ఉన్నత విద్య ఇక నెరవేరని కలగా మారడం ఖాయమే. యాజమాన్యాల ఒత్తిడితోనే.. డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే.. ఉన్నతాధికారులు ఈ ఫీజుల పెంపు ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పెంపు ద్వారా యాజమాన్యాలకు మేలు చేకూర్చేందుకు మండలిలోని కొంతమంది ఉన్నతాధికారులు పావులు కదిపినట్లు తెలిసింది. అందులో భాగంగానే కామన్ ఫీజు చేస్తామనే సాకుతో.. అన్ని వర్సిటీల పరిధిలోకి ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురానున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులపై ఫీజు పెంపు భారం! సాధారణంగా డిగ్రీలో చేరుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే ఇపుడు కామన్ ఫీజు అమల్లోకి తెచ్చి అదనంగా పెంచే మొత్తాన్ని విద్యార్థులనుంచే వసూలు చేసేలా నిబంధనను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా విద్యార్థు«లకు, తల్లిదండ్రులకు తాము కొంత ఫీజు చెల్లిస్తాం కనుక డిగ్రీ చదువులపై శ్రద్ధ పెరుగుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఉన్న యూనివర్సిటీ ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేల వరకు వసూలు చేసుకునేలా రెండేళ్ల కిందటే ఆదేశాలు జారీ అయ్యాయి. పెంచిన ఫీజు మొత్తం ఫీజు–రీయింబర్స్మెంట్ పరిధిలో రాదు. తల్లిదండ్రులే చెల్లిస్తున్నారు. అదే తరహాలో ఇపుడు అన్ని యూనివర్సిటీల్లో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఫీజులను పెంచి తల్లిదండ్రులపై భారం మోపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. త్వరలోనే జరిగే డిగ్రీ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా ప్రకటించనుందని తెలిసింది. రాష్ట్రంలోని 1,084 డిగ్రీ కాలేజీల్లో 4.20లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 2.20 లక్షలకు మించి భర్తీ కాలేదు. ఐదారేళ్లుగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫీజులు పెంచితే మరిన్ని ఖాళీలు తప్పవు. -
విజ్ఞానగని, విశ్వాసమణి ప్రొఫెసర్ విజయం
వాస్తవాన్నే జీవితంగా మలుచుకొని లోకానికి క్రైస్తవాన్ని ఆచరణలో చాటిన ఒక మహా విశ్వాసి ఉదంతం ఈ వారం. గొప్ప మేధావి, పరిశోధకుడు, ఆదర్శప్రాయమైన యూనివర్సిటీ అధ్యాపకుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడు, రచయిత, బైబిల్ పండితుడు, తాను విశ్వసించిన క్రైస్తవాన్ని ఆచరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో జీవించిన మహా విశ్వాసి ప్రొఫెసర్ బి.యి.విజయం, తన 86వ యేట ఈ జనవరి 30న కన్ను మూశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రం (ఎ్ఛౌ ౌజy)లో పట్టభద్రుడై, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి, అత్యున్నత పదవులు అలంకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర విభాగానికి అధిపతిగా, జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా సైంటిస్టుగా, మన దేశపు తూర్పు కనుమల్లో అణుధార్మిక శక్తి కలిగిన అత్యంత విలువైన భూగర్భ ఖనిజ నిల్వల్ని కనుగొనడంలో, బీహార్ ధన్బాద్ బొగ్గుగనులకు చెందిన అత్యంత విస్తారమైన నిల్వలను కనుగొనడంలో ఆయన దేశానికి చేసిన సేవ ఆవిరళమైనది. సౌదీ అరేబియా దేశంలో కూడా, ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానం మీద అక్కడికెళ్లి చమురు నిల్వలున్న పలు ప్రదేశాలను అప్పట్లో ఆయనే గుర్తించారు. వారి వైజ్ఞానిక సేవల్ని గుర్తిస్తూ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పతకాన్ని ప్రొ.విజయంకు బహూకరించి ఎం.ఎస్.స్వామినాథన్, వర్గీస్ కురియన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ దిగ్గజాల సరసన ఆయన్ను నిలబెట్టింది. రాయలసీమలోని ఒక గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి పట్టుదలతో, స్వయంకృషితో, ప్రపంచస్థాయి శాస్త్రజ్ఞుడుగా ఎదిగి, పటిష్టమైన క్రైస్తవ పునాదులున్న మచ్చలేని క్రైస్తవ విశ్వాసిగా జీవించిన ప్రొ.విజయం జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన మన దేశమే కాదు మొత్తం ప్రపంచం గర్వించదగిన మహా మేధావి, క్రైస్తవం, మానవత్వం పరిమళించిన మహామనిషి. ఒక్కమాటలో ‘తెలుగు క్రైస్తవం’ సగర్వంగా ప్రపంచానికందించిన మణిమాణిక్యమాయన! ప్రొఫెసర్ విజయం సహాయం పొందిన అసంఖ్యాకుల్లో ఈ రచయిత కూడా ఒకరు. సాక్షిలో క్రైస్తవ వ్యాసాన్ని క్రమం తప్పక చదివి, తన అమూల్యమైన లభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు విజయం. అలా ‘సాక్షి’ ద్వారా మళ్లీ ఏర్పడిన సాన్నిహిత్యంతో తరచుగా కలుసుకొంటున్నపుడు, భూగర్భశాస్త్రంలో ఆయనెంత ప్రవీణుడో, బైబిల్ పరిజ్ఞానంలో కూడా అంతే పట్టుగల్గిన వాడన్నది వెల్లడైంది.. ఈ రచయితతోపాటు ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని సందర్శించినప్పుడు ఎంతో విలువైన సమయం గడపడం సాధ్యమైంది. అప్పుడు ఈజిప్ట్లో సీనాయి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా చోట్ల రాళ్లను పరిశీలించి, ‘ఇక్కడ బంగారం నిల్వలున్నాయి’ అన్నారాయన. అదే విషయాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల ధృవీకరించడం వార్తల్లో తెలుసుకొని ఆయన ప్రతిభకు ఆశ్చర్యపోక తప్పలేదు. రాయలసీమ సిఎస్ ఐడియాసిస్కు మొట్టమొదటి భారతీయ బిషప్గా నియమించబడ్డ రైట్ రెవ. జాన్ బన్యన్ ఐదుగురు సంతానంలో కనిష్ఠుడాయన. నీతి నియమాలకు కట్టుబడి ఎంతో నిజాయితీగా పరిచర్య చేసిన బిషప్ జాన్ బన్యన్ నుండి క్రమశిక్షణ, భక్తి బాల్యం నుండే ప్రొఫెసర్ విజయంకు అలవడ్డాయి. నిజాయితీపరుడైన బిషప్ కుమారుడుగా విలాసాలకు దూరంగా, అతి సాధారణంగా ఆయన జీవితం సాగింది. పేదరికాన్ని, పేదల నిస్సహాయతను అలా ఆయన చాలా దగ్గరి నుండి చూశారు. అందుకే పేదల్ని, నిరాశ్రయుల్ని, అభాగ్యుల్ని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి ఎన్నో సహాయ కార్యక్రమాలు తన సేవాసంస్థ ద్వారా చేపట్టారు. ‘ఎవరినైనా ఆదుకున్న రోజున భలే నిద్రపడుతుందయ్యా’ అనేవారాయన. నిజ క్రైస్తవానికి ఇంతకు మించిన విశ్లేషణ, నిద్రలేమి అనే భయంకర వ్యాధికి దీన్ని మించిన చికిత్స ఉందా? ఎంతో స్నేహపాత్రుడు, గుండెలో ప్రేమ, కనికరాల ఊటలు ఉన్నాయా అనిపించేంత గొప్పగా స్పందించి సాయం చేసే వితరణ శీలి, సాత్వికుడు, వినయ మనస్కుడు అయిన విజయం లేని లోటు పూడ్చలేనిది. ఆయన విడిచి వెళ్లిన క్రైస్తవ వారసత్వం మాత్రం వెలలేనిది. –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
శివశక్తి
-
పరిశోధనల్లో సృజనాత్మకత అవసరం
హైదరాబాద్: పరిశోధనల్లో కొత్తదనం, సృజనాత్మకత అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు. గురువారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ), ఓయూ కామర్స్ విభాగం, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘అఖిల భారత 71వ కామర్స్ సదస్సు’ప్రారంభమైంది. క్యాంపస్లోని ఠాగూర్ ఆడిటోరియంలో వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం అధ్యక్షతన ప్రారంభమైన ఈ సదస్సు మూడు రోజుల పాటు జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎస్ ఎస్కే జోషి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశోధనల్లో కొత్తదనంతో పాటు సృజనాత్మకత అవసరమని, అప్పుడే విజయం సాధించగలమని అన్నారు. మారుతోన్న మార్కెట్ అవసరాలకు అనుకూలంగా పరిశోధనలు ఉండాలని ఆయన సూచించారు. పరిశోధనల వల్ల కనుగొన్న కొత్త అంశాలు, తయారు చేసే వస్తువులు అధిక సంఖ్యలో వినియోగంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఐసీఏ అధ్యక్షుడు సుభాష్ గార్గె మాట్లాడుతూ.. కామర్స్, ఎంబీఏ పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులలో పరిశోధనాతత్వాన్ని పెంపొందించేందుకు ప్రతి ఏటా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అతిథులంతా కలిసి సదస్సు సావనీరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే మిశ్రా, డెలాయిట్ అధికారి రమేశ్, సదస్సు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఓయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఓయూలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల హాల్ టికెట్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మంగళవారం నుంచి ఓయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే సోమవారం వరకు హాల్టికెట్ల రాకపోవడంతో విద్యార్థులు కంగారు పడుతున్నారు. మరికొన్ని కాలేజీలు అసలు కాలేజీకి హాల్టికెట్లు వచ్చాయో లేదోనన్న విషయాన్ని ఇంతవరకూ విద్యార్థులకు తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓయూ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్లో పలు కాలేజీల వద్ద విద్యార్థులు హాల్టికెట్ల కోసం పడిగాపులు కాయడం కనిపించింది. అసలేం జరిగింది? ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఓయూ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జరుగుతాయని ఒకసారి, జరగవని మరోసారి, రకరకాలుగా ప్రచారం జరిగింది. 23 వరకు వర్సిటీ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాయి. అకస్మాత్తుగా ఈనెల 24న వర్సిటీ నుంచి విద్యార్థుల హాల్టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు కళాశాలలు హాల్టికెట్లు ఇవ్వలేకపోయాయి. కొన్ని కాలేజీలు మాత్రం హాల్టికెట్లు వచ్చిన విషయాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపించాయి. మరికొన్ని కాలేజీలు ఈ విషయాన్ని కనీసం తెలపలేదు. దీంతో సోమవారం కళాశాలకు రాని విద్యార్థులకు అసలు హాల్టికెట్లు వచ్చిన విషయమే తెలియలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సెంటర్ల మార్పు.. డిగ్రీ కాలేజీల సెంటర్లు పెద్దగా మారవు. కానీ ఎన్ని కల కారణంగా కొన్ని కాలేజీలను ఎన్నికల స్ట్రాంగ్రూంలుగా వాడుతున్నారు. దీంతో కొన్ని కాలేజీల సెంటర్లు మారిపోయాయి. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి హాల్టికెట్లు వచ్చేదాకా తమకు తెలియదని, తాము మాత్రం ఏం చేయగలమని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. బ్లాక్ పెన్తోనే రాయాలి.. ఈసారి నిర్వహించబోయే పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ నుంచి ఓయూ పరిధిలో ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టారు. మార్కుల్లో అవకతవకలు, మూల్యాంకనంలో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఆన్లైన్ మూల్యాంకనంలో ఆన్సర్షీట్ స్పష్టంగా కనిపించాలంటే విద్యార్థులంతా బ్లాక్పెన్తోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు హాల్టికెట్లు అందకపోవడంతో చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలియకుండా పోయిందని పలు కాలేజీల లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24న హాల్టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం హడావుడిగా విద్యార్థులకు ఇచ్చారు. మంగళవారం ఉదయం త్వరగా వస్తే తీసుకోని వారందరికీ హాల్టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. -
మాతృభాషను మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది. చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు. మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ రద్దుకు నిరసనగా ఓయూలో ఆందోళనలు
హైదరాబాద్: కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో అసెంబ్లీ రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు గురువారం నిరసనలు చేపట్టారు. ఒక వైపు నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు నిర్వహించగా, నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని విరగడైందంటూ మరోవైపు స్వీట్లు పంచి, కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల మీదుగా భారీ ర్యాలీ జరిపారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్,టీజేఎస్ నేతలు రమేష్, కాంగ్రెస్ నేతలు దయాకర్ మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల తెలంగాణకు పట్టిన దరిద్రం వదిలిందని, కేసీఆర్ నియంత పాలననుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా మానిఫెస్టో హామీలను అమలు చేయకుండానే అసెంబ్లీ రద్దు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రజల ఆకాంక్షను వ్యక్తిగత స్వార్థాల కోసం, తన వ్యక్తిగత కోరికలతో కాలాన్ని వృథా చేశారన్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి ఇదొక శుభపరిణామమని, రానున్న ఎన్నికల్లో యువత, నిరుద్యోగుల తీర్పు కీలకంగా మారుతుందన్నారు. ప్రజా తీర్పుతోనే కేసీఆర్ చెంపచెల్లుమనేలా విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు. నేడు విద్యాసంస్థల బంద్: అసెంబ్లీ రద్దును నిరసిస్తూ విద్యార్థులు ఓయూలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దును నిరసిస్తూ శుక్రవారం విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్కు ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.బంద్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు యూనివర్సిటీలు విధిగా పాల్గొనాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. -
ఈసారి వస్తా..
సాక్షి, హైదరాబాద్: ఈసారి రాష్ట్రానికి వచ్చినప్పుడు తాను ఉస్మానియా యూనివర్సిటీని సందర్శిస్తానని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. తన రాక కోసం అధికారికంగా అనుమతి తీసుకోవాలని ఆయన విద్యార్థి నేతలకు సూచించారు. తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ నేతృత్వంలోని 15 మంది ఓయూ విద్యార్థి నేతల బృందం మంగళవారం రాహుల్ని కలిసింది. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థి, నిరుద్యోగుల పరిస్థితిని వివరించారు. టీఎస్పీఎస్సీలో అధికారికంగా రిజిస్టర్ చేసుకున్న నిరుద్యోగులే రాష్ట్రంలో 14 లక్షల మందికి పైగా ఉన్నారని, కేసీఆర్ ప్రభుత్వ తీరుతో వారంతా నైరాశ్యంతో ఉన్నారని తెలిపారు. జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్ల నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చిన ఒక్క గ్రూప్–2 నోటిఫికేషన్ కూడా కోర్టులో ఆగిపోయిందని, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా తప్పుల తడకగా ఇస్తున్నారని, వాటిని కోర్టులు నిలిపివేస్తున్నాయని చెప్పారు. దీని వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని రాహుల్కు వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పగా, రాహుల్ స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల కష్టాలు తీరతాయని, ఎవరూ బాధపడవద్దని హామీ ఇచ్చారు. ఓయూ విద్యార్థి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన 10 మంది విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ అవకాశం కల్పించిందని, అటు పార్టీ పదవుల్లోనూ, ఇటు అసెంబ్లీ, లోక్సభ టికెట్ల కేటాయింపులోనూ ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో ఓయూ విద్యార్థి నేతలకు పార్టీ ఆఫీస్ బేరర్ల నియామకంలోనూ, టికెట్ల కేటాయింపులోనూ ఉన్న అవకాశాలను పరిశీలించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డికి రాహుల్ సూచించారు. రాహుల్ను కలిసిన వారిలో విద్యార్థి నేతలు చరణ్కౌశిక్, దరువు ఎల్లయ్య, దుర్గం భాస్కర్, బాలలక్ష్మి, అర్జున్బాబు, శ్రీధర్గౌడ్, చెనగాని దయాకర్, బొమ్మా హనుమంతరావు, పుప్పాల మల్లేశ్, పున్నా కైలాశ్ నేత, విజయ్కుమార్, కేతూరి వెంకటేశ్, లోకేశ్యాదవ్, మదన్ ఉన్నారు. బీసీ బిల్లు పెడితే మద్దతిస్తాం బీసీ సంక్షేమ సంఘం నేతలకు రాహుల్ హామీ సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. మంగళవారం హరిత ప్లాజాలో ఆర్.కృష్ణయ్య రాహుల్గాంధీని కలిసి బీసీల సమస్యలపై వివరించారు. పేరుకే ప్రజాస్వామ్యమని, ఏ రంగంలోనూ బీసీలకు న్యాయం జరగడంలేదని కృష్ణయ్య వాపోయారు. ఉద్యోగ రంగంలో 9శాతం, రాజకీయరంగంలో 14 శాతం, పారిశ్రామిక, కాంట్రాక్టు రంగంలో ఒక శాతం మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్నారు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా అని రాహుల్గాంధీని కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే మేం అధికారంలోకి రాగానే బీసీ బిల్లు, రాజకీయ రిజర్వేషన్ల బిల్లు పెడతామని రాహుల్ హామీ ఇచ్చారని కృష్ణయ్య పేర్కొన్నారు. రాహుల్ బస్సులోనే... హరితప్లాజాలో కలిసి తిరిగివెళ్తున్న కృష్ణయ్యను తన బస్సులోకి రావాలని రాహుల్ చేయిపట్టి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీకి బీసీ సమస్యలపై కృష్ణయ్య వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లలో 50 శాతం, పంచాయతీరాజ్లో 34 శాతం నుంచి 52 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి, బీసీ అభివృద్ధికి ప్రత్యేక స్కీంను రూపొందించాలన్నారు. అదేవిధంగా బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్ ఎత్తేయాలని, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 27శాతం నుంచి 56 శాతానికి పెంచాలని, కేంద్ర స్థాయిలో రూ.60వేల కోట్ల బడెŠజ్ట్తో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. బీసీలకు పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీం విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. -
చంపిన చేతులతో.. నివాళులా?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో పోలీసు కాల్పుల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు దగ్గరే అరెస్ట్ చేయించిన విషయం కాంగ్రెస్ నేతలు మరిచారా అని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి రక్తాలు కారుతున్న విద్యార్థులను కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఓయూ ప్రశాంతంగా ఉందని, రాహుల్ వస్తే ఆ వాతావరణం దెబ్బతింటుందని వీసీ అనుమతి నిరాకరించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్లో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. అమరవీరుల స్తూపానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారన్న ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. ‘1969లో 369మంది ఉద్యమకారులను పిట్టల్లాకాల్చి చంపించిందెవరు.. ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా.. 2009లో డిసెంబర్ 9 ప్రకటనను కాంగ్రెస్ వెనక్కి తీసుకుంటే మళ్లీ ఆత్మహత్యలు జరిగాయి. ఆ అమరత్వానికి కాంగ్రెస్ కారణం కాదా? చంపేది మీరే.. నివాళులర్పించేది మీరే’అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాహుల్ నివాళులు అర్పించినంత మాత్రన కాల్చిన గాయాలను మాన్పలేరని చెప్పారు. పార్లమెంట్లో ఎప్పుడైనా ప్రశ్నించారా? తెలంగాణ హక్కుల గురించి ఒక్కరోజైనా పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడలేదని హరీశ్ విమర్శించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని అడగలేదని చెప్పారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ప్రాణహిత, పాలమూరులకు హోదా గురించి ఎందుకు మరిచారని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై సైతం రాహుల్ ఇప్పటివరకు నోరుమెదపలేదన్నారు. తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు పూర్తి మద్దతిచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్న రాహుల్, తెలంగాణలోని వాణిజ్య, వ్యాపారులకు సమాన రాయితీలపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి అర్హత లేదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, అది అర్థమయ్యే ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని చెప్పారు. విద్యుత్, వ్యవసాయంలో దేశానికే ఆదర్శం కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు, విత్తనాలు, ఎరువుల కొరత, రుణాల కోసం ధర్నాలు, లాఠీచార్జీలే గుర్తొస్తాయని హరీశ్ విమర్శించారు. సాగు, తాగు, విద్యుత్, వ్యవసాయానికి ధీమా కల్పించ డంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివి కూడా నెరవేర్చాం. రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్రప్రభుత్వ పనితీరు చూసి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లలో 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చాం. రూ.12 వేల కోట్లు రైతుబంధుకు ఖర్చు చేస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా? ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా తెలంగాణ ఉంది. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తయిందా.. దేశాన్ని సుదీర్ఘంగా పాలించి ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపిందా’అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, అందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్కు భంగపాటు తప్పదని హరీశ్ హెచ్చరించారు. -
అనుమతి నిరాకరణపై కాంగ్రెస్ గుస్సా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రాకుండా అనుమతి నిరాకరించడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నిర్బంధ, నియంత పాలనకిది నిదర్శనమని ధ్వజమెత్తారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు రాష్ట్రానికి వస్తుంటే ఆహ్వానించాల్సింది పోయి అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల సంగతేంటని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వర్సిటీలో రాజకీయ నాయకుల ప్రసంగాలను అనుమతించవద్దన్న ఓయూ ఉన్నతస్థాయి నిర్ణయాన్ని రాహుల్ విషయంలో అమలుపై తప్పుపట్టారు. శనివారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ, పీఏసీ చైర్పర్సన్ గీతారెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడారు. ఇనుప కంచెలు దాటుకొని వెళతాం రాహుల్ను ఓయూలోకి అనుమతించకపోవడం శోచమనీయం. విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునేందుకే రాహుల్ రావాలని భావించారు. ఓయూ నిషేధిత ప్రాంతం కాదు. ఇప్పుడు ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదు. కానీ భవిష్యత్తులో మాత్రం తమను అడ్డుకోలేరు. పోలీస్ బలగాలను, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లి విద్యార్థులను కలుస్తాం. –భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీజేపీ బీ–టీమ్ టీఆర్ఎస్ బీజేపీకి టీఆర్ఎస్ బీ–టీమ్గా పనిచేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. చైతన్య, నారాయణ కాలేజీల్లో టీఆర్ఎస్ నేతలు వాటాలు తీసుకుంటున్నారు. ఎస్సారెస్పీ నీళ్లడిగితే, రైతులను ప్రభుత్వం నిర్బంధిస్తోంది. రాహుల్ పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తోంది. –మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి రాహుల్కు భయపడే.. రాహుల్కు భయపడే ఓయూ పర్యటనను సీఎం కేసీఆర్ అడ్డుకున్నరు. కేసీఆర్ ఇప్పటికైనా మనసు మార్చుకుని రాహుల్ ఓయూ పర్యటనకు అనుమతివ్వాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో విద్యార్థులే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. ఎన్నికలు డిసెంబర్లో వచ్చినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే. –గీతారెడ్డి, పీఏసీ చైర్పర్సన్ తెలంగాణలో నియంత పాలన అతిథిని గౌరవించడం తెలంగాణ సంస్కృతి. కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు వస్తుంటే అవమానిస్తున్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోంది. ఓయూలో కనీసం అడుగుపెట్టే దమ్ములేని కేసీఆర్ రాహుల్ పర్యటనను అడ్డుకోవడం శోచనీయం. తెలంగాణ కేసీఆర్ జాగీరుకాదు. –వి.హనుమంతరావు, మాజీ ఎంపీ ఇది ప్రజాస్వామ్యమా? ఉస్మానియా వర్సిటీలో రాహుల్గాంధీ సభకు అనుమతినివ్వకపోవడం కేసీఆర్ మార్కు ప్రజాస్వామ్యమా? రాహుల్ చొరవతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఆయనకిచ్చే గౌరవం ఇదేనా? రాహుల్ పర్యటన అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. –పొంగులేటి సుధాకర్రెడ్డి, సీఎల్పీ ఉపనేత -
ఇనుప కంచెలను దాటుకుని వెళ్తాం
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం నిషేధిత ప్రాంతం కాదు.. అందులో ఉన్నవారు తీవ్రవాదులు కారు. ఇనుప కంచెలు దాటుకుని వెళ్లి మరి వారిని కలుస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వారు.. దేశానికి దిశానిర్దేశం చేసే అత్యద్భుత మానవ వనరులు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓయూలో విద్యార్థులను కలుస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడం శోచనీయం అన్నారు. రాహుల్ విద్యార్ధులను కలుస్తానన్నది వారితో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకునేందుకే అని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతివ్వలేదని, ఇలా చేయడం విద్యార్థుల ఆత్మాభిమానాన్ని కించపరచడమేనని ఆరోపించారు. ఇప్పుడు ఓయూలో పర్యటనకు అనుమతి ఇవ్వడంలేదు కానీ భవిష్యత్తులో మాత్రం తమను అడ్డుకోలేరని తెలిపారు. పోలీస్ బలగాలను, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లి మరి విద్యార్థులను కలుస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోరారు. మహిళల సమస్యలపై ప్రధాన చర్చ తెలంగాణ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ పలు సమస్యలపై మాట్లాడతారని భట్టి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తారన్నారు. తొలుత రాహుల్ గాంధీ అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం సరూర్ నగర్ స్టేడియంలో విద్యార్థి, నిరుద్యోగుల గర్జన సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సోనియా గాంధీ త్యాగాలకు సిద్ధపడి తెలంగాణ ఇచ్చింది ఇక్కడి ప్రజల కోసమే కానీ కేసీఆర్ కుటుంబం కోసం కాదని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. -
ఓయూలో రాహుల్కు నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీని ఉస్మానియా యూని వర్సిటీ లోపలికి అనుమతించే విషయంపై సస్పెన్స్ నెలకొంది. యూనివర్సిటీల్లోకి రాజకీయ నాయకులు ప్రసంగాలు అనుమతించవద్దన్న ఉన్నత స్థాయి నిర్ణయాన్ని రాహుల్ విషయంలో అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14న మధ్యాహ్నం 2 నుంచి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘాలు నిర్ణయించి ఈ మేరకు అనుమతి కోసం శనివారం వైస్ చాన్స్లర్కు వినతిపత్రం సమర్పించాయి. దీనికి ప్రతిగా కొన్ని విద్యార్థి సంఘాలు రాహుల్ వస్తే అడ్డుకుంటా మని ఆదివారం ర్యాలీ నిర్వహించాయి. దీంతో ఆర్ట్స్ కాలేజీ సమీపంలో నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఠాగూర్ ఆడిటోరియంలో ‘భారత్లో విద్య– ఉపాధి’అనే అంశంపై రాహుల్తో ఉపన్యాసం ఇప్పించేందుకు అనుమతివ్వాలని వీసీని కోరా లని కొన్ని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం భారీ ర్యాలీగా వెళ్లి వీసీకి మరో వినతిపత్రం సమర్పించనున్నాయి. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: వీసీ రాహుల్గాంధీ ఓయూలో సభ నిర్వహించేందు కు అనుమతించాలని కొన్ని విద్యార్థి సంఘాలు ఇచ్చిన విజ్ఞాపనపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని వీసీ రామచంద్రం తెలిపారు. ఆయన ఆదివారం సాక్షితో మాట్లాడుతూ.. రాహుల్కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించే స్థితి లేదని, ఆయన నిజాం కాలేజీ లేదా కోఠి ఉమెన్స్ కాలేజీల్లో నిర్వ హించుకునే అంశాలను పరిశీలిస్తామన్నారు. -
ఓయూలో రూ.20 కోట్లతో ట్రైనింగ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నా సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో ఇంటర్వ్యూల్లో రాణించలేక పోతున్నారు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ దుస్థితికి తెరదించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిక్షణ ఇవ్వనున్నారు. అధ్యాపకులకే కాకుండా ఇప్పటికే ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న విద్యార్థులకూ శిక్షణ ఇచ్చి, ఫ్యూచర్ టెక్నాలజీపై వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందుకోసం ‘సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యూనివర్సిటీ పాలక మండలి ఇందుకు అవసరమైన ఐదెకరాల భూమిని కేటాయించింది. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఇందులో భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, భవిష్యత్తులో బిల్డింగ్ నిర్వహణ, ఇతర అబివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లు కార్పస్ఫండ్గా జమ చేయనున్నారు. ఫ్యూచర్ టెక్నాలజీపై శిక్షణ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇటీవలే వందేళ్ల ఉత్సవాలను పూర్తి చేసుకుంది. ఇక్కడి ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటివరకు పాతిక వేల మందికి పైగా విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో పదివేలకుపైగా వివిధ దేశాల్లో మంచి హోదాల్లో స్థిరపడ్డారు. ఇంజనీరింగ్ అలుమ్నీ అసోసియేషన్లో ఇప్పటికే ఆరువేల మందికిపైగా సభ్యత్వం పొంది ఉన్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ వీరంతా ఉస్మానియా క్యాంపస్ను సందర్శించారు. వర్సిటీలో అలుమ్నీ అసోసియేషన్ తరపున ఏదైనా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏటా లక్ష మందికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికి వస్తున్నారు. వీరిలో ఉపాధి పొందుతుంది చాలా తక్కువే. విద్యార్థులు పారిశ్రామిక, భవిష్యత్తు సాంకేతిక అవసరాలపై ముందే శిక్షణ ఇస్తే.. ఇంటర్వ్యూల్లో సులభంగా రాణించగలుగుతారని భావించారు. ఇక్కడ కేవలం ఉస్మానియా వర్సిటీలో చదువుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులకే కాకుండా తెలంగాణలోని ఇతర యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులకు, అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో... ఇంజనీరింగ్ ట్రైనింగ్ సెంటర్ భవనాన్ని సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 40 గదులతో పాటు నాలుగు సెమినార్ హాళ్లు, ఏడెనిమిది క్లాసు రూమ్లు నిర్మించనున్నారు. విదేశాల నుంచి వచ్చే అతిథులు, పూర్వ విద్యార్థులు బస చేసేందుకు అవసరమైన గెస్ట్హౌస్ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ కోసం అవసరమై కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు ఈ భవనానికి సమీపంలో ఉన్న మోయిని చెరువును అభివృద్ధి చేసి కబ్జారాయుళ్ల బారి నుంచి రక్షించనున్నారు. ఇదిలా ఉంటే ఈ భవనం కోసం కేటాయించిన భూమిలో ఏపుగా పెరిగిన భారీ చెట్లను సైతం నరికి వేయడం వివాదాస్పదంగా మారింది. క్యాంపస్లో ప్రధాన రహదారి వెంట ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ.. వాటిని కేటాయించకుండా ఏపుగా చెట్లు పెరిగిన ప్రాంతాన్ని ఈ భవనానికి కేటాయించడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఓయూలో శేఖర్ కమ్ముల సందడి
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో సినీ దర్శకులు శేఖర్ కమ్ముల సందడి చేశారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గత మూడు వారాలుగా నిర్వహిస్తున్న ఇండక్షన్ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన శేఖర్ కమ్ముల విద్యార్థులతో అనేక విషయాలు పంచుకున్నారు. సమయం వృథా చేసుకోకుండా, చదవుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సమీరఫాతిమా, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణయ్య, పీజీఈసెట్ కో–కన్వీనర్ ప్రొ.రమేష్బాబు, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రొ.ఉమామహేశ్వర్, కోఆర్డినేటర్ ప్రొ.శివరామకృష్ణ, డాక్టర్ మేడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్ల వెలుగు.. సమస్యల్లో నలుగు
సాక్షి, హైదరాబాద్: రాజసం ఉట్టిపడే కళ... వందేళ్ల చారిత్రక నేపథ్యం... పన్నెండు వందల ఎకరాల విస్త్రీర్ణం... న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు... 700పైగా అనుబంధ కాలేజీలు... 12 ఫ్యాకల్టీలు, 54 కోర్సులు... నాలుగు వేల మంది సిబ్బంది... ఇరవై రెండు హాస్టళ్లు, ఏడు వేల మందికిపైగా విద్యార్థులు... ఇదీ మన ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యం. ఉన్నత విద్యలో ఒకప్పుడు అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన ఈ విద్యాకుసుమం ప్రస్తుతం పలు సమస్యలతో కునారిల్లుతోంది. పాలకులు చూపుతున్న వివక్ష, అధికారుల అలసత్వం వల్ల వందేళ్ల ప్రతిష్టకు మసకబారుతోంది. వర్సిటీలో 1,264 అధ్యాపక పోస్టులకు 732 ఖాళీగా ఉన్నాయి. 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసరూ లేరు. కోటి ఆశలతో కొంగొత్త ఆశయాలతో తొలిసారిగా యూని వర్సిటీలోకి అడుగుపెట్టబోతున్న కొత్త(పీజీ ఫస్ట్ ఇయర్)విద్యార్థులకు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నియామకాల్లేవు... వర్సిటీలోని అన్ని విభాగాల్లో దాదాపు 60 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి విభాగంలో ప్రొఫె సర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను 1ః2ః4 నిష్పత్తిలో భర్తీ చేయాల్సి ఉంది. వర్సిటీ చరిత్రలో దాదాపు పదిహేనేళ్లుగా నియామకాల్లేవు. ఇరవై ఏళ్ల క్రితం వర్సిటీలో దాదాపు 1,264 మంది అధ్యాపకులు పనిచేసేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య 532కి చేరింది. 732 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. 12 విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. తమిళం, మరాఠి, కన్నడ, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్, కాంపిటీషనల్ జియోఫిజిక్స్, ఫుడ్ అండ్ టెక్స్టైల్స్ కోర్సుల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో అకాడమిక్ కన్సల్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. అధ్యాపకుల కొరత వల్ల పరిశోధన అభ్యర్థులకు సీటు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో 17 వేల మందికిపైగా పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయగా, వీరిలో కనీసం 300 మందికైనా సీటు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. పరీక్షల విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ విభాగంలో 300 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కిక్కిరిసిపోతున్న హాస్టళ్లు... ఉస్మానియా విద్యార్థులను వసతిగృహాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. 22 హాస్టళ్లు ఉండగా, వీటిలో నాలుగువేల మందికి వసతి కల్పించాలి. కానీ, ఏడు వేలమందికిపైగా ఉంటున్నారు. సరిపడే బాతురూముల్లేక ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తోందని పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచాలు, కుర్చీలు, స్టడీ టేబుళ్లు, ర్యాక్లు సరిపడా లేవు. నిజాం కళాశాల, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థినులతోపాటు పేమెంట్ కోటాలో జాయిన్ అయినవారికి వసతి దొరకడం గగనంగా మారింది. తొలి విడతలో 15,800 సీట్లు భర్తీ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 17,500 పీజీ సీట్లు ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్లో భాగంగా ఇప్పటివరకు 15,800 సీట్లు భర్తీ చేశారు. జూలై 28లోగా వీరంతా ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మిగిలిన సీట్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్న రెండో విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నారు. ఎన్ఆర్ఐ, ఇతర కోటాల కింద చేరే విద్యార్థులకు వసతి కష్టంగా మారింది. దీంతో వారంతా వర్సిటీ బయటే ఉండాల్సి వస్తోంది. -
పీహెచ్‘డీ’లా
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీలు డీలా పడుతున్నాయి. అడ్మిషన్ పొందిన వారిలో సగం మంది కూడా సకాలంలో పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. ప్రత్యక్షంగా వర్సిటీకి చెడ్డపేరు తేవడంతో పాటు పరోక్షంగా ఇది వివిధ ఫెలోషిప్లపై ప్రభావం చూçపుతోంది. అడ్మిషన్ పొందుతున్న ప్రతి పది మందిలో ఒకరిద్దరు మాత్రమే నిర్దేశిత గడువులోగా థీసిస్ సమర్పిస్తుండగా, 80 శాతం మంది గడువు ముగిసిన తర్వాతే అందజేస్తున్నారు. పరోక్షంగా ఇది వర్సిటీకి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు పరిశోధనలు, ఫెలోషిప్లపై తీవ్రప్రభావం చూపుతోంది. సాక్షి, హైదరాబాద్ : పీహెచ్డీ చేయడం ఒకప్పుడు చాలా గొప్పగా భావించేవారు. వీరికి దేశవిదేశాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ ప్రస్తుతం అభ్యర్థుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. కేవలం ఫెలోషిప్లు సహా హాస్టల్ వసతి కోసమే పీహెచ్డీ అడ్మిషన్ అన్నట్లుగా తయారైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారిలో సగం మందికి కూడా పరిశోధన పత్రాలు సమర్పించడం లేదు. మరికొంత మంది ఐదేళ్లలో పూర్తి చేయాల్సిన పీహెచ్డీ కోర్సును ఏడెనిమిదేళ్ల వరకు పొడిగించుకుంటున్నారు. పీహెచ్డీ అడ్మిషన్ దొరికితే చాలు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు హాస్టల్లో ఉచితంగా వసతి పొందడంతో పాటు ప్రైవేటుగా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చని భావిస్తుంటారు చాలా మంది. అందుకే ఏ కోర్సుకు లేనంత డిమాండ్ పీహెచ్డీకి ఉంది. నోటిఫికేషన్ జారీ మొదలు ప్రవేశాల ముగింపు వరకు ఎన్నో ఆరోపణలు.. పోరాటాలు... తీరా సీటు లభిస్తే కనీసం 30 శాతం మంది కూడా ఇచ్చిన గడువులోపు పరిశోధన పత్రాలు పూర్తి చేయడం లేదు. పీహెచ్డీలో చేరిన ఒక్కో సైన్స్ విద్యార్థికి నెలకు రూ. లక్షకుపైనే ఖర్చు అవుతోంది. జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్లో ప్రతిభ చూపిన వారికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)కింద ఉపకారవేతనం అందిస్తుంది. పీజీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్లు అందిస్తుంది. గతంలో ఓయూకి ఏటా 60–70 రాజీవ్గాంధీ ఫెలోషిప్లు వస్తే ప్రస్తుతం 30–40కి మించడం లేదు. పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారిలో చాలా మంది మధ్యలో మానేస్తుండటం, సకాలంలో పరిశోధనలు పూర్తి చేసి ధీసిస్ సమర్పించక పోవడం వల్లే ఈ ఫెలోషిప్ల కుదింపుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రీ పీహెచ్డీలో 30 శాతం మంది పీహెచ్డీ ప్రవేశాల తర్వాత ఏడాది లోపు ప్రీపీహెచ్డీ పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో రెండు సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో 50 శాతం మార్కులు రావాలి. అభ్య ర్థిలో పరిశోధనాంశంపై ఏ మేరకు అవగాహాన పెరిగిందో ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. అయితే ప్రీపీహెచ్డీ పరీక్షలో 30 శాతం మంది తప్పుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. గతంలో రెగ్యులర్ పీహెచ్డీ కోర్సు మూడేళ్లు, పార్ట్టైమ్ కోర్సు నాలుగేళ్లు ఉండేది. ఆ తర్వాత మూడేళ్ల కోర్సును నాలుగేళ్లకు, నాలుగేళ్ల కోర్సును ఐదేళ్లకు పెంచారు. పీహెచ్డీ అడ్మిషన్ పొంది నిర్ధేశిత గడువులో పరిశోధన పత్రాలు సమర్పించిన వారు 40 శాతం మించలేదు. అధిక శాతం 6– 10 ఏళ్ల లోపు పూర్తి చేస్తున్నవారే. పీహెచ్డీలో చేరిన ఆర్ట్స్, సైన్స్ కోర్సు విద్యార్థుల్లో 50 శాతం మంది మధ్యలోనే మానేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది పీహెచ్డీ కోర్సుల్లో రిజిస్టరైన వారు ఫ్యాకల్టీ రిజిస్టరైన పేరు అభ్యర్థులు ఆర్ట్స్ 564 కామర్స్ 218 ఎడ్యుకేషన్ 76 ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 142 లా 2 మేనేజ్మెంట్ 367 ఓరియంటల్ లాంగ్వేజ్ 5 సైన్స్ 1191 సోషల్ సైన్స్ 443 ఫార్మసీ 31 గత విద్యా సంవత్సరం పూర్తి అయినవి సైన్స్ 181 ఇంజనీరింగ్ 48 ఇతరులు 137 -
వందేళ్ల ఉస్మానియా.. వసతులు ఇంతేనయా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ల చరిత్ర గల ఈ వర్సిటీ హాస్టళ్లు మాత్రం వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. క్యాంపస్ కాలేజీల్లో బీఈడీ, ఎంఈడీ, ఐదేళ్ల లాకోర్సు, ఎంబీఏ, ఎంకామ్, పీహెచ్డీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల విద్యార్థులకు వసతి గృహాలే లేవు. విధిలేని పరిస్థితిలో వీరికి ఇతర భవనాల్లో సర్దుబాటు చేస్తున్నారు. ఎంకామ్ ఐఎస్, ఫోరెన్సిక్సైన్స్ సహా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులు హాస్టల్ వసతి లేక బయటే ఉంటున్నారు. విదేశీ మహిళా విద్యార్థునుల పరిస్థితీ ఇలాగే ఉంది. పడుకునేందుకు సరిపడినని మంచాలే కాదు.. కనీసం కూర్చొనేందుకు కుర్చీలు, చదువు కునేందకు స్టడీ టేబుళ్లు, ర్యాక్లు కూడా లేవు. ఉన్న కొన్నింటినీ సీనియర్లే(నాన్బోర్డర్స్) ఆక్రమించు కోవడంతో హాస్టల్లో కొత్తగా చేరిన జూనియర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. అంతేగాక స్నానానికి సరిపడు గదులు లేకపోవడంతో ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ మెస్సుల్లో కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. ఈ నెల 23 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త విద్యార్థులకు వసతి కేటాయింపు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఉన్న హాస్టల్ భవనాల్లో ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. గదుల పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. చిన్నపాటి వర్షానికే హాస్టల్ గదులు నదులను తలపిస్తున్నాయి. క్యాంపస్లో 22 వసతి గృహాలు ఉండగా, వీటిలో 18 బోయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పీహెచ్డీ, ఇంజినీరింగ్, టెక్నాలజీ, బీఈడీ, లా, మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. వర్సిటీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్నా.. ఇప్పటికీ నిజాం కాలంనాటి రేకుల షెడ్లలోనే విద్యార్థులు తలదాచుకునే పరిస్థితి దాపురించింది. నిర్దేశించిన విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండడంతో ఆయా హాస్టళ్లలో శానిటేషన్ నిర్వహణ అధికారులకు ఇబ్బందిగా మారింది. మెస్సులను ఆధునికీకరించక పోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. ఇప్పటికీ కట్టెల పొయ్యిలపైనే వంటలే చేస్తున్నారంటే ఇక్కడి పరిస్థితి ఎంత వెనుకబడి ఉందో అర్ధం చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో కట్టెలు తడిసిపోయి వాటి నుంచి పొగతో కళ్ల మంటలు తప్పడం లేదు. జైళ్లను తలపిస్తున్న లేడీస్ హాస్టల్ గదులు గత పదేళ్లతో పోలిస్తే ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థినుల సంఖ్య రెట్టింపైంది. గతంలో అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తి 60:40గా ఉండగా ప్రస్తుతం అమ్మాయిల సంఖ్య 60 శాతానికి పెరిగింది. క్యాంపస్ కాలేజీల్లో చదువుతున్న వారితో పాటు అనుబంధ కాలేజీలైన కోఠి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ, ఖైరతాబార్ పీజీ కాలేజీల్లో చదువుతున్న యువతులకు కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్లో నాలుగు హాస్టల్ భవనాలు వీరికి కేటాయించగా వాటిలో 3800 మంది ఉంటున్నారు. గదుల కొరత వల్ల ఒక్కోదాంట్లో ఆరు నుంచి ఎనిమిది మంది ఉండాల్సి వస్తోంది. వసతికి నోచుకోలేని విదేశీ యువతులు ఉస్మానియా పరిధిలోని వివిధ కాలేజీల్లో 4 వేల మందికి పైగా విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి నుంచి వర్సిటీకి ఏటా రూ.15 కోట్ల ఆదాయం వస్తోంది. వీరిలో వెయ్యి మందికిపైగా క్యాంపస్లోనే చదువుతున్నప్పటికీ ఏ ఒక్కరికీ ఇక్కడి హాస్టళ్లలో వసతి కల్పించలేదు. ఫలితంగా వీరంతా బయట గదులను అద్దెకు తీసుకుని ఉంటున్నామని వర్సిటీలోని ఇరాక్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్బాస్ చెప్పారు. విదేశీ విద్యార్థులకు కూడా వర్సిటీలో వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ‘పీహెచ్డీ’ వారికీ పాట్లు తప్పడం లేదు.. వర్సిటీ నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్డీ విద్యార్థికి ఓ గదిని కేటాయించాలి. 120 గదుల సామర్థ్యం ఉన్న న్యూ పీజీ హాస్టల్లో పీహెచ్డీ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ఇరవై ఏళ్ల వరకు ఒక రూమ్కు ఒక విద్యార్థే ఉండేవారు. కొత్త హాస్టళ్లు లేకపోవడం, గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిశోధక విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఒక్కో గదిలో ఇద్దరి నుంచి ముగ్గురు సర్దుకుంటున్నారు. ఇక 101 గదులున్న ఎన్ఆర్ఎస్ హాస్టల్లో 300 మందికి పైగా ఉంటున్నారు. అన్ని హాస్టళ్లలోను విద్యార్థుల నిష్పత్తికి తగినన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేక తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన వారికి వసతి గగనమే అయింది. ఉస్మానియాలో కోర్సులు, విద్యార్థులు.. వందేళ్ల చరిత్ర గల పురాతన వర్సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 720 అనుబంధ కాలేజీలు, 87 దేశాలకు చెందిన 5155 మంది విద్యార్థులు, 3.5 లక్షల మంది దేశీయ విద్యార్థులు, 27 యూజీ పోగ్రామ్స్, 68 పీజీ కోర్సులు, 24 డిప్లొమా కోర్సులు, 15 సర్టిఫికెట్ కోర్సులు, రెండు రీసెర్చ్ పోగ్రామ్స్ ఉన్న వర్సిటీ ఇది. క్యాంపస్లో 12 ఫ్యాకల్టీలు, 53 డిపార్ట్మెంట్లు, 560 మంది టీచింగ్ స్టాఫ్, 1695 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, 446 మంది కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్, 16 రీసెర్చ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. కేవలం ఒక్క క్యాంపస్లోనే ఏడు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికోసం 20 వసతి గృహాలు ఉండగా, వీటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో పది హాస్టల్స్ నిర్మించాలి ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని మరో 10 హాస్టళ్లను నిర్మించాలి. గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో హాస్టల్స్ సమస్యలు తక్కువగా ఉండేవి. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఎంబీఏ, లా, బీఈడీ, ఎంఈడీ కోర్సుల విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలి. – మారం శ్రీనివాస్, ఓయూ చాలా వరకు శిథిలమయ్యాయి ఓయూ క్యాంపస్ హాస్టళ్లు చాలావరకు శిథిలావస్తకు చేరుకున్నాయి. హాస్టల్ భవనాలు, గదులు, ఇతర మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలమయ్యారు. సమస్యల శాస్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. నాణ్యత, పౌష్టికాహరం, తాగునీటి వసతి కల్పించాలి. – కాంపెల్లి శ్రీనివాస్, ఓయూ -
జవాబు పత్రాల దగ్ధంపై విద్యార్థుల్లో ఆందోళన
-
నాలుగు సబ్జెక్టులకు మళ్లీ పరీక్షలు?
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలో షార్ట్సర్క్యూట్ కారణంగా దగ్ధమైన జవాబు పత్రాలకు సంబంధించిన సబ్జెక్టులకు తిరిగి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని వర్సిటీ పాలక వ ర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ జువాలజీ, మ్యాథమెటిక్స్ సహా మరో 2 సబ్జెక్టుల జవాబు పత్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ప్రొ.శివరాజ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం షార్ట్సర్క్యూట్ జరిగిన గదిని పరిశీలించింది. అగ్నికి దగ్ధమైన పేపర్ల, ఫైర్ ఇంజన్ వదిలిన నీటి ద్వారానే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు గుర్తించింది. కాలిపోయిన వాటిలో బీఎస్సీ సెకండియర్ సెమిస్టర్ జవాబు పత్రాలే ఉండటం అధికారులకు ఊరట కలిగించే అంశమే అయినా.. ఇప్పటికే ఒకసారి పరీక్ష రాసినవారు మరోసారి రాయాల్సి రావడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీసి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏళ్లుగా కేబుళ్లు మార్చకపోవడంతోనే.. ఓయూ పరిపాలనా భవనం సహా కాలేజీ, హాస్టల్ భవనాలన్నీ ఏళ్ల క్రితం నిర్మించినవే. ఆయా భవనాల్లో అప్పటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్లైన్లను ఏర్పాటు చేశా రు. ఫ్యాన్లు, లైట్ల సామర్థ్యానికి సరిపడే కేబు ళ్లు మాత్రమే వేశారు. ఆ తర్వాత కూలర్లు, ఏసీలు, కంప్యూటర్లు వచ్చి చేరాయి. పెరిగిన విద్యుత్ వినియోగానికి తగ్గట్టు కేబుళ్ల సామర్థ్యం పెంచాల్సి ఉన్నా.. చర్యలు చేపట్టలేదు. దీంతో షార్ట్సర్క్యూట్లు చోటుచేసు కుంటున్నాయి. శతాబ్ది ఉత్సవాల సమయం లో ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. వీటిని భవనాల పునరుద్ధరణకు కాకుండా ఇతర అవసరాలకు వాడారు. కమిటీ రిపోర్టు మేరకే నిర్ణయం ఈ అగ్నిప్రమాదంపై కమిటీ విచారణ చేపట్టింది. గురువారం కల్లా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఏఏ సబ్జెక్టుల జవాబు పత్రాలు కాలిపోయాయి? ఎన్ని కాలిపోయాయి? వంటి వివరాలు తెలుస్తాయి. కమిటీ ఇచ్చే రిపోర్టు మేరకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అంశాన్ని ఆలోచిస్తాం. – వీసీ, ప్రొఫెసర్ రామచంద్రం -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. హత్యాయత్నం
తార్నాక : పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్ల పాటు స్నేహం చేసి అమె నుంచి అందినకాడికి డబ్బులు తీసుకుని మరో పెళ్లి చేసుకోవడమే కాకుండా మరో ఇద్దరితో కలిసి యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరించారు. కాచిగూడ ఏసీపీ నర్సయ్య, ఓయూ ఇన్స్పెక్టర్ జగన్ మంగళవారం వివరాలు వెల్లడించారు. ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫె సర్గా పని చేస్తున్న కిరణ్కుమార్ అదే విభాగంలో పీహెచ్డీ చేస్తున్న మరో అసిస్టెంట్ ప్రొఫెసర్తో స్నేహం కుదిరింది. ఇద్దరి కులాలు ఒకటే కావడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పదేళ్ల పాటు ఇద్దరూ కలిసి తిరిగారు. ఈ నేపథ్యంలో కిరణ్కుమార్ ఆమె వద్ద రూ.6లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బుల విష యమై సదరు యువతి కిరణ్కుమార్పై ఒత్తిడి చేయగా, పెళ్లి చేసుకుందామని, పెళ్లయిన తరువాత ఇస్తానని చెప్పాడు. పెళ్లి విషయమై వాయి దాలు వేస్తున్నాడు. సదరు యువతికి మరో యూ నివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం రావడంతో ఆమె అక్కడికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన కిరణ్కుమార్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు ఓయూ క్యాంపస్కు వచ్చి కిరణ్ను నిలదీయగా, తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, తన భార్యను చంపి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు. అంతేగాక ఆమె పీహెచ్డీ డిజర్టేషన్ వర్క్ పూర్తి చేస్తానంటూ మరికొంత డబ్బులు తీసుకున్నాడు. గత నెల 18న తన పీహెచ్డీ విషయమై క్యాంపస్కు వచ్చి వెళుతున్న ఆమెను ఓయూ ప్రెస్ వద్ద అడ్డుకున్న కిరణ్కుమార్ మరో ఇద్దరితో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఇంటికి వెళ్లి దాడి చేయడంతో బాధితురాలు గత నెల 19న ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సమాచారం అందడంతో ఓయూ అధికారులు అ తడిని సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న కిరణ్ భద్రాచలంలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ రంజిత్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు. మంగళవారం అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
ఓయూలో షార్ట్ సర్క్యూట్
హైదరాబాద్: ఓయూ క్యాంపస్ పరీక్షల నియంత్రణ విభాగం జవాబు పత్రాల మూల్యాంకన (స్పాట్ వాల్యుయేషన్) కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలు కొన్ని కాలిపోగా.. మరికొన్ని ఫైరింజన్ నీటికి తడిసిపోయాయి. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ తలెత్తగా.. సెక్యూరిటీ గార్డు అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు ఫైరింజన్ను పిలిపించి ఘోర ప్రమాదాన్ని నివారించగలిగారు. అగ్ని ప్రమాదాన్ని అరికట్టకలిగారు కాని ఫైరింజన్ నీటికి వేలాది జవాబు పత్రా లు తడిసి ముదై్ద, మూల్యాంకనానికి పనికి రాకుండా పోయాయి. కంట్రోలర్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు వీసీ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. చిన్న ప్రమాదమే: కంట్రోలర్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో స్పందించి అరికట్టామని కంట్రోలర్ ప్రొ.కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన గదిలో గత నెల 28, 29, 30, 31 తేదీల్లో జరిగిన బీఎస్సీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల జవాబు పత్రాలున్నాయ న్నారు. వాటిలో 5 శాతం మాత్రమే కాలిపోయాయన్నారు. అనుకోకుండా జరిగిన ఘట న కాబట్టి తమ తప్పిదం ఏమీ లేదన్నారు. కాగా, అగ్నిప్రమాదంపై విచారణ జరిపేందుకు క్యాంపస్లోని సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.శివరాజ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్టు వీసీ రామచంద్రం తెలిపారు.