త్రోబాల్ విజేత భారత్ | India won throw ball Test series | Sakshi
Sakshi News home page

త్రోబాల్ విజేత భారత్

Published Sun, Dec 1 2013 11:29 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ త్రోబాల్ టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ త్రోబాల్ టెస్టు సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం ముషీరాబాద్ ప్లేగ్రౌండ్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-1 (25-20, 23-25, 25-07, 25-20)తో లంకపై విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లోనూ దుమ్మురేపారు. ప్రత్యర్థి జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పాయింట్లు సాధించారు.
 
 మహ్మద్ అక్విద్ 15, అశోక్ 12 పాయింట్లు చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. లంక తరఫున మర్హిగల్లా 10, బండారా 7 పాయింట్లు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ పోటీల ముగింపు వేడుకలకు రాష్ట్ర మహిళల శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నీ అర్గనైజింగ్ చైర్మన్ ఎస్.కె.గుప్తా, అధ్యక్షుడు డి. శ్రీధర్, సెక్రటరీ ఎం.బి.నర్సింహులు పాల్గొన్నారు.
 
 భారత జట్టుకు ట్రోఫీని అందజేస్తున్న రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement