శ్రమించి గెలిచారు | Saina, Kashyap and Srikanth good opening in china opening | Sakshi
Sakshi News home page

శ్రమించి గెలిచారు

Published Thu, Nov 13 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

శ్రమించి గెలిచారు

శ్రమించి గెలిచారు

గట్టి ప్రత్యర్థులు ఎదురైనా... పట్టుదలతో పోరాడిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు.

రెండో రౌండ్‌లో సైనా, కశ్యప్, శ్రీకాంత్  చైనా ఓపెన్
 
 ఫుజౌ (చైనా): గట్టి ప్రత్యర్థులు ఎదురైనా... పట్టుదలతో పోరాడిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సైనా 21-14, 19-21, 21-17తో సయాక తకహాషి (జపాన్)పై గెలిచింది. తకహాషిపై సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం.

పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-11, 9-21, 21-15తో హైదరాబాద్‌కే చెందిన తన సహచరుడు గురుసాయిదత్‌పై గెలుపొందగా... కశ్యప్ 24-22, 19-21, 21-15తో నాన్ వీ (హాంకాంగ్)ను ఓడించాడు.

మరో మ్యాచ్‌లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 10-21, 21-19, 18-21తో విక్టర్ అక్జెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 12-21, 15-21తో జియోలాంగ్ లియు-జిహాన్ కియు (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది. తకహాషితో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది.

రెండో గేమ్‌లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి తడబడి ఒకదశలో వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా ఒకదశలో 11-12తో వెనుకబడినప్పటికీ వెంటనే కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 16-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement