Srikanth
-
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పోలీసులు కౌన్సెలింగ్కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘గేమ్ ఛేంజర్’ గెటప్తో ఇంటికి వెళ్లా..అమ్మ షాకైంది: శ్రీకాంత్
శంకర్ గారితో పని చేయాలని ప్రతీ ఒక్క ఆర్టిస్ట్కు ఉంటుంది. గేమ్ చేంజర్ కథ ఆయన ఫస్ట్ హాఫ్ చెప్పినప్పుడు ఈ పాత్రను నాకు ఎందుకు చెబుతున్నారా? అని అనుకున్నాను.సెకండాఫ్ చెప్పిన తరువాత ఈ పాత్రను కచ్చితంగా నేనే చేయాలని అనుకున్నాను. నా కారెక్టర్ అంత బాగా ఉంటుంది. గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుంది’అన్నారు నటుడు శ్రీకాంత్.శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘గేమ్ ఛేంజర్’లో నా గెటప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా నాన్నగారి గెటప్ చూసే నాకు ఈ పాత్ర ఇచ్చారు. ఓ సారి ఆ గెటప్ వేసుకొని ఇంటికి వెళ్తే.. నన్ను చూసి మా అమ్మ షాకయ్యింది. అప్పుడే నా గెటప్ సరిగ్గా సెట్ అయిందని అర్థమైంది.→ నేను ఇంత వరకు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని నటించలేదు. కానీ అలాంటి మేకప్ ధరించి నటించడం చాలా కష్టం. చెమటలు పట్టినా మేకప్ మారిపోతుంది.ప్రోస్థటిక్ మేకప్కే నాలుగు గంటలు పట్టేది. నా పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. సినిమాకు ముఖ్యమైన క్యారెక్టర్ నాది. ఇంత మంది అవకాశం రావడం నా అదృష్టం.→ శంకర్ గారి పనితనం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చాలా సహనంతో ఉంటారు. అనుకున్నది అనుకున్నట్టు వచ్చే వరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ప్రతీ కారెక్టర్ను ఆయన నటించి చూపిస్తారు.→ గోవిందుడు అందరివాడేలే చిత్రంలో రామ్ చరణ్తో కలిసి పని చేశాడు. అప్పుడు రామ్ చరణ్ చాలా యంగ్. ఇప్పుడు చాలా ఎదిగాడు. గ్లోబల్ స్థాయికి ఎదిగాడు. అప్పన్న పాత్రను రామ్ చరణ్ పోషించిన తీరు చూస్తే అంతా షాక్ అవుతారు. చాలా కొత్తగా అనిపిస్తాడు.→ ప్రస్తుతం ఎలివేషన్స్తో పాటు కథను చెబితే బాగా ఆదరిస్తున్నారు. కొన్ని చిత్రాలు ఎలివేషన్స్తోనే ఆడుతున్నాయి. ఈ చిత్రంలో కథతో పాటు ఎలివేషన్స్ ఉంటాయి. ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అస్సలు మిస్ ఫైర్ కాదు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.→ అందరి డేట్లు సెట్ అవ్వకపోవడం వల్లే ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయింది. దాదాపు ఏడాది వేస్ట్ అయింది. దేవర షూటింగ్లో ఉన్నప్పుడు గేమ్ చేంజర్ కోసం అడిగారు. అలా అందరి డేట్లు సెట్ చేసుకుని షూటింగ్ చేసే సరికి ఆలస్యం అయింది.→ ప్రస్తుతం రెగ్యులర్ ఫిల్మ్స్ కాకుండా డిఫరెంట్ పాత్రలను ఎంచుకుంటున్నాను. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటు గట్టులో నటిస్తున్నాను. కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తున్నాను. సుష్మిత గోల్డెన్ బాక్స్లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. -
అల్లు అర్జున్ ను కలిసిన శ్రీకాంత్
-
రాజకీయ కక్షతోనే నాపై కేసు.. మీ అరెస్టులకు భయపడేది లేదు
-
గ్రాండ్గా ఆర్జీవీ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లిలో రష్మిక, విజయ్, కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
విభిన్నంగా శ్రీకాంత్ లుక్
‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయి దుర్గా తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఎస్డీటీ 18’ (వర్కింగ్ టైటిల్). రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్. ‘హను–మాన్’ వంటి బ్లాక్బస్టర్ మూవీ నిర్మించిన ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ‘ఎస్డీటీ 18’ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ్రీకాంత్ లుక్ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఎస్డీటీ 18’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చేయని పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు సాయి దుర్గా తేజ్. అలాగే శ్రీకాంత్ పాత్ర విభిన్నంగా ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ మూవీగా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్నాథ్. -
తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్.. ఏ ఓటీటీకి రానుందంటే?
ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్ ఉన్న సిరీస్లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్తో వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్డ్రాప్లో మిస్టరీ థ్రిల్లర్గా ఈ సిరీస్న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్బాస్ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సరికొత్త వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్ ఫ్లాట్ఫామ్లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushotstartelugu) -
నాని కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా
-
ఇంగితజ్ఞానం లేదా పవన్ కళ్యాణ్... టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
-
పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన మాజీ మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్
-
డైవర్ట్ చేయడానికే ఈ డ్రామాలు ..
-
బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే స్కెచ్ వేసిన నాని
-
ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్
‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది.కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు. -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
వారికి కూడా.. మీతో సమానమైన వాటా వస్తుంది!
నా భార్యతో విడాకులు తీసుకున్నాను. నా ఇద్దరు పిల్లలూ తల్లి వద్దనే ఉంటారు. మా తండ్రి గారు ఇటీవలే చనిపోయారు. ఆయన ద్వారా నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సి వస్తుందా? – శరత్ కుమార్, రాజమండ్రిమీ తండ్రి నుంచి మీకు సంక్రమించిన ఆస్తి ఆయన స్వార్జితమై ఉండి, వీలునామా ప్రకారం మీకు సంక్రమించి ఉంటే, సదరు ఆస్తిలో మీకు తప్ప మరెవరికీ ఎటువంటి హక్కూ ఉండదు. మీ తదనంతరం వీలునామా రాయకపోతే మాత్రమే పిల్లలకి చెందుతుంది. మీ తండ్రిగారు ఒకవేళ వీలునామా రాయకుండా మరణించినట్లయితే తన స్వార్జితం మొత్తం క్లాస్–1 వారసులు; అంటే చనిపోయిన వ్యక్తి సంతానానికి (ఎంత మంది ఉంటే అన్ని భాగాలు), భార్యకి – తల్లిగారికి సమానమైన హక్కు ఉంటుంది.అలాకాకుండా మీ తండ్రి గారికి వారి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి అయి వుంటే, కేవలం అలాంటి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి వరకు మాత్రమే మీ పిల్లలకు హక్కు ఉండే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీ పిల్లలు మీ వద్ద ఉంటున్నారా లేక వాళ్ల అమ్మతోనే ఉంటున్నారా అనేది అప్రస్తుతం. అలాగే మీ తండ్రి గారికి ఒకవేళ మీతో΄ాటు ఇతర సంతానం అంటే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, మీ అమ్మగారు, అలాగే మీ తండ్రిగారి తల్లిగారు (మీ నాయనమ్మ) ఉంటే వారికి కూడా మీతో΄ాటు సమానమైన వాటా లభిస్తుంది.స్త్రీల హక్కులను గౌరవిస్తూ వారికి రావలసిన న్యాయమైన వాటాని స్వచ్ఛందంగా ఇచ్చే పురుషులు తక్కువే! అందుకని తమ న్యాయమైన వాటా కోసం వేల సంఖ్యలో స్త్రీలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ‘తనకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇచ్చాము, కాబట్టి అక్కాచెల్లెళ్లకు ఇచ్చేది ఏమీ లేదు’ అనే ధోరణి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అది తప్పు! హిందూ వారసత్వ చట్టం 2005 సవరణ తర్వాత కొడుకులకు–కూతుళ్లకు ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది. ఒకవేళ మీకు గనక అక్క చెల్లెళ్లు ఉంటే వారికి చెందవలసిన న్యాయమైన వాటా అడగకముందే వారికి ఇచ్చేయండి. మీ పిల్లలకి మీ స్వార్జితం – మీ తండ్రిగారి స్వార్జితం ఇవ్వాలి అని నిబంధన లేదు కానీ, వారు మైనర్లు అయితే మాత్రం వారికి చట్టరీత్యా మీనుంచి మెయింటెనెన్స్ ΄÷ందే హక్కు ఉంటుంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిఇవి చదవండి: సింధు కన్సల్టింగ్ కోచ్గా లీ హ్యూన్ -
అవయవాల అమ్మకం కథ కంచికేనా?
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా షెట్పల్లికి చెందిన రేవెళ్లి శ్రీకాంత్ అవయవ దానం వెనుక ఉన్న మిస్టరీ వీడడం లేదు. శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందగా, అంబులెన్స్ నిర్వాహకులే శ్రీకాంత్ అవయవాలు అమ్ముకున్నారనే చర్చ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదికాస్త రోజు రో జుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఆగస్టు 6న ప్రమాదానికి గురైన శ్రీకాంత్ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చనిపోయాడు. అనంతరం అతడి అవయవాలు అంబులెన్స్ డ్రైవర్లే అమ్ముకున్నారనే చర్చ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్లు మొదటి నుంచీ అవయవాలు దానం చేయాలంటూ ప్రోత్సహించడం మృతుడి కుటుంబ సభ్యులకు అనుమా నం కలిగించింది. అవయవాలను ఎక్కువ ధరకు అమ్ముకొని తమకు తక్కువ డబ్బులు ఇప్పించారేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత నెల 13న ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో అదే నెల 14న ‘అవయవాలు అమ్ముకున్నారు’అనే శీర్షికన ‘సాక్షి’దినపత్రికలో కథనం ప్రచురితం కాగా, సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లోని కార్పొరేట్, కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గత నెల 19న స్థానిక ఏసీపీ కార్యాలయంలో అవయవాలు అమ్ముకున్నారనే కథనంపై డీసీపీ భాస్కర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అవయవాలు అమ్మకం జరగలేదని, కేవలం జీవాన్దాన్ అనే సంస్థకు శ్రీకాంత్ కుటుంబసభ్యుల ఒప్పందం మేరకు అవయవాలు దానం చేశారని వెల్లడిస్తూ శ్రీకాంత్ను ఆస్పత్రిలో చేరి్పంచడంలో కమీషన్ల కోసం వేర్వేరు ఆస్పత్రులకు తిప్పుతూ కాలయాపన చేసినందుకు, అవయవాలు అమ్ముకున్నారనే అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఆరోపణలు చేసినందుకు కిరణ్, నరేష్, శ్రావణ్, సాయిరాం, సాగర్లపై చీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్పై వదిలేశారు. అవయవాలు అమ్మకం జరగలేదనే విషయాన్ని తేల్చేశారు. రూ.3లక్షలు ఇచ్చింది ఎవరు..? శ్రీకాంత్ అవయవాలు అమ్మకం జరగకపోతే శ్రీకాంత్ మృతదేహాన్ని అప్పగించిన తర్వాత కార్పొరేట్ ఆస్పత్రి సర్జన్.. శ్రీకాంత్ భార్య స్వప్న, కుటుంబ సభ్యులను పిలిపించి ఖర్చులకు తీసుకోమని రూ.3లక్షలు ఇచి్చనట్టు చెబుతున్నారు. అవయవాలు దానం చేస్తే రూ.3లక్షలు ఇవ్వడం ఎందుకు, దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాంత్ను కరీంనగర్ ఆస్పత్రి నుంచి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ వెళుతున్న క్రమంలో అవయవాలు దానం చేసిన ఆస్పత్రి నుంచి యాదగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి కరీంనగర్ వైద్యులు సూచించిన ఆస్పత్రికి వెళ్లకుండా అడ్డుకొని మాయమాటలు చెప్పి ఆ ఆస్పత్రికి రప్పించుకున్నాడు. ఈ యాదగిరి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి సారించలేదు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఇచ్చింది ఎవరనేదానిపైనా పోలీసులు స్పష్టత ఇవ్వలేకపోయారు. రూ.3లక్షల ప్రస్తావన, శ్రీకాంత్ భార్య స్పప్న ఫోన్నంబర్ ఎలా వెళ్లిందనే దానిపై స్పష్టత ఇవ్వకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి దాటవేశారు. చివరకు కేసు విచారణ పూర్తి కాలేదని, అంబులెన్స్ నిర్వాహకులను మళ్లీ కస్టడీకి తీసుకొని శాస్త్రీయ ఆధారాలు సేకరించి ఈ కేసులో పూర్తి విచారణ చేపడుతామని పేర్కొనడం గమనార్హం. పూర్తిస్థాయి విచారణ ఏమైంది.. అవయవాలు అమ్ముకున్న కథ కంచికేనా అన్న చందంగా మారింది. విచారణ పేరిట రోజుకో మలుపు తిరుగుతోంది. శ్రీకాంత్ అవయవాలు ఎవరు..? ఎంతకు అమ్ముకున్నారనేది ఇంకా ప్రజల్లో చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. పోలీసులు మాత్రం విచారణ కొనసాగుతోందని చెబుతున్నారు. గత నెల 27న కరీంనగర్ ఆస్పత్రి నిర్వాహకులు మంచిర్యాలకు వచ్చి వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై సీఐ బన్సీలాల్ను సంప్రదించగా విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో అంబులెన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని, అవయవాలు అమ్మకంపై వస్తున్న వదంతులపై సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని, విచారణ సాగుతోందని తెలిపారు. -
తుపాకులతో బంధించడం కొత్తగా ఉంది: హీరో శ్రీకాంత్
ఎవరినైనా తాళ్ళతోనో , సంకెళ్ళతోనో కట్టి బంధిస్తారు..కానీ ‘పోలీస్ వారి హెచ్చరిక’ పోస్టర్లో పోలీసునే తుపాకులతో కట్టి బంధించడం కొత్తగా ఉంది. సినిమా కూడా అంతే కొత్తగా ఉండి..అందరికి ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను’అని అన్నారు హీరో శ్రీకాంత్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. తూలిక తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ కొత్త కథల తో , కొత్త ఆలోచనలతో అడుగులేసే దర్శకుడు బాబ్జీ ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తాడని నాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.మంచి మనసున్న శ్రీకాంత్ గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ ను విడుదల గావించుకున్న మా "పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాన్ని మంచి మనసున్న ప్రేక్షక మహాశయులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం మాకుందని" దర్శకుడు బాబ్జీ అన్నారు. నా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని శ్రీకాంత్ ఆవిష్కరించడం నేను చేసుకున్న అదృష్టం అని నిర్మాత బెల్లి జనార్ధన్ అన్నారు. ఈ కార్యక్రమం లో యీ చిత్ర కథానాయకుడు సన్నీ అఖిల్, నటి జయ వాహిని, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ యస్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ నటుడికి రెమ్యునరేషన్ రూ.101.. ఎందుకంటే?
పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో శరద్ కేల్కర్ విలన్గా చేశాడు. ఈ మూవీ ఫ్లాప్ కావడంతో తెలుగులో మరో దానిలో యాక్ట్ చేయలేదు. అదే టైంలో హిందీలో వెబ్ సిరీసులు, సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయాడు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్లోనూ ప్రియమణికి బాస్గా చేసింది ఇతడే. పాపులర్ యాక్టర్స్లో ఒకరైన శరద్.. రీసెంట్గా 'శ్రీకాంత్' మూవీలో నటించినందుకుగానూ కేవలం రూ.101 తీసుకున్నాడట. తాజాగా ఓ ముఖాముఖిలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)'తుషార్ ('శ్రీకాంత్' డైరెక్టర్) దగ్గర డబ్బుల్లేవు. కానీ నన్ను సినిమాలో పెట్టుకోవాలని ఉంది. తను సినిమా గురించి అడగ్గానే.. రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయకూడదని అనుకున్నాను. ఇదే కాదు తుషార్ నాకు ఎప్పటినుంచో ఫ్రెండ్. అలానే తుషార్ నిజాయతీ నచ్చింది. డబ్బులుంటే నీకు ఇవ్వాల్సినంత ఇచ్చేవాడనని చెప్పాడు. ఇది విన్న తర్వాత రెమ్యునరేషన్ తీసుకోవాలనిపించలేదు. అందుకే రూ.101 మాత్రమే తీసుకున్నాను' అని శరద్ కేల్కర్ చెప్పాడు.రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలో నటించిన 'శ్రీకాంత్' సినిమాని తెలుగు కుర్రాడు శ్రీకాంత్ బొల్ల జీవితం ఆధారంగా తెరకెక్కించారు. చిన్నతనంలో చూపు కోల్పోయిన శ్రీకాంత్.. బిజినెస్మ్యాన్ ఎలా అయ్యాడు? పలు ఇండస్ట్రీలకు యజమాని ఎలా అయ్యాడు అనేదే స్టోరీ. ఇందులో సెకండాఫ్లో వచ్చే చిన్న పాత్రలో శరద్ కేల్కర్ నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?) -
పాతబస్తీలో పంజా విసరనున్న నాని
-
నా మొహం ఎలా చూపించను
శ్రీరాంపూర్: జీవితంలో సక్సెస్ కావాలి..డబ్బు సంపాదించాలి.. కుటుంబ సభ్యులను ఉన్నత స్థితిలో ఉంచాలంటూ ఆ యువకుడు ఎన్నో కలలు క న్నాడు. మొదట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లా భాలు బాగానే వచ్చాయి. ఆ తర్వాత తెలిసిన వారి వద్ద, లోన్యాప్లలో అప్పు చేసి పెట్టిన పెట్టుబడు లు ఆవిరయ్యాయి. మూడేళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నా కలిసి రావడం లేదని.. లోన్యాప్ల వేధింపులు తాళలేక.. ఉరేసుకొని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో శనివారం వెలుగులోకి వచి్చంది. ఎస్సై సంతోష్ కథనం ప్రకారం.. శ్రీరాంపూర్లోని అరుణక్కనగర్కు చెందిన నమ్తబాజీ శ్రీకాంత్(29) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రుతి, 9 నెల ల కుమారుడు ఉన్నారు. భార్య కొడుకుతో కలిసి రాఖీ పండుగకు ఊరెళ్లింది. దీంతో ఇంట్లో ఒక్కడే ఉన్న సమయంలో శుక్రవారం రాత్రి ఫ్యాన్కు వైరు తో ఉరేసుకున్నాడు. ఇంటి సమీపంలోనే తల్లిదండ్రులు ఉంటారు. శనివారం ఉదయం శ్రీకాంత్ తమ్ముడు సాయికుమార్ ఇంటికొచ్చి తలుపులు కొట్టినా తీయలేదు. దీంతో బలవంతంగా త లుపులు తెరిచి చూడగా, ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు శ్రీకాంత్ సెల్ఫోన్ను పరిశీలించగా, ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడయ్యాయి.సెల్ఫీ వీడియో తీసుకొని.. శ్రీకాంత్ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘నేను ఒక కొడుకుగా, అన్నగా, భర్త గా, తండ్రిగా ఫెయిల్ అయ్యాను. లైఫ్లో సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను. సక్సెస్ కాకపోగా, లోన్యాప్స్లో లోన్ తీశాను. బయట కూడా అప్పు తీసుకొచ్చాను. ఇంట్లో వారిని గొప్ప గా ఉంచాలి. మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో డబ్బులన్నీ పెట్టా. ట్రేడింగ్ చేసి డబ్బులన్నీ పోగొట్టుకున్నాను. మాఫ్రెండ్ వాళ్ల అన్న దగ్గరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నా. మా డాడీ దగ్గర రూ.2 లక్షలు అట్లనే వేర్వేరు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా. అన్నీ పోగొట్టుకున్నా. నాకు చాలా అప్పులున్నాయ్. దానికి తోడు ఈ లోన్యాప్స్. ప్రతి నెలా ఈఎంఐలు కచి్చతంగా కట్టేసిన. ఈ నెలొక్కటే కట్టలేదు. ఏడెనిమిది యాప్ల దాకా కట్ట లేదు. ఫోన్లలో టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. ఇంటికి వస్తామని వేధించారు. కుటుంబ సభ్యుల వద్ద మొహం చూపెట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నా ను’ అని ఆ వీడియోలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
విద్యుత్కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: విద్యుత్కు దేశంలో డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏటా 11 గిగావాట్ల చొప్పున డిమాండ్ పెరగ్గా.. వచ్చే ఆరేళ్ల పాటు ఏటా 15 గిగావాట్ల మేర అధికం అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ అదనపు సెక్రటరీ శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. సుమారు 40 గిగావాట్లు స్టోరేజ్ రూపంలో ఉంటుందన్నారు. ‘‘2030 నాటికి రోజులో సూర్యరశ్మి ఎక్కువగా ఉండే సమయంలో (సోలార్ హవర్స్) అదనంగా 85 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ తోడవుతుంది. అదే నాన్ సోలార్ హవర్స్లో 90 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవుతుంది’’అని శ్రీకాంత్ వెల్లడించారు. 2030 నాటికి స్టోరేజ్ సామర్థ్యంపై ఆధారపడే పరిస్థితి వస్తుందన్నారు. సోలార్ హవర్స్లో నిల్వ చేసిన విద్యుత్ను, నాన్ సోలార్ హవర్స్లో వినియోగించుకోవచ్చన్నారు. ఐఈఈఎంఏ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. బొగ్గు ఆధారిత విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతోపాటు, సోలార్, పవన (విండ్), స్టోరేజ్, ప్రసారం సామర్థ్యాల విస్తరణ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. 300 గిగావాట్ల లక్ష్యం.. 2030 నాటికి శిలాజ ఇంధనేతర మార్గాల ద్వారా (పునరుత్పాదక/పర్యావరణ అనుకూల) 500 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కేంద్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం. ఇప్పటికే పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో 200 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్టు శ్రీకాంత్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మరో 300 గిగావాట్ల సామర్థ్యం ఆచరణలోకి వస్తుందన్నారు. ఇందులో 225 గిగావాట్లు కేవలం సోలార్, పవన విద్యుత్ రూపంలో ఉంటుందని తెలిపారు. సోలార్ సామర్థ్యం దండిగా ఉన్న రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రాంతాలతో కూడిన ఆర్ఈ జోన్లలో సామర్థ్యం ఎక్కువగా వస్తుందన్నారు. గుజరాత్, తమిళనాడు తీరాల్లో ఆఫ్షోర్ (సముద్ర జలాలు) విండ్ ఫార్మ్లు, ఒడిశా, గుజరాత్, తమిళనాడు తీరాల్లో గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాల ఏర్పాటు ప్రణాళికలను సైతం వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు), డేటా కేంద్రాల రూపంలోనూ విద్యుత్కు డిమాండ్ గణనీయంగా పెరగబోతోందన్నారు. దేశం మొత్తాన్ని ఒకే ఫ్రీక్వెన్సీతో నడిచే ఒకే గ్రిడ్తో అనుసంధానించడం వల్ల 170 గిగావాట్ల విద్యుత్ను, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయొచ్చన్నారు. పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నట్టు శ్రీకాంత్ వెల్లడించారు. ‘‘40 గిగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(బీఈఈఎస్)ను, 19 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని ఆరేళ్లలో సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
రెండవ భార్యకు, పిల్లలకు ఆస్తి వస్తుందా?
భార్య లేదా భర్త బతికి ఉండగా, చట్టరీత్యా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండవ పెళ్లి చెల్లదు. ప్రస్తుతం ఉన్న చట్టాలలో, (ముస్లింలకు, కొన్ని ప్రత్యేక మతాచారాలు వున్నవారికి తప్ప) అది నేరం కూడా. అందుకనే రెండవ భార్యకి భర్త ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. మొదటి భార్య సంతానానికి, రెండవ భార్య సంతానానికి మాత్రం ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది. అయితే మొదటి భార్య చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకుంటే, ఆ రెండవ భార్యకి కూడా మొదటి భార్య సంతానం – రెండవ భార్య సంతానంతో పాటు ఆస్తిలో సమాన హక్కు ఉంటుంది.ఉదాహరణకు: చనిపోయిన మొదటి భార్యకి భర్తకి కలిపి ఇద్దరు సంతానం ఉన్నారు. అలాగే రెండవ భార్యకి ఇద్దరు సంతానం ఉన్నారు. ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోయిన భర్త స్వార్జితంలో – పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తిలో 5 భాగాలు అవుతాయి. అందులో నాలుగు భాగాలు మొదటి – రెండవ భార్య సంతానానికి, ఒక భాగం రెండవ భార్యకి చెందుతుంది.ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ – పదోన్నతి తర్వాత సంక్రమించే సర్వీస్ బెనిఫిట్స్కి సంబంధించి మాత్రం చట్టం కొంత వేరుగా ఉంటుంది. సాధారణ పరిస్థితులలో, పైన తెలిపిన విధంగా చెల్లుబాటు కాని పెళ్లి చేసుకున్న రెండవ భార్యకి పెన్షన్, సర్వీస్ బెనిఫిట్స్ లో ఎటువంటి హక్కు ఉండదు. కానీ అన్నివేళలా అలా వుండదు. ఇటీవలే 2023లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పులో మొదటి భార్య బతికి ఉన్నప్పటికీ, చట్టరీత్యా విడాకులు తీసుకోనప్పటికీ రెండవ భార్యకి కూడా పెన్షన్ – సర్వీస్ బెనిఫిట్స్లో సమాన హక్కు కల్పించింది. మొదటి భార్య నుంచి విడాకులు కావాలి అంటూ చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి డైవర్స్ కేసు ఫైల్ చేసి ఉండడం ఆ కేసులో గమనించదగ్గ అంశం.అంతేకాక ఫ్యామిలీ పెన్షన్ ఉద్దేశానికి, మెయింటెనెన్స్ చట్టం వెనుక ఉన్న ఉద్దేశానికి తేడా ఏమీ లేదు అని అంటూ, మొదటి భార్యకి, రెండవ భార్యకి పెన్షన్ సమానంగా రెండు భాగాలుగా పంచాలి అని కోర్టు తన తీర్పు వెలువరించింది. రైల్వే విభాగంలో మాత్రం, పెన్షన్ రూల్స్ లోని సెక్షన్ 75 ప్రకారం, మొదటి భార్యకి – రెండవ భార్యకి కూడా పెన్షన్లో సమాన హక్కు ఉంటుంది అని గతంలో పలు హైకోర్టులు పేర్కొన్నాయి. కొన్ని హక్కులు రెండవ భార్యకి వర్తిస్తాయా లేదా అన్నది కేసు పూర్వాపరాలను బట్టి, ఆయా కేసులోని ప్రత్యేక అంశాలపైనా ఆధారపడి ఉంటుంది.– శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
దంపతులలో ఎవరి తప్పూ లేకపోయినా విడాకులు తీసుకోవచ్చా?
పాశ్చాత్య దేశాలలో, ముఖ్యంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో దంపతులలో ఏ తప్పూ లేకపోయినా ‘నో ఫాల్ట్ డివోర్స్’ (అపరాధరహిత విడాకులు) పేరుతో విడాకులు ఇచ్చే చట్టం అమలులో ఉంది. అలాగే ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం)లో కూడా విడాకులు తీసుకునేందుకు చాలా దేశాలలోని చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే భారతదేశంలోని పెళ్లిళ్లను నియంత్రించే రెండు ప్రాథమిక చట్టాలైన హిందూ వివాహ చట్టం 1955, ప్రత్యేక వివాహ చట్టం 1954 అపరాధ రహిత విడాకులను, పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధంలో విడాకులను మంజూరు చేసేందుకు ఆ ప్రాతిపదికలను అంగీకరించవు.భార్య–భర్తల కొన్ని సంవత్సరాల పాటు విడిపోయి ఉండి, వారి వివాహ బంధం తిరిగి అతుక్కునే వీలులేనంతలా తెగిపోయి, ఇరువురు కలిసి బతికే ఆస్కారం లేకుండా పోయివున్న సందర్భాలను ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ (పునఃస్థాపనకు వీలులేని వివాహ బంధం) అంటారు. ఇలాంటి వివాహ బంధాలు కేవలం చట్టం దృష్టిలో మాత్రమే వివాహంగా మిగిలి ఉంటాయి. అలాగే ‘నాకు నా భార్యపై (లేదా భర్తపై) ఎటువంటి ఫిర్యాదులు లేవు, వారు వ్యక్తిగతంగా మంచివారే, మా ఇద్దరి మధ్య లేనిది సఖ్యత మాత్రమే.నాకు నా భార్య (లేదా భర్త) విడాకులు ఇవ్వను అంటున్నారు. అందుకే నాకు నో ఫాల్ట్ డివోర్స్ ఇవ్వండి’ అని అడిగితే భారతదేశం లోని ఏ చట్టం ప్రకారమూ విడాకులు ఇవ్వడం కుదరదు. భాగస్వామిపై హింసకు పాల్పడడం, అకారణంగా వదిలేసి వెళ్లడం, వివాహేతర సంబంధం కలిగి ఉండటం, నయం కాలేని అంటు వ్యాధులు కలిగి వుండటం, హేయమైన నేరారోపణ రుజువు కావటం, సంసార జీవనానికి పనికిరాకుండా ఉండడం, మతమార్పిడి చేసుకోవడం, కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ తిరిగి సంసార జీవితం ఆరంభించకపోవడం వంటివి మాత్రమే విడాకులు తీసుకోవడానికి ప్రాతిపదికగా పరిగణించబడతాయి (గ్రౌండ్స్ ఫర్ డివోర్స్). కాని 1978 లోనే, 71వ లా కమిషన్ తన సిఫార్సులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ను విడాకులు తీసుకోవడానికి ఒక ప్రాతిపదికగా/కారణంగా గుర్తించేలా చట్టంలో మార్పులు చేయాలి అని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను పరిగణిస్తూ, ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు చాలా కేసులలో ‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’ కింద విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఒకవేళ ఈ ప్రాతిపదికన విడాకులు తీసుకొని ఉంటే, భారతదేశంలోని ఏ చట్టంలోనూ ఆ ప్రాతిపదిక లేదు కాబట్టి విడాకులు చెల్లవు అనడం సమంజసం కాదు – అలా విదేశాలలో పొందిన విడాకులు చట్టబద్ధమే అని కొన్ని కేసులలో తీర్పునిచ్చింది.‘‘నో ఫాల్ట్ డివోర్స్’’ – ‘‘ఇర్రిట్రీవబుల్ బ్రేక్డౌన్ ఆఫ్ మ్యారేజ్’’ వంటి చట్టాలకు భారత దేశం పూర్తిగా సిద్ధంగా లేకపోయినప్పటికీ, వీలైనంత మేర సఖ్యత కుదిర్చేలా ప్రయత్నించి, వీలుకాని పక్షంలో సత్వరమే విడాకులు మంజూరు చేసే లాగా చట్టం మారాలి. పరస్పర ఒప్పందం/అంగీకారం ఉంటే భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వివాహం అయిన ఒక సంవత్సరం తర్వాత మ్యూచువల్ డివోర్స్ పొందవచ్చు. ఇదివరకు లాగా విడాకుల దరఖాస్తు చేసిన తరువాత ఆరు నెలలు ఆగవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్ -
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!) -
పిల్లలు నా పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు: శ్రీకాంత్
హీరో శ్రీకాంత్తో మూడునాలుగు సినిమాలే చేసింది ఊహ. అప్పటివరకు ఆన్స్క్రీన్పై జోడీ కట్టిన ఆమె రియల్ లైఫ్లోనూ తనతో జత కట్టింది. శ్రీకాంత్ను పెళ్లాడింది. వీరి పెళ్లయి దాదాపు పాతికేళ్లవుతోంది. వివాహం తర్వాత ఊహ సినిమాలకు దూరమైంది. ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఊహ సినిమాలు మానేయడానికి గల కారణంపై తాజాగా శ్రీకాంత్ స్పందించాడు.అది తన నిర్ణయమేఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. 'సినిమాలు మానేయమని ఊహకు మేమెవరం చెప్పలేదు. తనే వద్దనుకుంది. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకుంది. సినిమాలకు దూరమవ్వాలన్నది కేవలం తన నిర్ణయమే! ముగ్గురు పిల్లలు (రోషన్, మేధ, రోహన్) పుట్టాక వాళ్లే తన ప్రపంచమైపోయింది. ఏమాటకామాట.. అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం పెద్ద అదృష్టం. ఊహను పెళ్లి చేసుకున్న క్షణాలు నా జీవితంలోనే బెస్ట్.ఎక్కడా పేరు చెప్పుకోరుపిల్లల విషయానికి వస్తే.. రోషన్ సైకాలజీ చదివాడు. ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. నేను శ్రీకాంత్ కుమారుడిని అని ఎక్కడా చెప్పుకోడు. నా కూతురు మేధ కెనడాలో చదువుతోంది. అక్కడున్న తెలుగువారితో ఎన్నడూ కూడా శ్రీకాంత్ మా నాన్న అని చెప్పలేదు. ఎక్కడికైనా వెళ్లాలన్నా కూడా వీళ్లు నా పేరు ఉపయోగించుకోరు. శ్రీకాంత్ వాళ్ల అబ్బాయిని అని రికమండేషన్ చేయించుకోరు. వాళ్లంతట వాళ్లే సొంతంగా ఎదగాలని కష్టపడతారు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: బాలీవుడ్ నటికి సర్జరీ.. ఇప్పుడెలా ఉందంటే? -
హెర్బల్ ప్రొటీన్ ఉత్పత్తులను ఆవిష్కరించిన..హెబ్బాపటేల్ (ఫొటోలు)
-
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్హౌస్లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్హౌస్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్స్కా్వడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్హౌస్లో పార్టీ హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్హౌస్లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్హౌస్ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్లో తీసింది కాదని, ఆ ఫార్మ్హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఓ ఫామ్హౌస్లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
బెంగళూరులో రేవ్ పార్టీ భగ్నం.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో నటి హేమ
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
-
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ సెలబ్రిటీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీలో పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో టాలీవుడ్ సినీతారలు అలర్ట్ అయ్యారు. తాను అలాంటి పార్టీకి వెళ్లలేదంటూ ఇప్పటికే నటి హేమ స్పష్టం చేశారు. మరోవైపు ఆ సినీతారలు ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తాజాగా ఈ పార్టీకి టాలీవుడ్ హీరో, నటుడు శ్రీకాంత్ హాజరైనట్లు వార్తలొచ్చాయి. దీంతో వీటిపై ఆయన స్పందించారు. రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు. దయచసి తప్పుడు కథనాలను నమ్మవద్దని అభిమానులకు శ్రీకాంత్ సూచించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ..'రేవ్ పార్టీలు, పబ్లకు వెళ్లే వ్యక్తిని కాదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మకండి. బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నా. కొన్ని ఛానెల్స్లో నేను బెంగుళూరులోని రేవ్ పార్టీకి వెళ్లానని వార్తలొచ్చాయి. ఆ న్యూస్ చూసి నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ నవ్వుకున్నాం. నేను ఇంట్లోనే ఉన్నాను. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు. అందులో ఉన్న వ్యక్తి ఎవరో నాలా ఉండంటంతోనే అలా రాశారేమో. అతడికి కాస్త గడ్డం ఉంది. ముఖం కవర్ చేసుకున్నాడు. అతన్ని చూసి నేను కూడా షాకయ్యా. అచ్చం నాలా ఉన్నాడనిపించింది. నా ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా. దయచేసి అసత్య కథనాలు ఎవరు నమ్మొద్దు' అని అన్నారు. అంతే కాకుండా తాను ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొంత సేపు అక్కడి ఉండి వచ్చేస్తానని తెలిపారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదని.. మీడియా మిత్రులు సహా ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా.. రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారు.. నాలాగా ఉన్నాడనే పొరబడి ఉంటారని నేను అనుకుంటున్నా.. నేను ఇంట్లోనే ఉన్నా.. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు అని అన్నారు. -
జనతా బార్ సందేశం
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. రాయ్ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్ గర్ల్గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి -
బాలీవుడ్లో తెలుగువాడి బయోపిక్.. ఎవరీ శ్రీకాంత్ బొల్లా?
ఆంధ్రప్రదేశ్కు ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ‘శ్రీకాంత్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ రావు హీరోగా నటించగా, జ్యోతిక, శరత్ కేల్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తుషార్ హీరానందానీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్..తనకున్న లోపాన్ని దీటుగా ఎదుర్కొన్ని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ బాల్యం సీన్తో బాల్యం సీన్తో ట్రైలర్ ప్రారంభం అయింది. బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? తనకున్న లోపాన్ని అదిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు? బొల్లాంట్ ఇండస్ట్రీస్ను ఎలా స్థాపించాడు? తదితర అంశాలలో చాలా ఎమోషనల్గా ట్రైలర్ సాగింది. శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఒదిగిపోయాడు. . టీ సీరిస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, నిధి పర్మార్ హీరానందానీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవరీ శ్రీకాంత్? శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రలకు కొంతమంది బంధువులు సలహా ఇచ్చారట. కానీ వాళ్లు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి చదివాడు శ్రీకాంత్. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్ధులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది ఆయన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కాడు ఆయన. ఆరు నెలల విచారణ తర్వాత ఆయన సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇంటర్మీడియట్లో 98 శాతంతో క్లాస్లో టాపర్గా ఆయన నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా.. అంధుడైన కారణంగా ఆ అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఐదు యూనివర్సిటీల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. మసాచుసెట్స్లోని ఎంఐటీని ఆయన ఎంచుకున్నారు. అక్కడ సీటు పొందిన మొట్టమొదటి అంతర్జాతీయ అంధ విద్యార్థి శ్రీకాంత్. ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే పని చేయాలనుకున్నాడు. 2012లో తిరిగి హైదరాబాద్కి వచ్చాడు. బొల్లాంట్ ఇండస్ట్రీస్ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ, తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు. 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన ‘ 30 ఏళ్లలోపు 30 మంది’ జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది. 2022లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఈ జంట ఓ బిడ్డకు జన్మనిచ్చారు. -
‘కళ్యాణ్’ స్థానంలో మళ్లీ సీఎం కుమారుడే పోటీ
ముంబై: లోక్సభ ఎన్నికల్లో కళ్యాణ్ నియోజకవర్గంలో ఎట్టకేలకు సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే మరోసారి బరిలో దిగనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ప్రకటించారు. కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో శ్రీకాంత్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించారు. అయితే ఇవాళ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్వయంగా కళ్యాణ్ స్థానంలో శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారని ప్రకటించటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో శ్రీకాంత్ షిండే గెలుపు కోసం బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. నాగ్పూల్లో బీజేపీ 44వ వ్యవస్థాపక దినోత్సం సందర్భంగా ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడారు. ‘కళ్యాణ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మళ్లీ శ్రీకాంత్ షిండే బరిలో దిగుతున్నారు. ఆయన్ను ఓడించేందుకు తమకూటమకి ప్రతిపక్షమే లేదు. కళ్యాణ్ స్థానంలో శవసేన (ఏక్నాథ్ షిండే) పార్టీ బరిలోకి దిగుతుంది. అభ్యర్థిగా ఏక్నాథ్ షిండే కుమారుడు సిట్టింగ్ ఎంపీ శ్రీకాంత్ షిండే పోటీ చేస్తారు’ అని దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. శ్రీకాంత్ షిండే.. ఇప్పటికే కళ్యాణ్ పార్లమెంట్ స్థానంలో రెండుసార్లు (2014, 2019) పోటిచేసి విజయం సాధించారు. ఇక.. ఇప్పటికే ‘జ్వలించే టార్చ్’ గుర్తును సొంతం చేసుకున్న శివసేన (యూబీటీ) ఇప్పటికే 21 స్థానాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే వింధంగా షిండే వర్గం 9 స్థానాలు, బీజేపీ 24 స్థానాలు, ఎన్సీపీ( అజిత్ పవార్)- 4, రాష్ట్రీయా సమాజ్ పక్షా-1 ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కూటమి మరో 10 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి మే 20 పోలింగ్ జరిగి.. జూన్ 4ను ఫలితాలు విడుదల కాన్నాయి. -
హీరో శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
-
మరి అన్నయ్యంటే ఏమనుకున్నారు.. తన ప్రేమ అమృతం!
మెగాస్టార్ చిరంజీవికి అంతటా అభిమానులే! ఇండస్ట్రీలో కూడా ఆయన్ను ఆరాధించేవారు ఎంతోమంది! వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మెగాస్టార్ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్దాదా జిందాబాద్ చిత్రాలు ఎంతలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే! ఈ సినిమాల తర్వాత ఈ అన్నదమ్ములు మరింత క్లోజయ్యారు. ఈరోజు(మార్చి 23న) శ్రీకాంత్ బర్త్డే.. అది గుర్తుపెట్టుకుని మరీ చిరంజీవి స్వయంగా అతడి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేనా? స్వయంగా కేక్ కట్ చేయించి తినిపించాడు. కేక్ మీద హ్యాపీ బర్త్డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అని రాయించడం హైలైట్గా మారింది. తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీతో కాసేపు సరదాగా గడిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. The Dada-ATM combo was clicked as the Mega Star @KChiruTweets visited @actorsrikanth 's home to celebrate the actor’s birthday! 😍😍#Chiranjeevi #MegastarChiranjeevi #ActorSrikanth #RoshanMeka pic.twitter.com/MDrO1YwxCc — Dileep Kumar (@chirufanikkada1) March 23, 2024 చదవండి: హిట్ సినిమాల చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేంటి ఇంతందంగా మారిపోయింది! -
‘అనన్య’ విజయం సాధించాలి: హీరో శ్రీకాంత్
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అనన్య’. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మిస్తున్నారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో "అనన్య" ప్రచార చిత్రాన్ని శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఆవిష్కరించి, ఈ చిత్రం ఘన విజయం సాధించాలని అభిలషించారు. ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ "శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్"కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు దండిగా అందుకుని, ఈనెల 22న వస్తున్న "అనన్య" ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడీ తెలిపారు. తమ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్ కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. -
కులం పేరుతో దూషించి దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్సీ పై కేసు నమోదు
-
పల్లెటూరి ప్రేమకథ
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధా మాధవం’. గోనాల్ వెంకటేశ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘రాధా మాధవం’ ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమకథా చిత్రమని తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది.. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అందమైన పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘రాధా మాధవం’. మా సినిమా సెన్సార్ పనులు జరుపుకుంటోంది’’ అన్నారు దాసరి ఇస్సాకు. ‘‘ఈ నెలలోనే మా సినిమా రిలీజ్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు గోనాల్ వెంకటేశ్. ‘‘పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథతో సహజత్వం ఉట్టి పడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. మా చిత్రం ట్రైలర్ను విడుదల చేసిన శ్రీకాంత్గారికి థ్యాంక్స్’’ అన్నారు వినాయక్ దేశాయ్. -
తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ మాజీ నంబర్వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టగా... లక్ష్య సేన్, ప్రియాన్షుæ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జకార్తాలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 14–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... ప్రణయ్ 18–21, 21–19, 10–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. -
గోపిచంద్ సినిమాతో ఎంట్రీ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి దాదాపు ఐదేళ్ల తర్వాత టాలీవుడ్ తలుపు తట్టింది. ఒంటరి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. మలయాళం, తమిళం, కన్నడలో పలు సినిమాల్లో నటించింది. కానీ తెలుగులో కేవలం హీరో, మహాత్మ, నిప్పు లాంటి చిత్రాల్లో మాత్రమే కనిపించిది. తన 22 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్లో కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే చేసింది. ఇంతకీ ఆమె హీరోయిన్ ఎవరో గుర్తుకు వచ్చిందా? ప్రస్తుతం కోలీవుడ్తో పాటు కన్నడ, మలయాళ సినిమాలతో బిజీగా ఉంది. టాలీవుడ్లో అలా వచ్చి.. ఇలా గుడ్ బై చెప్పిన అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందాం పదండి. కేరళలోని త్రిసూర్లో జన్మించిన భావన..2002లో మలయాళంలో నమ్మల్ అనే చిత్రం తన కెరీర్ ప్రారంభించింది. మొదటి సినిమాకే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత మలయాళంలో ఛాన్సులు కొట్టేసిన ముద్దగుమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత 2008లో గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నితిన్ సరసన హీరో చిత్రంలో మెరిసింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ చిత్రంతో గుర్తింపు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ ఈ కేరళకుట్టికి పెద్దగా కలిసిరాలేదు. తెలుగులో కేవలం నాలుగు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తమిళం, కన్నడలో ఛాన్స్లు రావడంతో టాలీవుడ్కు బైబై చెప్పేసింది. భావన చివరిసారిగా రవితేజ నటించిన నిప్పు చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. నిర్మాతతో ప్రేమ పెళ్లి అయితే 2012లో కన్నడలో రోమియో చిత్రంలో నటించారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నవీన్తో భావనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ.. 2018లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఇటీవలే వీరిద్దరు ఆరో వివాహా వార్షికోత్సవం జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం భావన తన భర్తతో కలిసి బెంగళూరులో స్థిరపడింది. కాగా.. భావన చివరిసారిగా మలయాళ చిత్రం 'ఎన్టిక్కక్కకోరు ప్రేమోందర్న్'లో కనిపించింది. View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) View this post on Instagram A post shared by Bhavana🧚🏻♀️Mrs.June6 (@bhavzmenon) -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
ఈమె ఆ స్టార్ హీరో కూతురు.. హీరోయిన్లని మించిపోయే గ్లామర్.. గుర్తుపట్టారా?
సాధారణంగా హీరో లేదా హీరోయిన్కి వారసులు దాదాపుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు అబ్బాయిలు ఎక్కువగా వచ్చేవారు కానీ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా తల్లితండ్రుల వారసత్వాన్ని టాలీవుడ్లో కొనసాగిస్తున్నారు. ఈమె తల్లిదండ్రులు కూడా ప్రముఖ హీరోహీరయినే. కాకపోతే ఈమె నటి అవుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్. కానీ చూస్తుంటే మాత్రం హీరోయిన్లని మించిపోయేంత అందంగా కనిపిస్తుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: ప్రభాస్ హీరోయిన్కి చేదు అనుభవం.. అలా జరగడంతో!) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మేధ. ఈమె ప్రముఖ హీరో శ్రీకాంత్ కూతురు. 90ల్లో 'పెళ్లి సందడి' లాంటి సినిమాలతో ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ నటుడు.. ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించాడు కానీ అదృష్టం కలిసిరాలేదు. చిన్న కొడుకు రోహన్ ఇంకా చదువుకుంటున్నాడు. అయితే కూతురు మేధ.. రీసెంట్గానే చదువు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట శ్రీకాంత్ కూతురు మేధ.. కెమెరా కంటికి చిక్కింది. పింక్ కలర్ చీరలో అందంగా మెరిసిపోతున్న ఈమెని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హీరోయిన్లని మించిపోయేలా ఉన్న ఈమె.. నటి అవుతుందా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ ఇండస్ట్రీలోకి వస్తే మాత్రం మోస్ట్ బ్యూటీఫుల్ హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు. (ఇదీ చదవండి: పెళ్లి పీటలెక్కనున్న 'పల్సర్ బైక్' రమణ.. గ్రాండ్గా ఎంగేజ్మెంట్) -
తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్ల విషాదం!
వరంగల్, మహబూబాబాద్: తాత సంవత్సరీకానికి వచ్చిన ఇ ద్దరు మనుమళ్లు వాగులో స్నానానికి వెళ్లి ప్ర మాదవశాత్తు మునిగి చనిపోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లి గ్రా మంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల, పోలీసుల కథనం ప్రకారం.. వేములపల్లి గ్రామానికి చెందిన తాటిపాముల రాజీరు ఏడాది క్రితం చనిపోయాడు. శుక్రవారం సంవత్సరీకం (ఏడాది మాశికం). దీంతో అతని మనుమళ్లు తాటిపాముల పవన్(25), సిరిమల్లె శ్రీకాంత్ (17) (బావబామ్మర్దులు)లు వేములపల్లికి వచ్చారు. గ్రామంలోని పెద్దవాగులో స్నానానికి ఇద్దరు వెళ్లారు. వాగులో భారీ గుంతలు ఉండడం.. లోతు తెలియక దిగిన వారు ఈత రాకపోవడంతో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటకు తీశారు. చిట్యాల సీఐ వేణు చందర్, ఎస్సై జాడి శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. తాత సంవత్సరీకానికి వచ్చి ఇద్దరు మనుమళ్లు వాగులో పడి చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. ఇవి చదవండి: అన్నీ సంచలనాలే.. ‘టీఎస్పీఎస్సీ’ కేసుతో కరీంనగర్కు లింకు! -
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
ఆ సినిమా తర్వాత నా కెరీర్ గ్రాఫ్ పడిపోయింది: హీరో శ్రీకాంత్
హీరో శ్రీకాంత్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశాడు. ఒకప్పుడు స్టార్ హీరోలకే గట్టి పోటీనిచ్చాడు. అయితే రానురానూ శ్రీకాంత్ కెరీర్ డల్ అయింది. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కనిపిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న శ్రీకాంత్ టాలీవుడ్లో సెంచరీ మార్క్ను సులువుగా దాటేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గ్రాఫ్ పడిపోవడంపై స్పందించాడు. 'ఆమె సినిమా హిట్టయింది. అప్పటికే తాజ్మహల్, పెళ్లి సందడి సినిమాలు కమిటయ్యాను. వాటితో పాటు ఆహ్వానం, వినోదం వంటి చిత్రాలన్నీ వరుసగా హిట్టయ్యాయి. అప్పటి నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఆ తర్వాత చేయడానికి మూడు సినిమాలు రిలీజ్గా ఉండేవి. హిట్ పడగానే పెద్దపెద్ద బ్యానర్లు వచ్చేవి. కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యేసరికి ఈ పెద్ద బ్యానర్లు వెనక్కు వెళ్లిపోయేవి. మహాత్మ(2009) సినిమా తర్వాత నాకు పెద్ద దెబ్బ పడింది. ఇది నా వందో సినిమా. దీని తర్వాత నా కెరీర్ నెమ్మదిగా కిందకు పడిపోయింది. మహాత్మ తర్వాత ఓ పాతిక సినిమాలు చేశాను. కానీ ఏదీ విజయం సాధించలేదు. బహుశా టైం బ్యాడేమో.. కొత్తవాళ్లు ఇండస్ట్రీకి రావడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు' అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: తెలుగింటి హీరోయిన్.. అందంగా లేదని వెక్కిరించినవాళ్లే కుళ్లుకున్నారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. -
'కోటబొమ్మాళి పీఎస్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ
టైటిల్: కోటబొమ్మాళి పీఎస్ నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు దర్శకుడు: తేజ మార్ని సంగీతం : మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్: జగదీశ్ చీకటి ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్ ఆర్ నిర్మాత : బన్నీ వాస్, విద్య కొప్పినీడి నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్ విడుదల తేదీ: 2023 నవంబరు 24 రీమేక్ అనేది సేఫ్ గేమ్ లాంటిది. ఓ భాషలో హిట్టయిన మూవీని కాస్త మార్పులు చేర్పులు చేసి మరో భాషలో తీసి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా మలయాళంలో రిలీజై ప్రేక్షకాదరణ దక్కించుకున్న చిత్రం 'నాయట్టు'. దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గ మార్పులు చేసి 'కోటబొమ్మాళి పీఎస్' అనే మూవీగా తీశారు. తాజాగా ఇది థియేటర్లలో వచ్చింది. మరి సినిమా టాక్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) కథేంటి? శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి. ఈ ఊరి పోలీస్ స్టేషన్లో రామకృష్ణ(శ్రీకాంత్) హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటాడు. ఇదే స్టేషన్లో రవికుమార్ (రాహుల్ విజయ్), కుమారి (శివాని రాజశేఖర్) కానిస్టేబుల్స్. కోటబొమ్మాళిలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఊరంతా చాలా హడావుడిగా ఉంటుంది. ఎన్నికల జరగడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ ముగ్గురు కానిస్టేబుల్స్.. ఓ హత్య కేసులో ఇరుక్కుంటారు. దీంతో పోలీసులే ఈ పోలీసుల వెంటపడతారు? మరి హత్య చేసిన ముగ్గురిను.. పోలీసులకు దొరికారా? ఇందులో ఎస్పీ రజియా అలీ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. సినిమా ఎలా ఉందంటే? రీమేక్ సినిమా తీయడం అనేది ఎంత సేఫో? అంత డేంజర్ కూడా! ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నవ్వులపాలైపోవడం గ్యారంటీ. ఈ విషయంలో 'కోటబొమ్మాళి పీఎస్' ఫస్ట్ క్లాస్లో పాసైపోయింది! రెండున్నర గంటల సినిమాలో డ్రామా, థ్రిల్, ఎమోషన్ బాగా కుదిరాయి. ముఖ్యంగా యాస విషయంలోనూ కేర్ తీసుకున్నారు. ప్రతి సీన్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే.. మైనర్ బాలికని రేప్ చేశారనే కారణంతో నలుగురు కుర్రాళ్లని పోలీసులు ఎన్కౌంటర్ చేసే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. ఈ ఆపరేషన్ కోసం రామకృష్ణ(శ్రీకాంత్), ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మి శరత్ కుమార్) కలిసి పనిచేస్తారు. ఆ తర్వాత కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే కానిస్టేబుల్స్ రామకృష్ణ, రవి, కుమారి చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎష్టాబ్లిష్ చేశారు. మరోవైపు ఉపఎన్నికకు సంబంధించిన స్టోరీ నడుస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఓ ప్రమాదం జరుగుతుంది. దీంతో అదికాస్త రాజకీయం అవుతుంది. రెండు స్టోరీలకు లింక్ ఏర్పడుతుంది. ప్రమాదం అనుకున్నది హత్యగా మారిపోతుంది. ముగ్గురు కానిస్టేబుల్స్.. ఈ హత్య కేసులో ఇరుక్కుంటారు. తమ కార్నర్ చేస్తున్నారని తెలిసి తప్పించుకుని పారిపోతారు. మరి చివరకు వీళ్లు పోలీసులకు దొరికారా? లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. రూరల్ బ్యాక్ డ్రాప్తో నడిచే సినిమాలు ఈ మధ్య ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి. 'నాయట్టు' చిత్రాన్ని అలా శ్రీకాకుళం బ్యాక్డ్రాప్కి మార్చి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఊరిలో యాస దగ్గర నుంచి పాత్రల మధ్య నడిచే డ్రామా వరకు బాగానే సెట్ చేసుకున్నారు. ప్రధానంగా ఓ నాలుగైదు పాత్రలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ రాసుకున్నారు. కాకపోతే ముగ్గురు కానిస్టేబుల్స్, పోలీసులు మధ్య ఛేజింగ్ డ్రామా అంతా కాస్త సాగదీసినట్లు ఉంటుంది. దాన్ని కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. మెయిన్ లీడ్స్లో శ్రీకాంత్ పాత్రకు రాసుకున్న సీన్స్ బాగున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే మంచి థ్రిల్ ఇస్తాయి. ఆల్రెడీ పోలీసోడు కాబట్టి తనని ఛేజ్ చేస్తున్న ఎస్పీకే కౌంటర్స్ ఇస్తుంటాడు. సినిమా చూస్తున్నంతసేపు క్లైమాక్స్లో ఏం జరుగుతుందా? పోలీసులు.. హత్య కేసులో ఇరుక్కున్న కానిస్టేబుల్స్ని పట్టుకుంటారా? లేదా అని టెన్షన్ క్రియేట్ అవుతుంది. అయితే మనం అనుకోని ఇన్సిడెంట్స్ క్లైమాక్స్లో జరుగుతాయి. ఎవరెలా చేశారు? ఈ సినిమాలో కథే హీరో. మిగిలిన వాళ్లంత పాత్రధారులు మాత్రమే. అలానే స్టార్ యాక్టర్స్ ఎవరు లేరు. ఉన్నంతలో శ్రీకాంత్ మాత్రమే చాలామందికి తెలిసిన ముఖం. అతడు తనకొచ్చిన హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ రోల్కి పూర్తి న్యాయం చేశాడు. కానిస్టేబుల్ రవిగా చేసిన రాహుల్ విజయ్కి ఉన్నంతలో మంచి సీన్స్ పడ్డాయి. కానిస్టేబుల్ కుమారిగా చేసిన శివాని.. స్టోరీ అంతా ఉంటుంది కానీ యాక్టింగ్కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఎస్పీ రజియా అలీగా వరలక్ష్మి శరత్ కుమార్.. పోలీస్ విలనిజం చూపించింది. మంత్రి పాత్రలో మురళీ శర్మ పర్వాలేదనిపించాడు. మిగిలిన వాళ్లంతా ఫరిది మేరకు నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. 'లింగి లింగి లింగిడి' పాట వల్ల ఈ సినిమాపై కాస్త క్యూరియాసిటీ పెరిగింది. ఆ సాంగ్ మ్యూజిక్ హిట్. పిక్చరైజేషన్ జస్ట్ బాగుంది. పాటలేం లేవు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కథకు తగ్గట్లు సరిపోయింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. చివరగా డైరెక్టర్ తేజ మార్ని గురించి చెప్పుకోవాలి. మాతృకని పెద్దగా చెడగొట్టకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీయడంలో పాసైపోయారు. ఓవరాల్గా 'కోటబొమ్మాళి పీఎస్'.. ఓ మంచి మూవీ చూసిన ఫీల్ ఇస్తుంది. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సౌండ్ పార్టీ’ మూవీ రివ్యూ) -
రాజకీయాలతో సంబంధం లేదు
‘‘ప్రస్తుత రాజకీయాలకు, ‘కోటబొమ్మాళి పీఎస్’ సినిమా కథకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఈ మూవీలో ఎన్నికల గురించి, ఓటు విలువ గురించి చర్చించాం. వ్యవస్థ, మనం ఎలా అవినీతిమయమై ఉన్నాం అనేది ఈ చిత్రంలో చెబుతున్నాం. ఈ మూవీకి ఏ పొలిటికల్ ఎజెండా లేదు’’ అని డైరెక్టర్ తేజా మార్ని అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా తేజా మార్ని మాట్లాడుతూ– ‘‘వ్యవస్థలో ఉన్న వాళ్లు అదే వ్యవస్థకు బలైతే ఎలా ఉంటుంది? అనే కథని జనాలకు చెప్పాలనిపించింది. కోటబొమ్మాళి అనే ఊరిలో ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఏం జరిగింది? అది ముగ్గురు పోలీస్ అధికారుల జీవితాలను ఎలా మార్చింది? అనేది ఈ చిత్ర కథ. మలయాళ హిట్ ‘నాయట్టు’ కి ఇది తెలుగు రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశాం. శ్రీకాంత్, వరలక్ష్మిగార్ల పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. రాహుల్, శివాని చక్కగా నటించారు. నిర్మాతలు వాసు, విద్యగార్లు ఎక్కడా రాజీపడలేదు. ‘లింగిడి లింగిడి..’ పాట వల్లే మా సినిమా గురించి అందరికీ తెలిసింది’’ అన్నారు. -
నటుడికి సంతృప్తి అనేది ఉండదు
‘‘ఈ మధ్య కాలంలో నేను పూర్తి స్థాయి పాత్ర చేసిన చిత్రం ‘కోట బొమ్మాళి’. నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర. అంతకు ముందు నేను చేసిన సినిమాల్లో పాటలు, ఫైట్స్.. ఇలా వాణిజ్య అంశాలు ఉన్నాయి. ‘కోట బొమ్మాళి’లో చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన విశేషాలు. ► ‘కోట బొమ్మాళి’ వైవిధ్యమైన కథ. ఎక్కడైనా క్రిమినల్స్ని ΄ోలీసులు వెంటాడి పట్టుకుంటారు. ఈ సినిమాలో ΄ోలీసులే ΄ోలీసులను వెంటాడటం ఆసక్తిగా ఉంటుంది. రాజకీయ నాయకులు ΄ోలీసులను ఎలా వాడుకుంటారు? దాని వల్ల ΄ోలీసులకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? తమ ఓట్ల కోసం కులాలను, మతాలను రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటారు? అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం. ఈ సినిమాలో ఎలాంటి పొలిటికల్ సెటైర్ ఉండదు. అయితే ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్నది చూపించాడు దర్శకుడు తేజ. ►ఓ మధ్య తరగతి హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందన్నది ఈ మూవీలో ఆసక్తిగా ఉంటుంది. నేను హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ పాత్ర చేశాను. నా పాత్ర, రాహుల్, శివాని.. మా ముగ్గురి పాత్రల మధ్య కథ తిరుగుతుంటుంది. మా పై అధికారి వరలక్ష్మి మమ్మల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తులకు నేను వేసే పై ఎత్తులు ఆసక్తిగా ఉంటాయి. ►దాదాపు 32 ఏళ్ల కెరీర్లో ఎన్నో పాత్రలు చేశాను. ఎన్ని చేసినా ఓ నటుడికి సంతృప్తి ఉండదు.. ఇంకా వైవిధ్యమైన పాత్రలు చేయాలనే ఆరాటం ఉంటుంది. ప్రస్తుతం రామ్చరణ్తో ‘గేమ్ చేంజర్’, ఎన్టీఆర్తో ‘దేవర’, మోహన్లాల్, మా అబ్బాయి రోషన్ నటిస్తున్న ‘వృషభ’ సినిమాల్లో కీ రోల్స్ చేస్తున్నాను. -
శ్రీకాంత్ పరాజయం
షెన్జెన్: చైనా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్లకు నిరాశ ఎదురైంది. ఈ ముగ్గురూ తొలి రౌండ్ను దాటలేకపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 24వ ర్యాంకర్ శ్రీకాంత్ 15–21, 21–14, 13–21తో ప్రపంచ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 19–21, 18–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ షి యు కి (చైనా) చేతిలో... 30వ ర్యాంకర్ ప్రియాన్షు 17–21, 14–21తో 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) ద్వయం 15–21, 9–21తో షు జియాన్ జాంగ్–యు జెంగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Kotabommali PS Pre Release Photos: ‘కోట బొమ్మాళి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
భూమికను చంపేయాలన్నంత కోపం వచ్చింది: హీరో శ్రీరామ్
శ్రీరామ్.. ఈయన అసలు పేరు శ్రీకాంత్. కానీ తెలుగులో ఈ పేరుతో ఇదివరకే ఓ నటుడు ఉండటంతో శ్రీరామ్గా వెండితెరపై అడుగుపెట్టాడు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తండ్రి మొదట్లో నాటకాలు వేసి కళాకారుడిగా గుర్తింపు పొందాడు. అలా చిన్నతనంలోనే శ్రీరామ్కు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మొదట్లో నాటకాలు వేసిన ఇతడికి కెరీర్ ప్రారంభంలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. హీరోగా ఛాన్సులిస్తామన్నవాళ్లు చివర్లో ఇతడిని తీసేసి వేరేవాళ్లతో షూటింగ్ మొదలుపెట్టేవాళ్లు. తెలుగులో ఎంట్రీ అలా వరుస షాకుల అనంతరం రోజా కూటం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒకరికి ఒకరు మూవీతో తెలుగు వారికీ దగ్గరయ్యాడు. తమిళంలో హీరోగా కొనసాగిన ఇతడు తెలుగులో మాత్రం సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రీరామ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ పరిస్థితిలో లేను.. అందుకే! 'నేను ఒకరికి ఒకరు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.. రెండు సినిమాలకు ఒకేసారి సంతకం చేశాను. రెండు సినిమాలు ప్రకటించారు. అయితే అప్పుడు నేను ఆస్పత్రిపాలై ఉన్నాను. ఫైట్స్ చేసే పరిస్థితిలో లేను. నా కోసం పోరాట సన్నివేశాలను తగ్గించడం అస్సలు కరెక్ట్ కాదు. అలా నేను నటించి సినిమాకు న్యాయం చేయలేను అనే ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. పారిపోయింది.. అందుకే హీరోయిన్ భూమికతో గొడవలు కూడా జరిగాయి. సగం పాట అయిపోయాక సెట్ నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఓ రోజు ఎయిర్పోర్ట్లో కనిపించినప్పుడు షూటింగ్ ఎలా జరిగింది? అని అడిగింది. కత్తి తీసుకుని అక్కడే పొడిచేయాలనిపించింది. ఈ మధ్యే మేమిద్దరం మాట్లాడుకున్నాం.. అప్పటి సంఘటన తలుచుకుని నవ్వుకున్నాం. ఇప్పుడంటే నవ్వుకుంటున్నాం కానీ ఆ రోజు మాత్రం చాలా కోపమొచ్చింది' అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్. చదవండి: లగ్జరీ లైఫ్ వదిలి ఇండియాకు.. హీరోగా సూపర్ సక్సెస్.. కానీ.. -
ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది..నన్ను రీప్లేస్ చేస్తారేమో అనుకున్నా
రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో రాహుల్ విజయ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కానిస్టేబుల్ రవి పాత్రలో నటించాను. ఎస్ఐ రామకృష్ణగా శ్రీకాంత్గారు, కానిస్టేబుల్ కుమారిగా శివానీ రాజశేఖర్ నటించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోట బొమ్మాళి అనే ఊర్లోని పోలీస్స్టేషన్లో ఏం జరిగింది? అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. మలయాళ చిత్రం ‘నాయట్టు’కు ‘కోట బొమ్మాళి పీఎస్’ రీమేక్. అయితే నా పాత్రపై ఏ ప్రభావం ఉండకూడదని ‘నాయట్టు’ పూర్తి చిత్రం నేను చూడలేదు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్ప్లే రేసీగా ఉంటుంది. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక ఈ సినిమాలోని ‘లింగిడి..’ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ పాటతోనే మరింత మందికి మేం చేరువ అయ్యాం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో మా నాన్నగారు (ఫైట్ మాస్టర్ విజయ్) అసిస్టెంట్ ఫైట్ మాస్టర్గా, ఫైట్ మాస్టర్గా చేశారు. అదే బ్యానర్లో నేను హీరోగా చేయడం పట్ల ఆయన హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ సినిమా సమయంలో నాకు ప్రమాదం జరిగి, కాలికి దెబ్బ తగిలింది. దీంతో నాలుగు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో నన్ను రీప్లేస్ చేస్తారేమో? అనుకున్నాను. కానీ ‘బన్నీ’ వాసు, విద్యాగార్లు నన్ను సపోర్ట్ చేశారు. ఇలాంటి సంస్థలో వర్క్ చేయడం నాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఆర్కా మీడియాలో ఓ షో కమిట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చారు. -
తొలిసారి అలాంటి సీన్ చేశా!
‘‘నేనిప్పటివరకూ ఏ సినిమాలోనూ సిగరెట్ తాగే సన్నివేశంలో నటించలేదు. ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా కథకు అవసరం కావడంతో తొలిసారి స్మోకింగ్ సన్నివేశం చేశాను. అందుకే ఈ చిత్రం నాకు సవాల్గా అనిపించింది’’ అని నటి వరలక్ష్మీ శరత్కుమార్ అన్నారు. రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ చెప్పిన విశేషాలు. ∙నేను కథే హీరోగా భావిస్తాను. నా కెరీర్లో తమిళంలో ఎక్కువగా పోలీస్ పాత్రలు చేశాను. కానీ తెలుగులో మాత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’ నా తొలి మూవీ. ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలకు క్రేజ్ ఉంటోంది. ∙‘కోట బొమ్మాళి పీఎస్’లో శ్రీకాంత్గారు, నేను పోలీస్ ఆఫీసర్స్. ఇద్దరిలో ఒకరు క్రిమినల్ అయితే ఎలా ఉంటుంది? పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? అన్నది ఈ చిత్రకథ. పిల్లి మరియు ఎలుక ఆటలా థ్రిల్ చేసేలా ఉంటుంది. ఓటు గురించి అవగాహన కల్పించే లైన్ కూడా ఉంటుంది. ఎన్నికల టైమ్లో వస్తున్న మా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ∙‘వరలక్ష్మి చాలా వైవిధ్యంగా చేసింది’ అని ప్రేక్షకులు అనుకునేలా మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. లేడీ ఓరియంటెండ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే ఎలాంటి మూవీలోనైనా నటించడానికి రెడీ. తెలుగులో నేను నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. కన్నడలో సుదీప్తో ‘మ్యాక్స్’ చిత్రంలో నటిస్తున్నాను. -
ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా కోట బొమ్మాళి పాట
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్పై ‘బన్నీ’ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 24న విడుదలవుతోంది. ఈ సినిమా నుంచి ‘ఉత్తరాంధ్రను ఊపేసేలా... శ్రీకాకుళం చిందేసేలా...’ అంటూ సాగే టైటిల్ సాంగ్ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీకాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ్మ తల్లి సన్నిధానంలో ఈ పాటను విడుదల చేశారు. రంజన్ రాజ్ సంగీతం అందించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. ఈ పాట విడుదలలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, తేజా మార్ని, చిత్రసహ నిర్మాత భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
లింగి లింగిడి..!
శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతోంది. రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్ స్వరపరచిన ఈ చిత్రంలోని ‘లింగి లింగిడి..’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేయగా, 30 మిలియన్ వ్యూస్ను పూర్తి చేసుకుంది. ‘‘ఈ పాటలానే మా చిత్రానికి ప్రేక్షకులు విజయం అందిస్తారనే నమ్మకం ఉంది’’ అని హైదరాబాద్లో నిర్వహించిన సెలబ్రేషన్స్లో ‘బన్నీ’ వాసు అన్నారు. -
Kota Bommali Ps Teaser Launch: 'కోట బొమ్మాళి పి.ఎస్' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'గన్ కన్నా.. ఫోన్ బాగా పేలుతుంది సార్'
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'కోట బొమ్మాళి పి.ఎస్'. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: అందుకే ఆ హీరోను దూరం పెట్టేశా.. అనసూయ క్రేజీ కామెంట్స్!) టీజర్ చూస్తే ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య జరిగే సన్నివేశాలే కథాంశంగా తీసినట్లు కనిపిస్తోంది. సస్పెన్స్తో పాటు క్రైమ్ థ్రిల్లర్ను తలపించే యాక్షన్ సీన్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నాయి. అసలు ఈ కోట బొమ్మాళి పీఎస్ కథేంటో తెలియాలంటే ఈనెల 24 వరకు ఆగాల్సిందే. Haunting tale from the rustic lands of Srikakulam 🔥🔥#KotabommaliPS teaser out now! - https://t.co/GrvWpLzMBL Grand release worldwide on November 24th ❤🔥@actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @GA2Official @DirTejaMarni @varusarath5 @bhanu_pratapa @Rshivani_1… pic.twitter.com/TG1Pq39zV3 — GA2 Pictures (@GA2Official) November 6, 2023 -
వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న అలనాటి హీరోయిన్ రీ ఎంట్రీ
సీనియర్ నటి మాళవిక గుర్తుందా? 1990- 2000 దశకం కిడ్స్కు ఈ భామను అంత ఈజీగా మరిచిపోలేరు. తెలుగులో శ్రీకాంత్,వడ్డే నవీన్ సూపర్ హిట్ సినిమా అయిన 'చాలాబాగుంది' చిత్రంతో వెండితెరపై మెరిసింది. తర్వాత చంద్రముఖి,ఆంజినేయులు వంటి చిత్రాల్లో మెరిసింది. తమిళంలో చిత్తిరం పేసుదడి చిత్రంలో వాలమీనుక్కమ్ అనే ప్రత్యేక పాటలో మాళవిక డాన్స్ చాలా పాపులరైంది. ఈమె 1999లో అజిత్కు జంటగా ఉన్నై తేడా చిత్రం ద్వారా కథానాయికిగా కోలీవుడ్లో పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లోనూ మాళవిక నాయకిగా నటించి పాపులర్ అయ్యింది. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ ఛాన్సులు ఆమెకు దక్కాయి. అలా ఐదేళ్లపాటు కథానాయకిగా కొనసాగిన ఈమెకు ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఆమైపె వివాదాస్పద నటి అని ముద్ర పడడమేననే ప్రచారం జరిగింది. దీంతో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. 2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయింది మాళవిక. కాగా ఇటీవల తన ఇన్స్ట్రాగామ్లో గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ యాక్టివ్గా ఉంటున్న ఆమె మళ్లీ చిత్రాల్లో నటించడానికి రెడీ అనే సిగ్నల్ ఇచ్చింది. సుమారు 14 ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీకి రెడీ అయింది. అందులో భాగంగా తమిళ్లో సూపర్ అనే కార్యక్రమం ద్వారా బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమవుతున్న 'ఊ సొల్రియా ఊ ఊ సొల్రియా' అనే కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంటోంది. త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో రీ ఎంట్రీ అయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by Shweta Konnur Menon (@shwetakonnurmenon) -
అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ పసివాడి ప్రాణాన్ని బలితీసుకుంది. అక్కను బస్సు ఎక్కించేందుకు బస్సు దగ్గరికి వెళ్లిన బాలుడు బస్సు ముందు టైరు కింద పడి మృతి చెందిన సంఘటన గురువారం హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలం, జనంపల్లికి చెందిన తన్నీరు శ్రీకాంత్ పోస్ట్మెన్గా పనిచేస్తూ పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూరు గణేష్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి కుమార్తె నిషిక, కుమారుడు పవన్ హర్షకుమార్(3) సంతానం. గురువారం ఉదయం పెద్దఅంబర్పేట్లోని కాండర్షైన్ పాఠశాలలో చదువుతున్న తన కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా అతడి కుమారుడు హర్ష కూడా బస్సు వద్దకు వచ్చాడు. అక్కడే ఉన్న బస్సు అటెండర్ మల్లారెడ్డి బాలుడిని గమనించకపోవడంతో బస్సు డ్రైవర్ ఈశ్వర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును ముందుకు తీశాడు. దీంతో బస్సు ముందు చక్రాలు చిన్నారి తలపై వెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు పోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. దీనిని గుర్తించిన కాలనీ వాసులు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
’కోట బొమ్మాళి పీ ఎస్’వచ్చేస్తోంది
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కోటబొమ్మాళి పీఎస్’. మలయాళ సూపర్ హిట్ నాయాట్టుకి తెలుగు రీమేక్గా వస్తున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నుంచి ఆ మధ్య విడుదలైన శ్రీకాకుళం మాస్ జానపద పాట ‘లింగి లింగి లింగిడి’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. యూట్యూబ్లో కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించింది చిత్రబందం. నవంబరు 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నేడు విడుదల తేది పోస్టర్ నువిడుదల చేశారు. పోలీస్ కు రాజకీయనాయకుడికి మధ్య జరిగే పవర్ ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24న విడుదల కానుండంతో ఈ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. -
'ఇది అన్ని కుక్కల్లా లేదు.. ఏదో తేడాగా ఉంది'
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, ఫస్ట్లుక్తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేస్తూ..'ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్లైన్తో విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈ చిత్రం ఓ ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు. టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్ జోనర్లో తెరకెక్కించాలని అనిపించింది. ఈ మూవీ స్క్రీన్ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్ పేరు వినగానే అందరూ ఈ పేరు ఎందుకు పెట్టావని అన్నారు. మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. అది నెగెటివ్ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టా. సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది.' అన్నారు. -
అది నా అదృష్టం
చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ కీలక పాత్రలో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’. ఈ సినిమా నవంబరు 4న థియేటర్స్లో రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నాగబాబు, శ్రీకాంత్ రీ రిలీజ్ ట్రైలర్ను విడుదల చేశారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఏంబీబీఎస్’ తెలుగు రీమేక్ గురించి వినగానే, హీరో పక్కన ఉండే పాత్ర నాకే రావాలనుకున్నాను. అలాగే వచ్చింది. ఇప్పటికీ నన్ను ‘ఏటీఎం’ (శ్రీకాంత్ పాత్ర పేరు) అని పిలుస్తుంటారు. అన్నయ్య (చిరంజీవి)తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు. -
ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు: శ్రీకాంత్
మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్. 2004లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా హీరో శ్రీకాంత్ మెప్పించారు. అయితే ఈ మూవీని మెగా ప్రొడక్షన్స్ ద్వారా నవంబర్ 4న భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ రి రిలీజ్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ ట్రైలర్ను నాగబాబు, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2004ని నేను ఎప్పుడూ మరిచిపోలేను. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మున్నాభాయ్ లగేరహో రీమేక్ వార్త వినిపించింది. హీరో పక్కన ఉండే కారెక్టర్ నాకు ఎలా ఉంటుంది అన్నయ్యా?' అని చిరంజీవిని అడిగా. అలా నవ్వి ఇలా వదిలేశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకే వచ్చింది. అన్నయ్యతో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయనది ఎంతో కష్టపడే మనస్తత్వం. ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తుంటారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోంది. పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ.. 'ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ మూవీ వచ్చి 19 ఏళ్లు అవుతోంది. ప్రతీ 20 ఏళ్లకు ఓ జనరేషన్ మారుతూ ఉంటుంది. టీవీ, యూట్యూబ్లో పాత సినిమాలను ఎవరూ చూడరు. కానీ ఇలాంటి సినిమాలకు మళ్లీ మళ్లీ చూసే ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఇలాంటి చిత్రాలను ఒకప్పుడు థియేటర్లో మళ్లీ ప్రదర్శించేవారు. కానీ ఇప్పుడు ఓటీటీ, ఛానెళ్లలో వస్తున్నాయి. ఇలాంటి సినిమా మళ్లీ 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ట్రైలర్ చూశాకా ఇవన్నీ నాకు గుర్తొచ్చి బాధ, సంతోషం కలిగాయి.' అని అన్నారు. -
ఇక ఆసీస్తో ప్రమాదం
వరుస పరాజయాల అనంతరం ఆ్రస్టేలియా జట్టు ఎట్టకేలకు శ్రీలంకపై చక్కని విజయంతో ప్రపంచకప్లో బోణీ చేసింది. పట్టికలో చేరిన 2 పాయింట్లు ఆసీస్ శిబిరాన్ని సంబరంలో ముంచింది. ఓ కెప్టెన్ ముందుండి నడిపిస్తే దాని ప్రభావం జట్టుపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం రోహిత్ శర్మ భారత్ను ఎలా విజయవంతగా నడిపిస్తున్నాడో చూస్తే అర్థమవుతుంది. ఆసీస్ కెప్టెన్ కమిన్స్ లయ అందుకోవడం, స్పిన్నర్ జంపా తిప్పేయడంతో ‘కంగారూ జట్టు’ ఇకపై ప్రమాదకర శక్తిగా మారుతుంది. ఇదే విషయం వారి గత ఐదు ప్రపంచకప్ టైటిళ్ల ఘనమైన రికార్డు సూచిస్తుంది. మార్ష్ , లబుషేన్లతో పాటు స్మిత్ కూడా నిలకడగా ఆడితే బ్యాటింగ్ దళానికి తిరుగుండదు. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు అఫ్గాన్, దక్షిణాఫ్రికాకు నెదర్లాండ్స్ ఊహించని షాక్లు ఇచ్చాయి. ఇలా రోజుల వ్యవధిలోనే రెండు సంచలనాలు సెమీఫైనల్ బెర్త్ల రేసును రసవత్తరం చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై ఆఖరి పది ఓవర్లలో డచ్ బ్యాటర్లు చెలరేగిన వైనం, బౌలింగ్లో సఫారీపై విసిరిన పంజా అద్భుతం. ఇలాంటి పరాజయం నుంచి దక్షిణాఫ్రికా ఎలా పుంజుకుంటుందో చూడాలి. నేడు ఆస్ట్రేలియా, పాకిస్తాన్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగడం ఖాయం. ఎందుకంటే రెండు మ్యాచ్లు ఓడిన ఆసీస్ గెలుపుబాట పట్టగా, రెండు విజయాలు సాధించిన పాక్ ఓటమితో ఉంది. ఇలాంటి జట్ల మధ్య శుక్రవారం ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. యువ బ్యాటర్లు షఫిక్, ఇమాముల్, షకీల్లతో పాటు సీనియర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్లు బ్యాట్ ఝుళిపిస్తే విజయం ఏమంత కష్టం కాదు. ఇక వేదిక గురించి చెప్పుకోవాల్సి వస్తే... బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయం. ఇది ఎన్నోసార్లు పరుగుల మజా పంచింది. అలాగే నాణ్యమైన బౌలింగ్ రుచి చూపిస్తే... కట్టడి చేయొచ్చని కూడా ఐపీఎల్లో యజువేంద్ర చహల్ నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఎవరు మెరిపిస్తారో, ఎవరు కట్టడి చేస్తారో చూడాలి. -
భయానక చిత్రం
శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ (భయానక చిత్రం) అనేది ఉపశీర్షిక. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని హీరో శ్రీ విష్ణు ఆవిష్కరించి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. సాయికిరణ్ దైదా మాట్లాడుతూ–‘‘పూర్తి స్థాయి హారర్ నేపథ్యంలో ‘పిండం’ ఉంటుంది. ఈ చిత్ర కథ ప్రస్తుతం, 1990, 1930.. ఇలా మూడు కాలాల్లో జరుగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమా టీజర్ను ఈ నెల 30న రిలీజ్ చేస్తాం. నవంబర్లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు యశ్వంత్ దగ్గుమాటి. ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణ సౌరభ్ సూరంపల్లి. -
‘కివీస్ తమ స్థాయిని చూపించింది’
తొలి మ్యాచ్లో ఇంగ్లండ్పై సాధించిన ఘనవిజయం కారణంగా న్యూజిలాండ్ గురించి ఇప్పుడు ఇతర టీమ్ల దృష్టి కోణం మారి ఉంటుంది. ఫేవరెట్గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ను కివీస్ దెబ్బకొట్టింది. వేగంగా లక్ష్యం చేరిన ఆ జట్టు గెలుపుతో పాటు మెరుగైన రన్రేట్ను కూడా సాధించింది. ఇలాంటి పెద్ద టోర్నీల్లో సెమీస్ చేరేందుకు రన్రేట్ కూడా కీలకంగా మారుతుంది. తర్వాతి మ్యాచ్లో కివీస్కు నెదర్లాండ్స్ పోటీనిచ్చే అవకాశం కనిపించడం లేదు. పాకిస్తాన్తో మ్యాచ్నూ మెరుగ్గానే ఆరంభించినా ‘డచ్’ దానిని నిలబెట్టుకోలేకపోయింది. డి లీడ్ అద్భుతంగా ఆడినా ఇలాంటి మ్యాచ్లో ఒకరికంటే ఎక్కువ మంది మంచి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ఇంగ్లండ్తో మ్యాచ్లో కాన్వే, రచిన్ అదే చూపించారు. కాన్వే ఐపీఎల్లో ఇప్పటికే సత్తా చాటగా, రచిన్ కొత్తగా వచ్చాడు. రాహుల్, సచిన్ పేర్లను కలిపి పెట్టుకున్న అతను వారిద్దరు గర్వపడేలా ఆడాడు. అతని బ్యాటింగ్లో రవీంద్ర జడేజా పోలికలు కనిపిస్తున్నాయి. అతనిలాగే ఇతనూ లెఫ్టార్మ్ స్పిన్నరే. ముగ్గురు టాప్ ఆటగాళ్లు కలగలిసిన వ్యక్తి అంటే అతని ఆట కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా. భారతీయ మూలాలు ఉన్న రచిన్ ఆట శైలి కూడా సగటు న్యూజిలాండర్లా లేదు. చక్కటి టైమింగ్, పదునైన స్ట్రోక్లతో ఇంగ్లండ్ బౌలింగ్ను దెబ్బ కొట్టిన అతని ఆట నాకు బాగా నచ్చింది. విలియమ్సన్లాంటి పలువురు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగి కూడా న్యూజిలాండ్ 9 వికెట్ల ఘనవిజయంతో టోర్నీ తొలి మ్యాచ్లోనే తమ స్థాయిని ప్రదర్శించింది. నేటి మ్యాచ్లో నెదర్లాండ్స్ కూడా చివరి వరకు పోరాడవచ్చేమో కానీ కివీస్కు మరో రెండు పాయింట్లు రాకపోతే ఆశ్చర్యపోవాల్సిందే. -
'మీ కూతురితో నాకు పెళ్లి ఒక్కటే కాలేదు..' ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్!
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏందిరా ఈ పంచాయితీ'. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్పై ప్రదీప్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రాన్ని గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ను కూడా చూపించబోతోన్నట్లు తెలుస్తోంది. తాజాగా హీరో శ్రీకాంత్ చేతులు మీదుగా ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ బాగుంది. కొత్త టీం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. కాగా.. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, గ్లింప్స్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రేమ పంచాయితీ
భరత్, విషికా లక్ష్మణ్ జంటగా టి. గంగాధర దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ లవ్ ఎమోషనల్ లవ్స్టోరీ ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఎం.ప్రదీప్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ బాగుంది.. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్ధాలు కావు’, ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
టాలీవుడ్లో సూపర్ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!!
శ్రీకాంత్, రాశి ఈ జోడీ వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించింది. ప్రేయసి రావే, అమ్మో! ఒకటో తారీఖు, దీవించండి, పండగ, గిల్లికజ్జాలు, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు.. మీ ఆవిడ చాలామంచిది లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అయితే చాలా రోజుల తర్వాత ఇటీవలే వీరిద్దరు జంటగా కనిపించారు. అప్పట్లో సూపర్ హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. ఓకే వేదికపై కనిపించడంతో అభిమానులు వీరి కాంబినేషన్పై వచ్చిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న రాశి, శ్రీకాంత్ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: అందుకే ‘పెదకాపు’ అని టైటిల్ పెట్టాం: నిర్మాత) అయితే ఈ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు చాలా చిలిపిగా ప్రవర్తించారు. పక్క పక్కనే నిలబడి రాశి, శ్రీకాంత్ వేదికపై నవ్వుతూ కనిపించారు. ఒకరి వైపు ఒకరు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వారు. అయితే వారిద్దరి మధ్య సంభాషణ పక్కనపెడితే.. ఆ జోడీ ఓకే వేదికపై కనిపించడం అభిమానులకు కనువిందు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈవెంట్లో రాశి పలు ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. తాము ఓకే ఏడాదిలో ఇద్దరం వేరు వేరుగా ఏకంగా ఎనిమిది చిత్రాల్లో నటించామని తెలిపింది. 2000 సంవత్సరంలో రాశి నటించిన పోస్ట్మ్యాన్, ఒకే మాట, మూడు ముక్కలాట, దేవుళ్లు సహా 8 తెలుగు చిత్రాలు, మూడు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి!, ‘చాలా బాగుంది..!, చూసొద్దాం రండి, సకుటుంబ సపరివార సమేతం లాంటి చిత్రాలతో అదే ఏడాదిలో శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. (ఇది చదవండి: తెలుగు సీరియల్ నటి.. ఇంతలా రెచ్చిపోవడానికి కారణం!) కాగా.. రాశి ప్రస్తుతం జానకీ కలగనలేదు సీరియల్తో బుల్లితెరపై సందడి చేస్తోంది. శ్రీకాంత్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర, రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ ఛేంజర్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన రామ్ పోతినేని స్కంద ఈ నెల 28న విడుదల కానుంది. చాలా రోజుల తర్వాత కలిస్తే ఇలానే ఉంటది ఏం మాట్లాడుకున్నారో కానీ....చూస్తుంటే ముచ్చటేస్తుంది 😍 #Srikanth #Raasi pic.twitter.com/bOhP9TnICf — Rajesh Manne (@rajeshmanne1) September 25, 2023 -
దాసరితో సినిమా తీయకపోవడానికి కారణం ఇదే : హీరో శ్రీకాంత్
-
ఆపరేషన్ దుర్యోధన సినిమా గురించి హీరో శ్రీకాంత్..!
-
నాకు చిరంజీవి గారికి ఒక మంచి బాండింగ్ ఉంది
-
హీరో శ్రీకాంత్ తన లవ్ మ్యారేజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
-
ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం అంటున్న శ్రీకాంత్
-
భయపెట్టే తంతిరం
భార్యాభర్తల మధ్యలో ఓ ఆత్మ ప్రవేశించడం వల్ల వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితమైంది? అనే కథాంశంతో రూపొందిన హారర్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘తంతిరం’. శ్రీకాంత్ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించారు. ముత్యాల మెహర్ దీపక్ దర్శకత్వంలో శ్రీకాంత్ కంద్రగుల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ‘‘ఆడియన్స్కు గుర్తుండిపోయే చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ గుర్రం. ‘‘ఈ సినిమా చూసి ఆడియన్స్ థ్రిల్ అవుతారు’’ అన్నారు మెహర్ దీపక్. ‘‘బడ్జెట్ ఎక్కువ అవుతున్నా రాజీ పడకుండా నిర్మించాం. ప్రేక్షకులు ఈ సినిమాను హిట్ చేయాలి’’ అన్నారు శ్రీకాంత్ కంద్రగుల. -
నిజాన్ని నిజాయితీగా చెప్పాం
‘‘మంత్ ఆఫ్ మధు’లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. శ్రీకాంత్గారు అద్భుతంగా తీశారు. ఇది ఫీమేల్ సెంట్రిక్ సినిమా కాదు’’ అని స్వాతి రెడ్డి అన్నారు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో శ్రీకాంత్ నాగోతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మేమెంత ΄్యాషనేట్గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా చేరువవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘ఈ చిత్రం 90 శాతం షూటింగ్ని వైజాగ్లో చేశాం’’ అన్నారు యశ్వంత్ ములుకుట్ల. -
కోట బొమ్మాళి పాట
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
‘కోటబొమ్మాలి పిఎస్’లో శ్రీకాకుళం ఫోక్ సాంగ్
తెలుగు సినిమాలను నిర్మించడంతో పాటు పర భాష చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తూ దూసుకెళ్తోంది ప్రముఖ నిర్మాణ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్-2. ఇప్పటికే పలు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలను తెలుగులో విడుదల చేసింది. తాజాగా మలయాళ బ్లాక్ బస్టర్ నాయాట్టు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తోంది.కోట బొమ్మాళి పిఎస్ పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.