Kashyap
-
‘ఎఫ్బీఐ’ డైరెక్టర్గా కశ్యప్ పటేల్.. నామినేట్ చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ జనవరిలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో తన పరిపాలన టీమ్లో కీలకమైన సభ్యులను ఒక్కొక్కరిని నియమిస్తున్నారు. పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు ఇప్పటికే ట్రంప్ కీలక పదవులిచ్చారు.తాజాగా భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్కు దేశంలోనే అత్యంత ముఖ్యమైన దర్యాప్తు సంస్థ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్గా కశ్యప్ను నియమించనున్నట్లు ప్రకటించారు.‘కాష్ గొప్ప లాయర్,దర్యాప్తులో దిట్ట. అమెరికాలో అవినీతి నిర్మూలనకు,న్యాయాన్ని గెలిపించేందుకే నిత్యం శ్రమించే ‘అమెరికా ఫస్ట్’ ఫైటర్’. అమెరికా ప్రజల రక్షణలో ఆయన కృషి గొప్పంది.కాష్ నియామకంతో ఎఫ్బీఐకి పునర్వైభవం తీసుకొస్తాం’అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫాంలో పోస్టు చేశారు.తొలి నుంచి ట్రంప్కు వీరవిధేయుడిగా కాష్కు పేరుంది. కశ్యప్ పూర్వీకులు భారత్లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్గా వివిధ హోదాల్లో సేవలందించారు. -
లోక్సభ అభ్యర్థికి పాలాభిషేకం!
బీహార్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ మనీష్ కశ్యప్ పశ్చిమ చంపారన్ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆ ప్రాంతంలో విరివిగా పర్యటిస్తూ, ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ నేపధ్యంలో మనీష్ కశ్యప్కు కొందరు మహిళలు పాలాభిషేకం చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య ఒక కేసులో చిక్కుకుని,ఇటీవలే జైలు నుంచి విడుదలైన మనీష్ కశ్యప్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. కొత్త బీహార్ను సృష్టించడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మనీష్ చెబుతున్నారు. తూర్పు చంపారన్ జిల్లా బంజరియా బ్లాక్లోని రతన్పూర్ గ్రామానికి మనీష్ కశ్యప్ ప్రచారానికి వచ్చిన సందర్భంగా అక్కడి మహిళలు అతనికి పాలాభిషేకం చేశారు. మనీష్ కశ్యప్ ఎన్నికల పర్యటనలో ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మనీష్ కశ్యప్ను చూసేందుకు జనం తరలివస్తున్నారు. -
సింధు పునరాగమనం
కౌలాలంపూర్: గాయంతో ఐదు నెలలు ఆటకు దూరంగా ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది. నేటి నుంచి జరిగే మలేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీతో 2023 బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులందరూ బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత్ తరఫున పీవీ సింధు, ఆకర్షి కశ్యప్, సైనా నెహ్వాల్, మాళవిక ... పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్య సేన్ పోటీపడుతున్నారు. గత ఏడాది ఆగస్టులో కామన్వెల్త్ గేమ్స్లో చివరిసారి బరిలోకి దిగిన సింధు మహిళల సింగిల్స్లో భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. ఆ తర్వాత చీలమండ గాయంతో ప్రపంచ చాంపియన్షిప్తోపాటు ఇతర టోర్నీలకు ఆమె దూరంగా ఉంది. సింధు బుధవారం జరిగే తొలి రౌండ్లో మూడుసార్లు ప్రపంచ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ (స్పెయిన్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్లో మంగళవారం తొలి రౌండ్ మ్యాచ్లో కెంటా నిషిమోటో (జపాన్)తో కిడాంబి శ్రీకాంత్ ఆడతాడు. 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 10 కోట్ల 29 లక్షలు) ప్రైజ్మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 87,500 డాలర్ల చొప్పున (రూ. 72 లక్షలు) అందజేస్తారు. -
Huzurabad: గులాబీ గూటికి ముద్దసాని కశ్యప్ రెడ్డి
సాక్షి, కరీంనగర్: త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు కశ్యప్రెడ్డి కాంగ్రెస్ను వీడి గు లాబీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్రెడ్డి వర్గీయుడిగా గుర్తింపు పొందిన కశ్యప్ రెడ్డి సోమవారం మంత్రులు టి.హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతున్న పరిస్థితుల్లో కశ్యప్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడం చర్చనీయాంశమైంది. 2014లో టీడీపీ నుంచి కశ్యప్ పోటీ మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి మరణం తరువాత 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కశ్యప్రెడ్డి తొలిసారిగా హుజూరాబాద్ నుంచి బరిలో నిలిచారు. టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన కశ్యప్ రెడ్డి మూడోస్థానంలో నిలిచారు. తరువాత పరిణామాల్లో ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి అనుయాయుడిగా వ్యవహరించిన కశ్యప్ రెడ్డి.. ఆయనతో పాటే కాంగ్రెస్లో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రేవంత్రెడ్డి ద్వారా విఫలయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిస్థితుల్లో కశ్యప్ రెడ్డి చేరికతో ‘వచ్చే ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా విజయం కోసం కృషి చేస్తా’ అని స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు కశ్యప్ రెడ్డి బాబాయ్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు హుజూరాబాద్ అభ్యర్థి కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా టికెట్టు ఇస్తే పోటీ చేయాలనే నాయకుల సంఖ్య కూడా పెరుగుతోంది. చదవండి: Huzurabad: తెరపైకి పురుషోత్తంరెడ్డి పేరు.. ఎవరీయన?! -
ప్రణీత్, కశ్యప్ ఔట్
ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్ సింగిల్స్లో భారత పోరాటం ముగిసింది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ సింధు, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా... తాజాగా ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ కూడా వెనుదిరిగారు. గురువారం 84 నిమిషాల పాటు సాగిన ప్రిక్వార్టర్ పోరులో ప్రపంచ 11వ ర్యాంకర్ సాయిప్రణీత్ 20–22, 22–20, 16–21తో టోర్నీ నాలుగో సీడ్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్లో నువ్వా–నేనా అన్నట్లు పోరాడటంతో స్కోరు 20–20తో సమమైంది. చివర్లో వరుసగా రెండు పాయింట్లు సాధించిన డెన్మార్క్ షట్లర్ తొలి గేమ్ను గెలిచాడు. రెండో గేమ్లోనూ ఇద్దరు ఆటగాళ్లు తొలుత హోరాహోరీగా ఆడినప్పటికీ కీలక సమయంలో పాయింట్లు సాధించిన ప్రణీత్ 19–13తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో తడబడిన ప్రణీత్ వరుసగా 5 పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయి ఆధిక్యాన్ని 19–18కి తగ్గించుకున్నాడు. అనంతరం ప్రణీత్ ఒక పాయింట్, ఆంటోన్సెన్ రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకోగా స్కోర్ 20–20తో సమమైంది. అయితే ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని ప్రణీత్ రెండు పాయింట్లు సాధించి రెండో గేమ్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నిర్ణాయక మూడో గేమ్లో డెన్మార్క్ షట్లర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మరో ప్రిక్వార్టర్ పోరులో కశ్యప్ 13–21, 19–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడాడు. తొలి గేమ్లో ఏ మాత్రం పోటీ ఇవ్వని కశ్యప్ రెండో గేమ్లో మాత్రం పోరాడాడు. అయితే 19–17తో ఉన్న సమయంలో ఒత్తిడికి లోనైన కశ్యప్ వరుసగా 4 పాయింట్లను ప్రత్యర్థికి సమర్పించుకొని ఇంటి ముఖం పట్టాడు. సాత్విక్కు మిశ్రమ ఫలితాలు భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్కు మిశ్రమ ఫలితాలు ఎదురైయ్యాయి. డబుల్స్లో చిరాగ్ శెట్టితో జత కట్టిన సాయిరాజ్ క్వార్టర్స్ చేరగా... మిక్స్డ్ డబుల్స్లో మాత్రం ప్రిక్వార్టర్స్ అడ్డంకిని దాటలేకపోయాడు. డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం 21–18, 21–23, 21–11తో ఆరో సీడ్ హిరోయుకి ఎండో– యుట వటనాబె (జపాన్) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప జంట 21–23, 16–21తో టోర్నీ ఐదో సీడ్ సియో సెయుంగ్ జే– చే యుజుంగ్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్స్ పోరులో టోర్నీ మూడో సీడ్ లి జున్ హుయ్– లియు యున్ చెన్ (చైనా) జంటతో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం తలపడుతుంది. -
సత్తాకు పరీక్ష
అద్వితీయ ప్రదర్శనతో విశ్వవిజేతగా అవతరించి... అన్ని వర్గాల నుంచి ఆత్మీయ సత్కారాలు, స్వాగతాలు అందుకొని... కొత్త చరిత్ర మధుర క్షణాలను ఆస్వాదించి... మూడు వారాలుగా బిజీబిజీగా గడిపిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టనుంది. నేడు మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ప్రపంచ చాంపియన్షిప్ కోసం పక్కాగా సిద్ధమై అనుకున్న లక్ష్యాన్ని అందుకున్న సింధు... చైనా గడ్డపై రెండోసారి విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో ఇక నుంచి సింధు ఆటతీరును ఆమె ప్రత్యర్థులు నిశితంగా గమనించే అవకాశం ఉంది. సరికొత్త వ్యూహాలతో ఈసారీ తన ప్రత్యర్థులకు సింధు చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. చాంగ్జౌ (చైనా): భారత బ్యాడ్మింటన్ స్టార్స్ మరో సమరానికి సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో మహిళల ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, మాజీ రన్నరప్ సైనా నెహా్వల్... పురుషుల సింగిల్స్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత భమిడిపాటి సాయిప్రణీత్, కశ్యప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్విట్జర్లాండ్లో గత నెలలో ముగిసిన ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొంటున్న తొలి టోర్నమెంట్ ఇదే కానుంది. కాస్త కఠినమే... మహిళల సింగిల్స్లో పీవీ సింధు ఐదో సీడ్గా, సైనా నెహ్వాల్ ఎనిమిదో సీడ్గా బరిలోకి దిగనున్నారు. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్ల్లో ప్రపంచ మాజీ నంబర్వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్తో సింధు... ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్ఫన్ (థాయ్లాండ్)తో సైనా ఆడతారు. లీ జురుయ్తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... సైనా 3–1తో బుసానన్పై ఆధిక్యంలో ఉంది. గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన లీ జురుయ్ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయతి్నస్తోంది. ఈ ఏడాది ఇండోనేసియా మాస్టర్స్ టోరీ్నలో లీ జురుయ్తో ఆడిన సింధు మూడు గేమ్లపాటు పోరాడి గెలిచింది. గత నెలలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలకు పక్కా ప్రణాళికతో సిద్ధమైన సింధు చైనా ఓపెన్లోనూ సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉంది. 2016లో ఈ టోరీ్నలో విజేతగా నిలిచిన సింధు అదే ఫలితాన్ని ఈసారి పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి రౌండ్ గట్టెక్కితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ చెన్ యుఫె (చైనా), సెమీస్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) లేదా సైనా ఎదురయ్యే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న రెండుసార్లు ప్రపంచ మాజీ చాంపియన్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్ ఈ టోరీ్నలో ఆడుతోంది. గతవారం వియత్నాం ఓపెన్లో మారిన్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో నాలుగో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో మారిన్ ఆడుతుంది. ఇదే పార్శ్వంలో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్), మాజీ విశ్వవిజేత రచనోక్ (థాయ్లాండ్) ఉన్నారు. కోచ్ కిమ్ జీ హ్యున్ లేకుండానే... ప్రపంచ చాంపియన్షిప్లో సింధు స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించిన భారత మహిళల సింగిల్స్ కోచ్ కిమ్ జీ హ్యున్ (దక్షిణ కొరియా) చైనా ఓపెన్కు జట్టు వెంట వెళ్లడం లేదు. తన భర్త ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె స్వదేశం వెళ్లిపోయింది. ఆమె తిరిగి జట్టుతో ఎప్పుడు చేరుతుందనే అంశంపై స్పష్ట మైన సమాచారం లేదు. కనీసం రెండు వారాలపాటు ఆమె తన కుటుంబంతో ఉండే అవకాశముంది. సాయిప్రణీత్ జోరు కొనసాగేనా... పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి నలుగురు ఎంట్రీలు పంపించినా... మోకాలి గాయం కారణంగా కిడాంబి శ్రీకాంత్... డెంగీ జ్వరంతో ప్రణయ్ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. దాంతో భారత్ ఆశలన్నీ సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్పై ఆధారపడ్డాయి. పురుషుల సింగిల్స్లో 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచ చాంపియన్íÙప్లో కాంస్య పతకం నెగ్గిన భారత ప్లేయర్గా గుర్తింపు పొందిన సాయిప్రణీత్ ఈ టోర్నీలో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. తొలి రౌండ్లో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)తో సాయిప్రణీత్ ఆడతాడు. తొలి రౌండ్లో గెలిస్తే రెండో రౌండ్లో మూడో సీడ్ షి యు కి (చైనా)తో సాయిప్రణీత్ ఆడే చాన్స్ ఉంది. కశ్యప్ తొలి రౌండ్లో లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో తలపడతాడు. పురుషుల డబుల్స్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సుమీత్ రెడ్డి–మను అత్రి జోడీలు పోటీ పడనున్నాయి. మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశి్వని పొన్నప్ప... మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; అశ్విని పొన్నప్ప–సాత్విక్ సాయిరాజ్ జంటలు బరిలో ఉన్నాయి. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్
సింగపూర్ : సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. ర్యాంకింగ్స్లో దిగువన ఉండటంతో అతను క్వాలిఫయింగ్ ఈవెంట్లో పోటీపడ్డాడు. మంగళవారం రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన కశ్యప్ మెయిన్ డ్రా పోటీలకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్ క్వాలిఫికేషన్ తొలి రౌండ్లో ఈ భారత వెటరన్ షట్లర్ 21–5, 14–21, 21–17తో మలేసియాకు చెందిన చిమ్ జున్ వీపై గెలుపొందాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 15–21, 21–16, 22–20తో జపాన్ ఆటగాడు యు ఇగరషిపై చెమటోడ్చి నెగ్గాడు. మరోవైపు మహిళల సింగిల్స్లో ముగ్ధా ఆగ్రే కూడా మెయిన్ డ్రాకు అర్హత పొందింది. ఆమె క్వాలిఫయింగ్లో 16–21, 21–14, 21–15తో అమెరికా షట్లర్ లారెన్ లామ్పై గెలిచింది. నేడు జరిగే ప్రధాన డ్రా తొలి మ్యాచ్లో రస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో కశ్యప్, పోర్న్పవి చొచువాంగ్ (థాయ్లాండ్)తో ముగ్ధా ఆగ్రే పోటీపడతారు. పురుషుల డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో ఎం.ఆర్. అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జోడీ 11–21, 18–21తో ఆరో సీడ్ కిమ్ అస్ట్రప్–అండర్స్ స్కారప్ (డెన్మార్క్) జోడీ చేతిలో ఓడింది. ఈ రోజు జరిగే మెయిన్ డ్రా పోటీల్లో భారత స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్.ప్రణయ్లు తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. -
ప్రిక్వార్టర్స్లో కశ్యప్, మిథున్
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఫ్రాన్స్లో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ కశ్యప్ 21–15, 21–17తో రొసారియో (ఇటలీ)పై గెలి చాడు. హైదరాబాద్కే చెందిన గురుసాయిదత్ 18–21, 17–21తో అజయ్ జయరామ్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్లో తెలుగు అమ్మాయిలు శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. శ్రీకృష్ణప్రియ 16– 21, 22–20, 13–21తో ముగ్ధ (భారత్) చేతిలో... వృశాలి 11–21, 12–21తో పొలికర్పోవా (ఇజ్రాయెల్) చేతిలో ఓడారు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో మిథున్ 21–18, 21–16తో సిద్ధార్థ్పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరాడు. నికొలోవ్ (బల్గేరియా)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో సిరిల్ వర్మ తొలి గేమ్ను 22–20తో నెగ్గి, రెండో గేమ్ను 14–21తో కోల్పోయాడు. మూడో గేమ్లో 3–14తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగాడు. -
రెండో రౌండ్లో కశ్యప్
బాసెల్,(స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, శుభాంకర్ డే రెండో రౌండ్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో కశ్యప్ 21–19, 21–17తో ఫెలిక్స్ బ్యూరెస్డెట్ (స్వీడన్)పై, శుభాంకర్ 21–19, 21–17తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్)పై గెలిచారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 23–21, 17–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తొనియా) చేతిలో, గుమ్మడి వృశాలి 14–21, 11–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయారు. క్వాలిఫయర్ రియా ముఖర్జీ (భారత్) 21–23, 21–15, 21–8తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–15, 21–17తో రాల్ఫీ జాన్సెన్–కిలాసు (జర్మనీ) జోడీపై నెగ్గింది. -
తొలి రౌండ్లోనే కశ్యప్ ఓటమి
గ్వాంగ్జూ (కొరియా): వరల్డ్ టూర్ సూపర్–300 కొరియా ఓపెన్లో భారత షట్లర్లకు చుక్కెదురైంది. స్టార్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 17–21, 21–13, 8–21 లీ డాంగ్ క్యూన్ (కొరియా) చేతిలో... సౌరభ్ వర్మ 13–21, 21–12, 18–21తో ఈటూ హియానో (ఫిన్లాండ్) చేతిలో ఓడారు. గంటా 19 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో కశ్యప్ తొలి రెండు గేమ్ల్లో అద్భుత ప్రదర్శన చేసినా... మూడో గేమ్లో పూర్తిగా తడబడి గేమ్తో పాటు మ్యాచ్ను కోల్పోయాడు. -
మోజు
ఎవరి ప్రమేయం లేకుండా ఓ రోజు మొదలైంది. వీధిదీపాలు ఆర్పేసమయాన్ని కూడా వేగంగా దాటేసింది.మరుసటిరోజు దినపత్రికల్లో.. ‘‘ప్రముఖ నగల వ్యాపారి కశ్యప్చంద్ అదృశ్యం’’ అనే వార్త ప్రధానంగా అందరినీ ఆకర్షించింది. గత వారం రోజులుగా అతడు కనిపించకపోవడంతో పోలీసులకు ఆ కేసు సవాలుగా మారింది. ‘‘సార్..! మా కాకా(చిన్నాన్న) కశ్యప్ చంద్ విషయం ఏమైనా తెలిసిందా?’’ చాలా ఆందోళనగా అడిగాడు విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు).‘‘మీరే చెప్పాలి..! కనిపించక ఇన్ని రోజులైతే మీరు నిన్నొచ్చి కేసు పెట్టారు. ఈ రోజు వచ్చి కేసు ఎంత వరకూ వచ్చిందంటున్నారు? అసలు ఇన్ని రోజులు మీరెందుకు కేసు పెట్టలేదు’’ అని అడిగాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్.‘‘సార్ మా కాకా వాళ్ల కొడుకు నిరాల్ చంద్ ఢిల్లీలో నగల వ్యాపారం చేస్తుంటాడు. అప్పుడప్పుడూ మా కాకా ఢిల్లీలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్తుంటాడు. సో అలా వెళ్లి ఉంటాడని అనుకున్నాం. కానీ నిన్ననే ఢిల్లీకి ఫోన్ చేస్తే తెలిసింది మా కాకా అక్కడలేడని. వెంటనే బంధుమిత్రుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టాం. చివరికి మీకు కంప్లైంట్ ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చాడు విశాల్ చంద్.విశాల్ పక్కనే ఉన్న అతడి భార్య కౌనికా చంద్ కళ్లను అప్రయత్నంగా గమనించాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ముఖంలో ప్రత్యేకమైన ఆకర్షణ లేకున్నా ఆమె చూపుల్లో ఏదో గమ్మత్తుంది. ఎలాంటివారినైనా ఆ కళ్లు కట్టిపారేస్తాయి. కొన్ని క్షణాలపాటు ప్రణయ్ది కూడా అదే పరిస్థితి.‘‘మా కాకా చాలా మంచివాడు సార్. అందరితోనూ చాలా చనువుగా ఆప్యాయంగా మాట్లాడతాడు. మా చిన్నమ్మ చనిపోయి చాలా ఏళ్లు అయ్యింది. పనివాళ్ల సహకారంతో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ప్లీజ్ సార్! ఆయన ఆచూకీని కనిపెట్టే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నుంచి ఉంటుంది’’ అన్నాడు విశాల్.విశాల్ మాటలకి చూపు తిప్పిన ఇన్స్పెక్టర్.. ‘‘సరే విశాల్..! అవసరముంటే మిమ్మల్ని స్టేషన్కి పిలుస్తాను. మీరు వెళ్లొచ్చు’’ అన్నాడు గంభీరంగా. రోజులు గడుస్తున్నాయి. కేసు పరిశీలనలో భాగంగా కశ్యప్ చంద్ జ్యూయెలరీ షోరూమ్ వెళ్లాలనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. ఎందుకంటే అప్పటిదాకా కేసులో ఏ ఆధారమూ దొరకలేదు. పైగా ఎఫ్.ఐ.ఆర్లో కూడా ఎవరిమీద అనుమానం ఉన్నట్లుగా పేర్కొనలేదు. జ్యుయెలరీ షాప్ చాలా విశాలంగా ఉంది. చాలామంది పనివాళ్లున్నారు. దేశవ్యాప్తంగా చాలా బ్రాంచ్లు పెట్టినా హైదరాబాద్లో ఉన్న జ్యుయెలరీ షాప్ అంటేనే కశ్యప్ చంద్కి చాలా ఇష్టమని చెప్పాడు ఓ సిబ్బంది. ఎందుకని అడిగితే... ‘కశ్యప్ సారు మొదటిగా ప్రారంభించి షాప్ ఇదే’ బదులిచ్చాడు. షాప్ అంతా తిరిగి గమనించాడు ప్రణయ్. కశ్యప్ చంద్ కూచునే కౌంటర్ చాలా విశాలంగా ఉంది. పక్కనే కొంచెం చిన్న క్యాష్కౌంటర్లో ఓ పాతికేళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు నీనా వైశాలి. ఇన్స్పెక్టర్ ప్రణయ్ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ షాప్ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంకా కశ్యప్ చంద్ అలవాట్లు, ఆసక్తులు, ఎవరెవరితో చనువుగా ఉంటాడనే విషయాలు అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు.‘‘కశ్యప్ చంద్ పూర్తిగా శాకాహారి. సిగరెట్ కాల్చడు. యాలక్కాయలో ఒకే ఒక్క పలుకు గింజ, లేదా లవంగంలో సగం నోట్లో వేసుకుని అటూ ఇటూ ఆడిస్తుంటాడు. అంతకు మించి అతని ఆహారంలో మరే ప్రత్యేకత లేదు. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఓ చల్లని ‘యాపిల్ ఫీజ్’ తాగుతుంటాడు. కస్టమర్లతో ఆహ్లాదకరంగా మాట్లాడుతుంటాడు. వచ్చేది ఎక్కువగా మహిళలే కనుక అందరితో సౌమ్యంగా, ఆత్మీయంగా సంభాషిస్తుంటాడు. అది అతనిలో ఉన్న ప్రత్యేకత’’ చెప్పుకొచ్చాడు మరో సిబ్బంది. అయితే చివరగా ఆ సిబ్బంది కొన్ని ముఖ్యమైన విషయాలనే చెప్పాడు. కశ్యప్ చంద్ స్త్రీలోలుడు. ఆడవాళ్లని అందులోనూ అందమైన ఆడవాళ్లని తన మాటలతో బురిడీ కొట్టించే మనస్తత్వం కలవాడనే అర్థమొచ్చేలా కొన్ని విషయాలను చాలా సాధారణంగా చెప్పాడు ఆ సిబ్బంది. స్టేషన్కి తిరిగి వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రణయ్కి.. ఆ సిబ్బంది చెప్పిన చివరి మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి. అంటే కశ్యప్ చంద్కి ఆడయావ ఎక్కువ. వయసు 60 దాటినా ఆడ పిచ్చిపోలేదు’’ అనుకుంటూ ఆలోచనల్లో పడిన ప్రణయ్కి... వారంరోజుల క్రితం స్టేషన్కి వచ్చిన విశాల్ చంద్(కశ్యప్ చంద్ అన్నకొడుకు) భార్య కౌనికా చంద్తో పాటు కశ్యప్ చంద్ జ్యుయెలరీ షాప్లో పనిచేస్తున్న నీనా వైశాలీ గుర్తుకొచ్చారు.వెంటనే వాళ్లని స్టేషన్కి పిలిపించాడు. ముందుగా కౌనికా చంద్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రణయ్.‘‘మీరేం చేస్తుంటారు?’’‘‘జాబ్ అంటూ ఏం లేదు. మావారికి సహకరిస్తుంటాను.’’‘‘మీ చిన్న మావయ్య.. అదే కశ్యప్ చంద్ మీతో ఎలా ఉండేవారు.’’‘‘చాలా సరదాగా ఉండేవారు. అప్పుడప్పుడూ నేనే ఆయనకి డిన్నర్ తీసుకెళ్లేదాన్ని’’ చెప్పింది కౌనికా.‘‘మీరే ఎందుకు? పనివాళ్లు చాలా మంది ఉంటారుగా వాళ్ల చేత పంపొచ్చుగా?’’‘‘నేను వెళ్తే ఆయన చాలా సంతోషించేవారు. ‘ఆడ దిక్కులేని కొంప. అప్పుడప్పుడూ వచ్చిపోతుండు’ అనేవారు. అందుకే నాకు తీరిక దొరికినప్పుడు, పనివాళ్లు అందుబాటులో లేనప్పుడూ నేనే స్వయంగా డిన్నర్ తీసుకెళ్లి వడ్డించేదాన్ని’’‘‘మరి.. ఆయన స్త్రీలోలుడని విన్నాను నిజమేనా?’’‘ఆయనకు కాస్త సరసాలెక్కువే. కోడలినైనా నాతోనూ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవారు.అవకాశం ఇస్తే అతడు ఎలాంటి సంబంధానికైనా సిద్ధమన్నట్లుగా ఉండేవాడు.’’‘‘మరి మీరెప్పుడూ అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడలేదా?’’‘‘అంటే.. మొదట్లో కాస్త ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఆయన మనస్తత్వం అంతేనని సరిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఒంటరి ముసలివాడనే జాలి ఎక్కువగా ఉండేది నాకు. నా భర్త కూడా రెండుమూడు సార్లు అతడి ప్రవర్తన గురించి నన్ను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని.’’‘‘ఆయన్ని చివరగా ఎప్పుడు చూశారు?’’‘‘సుమారు పదిహేను రోజులవుతుంది. నేను మా పుట్టింటికి వెళ్లే ముందు రోజు అతడికి డిన్నర్ తీసుకెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అతడు ఊర్లో లేడని తెలిసింది. ఢిల్లీ వెళ్లి ఉంటారనుకున్నాం. కానీ అతడు అక్కడ కూడా లేకపోయేసరికి మిమ్మల్ని ఆశ్రయించాం.’’ప్రణయ్ రెట్టించినా.. గర్దించినా.. అంతకు మించి ఏం రాలేదు ఆమె నుంచి. మొత్తానికి అదృశ్యమైన కశ్యప్ చంద్ ‘స్త్రీ లోలుడని’’ అర్థమైంది. నీనా వైశాలీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించింది. కశ్యప్ చంద్ ఇంట్లో వంటపని చేసే టిట్టూని ప్రశ్నించాడు. ఆమె కాస్త వణికింది. ఎందుకని ఆరా తీస్తే.. తన పట్ల కూడా కశ్యప్ అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఎక్కడ ఉద్యోగం పోతుందోననే భయంతో అతడి ఆగడాలను భరించానని చెప్పుకొచ్చింది. చివరగా షోరూమ్లో ఉన్న సీసీ పుటేజ్లను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. కశ్యప్ చంద్ కనిపించకుండా పోయిన రోజు నుంచి వెనక్కి ఒక్కో రోజు ఒక్కో రోజూ సీసీ ఫుటేజ్లో గమనించాడు. ఆ ఫుటేజ్లో కొందరు ఆడవాళ్లు కశ్యప్తో చాలా చనువుగా ఉన్నారు. దాంతో వాళ్లందరినీ స్టేషన్కి పిలిపించి విచారించాడు. ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. మళ్లీ మళ్లీ ఆ సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తూనే ఉన్నాడు. రోజు, వారాలు, నెలలు వెనక్కి వెనక్కి వెళ్లి మరీ షోరూమ్ దృశ్యాలను సీసీ ఫుటేజ్లో చూస్తూనే ఉన్నాడు. ఈ సారి షోరూమ్కి వచ్చే ఆడవాళ్లని కాదు. షోరూమ్లో ఉన్న కశ్యప్ చంద్ హావభావాలపై దృష్టిపెట్టాడు. అలా చూస్తూ ఉండగా కశ్యప్ చంద్ ఎక్స్ప్రెషన్స్ ఓ చోటా కాస్త డిఫరెంట్గా తోచాయి. ఎదురుగా డోర్ తెరుచుకుని లోనికి వస్తున్న ఓ మహిళను చూసి ఎడమ కన్ను మీటుతున్నాడు. ఆమె నవ్వుకుంటోంది. ఆమెని మరింత జూమ్ చేసి చూశాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. చాలా అందంగా చురుగ్గా ఉన్న ఆమెకు వయసు ముప్ఫై దాటినట్లే ఉన్నాయి. ఎంక్వైరీలో భాగంగా మొత్తానికీ ఆమెను వెతికిపట్టుకున్నారు పోలీసులు.కాలింగ్ బెల్మోగుతోంది. పోలీసులను చూసి నిర్ఘాంతపోయింది ఆమె.‘‘మీ పేరు?’’ లోపలికి నడిచాడు ప్రణయ్.‘‘సుగుణ కుమారి’’‘‘కశ్యప్ చంద్ మీకు తెలుసా?’’ సోఫాలో కూర్చుంటూ అడిగాడు.‘‘ఏ కశ్యప్ చంద్?’’‘‘అదే జ్యుయెలరీ షాప్ ఓనర్ కశ్యప్ చంద్!?’’‘‘తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు.’’‘‘అవునా? పోనీ.. ఆయన కన్నుగీటితే ముసిముసిగా నవ్వుకున్నారా?’’ అన్నాడు ప్రణయ్ చాలా వెటకారంగా.అతడి ప్రశ్నకి షాక్ అయ్యింది సుగుణ. ‘‘ఏమ్.. ఏం మాట్లాడుతున్నారు?’’ అంది వణుకుతున్న స్వరంతో.‘‘ఇప్పటికీ మించిపోయింది లేదు. కశ్యప్ని ఎక్కడ దాచారో చెబితే శిక్ష తగ్గుతుంది. కచ్చితంగా మీరే ఈ పని చేశారని నా ఎంక్వైరీలో తేలింది’’ గదమాయించాడు ప్రణయ్.‘‘కశ్యప్ చంద్ చనిపోయాడు. నేనే.. నేనే.. చంపేశాను’’ బాగా ఏడుస్తోంది సుగుణ.‘‘వాట్? ఎందుకు?’’‘‘నా స్నేహితురాలు జ్యుయెలరీ కొనడానికి ఒకరోజు కశ్యప్ చంద్ షాప్కి తీసుకెళ్లింది. అప్పుడే అతడు నాకు పరిచయం. ఆ తర్వాత చిన్న చిన్న జ్యుయెలరీలు నేనూ ఇక్కడే కొనేదాన్ని. అతడి మాట తీరు, అతడు చూపించే అభిమానం నాకు బాగా నచ్చేవి. మాటల సందర్భంలో నా భర్త బిజినెస్లో లాస్ అయ్యారని, అప్పులు తీర్చేందుకు గల్ఫ్ వెళ్లారని, ఏదో కేసు విషయంలో అక్కడే జైలు పాలైన నా భర్తను తిరిగి ఇండియాకు రప్పించేందుకు డబ్బులు సర్ధుబాటు కావట్లేదని అతడితో చెప్పుకున్నాను. డబ్బుపరంగా ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తానని మాటిచ్చాడు. పైగా అదే రోజు మా ఇంటికి వచ్చాడు. ‘నేను చేయబోయే డబ్బుసాయానికి కృతజ్ఞతగా ఏమిస్తావ’న్న అతడి కోరికకు నేను లొంగిపోయాను. ఆ రోజు నుంచీ డబ్బు సర్ధుబాటు చెయ్యమంటే ఇదిగో.. అదిగో.. అని జరిపేవాడు. కానీ రెగ్యులర్గా మా ఇంటికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్లిపోయేవాడు. కొన్ని రోజులకి మేము కలిసి దిగిన కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను చూపించి నానుంచే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు. రెండు మూడు చోట్ల అప్పు చేసి కూడా అతడికి డబ్బులిచ్చాను. అతడి ఆగడాలకు విసిగిన నేను అతడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు. నిద్రపోయే ముందు యాపిల్ ఫీజ్ తాగడం అతడికి అలవాటు.అందులో అప్పటికే నిద్రమాత్రలు కలిపి ఉంచాను. అది తాగి మైకంలోకి పోగానే గొంతు నులుమి చంపేశాను. ఆధారాలన్నీ కాల్చి బూడిద చేశాను. శవాన్ని ముక్కలు చేసి మూట కట్టి అర్ధరాత్రి సమయంలో స్కూటీపైన తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాను’’ అని ఏడుస్తూ ముగించింది సుగుణ. సుగుణ వాంగ్మూలం తీసుకున్న ప్రణయ్.. అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లాడు.పోగొట్టుకున్నచోటే వెతకాలనే నానుడి నమ్మి.. సీసీçఫుటేజ్ మళ్లీ మళ్లీ శోధించడం వల్లే కన్నుగీటుతున్న కశ్యప్ చంద్ స్టిల్ చూడగలిగాడు. లేదంటే కేసు ఎప్పటికి తేలేదో!!’ అనుకున్నాడు ఇన్స్పెక్టర్ ప్రణయ్. -
క్వార్టర్స్లో సైనా, ఉత్తేజిత
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్తో సైనా తలపడతారు. సమీర్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధిస్తాడు. సిక్కి–అశ్విని జంట జోరు... మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
సైనా, కశ్యప్ శుభారంభం
లక్నో: సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21–10, 21–10తో కేట్ ఫూ కునె (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్కు చేరింది. తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, మామిళ్లపల్లి తనిష్క్ ముందంజ వేయగా... శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్లో నిష్క్రమించారు. సాయి ఉత్తేజిత 21–19, 21–19తో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్)పై, తనిష్క్ 21–17, 21–16తో రసిక రాజే (భారత్)పై గెలిచారు. వృశాలి 12–21, 9–21తో జాంగ్ యిమాన్ (చైనా) చేతిలో ఓడిపోగా... ప్రాషి జోషితో జరిగిన మ్యాచ్లో 6–3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా శ్రీకృష్ణప్రియ వైదొలిగింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పారుపల్లి కశ్యప్ 21–14, 21–12తో తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్లాండ్)పై, భమిడిపాటి సాయి ప్రణీత్ 21–12, 21–10తో సెర్గీ సిరాంట్ (రష్యా)పై, గురుసాయిదత్ 21–11, 21–15తో జొనాథన్ పెర్సన్ (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రణయ్ 14–21, 7–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో సిరిల్ వర్మ 12–21, 17–21తో సమీర్ వర్మ (భారత్) చేతిలో, చిట్టబోయిన రాహుల్ యాదవ్ 19–21, 21–8, 18–21తో మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 14–21, 11–21తో రెన్ జియాంగ్జు–చావోమిన్ జౌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
సైనా నెహ్వాల్ ప్రేమ వివాహం..?
సాక్షి, హైదరాబాద్: సినిమా నేపథ్యం గల స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణమైన తరుణంలో క్రీడా నేపథ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఈ జాబితాలోకి చేరుతున్నారు. గతంలో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న దినేశ్- కార్తీక్- దీపికా పల్లికల్, గీతా ఫోగట్- పవన్ కుమార్, సాక్షి మాలిక్-సత్యవ్రత్ కాదియాన్, ఇశాంత్ శర్మ- ప్రతిమా సింగ్ల జాబితాలోకి బ్యాడ్మింటన్ స్టార్ జోడి చేరబోతోంది. బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్లు త్వరలో ఒక్కటి కాబొతున్నారా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు వారి సన్నిహిత వర్గాలు. దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న సైనా-కశ్యప్ల వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. డిసెంబర్ 16న వివాహం, అదే నెల 21న రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరవుతారని, కానీ హైదరాబాద్లో రిసెప్షన్ గ్రాండ్గా చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు సైనా-కశ్యప్ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరిద్దరూ 2005 నుంచి గోపిచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్లో శిక్షణ తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా వీరి ప్రేమ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు స్పందించలేదు అదే విధంగా ఖండించనూలేదు. ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వార్తల్లో నిలువలేదు. తాజాగా ఈ స్టార్ ఆటగాళ్లు వివాహం చేసుకోబుతున్నారని తెలియగానే అభిమానులు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు. 28ఏళ్ల సైనా నెహ్వాల్ 2010,2018 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు, 2012 ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించారు. చదవండి: ఆట మొదలు -
246వ ర్యాంకర్ చేతిలో చుక్కెదురు
వ్లాదివోస్టాక్ (రష్యా): పూర్వ వైభవం కోసం తపిస్తున్న భారత మాజీ నంబర్వన్ పారుపల్లి కశ్యప్కు మరో నిరాశాజనక ఓటమి ఎదురైంది. రష్యా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 246వ ర్యాంకర్ ర్యొటారో మరువో (జపాన్)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్, నాలుగో సీడ్ కశ్యప్ 34 నిమిషాల్లో 12–21, 11–21తో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన కశ్యప్ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతవారం సింగపూర్ ఓపెన్ టోర్నీలో భారత్కే చెందిన సౌరభ్ వర్మతో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో కశ్యప్ కేవలం 15 నిమిషాల్లోనే ఓడిపోయాడు. హైదరాబాద్కే చెందిన గురుసాయిదత్, చిట్టబోయిన రాహుల్ యాదవ్తోపాటు భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, చిరాగ్ సేన్, బోధిత్ జోషి, ప్రతుల్ జోషి కూడా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. రెండో రౌండ్ మ్యాచ్ల్లో గురుసాయిదత్ 14–21, 8–21తో వ్లాదిమర్ మల్కోవ్ (రష్యా) చేతిలో... రాహుల్ యాదవ్ 21–23, 11–21తో సౌరభ్ వర్మ (భారత్) చేతిలో... చిరాగ్ సేన్ 14–21, 21–16, 16–21తో పాబ్లో అబియాన్ (స్పెయిన్) చేతిలో... అజయ్ జయరామ్ 21–15, 14–21, 15–21తో శుభాంకర్ డే (భారత్) చేతిలో... బోధిత్ జోషి 8–21, 14–21తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (భారత్) చేతిలో... ప్రతుల్ జోషి 12–21, 21–18, 13–21తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్) చేతిలో ఓడిపోయారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో వృశాలి మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలితోపాటు రితూపర్ణ దాస్, ముగ్ధా అగ్రే ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... చుక్కా సాయి ఉత్తేజిత రావు, వైదేహి చౌదరీ ఓడిపోయారు. వృశాలి 21–11, 21–16తో ఎలీనా కొమెన్ద్రవోస్కాజా (రష్యా)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–18తో విక్టోరియా (రష్యా)పై, ముగ్ధ 21–16, 21–19తో యిన్ ఫమ్ లిమ్ (మలేసియా)పై గెలుపొందారు. సాయి ఉత్తేజిత 21–14, 15–21, 18–21తో బ్యోల్ లిమ్ లీ (కొరియా) చేతిలో... వైదేహి 13–21, 15–21తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
ఆస్ట్రియా ఓపెన్ విజేత కశ్యప్
వియన్నా: మూడేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కశ్యప్ 23–21, 21–14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో కశ్యప్ 21–18, 21–4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు స్విస్ ఓపెన్లో భారత్కే చెందిన సమీర్ వర్మ కూడా ఫైనల్కు చేరాడు. సెమీఫైనల్లో సమీర్ వర్మ 21–14, 11–21, 21–12తో వాంగ్చరోయిన్ (థాయ్లాండ్)ను ఓడించాడు. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్
కౌలూన్ (హాంకాంగ్): మళ్లీ పూర్వ వైభవం కోసం తపిస్తున్న భారత మాజీ నంబర్వన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో కశ్యప్ 21–12, 21–10తో కాన్ చావో యు (చైనీస్ తైపీ)పై, 21–13, 21–19తో లీ చెయుక్ యియు (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 18–21, 11–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ల్లో మెటీ పౌల్సెన్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్; లెయుంగ్ యీ (హాంకాంగ్)తో పీవీ సింధు; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సౌరభ్ వర్మ; హు యున్ (హాంకాంగ్)తో ప్రణయ్; సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్; లీ డాంగ్ కెయున్ (కొరియా)తో కశ్యప్ తలపడతారు. ప్రాంజల జంట ముందంజ ముంబై: హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల–కర్మన్కౌర్ థండి (భారత్) జంట 6–3, 7–5తో నైక్తా బెయిన్స్ (ఆస్ట్రేలియా)–ఫ్యానీ స్టోలర్ (హంగేరి) ద్వయంపై గెలిచింది. -
కశ్యప్ ఆట ముగిసింది...
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్లోనే ఇంటిదారి పట్టాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడి ప్రధాన డ్రాకు అర్హత సంపాదించింది. ఆడిన రెండు క్వాలిఫయింగ్ పోటీల్లోనూ ఈ జంట గెలుపొందింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో కశ్యప్ తొలి రౌండ్లో 21–13, 21–16తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. తర్వాత జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 4–21, 19–21తో జపాన్కు చెందిన తకుమా వుయేడా చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్లో రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–అశ్విని జంట 21–17, 21–13తో క్రిస్టోఫర్ నుడ్సెన్–ఇసాబెలా నీల్సన్ (డెన్మార్క్) జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో రౌండ్లోనూ ఈ భారత జోడి 21–8, 21–13తో జోన్స్ రాల్ఫీ జన్సెన్–ఎవా జన్సెన్స్ (జర్మనీ) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా–సిక్కిరెడ్డి జంట 17–21, 15–21తో సామ్ మాగి–క్లొ మాగి(ఐర్లాండ్) జోడి చేతిలో ఓడింది. -
క్వార్టర్స్లో కశ్యప్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరిద్దరితో పాటు ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో కశ్యప్ 21–9, 21–8తో ఆస్కార్ గువో (న్యూజిలాండ్)పై, సిరిల్ వర్మ 21–14, 21–16తో సపుత్ర విక్కీ అంగా (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 23–21, 21–18తో ఫర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–16, 21–16తో విబవో (ఇండోనేసియా)పై గెలిచారు. -
ప్రిక్వార్టర్స్ కు కశ్యప్, ప్రణయ్
ఆక్లాండ్:న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సౌరవ్ వర్మ, సిరిల్ వర్మలు ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండో రౌండ్ పోరులో వారు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరారు. తొలుత ప్రణయ్ 23-21, 21-18 తేడాతో అబ్దుల్లా కౌలిక్(ఇండోనేసియా)పై పోరాడి గెలిచి తదుపరి రౌండ్ కు అర్హత సాధించగా, కశ్యప్ 21-9, 21-8 తేడాతో ఒస్కార్ గు(న్యూజిలాండ్)పై సునాయాసంగా విజయం సాధించి ప్రిక్వార్టర్స్ కు చేరాడు. ఇక సౌరవ్ 21-16, 21-16 తో ఖో విబోవు(ఇండోనేసియా)పై, సిరిల్ వర్మ 21-14, 21-16తో విక్కీ అంగ్గా(ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్ లోకి ప్రవేశించారు. -
కశ్యప్ శుభారంభం
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సిరిల్ వర్మ, సౌరభ్ వర్మ శుభారంభం చేయగా... రెండో సీడ్ అజయ్ జయరామ్ పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్ మ్యాచ్లో కశ్యప్ కేవలం 22 నిమిషాల్లో 21–5, 21–10తో రుంబాకా (ఇండోనేసియా)ను చిత్తుగా ఓడించాడు. ఇతర మ్యాచ్ల్లో ప్రణయ్ 21–14, 21–16తో రుస్తావితో (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–17, 21–15తో నాథన్ (ఆస్ట్రేలియా)పై, సిరిల్ వర్మ 21–13, 21–12తో రియాంతో సుబగ్జా (ఇండోనేసియా)పై గెలిచారు. అజయ్ జయరామ్ 19–21, 13–21తో చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. -
ప్రణయ్దే యూఎస్ ఓపెన్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ లో భారత్ ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో తుది పోరులో ప్రణయ్ విజయం సాధించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. తద్వారా తన కెరీర్లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ ను ప్రణయ్ సాధించాడు. దాదాపు గంటకుపైగా జరిగిన పోరులో ప్రణయ్ 21-15, 20-22, 20-12 తేడాతో కశ్యప్ పై గెలిచాడు. తొలి గేమ్ ను గెలిచిన ప్రణయ్.. రెండో గేమ్ లో పోరాడి ఓడాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ లో ప్రణయ్ దాటిగా ఆడి కశ్యప్ కు షాకిచ్చాడు. గత ఏడాది స్విస్ ఓపెన్ గెలుచుకున్న తరువాత ప్రణయ్ ఓ అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కాగా, ఈ ఏడాది ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్ చేరడం రెండో సారి. సింగపూర్ ఓపెన్ ఫైనల్లో శ్రీకాంత్, సాయి ప్రణీత్లు తలపడిన సంగతి తెలిసిందే. -
యూఎస్ ఓపెన్ మనదే
పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్, ప్రణయ్ న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై తొలి గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ సాధించేందుకు హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ మరో విజయం దూరంలో ఉన్నాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో కశ్యప్తోపాటు భారత్కే చెందిన మరో అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ ఫైనల్కు చేరడంతో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత్ ఖాతాలో చేరడం ఖాయమైంది. ఆదివారం జరిగిన సెమీఫైనల్స్లో కశ్యప్ 15–21, 21–15, 21–16తో క్వాంగ్ హీ హియో (కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్ 21–14, 21–19తో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)ను ఓడించాడు. ఈ ఏడాది ఓ అంతర్జాతీయ టోర్నీలో ఇద్దరు భారత ఆటగాళ్లు ఫైనల్కు చేరడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఏప్రిల్లో సింగపూర్ ఓపెన్లో సాయిప్రణీత్, శ్రీకాంత్ టైటిల్ కోసం తలపడ్డారు. 30 ఏళ్ల కశ్యప్ తన కెరీర్లో రెండు గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్స్ సాధించగా... ఆ రెండు టైటిల్స్ భారత్లో జరిగిన సయ్యద్ మోడీ టోర్నీలోనే కావడం విశేషం. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 12–21, 21–12, 20–22తో టాప్ సీడ్ లు చింగ్ యావో–యాంగ్ పో హాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
సెమీస్లో కశ్యప్, ప్రణయ్
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో కశ్యప్ 21–13, 21–16తో భారత్కే చెందిన సమీర్ వర్మను ఓడించగా... ప్రణయ్ 10–21, 21–15, 21–18తో కాంటా సునెయామ (జపాన్)పై గెలుపొం దాడు. ఈ ఏడాది కశ్యప్ తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్కు చేరడం విశేషం. సెమీఫైనల్స్లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో ప్రణయ్; క్వాంగ్ హీ హెయో (కొరియా)తో కశ్యప్ తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం (భారత్) 21–18, 22–20తో హిరోకి ఒకుముర–ఒనోదెరా (జపాన్) జోడీపై గెలిచి సెమీస్కు చేరింది. -
కశ్యప్ ముందంజ
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో కశ్యప్ 21–19, 21–10తో నికులా కరుణరత్నె (శ్రీలంక)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 21–18, 17–6తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గెర్గిలీ క్రసుజ్ (హంగేరి) గాయంతో వైదొలిగాడు . ఇతర మూడో రౌండ్ మ్యాచ్ల్లో సమీర్ వర్మ 18–21, 21–14, 21–18తో తొమ్మిదో సీడ్ యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, ప్రణయ్ 21–8, 14–21, 21–16తో మార్క్ కాల్జు (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్లో సమీర్ వర్మతో కశ్యప్; సునెయామ (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకృష్ణప్రియ 11–21, 10–21తో జాంగ్ మీ లీ (కొరియా) చేతిలో, రితూపర్ణ దాస్ 15–21, 20–22తో నటాలియా కోచ్ రోడ్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు. -
కశ్యప్ ఓటమి... ప్రణయ్ ముందంజ
కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కాలగ్రి (కెనడా): భారత సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ కెనడా ఓపెన్ గ్రాండ్ప్రి టోర్నమెంట్లో రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్లో 16వ సీడ్గా బరిలోకి దిగిన కశ్యప్కు 10–21, 21–10, 15–21తో కొకి వతనబి (జపాన్) చేతిలో చుక్కెదురైంది. రెండో సీడ్ హెచ్.ఎస్.ప్రణయ్తో పాటు అభిషేక్ యెలెగార్, కరణ్ రాజన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. రెండో రౌండ్లో ప్రణయ్ 21–17, 16–21, 21–15తో కియెరన్ మెర్రిలీస్ (స్కాట్లాండ్)పై గెలుపొందగా, అభిషేక్ 21–10, 19–21, 21–17తో హోవార్డ్ షు (అమెరికా)ను ఓడించాడు. కరణ్ రాజన్ 21–16, 21–14తో సామ్ పార్సన్స్ (ఇంగ్లండ్)పై విజయం సాధించాడు. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా, తరుణ్ కోన–మేఘన జోడీలు ప్రిక్వార్టర్స్ చేరాయి. తొలిరౌండ్లో సిక్కిరెడ్డి జంట 21–10, 21–19తో డానియెల్–డానిక నిషిముర (పెరూ) ద్వయంపై, తరుణ్ జోడి 21–13, 22–20తో నైల్ యకుర–బ్రిట్నీ టామ్ (కెనడా) జంటపై గెలుపొందాయి. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో రుత్వికా శివాని 6–21, 21–9, 21–13తో గా యున్ కిమ్ (దక్షిణ కొరియా)పై గెలువగా, రీతుపర్ణా దాస్ 21–9, 18–21, 16–21తో హరుకో సుజుకి (జపాన్) చేతిలో ఓడింది. -
కశ్యప్ శుభారంభం
కాలగ్రి (కెనడా): గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కెనడా గ్రాండ్ప్రి టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21–11, 21–9తో డానియల్ లా టొర రీగల్ (పెరూ)పై గెలుపొందాడు. భారత్కే చెందిన రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్తోపాటు సారంగ్ లఖాని, కరణ్ రాజన్, అభిషేక్ యెలెగార్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. -
ప్రిక్వార్టర్స్లో కశ్యప్ ఓటమి
చాంగ్జూ (చైనా): చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతను 10–21, 22–20, 13–21తో మూడో సీడ్ కియావో బిన్ (చైనా) చేతిలో కంగుతిన్నాడు. చాలాకాలంగా గాయాలతో సతమతమైన కశ్యప్ ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నీ ఇది. మరో ఆటగాడు హర్షిల్ డాని కూడా 17–21, 18–21తో సన్ ఫెక్సియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత పోరాటం ఈ టోర్నీలో ముగిసింది. మూడో ర్యాంకుకు సింధు భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు మూడో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని మూడో ర్యాంకుకు చేరింది. గతవారం ఐదో ర్యాంకుకు దిగజారిగన సింధు ర్యాంకు... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్లో క్వార్టర్స్కు చేరడం ద్వారా మెరుగైంది. -
కశ్యప్ శుభారంభం
చాంగ్జూ (చైనా): ఈ ఏడాది తాను బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్ చైనా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో ‘బై’ పొందిన కశ్యప్... బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 21–16, 21–17తో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై గెలుపొందాడు. నాలుగేళ్ల క్రితం ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరిన కశ్యప్ ఆ తర్వాత గాయాల కారణంగా వెనుకబడిపోయాడు. ప్రస్తుతం అతను 104వ ర్యాంక్లో ఉన్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ కియావో బిన్ (చైనా)తో కశ్యప్ ఆడతాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్లో భారత్కే చెందిన హర్షీల్ డాని 21–16, 22–20తో యాన్ రున్జి (చైనా)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారిణుల పోరాటం ముగిసింది. బరిలో దిగిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. సాయి ఉత్తేజిత 4–21, 21–13, 12–21తో లీ వెన్మీ (చైనా) చేతిలో, శ్రీకృష్ణప్రియ 18–21, 11–21తో లీ యున్ (చైనా) చేతిలో ఓడిపోయారు. -
కశ్యప్ ఖాతాలో కాంస్యం
జెజు (కొరియా): ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నమెంట్లో సెమీఫైనల్కు చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ఆ అడ్డంకిని దాటలేకపోయాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లో సెమీఫైనల్లో నిష్క్రమించి కాంస్యాన్ని సాధించాడు. ప్రపంచ ఆరో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)తో జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో కశ్యప్ 21–23, 16–21తో ఓటమి పాలయ్యాడు. సెమీస్లో ఓడిన కశ్యప్కు 1,740 డాలర్ల (రూ. లక్షా 17 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్లో కశ్యప్
జెజు (కొరియా): గాయం నుంచి కోలుకున్నాక ఆడుతోన్న ఏడో టోర్నమెంట్లో ఎట్టకేలకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించాడు. కొరియా మాస్టర్స్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ఆటగాడు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-8, 21-16తో ఆరో సీడ్ జెయోన్ హైక్ జిన్ (కొరియా)పై విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, టాప్ సీడ్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ తలపడతాడు. -
శ్రమించి నెగ్గిన సైనా
ప్రిక్వార్టర్స్లోకి కశ్యప్, సారుుప్రణీత్ మకావు ఓపెన్ టోర్నీ మకావు: గాయం నుంచి కోలుకున్నాక పాల్గొంటున్న మూడో టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్ను అతి కష్టమ్మీద అధిగమించింది. మకావు ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్లో ఈ టాప్ సీడ్ క్రీడాకారిణి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా 21-23, 21-14, 21-18తో ప్రపంచ 44వ ర్యాంకర్ హనా రమాదిని (ఇండోనేసియా)పై శ్రమించి గెలిచింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను కోల్పోరుున సైనా... తర్వాతి రెండు గేముల్లో పట్టుదలతో పోరాడి విజయాన్ని దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సారుుప్రణీత్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో కశ్యప్ 21-19, 21-8తో చున్ వీ చెన్ (చైనీస్ తైపీ)పై, సారుుప్రణీత్ 21-12, 21-15తో సున్ ఫీజియాంగ్ (చైనా)పై గెలిచారు. మరో మ్యాచ్లో సమీర్ వర్మ 18-21, 13-21తో మొహమ్మద్ బాయు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో మనూ అత్రి-సుమీత్ రెడ్డి జంట 21-11, 17-21, 21-9తో చాన్ అలన్ యున్ లంగ్-లీ కుయెన్ హాన్ (హాంకాంగ్) జోడీపై గెలిచింది. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్ అర్హత
సియోల్: కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్లో హైదరాబాద్ ఆటగాడు కశ్యప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం మొదలైన ఈ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో కశ్యప్ వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. ప్రపంచ 815వ ర్యాంకర్ కో గ్యుంగ్ బో (దక్షిణ కొరియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 107వ ర్యాంకర్ కశ్యప్ 15-21, 23-21, 21-19తో గెలుపొందగా... 100వ ర్యాంకర్ పనావిత్ తొంగ్నువామ్ (థాయ్లాండ్)తో జరిగిన రెండో రౌండ్లో 15-21, 21-16, 21-15తో విజయం సాధించాడు. కో గ్యుంగ్ బోతో జరిగిన మ్యాచ్లో కశ్యప్ రెండో గేమ్లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో నాలుగో సీడ్ తియాన్ హువీ (చైనా)తో కశ్యప్; వోంగ్ వింగ్ కీ విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్; వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)తో ప్రణయ్; హావో (చైనీస్ తైపీ)తో సాయిప్రణీత్; హయెక్ జిన్ (కొరియా)తో జయరామ్ ఆడతారు. -
సాయిప్రణీత్ శుభారంభం
కశ్యప్, ప్రణయ్ కూడా ఇండోనేసియా గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీ బాలిక్పాపన్ (ఇండోనేసియా): రియో ఒలింపిక్స్ తర్వాత జరుగుతున్న తొలి గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్లో భారత ఆటగాళ్లు శుభారంభం చేశారు. పదో సీడ్ భమిడిపాటి సారుుప్రణీత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ రెండో రౌండ్లోకి ప్రవేశించారు. సిరిల్ వర్మ, కౌశల్, హర్షిల్ డాని తొలి రౌండ్లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సారుుప్రణీత్ 21-18, 13-21, 21-13తో సుబగ్జా రియాంతో (ఇండోనేసియా)పై, కశ్యప్ 21-6, 21-8తో సులిస్తో (ఇండోనేసియా)పై, జయరామ్ 21-8, 21-9తో మైనాకి (ఇండోనేసియా)పై, ప్రణయ్ 16-21, 21-19, 21-14తో హా యంగ్ వూంగ్ (దక్షిణ కొరియా)పై గెలిచారు. సిరిల్ వర్మ 7-21, 9-21తో వీ ఫెంగ్ చాంగ్ (మలేసియా) చేతిలో, కౌశల్ 23-21, 14-21, 13-21తో మేగనంద (ఇండోనేసియా) చేతిలో, హర్షిల్ 18-21, 16-21తో సిమోన్ సాంతొసో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగమ్మారుు గద్దె రుత్విక శివాని, తన్వీ లాడ్, పీసీ తులసీ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. రుత్విక 14-21, 14-21తో హనా రమదిని (ఇండోనేసియా) చేతిలో, తులసీ 12-21, 5-21తో జియో లియాంగ్ (సింగపూర్) చేతిలో, తన్వీ 14-21, 19-21తో రుసెల్లి హర్తావన్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా (భారత్) జంట 10-21, 14-21తో మార్కిస్ కిడో-హెంద్రా గుణవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. గురువారం జరిగే రెండో రౌండ్ మ్యాచ్ల్లో అజయ్ జయరామ్తో కశ్యప్; కాంతాఫోన్ (థాయ్లాండ్)తో సారుుప్రణీత్; జూ వెన్ సుంగ్ (మలేసియా)తో ప్రణయ్ తలపడతారు. -
కశ్యప్ కూడా బెంగళూరుకు...
ప్రత్యేక శిక్షణ తీసుకోనున్న షట్లర్ న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్ బాటలోనే భారత బ్యాడ్మింటన్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ కూడా హైదరాబాద్నుంచి బెంగళూరుకు మకాం మార్చాడు. రాబోయే కొన్ని నెలల పాటు అతను కోచ్ టామ్ జాన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటాడు. కొద్ది రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్న కశ్యప్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. గాయం కారణంగానే అతను రియో ఒలింపిక్స్ అర్హత టోర్నీలకు దూరమయ్యాడు. ‘మోకాలి గాయం తర్వాత నా ఆట ఆశించిన స్థాయిలో లేదు. రియో అవకాశం కోల్పోవడం కూడా నిరాశపర్చింది. అందుకే కొత్తగా ప్రయత్నించాలని నిర్ణయించాను. అదే ఆలోచనతో టామ్ జాన్ అకాడమీలో శిక్షణ తీసుకోబోతున్నాను. బెంగళూరులోనే ఫిజియో డెక్లైన్ లీటావో సహాయం కూడా తీసుకుంటాను’ అని కశ్యప్ చెప్పాడు. ఇండోనేసియా, జపాన్, కొరియా టోర్నీల తర్వాత తాను హైదరాబాద్కు తిరిగి వస్తానని అతను వెల్లడించాడు. 2014 ఆసియా క్రీడలకు ముందు సైనా నెహ్వాల్ కూడా గోపీచంద్ అకాడమీని వదిలి ప్రస్తుతం బెంగళూరులోనే విమల్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. -
రొమాంటిక్, ఎంటర్టైనర్
యువతకు నచ్చే అంశాలతో పాటు రొమాం టిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. కాశ్యప్, చాందినీ జంటగా కళ్యాణ్ సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరాం బాలాజీ దర్శకత్వంలో ఎం.జాహ్నవి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. ‘డిజీక్వెస్ట్’ బసిరెడ్డి కెమేరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు కిశోర్ పార్థసాని క్లాప్ ఇచ్చారు. నిర్మాత మల్కాపురం శివకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘‘కథపై ఆరునెలలు పనిచేశాం. నటీనటులకు మూడునెలలు వర్క్షాప్ నిర్వహించాం. మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘అన్నపూర్ణాస్కూల్లో శిక్షణ పొందిన కశ్యప్ను హీరోగా పరిచయం చేస్తు న్నాం. బంటిగారు మంచి పాటలు ఇచ్చారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పావని తదితరులు పాల్గొన్నారు. -
ఆడలేనన్నా... ఇంటికి విమాన టిక్కెట్లు
- కశ్యప్ న్యూఢిల్లీ: కడుపులో కండరాల గాయం కారణంగా దక్షిణాసియా గేమ్స్లో పాల్గొనలేనని చెప్పినా... గువహాటికి వెళ్లేందుకు తనకు విమాన టిక్కెట్లు పంపించారని స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు లిఖితపూర్వకంగా తెలియజేసినా... ‘బాయ్’ తనను మరో రకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శిం చాడు. ‘గాయం కారణంగా నేను చాలా సమయాన్ని కోల్పోయా. దాదాపు ఏడు టోర్నీలకు గైర్హాజరైనా... తప్పనిసరి పరిస్థితుల్లో పీబీఎల్, సయ్యద్ మోదీలో బరిలోకి దిగా. దీంతో గాయం తిరగబెట్టింది. ఫలితంగా థాయ్లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగా. కానీ ఇప్పుడు దక్షిణాసియా గేమ్స్లో ఆడాలని బాయ్, క్రీడాశాఖ కోరుతోంది. అయితే నేను ఆడే పరిస్థితుల్లో లేను. ఇందుకు సంబంధించి లేఖలు కూడా పంపా. అయినాగానీ గువహాటి వెళ్లేందుకు నాకు విమాన టిక్కెట్లు పంపారు. ఇది చాలా నిరాశ కలిగించే అంశం’ అని కశ్యప్ చెప్పాడు. -
సాయి ప్రణీత్ సంచలనం
♦ హైదరాబాద్పై లక్నో విజయం ♦ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో సొంతగడ్డపై మ్యాచ్లను హైదరాబాద్ హంటర్స్ ఓటమితో ప్రారంభించింది. శనివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన పోరులో అవధ్ వారియర్స్ 4-3 తేడాతో హైదరాబాద్ హంటర్స్పై విజయం సాధించింది. గోపీచంద్ అకాడమీ సహచరుల మధ్య జరిగిన మ్యాచ్లో సాయి ప్రణీత్... పారుపల్లి కశ్యప్ను చిత్తు చేయడం విశేషం. గాయంతో మరోసారి సైనా నెహ్వాల్ మ్యాచ్ ఆడకుండా తప్పుకుంది. కశ్యప్కు నిరాశ: సైనా గైర్హాజరీలో మహిళల సింగిల్స్ మ్యాచ్ ఆడిన జి.వృషాలి 15-7, 15-11 స్కోరుతో కె.సుపనిదను చిత్తు చేసి అవధ్కు 1-0 ఆధిక్యం అందించింది. పురుషుల డబుల్స్లో వారియర్స్ జోడి బోడిన్ ఇసారా-కై యున్ 15-10, 15-12తో హంటర్స్ జంట కార్స్టెన్ మోగెన్సన్-మార్కిస్ కిడోను ఓడించింది. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో ఆ జట్టు ఖాతాలో అదనపు పాయింట్ చేరింది. దీంతో వారియర్స్ 3-0 ఆధిక్యంలోకి వచ్చారు. తొలి పురుషుల సింగిల్స్ మ్యాచ్లో సాయిప్రణీత్ 6-15, 15-8, 15-5తో కశ్యప్ను ఓడించాడు. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ఆరంభంలో కశ్యప్ ఆధిక్యం కనబర్చాడు. అయితే రెండో గేమ్లో అనూహ్యంగా పుంజుకున్న సాయి కోలుకున్నాడు. కశ్యప్ డ్రాప్ షాట్లు వరుసగా విఫలం కావడం సాయికి కలిసొచ్చి సమంగా నిలిచాడు. మూడో గేమ్లో కూడా ప్రణీత్ జోరు కొనసాగింది. అద్భుతమైన స్మాష్లతో దూకుడు ప్రదర్శించిన అతను కశ్యప్కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. చివరకు కూడా మరో చక్కటి స్మాష్తో అవధ్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ ముగిసేసరికి 4-0తో లక్నో స్పష్టమైన ఆధిక్యంతో మ్యాచ్ సొంతం చేసుకుంది. రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్ లీ చోంగ్ వీ 15-8, 15-9తో తనోంగ్సక్పై గెలుపొందాడు. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన లీ చోంగ్ వీ ఈసారి స్థాయికి తగ్గట్లుగా ఆడాడు. ఇది ట్రంప్ మ్యాచ్ కావడంతో హైదరాబాద్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. ఇక చివరిగా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో హంటర్స్ ద్వయం జ్వాల గుత్తా-మార్కిస్ కిడో 12-15, 15-14, 15-10తో బోడిన్ ఇసారా-క్రిస్టియానాను ఓడించి లక్నో ఆధిక్యాన్ని 4-3కు తగ్గించింది. -
కశ్యప్ శుభారంభం
రెండో రౌండ్లోకి ప్రణయ్ సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు {పపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ జకార్తా: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ చాంపియన్షిప్లో శుభారంభం చేశారు. గతేడాది తొలి రౌండ్లోనే నిష్ర్కమించిన హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్... తొలిసారి ఈ మెగా ఈవెంట్లో ఆడుతోన్న కేరళ ఆటగాడు ప్రణయ్ తమ ప్రత్యర్థులపై కేవలం 31 నిమిషాల్లో గెలుపొందడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్ కశ్యప్ 21-17, 21-10తో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)పై... 11వ సీడ్ ప్రణయ్ 21-12, 21-16తో అలెక్స్ యువాన్ (బ్రెజిల్)పై విజయం సాధించారు. ఎరిక్తో జరిగిన మ్యాచ్లో తొలి గేమ్లో కశ్యప్ ఒకదశలో 6-12తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న అతను వరుసగా ఆరు పాయింట్లు సాధించి స్కోరును 12-12తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరితో ఆధిక్యం దోబూచులాడినా చివరకు కశ్యప్ గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో మాత్రం మొదటి నుంచే కశ్యప్ ఆధిపత్యం చలాయించాడు. ఒకసారి వరుసగా ఆరు పాయింట్లు, మరోసారి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 11-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత ఇదే దూకుడును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రెండో రౌండ్లో ఎకిరింగ్ (ఉగాండ)తో ప్రణయ్; తియెన్ మిన్ (వియత్నాం)తో కశ్యప్ ఆడతారు. మరోవైపు హైదరాబాద్కే చెందిన డబుల్స్ ప్లేయర్ సిక్కి రెడ్డికి మిశ్రమ ఫలితాలు లభించాయి. మిక్స్డ్ డబుల్స్లో తొలి రౌండ్లోనే ఓడిన సిక్కి రెడ్డి, మహిళల డబుల్స్లో మాత్రం ముందంజ వేసింది. మిక్స్డ్ డబుల్స్ మొదటి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం 13-21, 17-21తో లియావో మిన్ చున్-చెన్ సియో హువాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 16-21, 21-15, 21-14తో ఇసాబెల్ హెర్ట్రిచ్-బిర్గిట్ మైకేల్స్ (జర్మనీ) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ మరో మ్యాచ్లో అరుణ్ విష్ణు-అపర్ణ బాలన్ (భారత్) జోడీ 18-21, 21-10, 22-24తో ద్రెమిన్-దిమోవా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. దాంతో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ (భారత్) జంట 17-21, 21-11, 21-11తో ఖాఖిమోవ్-కుజ్నెత్సోవ్ (రష్యా) జోడీపై గెలిచింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో లినీ జార్స్ఫెల్డ్ (డెన్మార్క్)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఫారిమన్ (ఆస్ట్రేలియా)తో శ్రీకాంత్; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కాయ్ యున్-లూ కాయ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో లాన్సాక్-లెఫెల్ (ఫ్రాన్స్)లతో మోహితా-ధాన్యా తలపడతారు. -
కశ్యప్ కేక
♦ ప్రపంచ నంబర్వన్పై సంచలన విజయం ♦ సెమీఫైనల్లోకి ప్రవేశం ♦ సైనాకు తప్పని ఓటమి ♦ ఇండోనేసియా ఓపెన్ సత్తా ఉన్నా స్థాయికి తగ్గ విజయాలు సాధించడంలేదనే విమర్శకులకు సమాధానమిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ చెన్ లాంగ్ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించాడు. రెండోసారి ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యాదృచ్ఛికంగా 2012లో ఇదే టోర్నీలో తొలిసారి సెమీస్ చేరిన కశ్యప్ అప్పుడు కూడా క్వార్టర్స్లో చెన్ లాంగ్నే ఓడించాడు. ఆనాడు చెన్ లాంగ్ ప్రపంచ మూడో ర్యాంకర్గా ఉండి టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగాడు. జకార్తా : ఒకట్రెండు రౌండ్లలో విజయాలు సాధించడం... ఆ తర్వాత ప్రత్యర్థిగా చైనా ప్లేయర్ ఎదురైతే ఓడిపోవడం... చాలా టోర్నమెంట్లలో పారుపల్లి కశ్యప్ విషయంలో ఇలా జరుగుతోంది. తాజాగా ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లోనూ ఇలాంటి ఫలితమే పునరావృతం అవుతుందని భావించిన వాళ్లందరి అంచనాలను కశ్యప్ తలకిందులు చేశాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అద్భుత ఆటతీరుతో అలరించాడు. ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్, చైనా స్టార్ చెన్ లాంగ్ను బోల్తా కొట్టించాడు. 63 నిమిషాలు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ 14-21, 21-17, 21-14తో చెన్ లాంగ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో చెన్ లాంగ్ చేతిలో ఏడుసార్లు ఓడిపోయిన కశ్యప్ ఈ మ్యాచ్లో తన అత్యుత్తమ ఆటతీరును కనబరిచాడు. కళ్లు చెదిరే స్మాష్లు సంధించిన ఈ హైదరాబాద్ ప్లేయర్ నెట్ వద్ద కూడా పైచేయి సాధించాడు. చురుకైన కదలికలకు, శక్తివంతమైన స్మాష్లకు పెట్టింది పేరైన చెన్ లాంగ్ ఈసారి మాత్రం కశ్యప్ దూకుడు ముందు తడబడ్డాడు. తొలి గేమ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన చెన్ లాంగ్... రెండో గేమ్లో ఒక దశలో 7-6తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. వెనుకంజలో ఉన్నా... నమ్మకం కోల్పోకుండా, పూర్తి విశ్వాసంతో ఆడిన కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 9-7తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ రెండో గేమ్ను కైవసం చేసుకొని మ్యాచ్లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్లో కశ్యప్ ఆరంభం నుంచే శాసించాడు. మరోవైపు కశ్యప్ స్మాష్లను, షాట్లను కచ్చితంగా అంచనా వేయడంలో విఫలమైన చెన్ లాంగ్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. కశ్యప్ 14-5తో ఏకంగా తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సాధించి పట్టుబిగించాడు. చెన్ లాంగ్ తేరుకునే ప్రయత్నం చేసినప్పటికీ కశ్యప్ అందివచ్చిన ప్రతీ పాయింట్ అవకాశాన్ని అనుకూలంగా మల్చుకొని చిరస్మరణీయ విజయం సాధించాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కెంటో మొమోటా (జపాన్)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 0-1తో వెనుకంజలో ఉన్నాడు. వీరిద్దరూ 2013 చైనా ఓపెన్లో ఏకైకసారి ఆడగా... మొమోటా 21-11, 21-12తో గెలిచాడు. ఓవరాల్గా కశ్యప్ ఐదోసారి ఓ సూపర్ సిరీస్ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. గతంలో అతను సింగపూర్ ఓపెన్ (2010), డెన్మార్క్ ఓపెన్ (2014), ఇండియా ఓపెన్ (2012), ఇండోనేసియా ఓపెన్ (2012)లలో సెమీస్ అడ్డంకిని అధిగమించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ఐదో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో 70 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో సైనా 21-16, 12-21, 18-21తో ఓడిపోయింది. షిజియాన్ చేతిలో సైనాకిది ఏడో పరాజయం. గతవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ సిరీస్ టోర్నీలోనూ సైనా ఈ చైనా ప్లేయర్ చేతిలోనే ఓటమి చెందడం గమనార్హం. షిజియాన్తో ఆడిన మ్యాచ్లో సైనాకు గెలుపొందే అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. నిర్ణాయక మూడో గేమ్లో సైనా 15-10తో ఐదు పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన దశలో ఒత్తిడికి లోనైంది. వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. మరోసారి 18-18 వద్ద స్కోరును సమం చేసిన షిజియాన్ ఈసారి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి సైనాను ఇంటిదారి పట్టించింది. సెమీఫైనల్స్ ఉదయం గం. 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
ఇండోనేషియా ప్రిక్వార్టర్స్ కి సైనా, కశ్యప్
జకర్తా: భారత నం.1 స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సింగిల్స్ విభాగంలో ఇండోనేషియా ఓపెన్ ప్రిక్వార్టర్స్ లో ప్రవేశించింది. పి.వి.సిందూ ఇంటి దారి పట్టింది. పురుషుల కేటగిరిలో పారుపల్లి కశ్యప్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ కి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన మ్యాచ్ లో థాయ్లాండ్ కి చెందిన నిచాన్ జిందాపొన్పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది. తొలిసెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సైనాకు రెండోసెట్ లో కొంత ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో 18-17 తో వెనకబడి ఉన్న సైనా వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని విజయం సాధించింది. 2009, 2010, 2012 సంవత్సరాలలో సైనా ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే. పారుపల్లి కశ్యప్ 21-17, 21-7 తేడాతో వరుస సెట్లను కైవసం చేసుకొని థాయ్లాండ్ కి చెందిన టనొంగ్ సాక్ పై విజయం సాధించాడు. ఈ రెండు సెట్లను కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం. సిందూ ఓటమి హైదరాబాదీ షట్లర్ పి.వి.సిందూ 21-15, 21- 14 తేడాతో వరస సెట్లు కోల్పోయి చైనాకి చెందిన క్రీడాకారిణి హు యా చింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ ఓటమితో సిందూ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. -
సైనాకు రెండో సీడ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్కు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో రెండో సీడింగ్ లభించింది. ఈనెల 26న సిడ్నీలో మొదలయ్యే ఈ టోర్నీలో సైనా తొలి రౌండ్లో క్వాలిఫయర్తో తలపడుతుంది. హైదరాబాద్కే చెందిన పి.వి.సింధు తొలి రౌండ్లో ప్రపంచ మాజీ చాంపియన్, ఎనిమిదో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)తో ఆడుతుంది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో విటింగ్హస్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; వాంగ్ జెంగ్మింగ్ (చైనా)తో కశ్యప్; తియాన్ హువీ (చైనా)తో ప్రణయ్ పోటీపడతారు. -
కశ్యప్ శుభారంభం
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ వుహాన్ (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో భారత స్టార్ పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-17, 21-13తో జిలియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై గెలిచాడు. 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో కాస్త పోటీ ఎదుర్కొన్నా కశ్యప్కు రెండో గేమ్లో ఎదురులేకుండా పోయింది. రెండో గేమ్ ఆరంభంలో వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ 9-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరుతో మ్యాచ్ను ముగించాడు. బుధవారం జరిగే తదుపరి రౌండ్లో జెన్ హావో సు (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో కశ్యప్ 2-1తో ఆధిక్యంలో ఉన్నాడు. గతేడాది ఆసియా చాంపియన్షిప్లో జెన్ హావో సు చేతిలో ఓడిన కశ్యప్ ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకుంటాడో లేదో వేచి చూడాలి. మరోవైపు మహిళల డబుల్స్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జ్వాల-అశ్విని జంట 17-21, 21-15, 15-21తో యు పో పాయ్-యా చింగ్ సు (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
రెండో రౌండ్లో ప్రవేశించిన కశ్యప్
వుహాన్ (చైనా): భారత బ్యాడ్మింటన్ తేజం పారుపల్లి కశ్యప్ ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (ఏబీసీ)లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ జీ లియాంగ్ డెరెక్ వోంగ్ (సింగపూర్)పై ప్రపంచ 14వ ర్యాంకర్ కశ్యప్ గెలుపొందాడు. మరోవైపు ఆసియా బ్యాడ్మింటన్ తొలి రౌండ్లోనే జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్పలు ఓటమి చెందారు. -
కశ్యప్, ప్రణయ్ సంచలనం
♦ ప్రపంచ ఐదో, రెండో ర్యాంకర్స్పై గెలుపు ♦ శ్రీకాంత్కు చుక్కెదురు ♦ సింగపూర్ ఓపెన్ టోర్నీ సింగపూర్ : అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సంచలనాలు సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్ ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించగా... కేరళ కుర్రాడు ప్రణయ్ ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్సన్ (డెన్మార్క్)ను ఇంటిముఖం పట్టించాడు. మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్న మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్కు మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్లాండ్) చేతిలో చుక్కెదురైంది. గతంలో సన్ వా హోతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కశ్యప్ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూశాడు. 46 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-15, 22-20తో సన్ వా హోను ఓడించాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడ్డ కశ్యప్ ఆ తర్వాత తేరుకొని 14-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్ను దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో కీలకదశలో కశ్యప్ పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు రెండు వారాల వ్యవధిలో రెండోసారి ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్సన్ను ప్రణయ్ ఓడించడం విశేషం. గత నెలాఖర్లో ఇండియా ఓపెన్లో జార్గెన్సన్పై మూడు గేముల్లో నెగ్గిన ప్రణయ్ ఈసారి రెండు గేముల్లోనే గెలిచాడు. కేవలం 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 21-16, 21-8తో జార్గెన్సన్పై విజయం సాధించాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ సెన్సోమ్బూన్సుక్తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 15-21, 20-22తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 22-24, 18-21తో మూడో సీడ్ జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో కశ్యప్; కెంటో మొమాటా (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. -
బాడ్మింటన్ క్రీడాకారులకు నగదు పురస్కారాలు
న్యూఢిల్లీ: బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) మంగళవారం బాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లకు నగదు పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ వేదికల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వరల్డ్ నెం. 2 సైనానెహ్వాల్, కామన్ వెల్త్ గేమ్స్ లో ఛాంపియన్గా నిలిచిన కశ్యప్ ఇద్దరికీ చెరి అయిదు లక్షల రూపాయల బహుమతిని ఇస్తున్నట్టుగా బీఎఐ అధ్యక్షులు అఖిలేష్ దాస్ ప్రకటించారు. గత జనవరిలో లక్నో లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలసిందే. -
క్వార్టర్స్లో శ్రీకాంత్, సైనా
చైనా ఓపెన్ టోర్నీ ఫుజౌ (చైనా): సొంతగడ్డపై చైనా క్రీడాకారులను ఓడించి... భారత ప్లేయర్స్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21-17, 19-21, 21-14తో హువాన్ గావో (చైనా)ను ఓడించగా... కశ్యప్ 11-21, 21-11,21-13తో జుయ్ సాంగ్ (చైనా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21-18, 21-18తో జింగ్జింగ్ కిన్ (చైనా)పై నెగ్గింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో మార్క్ జ్విబ్లెర్ (జర్మనీ)తో కశ్యప్; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; దీ సుయో (చైనా)తో సైనా తలపడతారు. -
శ్రమించి గెలిచారు
రెండో రౌండ్లో సైనా, కశ్యప్, శ్రీకాంత్ చైనా ఓపెన్ ఫుజౌ (చైనా): గట్టి ప్రత్యర్థులు ఎదురైనా... పట్టుదలతో పోరాడిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల తొలి రౌండ్లో ఆరో సీడ్ సైనా 21-14, 19-21, 21-17తో సయాక తకహాషి (జపాన్)పై గెలిచింది. తకహాషిపై సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-11, 9-21, 21-15తో హైదరాబాద్కే చెందిన తన సహచరుడు గురుసాయిదత్పై గెలుపొందగా... కశ్యప్ 24-22, 19-21, 21-15తో నాన్ వీ (హాంకాంగ్)ను ఓడించాడు. మరో మ్యాచ్లో కేరళ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ 10-21, 21-19, 18-21తో విక్టర్ అక్జెల్సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి ద్వయం 12-21, 15-21తో జియోలాంగ్ లియు-జిహాన్ కియు (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది. తకహాషితో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో సైనా తొలి గేమ్లో స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. రెండో గేమ్లో మాత్రం ఈ హైదరాబాద్ అమ్మాయి తడబడి ఒకదశలో వరుసగా ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్లో సైనా ఒకదశలో 11-12తో వెనుకబడినప్పటికీ వెంటనే కోలుకుంది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 16-11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. -
సైనా, కశ్యప్ ఓటమి
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: చైనా అడ్డంకిని అధిగమించడంలో భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ విఫలమయ్యారు. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో కశ్యప్ 15-21, 21-13, 13-21తో ఐదో సీడ్ జెంగ్మింగ్ వాంగ్ (చైనా) చేతిలో; ఐదో సీడ్ సైనా 19-21, 21-19, 15-21తో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. నిర్ణాయక మూడో గేమ్లో సైనా 15-10తో ఆధిక్యంలో ఉన్నా... అనూహ్యంగా తడబడి షిజియాన్కు వరుసగా 11 పాయింట్లు కోల్పోయి చేజేతులా ఓడటం గమనార్హం. అంతకుముందు గురువారం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 21-19, 21-18తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)ను ఓడించడం విశేషం. మరోవైపు శ్రీకాంత్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. ఆరో సీడ్ క్రిస్టియన్ విటిన్గస్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 20-22, 14-21తో ఓడిపోయాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ సైనా 21-19, 21-16తో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)ను ఓడించింది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 6-21, 8-21తో ఏడో సీడ్ జియోలి వాంగ్-యాంగ్ యు (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఏడు స్థానాలు ఎగబాకి... ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్లో పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్, కశ్యప్ ఏడేసి స్థానాల చొప్పున పురోగతి సాధించారు. తాజా ర్యాంకింగ్స్లో శ్రీకాంత్ 23 నుంచి 16వ స్థానానికి... కశ్యప్ 28 నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని ఆరో ర్యాంక్కు చేరుకోగా... సింధు 10వ స్థానంలోనే ఉంది. -
సైనా, కశ్యప్ ర్యాంకులు మెరుగు
కౌలాలంపూర్: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం సంపాదించి ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక కశ్యప్, శ్రీకాంత్ ఏడేసి స్థానాలు మెరుగుపరచుకుని వరసగా 21, 16 ర్యాంక్లు కైవసం చేసుకున్నారు. వర్ధమాన షట్లర్ పీవీ సింధు పదో ర్యాంక్ను నిలబెట్టుకుంది. -
కశ్యప్ సంచలనం
ప్రపంచ నాలుగో ర్యాంకర్పై గెలుపు సైనా, శ్రీకాంత్ శుభారంభం తొలి రౌండ్లోనే ఓడిన సింధు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ పారిస్: గతవారం డెన్మార్క్ ఓపెన్లో ప్రపంచ మూడో ర్యాంకర్ను బోల్తా కొట్టించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సంచలన విజయంతో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 28వ ర్యాంకర్ కశ్యప్ 21-11, 21-18తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్)ను ఇంటిదారి పట్టించాడు. కేవలం 34 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో తొలి గేమ్ను అలవోకగా నెగ్గిన కశ్యప్కు రెండో గేమ్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఒకదశలో కశ్యప్ 12-15తో వెనుకబడినా... వెంటనే తేరుకొని స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత స్కోరు 18-18 వద్ద కశ్యప్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. కెనిచి టాగోపై కశ్యప్కిది రెండో విజయం. గతంలో కశ్యప్ ఈ జపాన్ ప్లేయర్ చేతిలో మూడుసార్లు ఓడిపోయాడు. గురువారం జరిగే రెండో రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ హువీ తియాన్ (చైనా)తో కశ్యప్ తలపడతాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ 21-10, 21-14తో క్వాలిఫయర్ దిమిత్రో జవద్స్కయ్ (ఉక్రెయిన్)పై గెలిచాడు. అయితే భారత్కే చెందిన సౌరభ్ వర్మ 10-21, 11-21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో; ప్రణయ్ 11-21, 21-15, 20-22తో కెంటో మొమాటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 21-9తో సషీనా వారన్ (ఫ్రాన్స్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ పి.వి.సింధు 21-12, 18-21, 16-21తో పోర్న్టిప్ బురానాప్రాసెర్ట్సుక్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. సషీనాతో జరిగిన మ్యాచ్లో సైనా రెండో గేమ్లో వరుసగా 11 పాయింట్లు సాధించడం విశేషం. గురువారం జరిగే రెండో రౌండ్లో కిర్స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప (భారత్)-వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా) ద్వయం 21-16, 21-19తో కీగో సొనోదా-షిజుకా మత్సో (జపాన్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జంట 18-21, 21-16, 21-14తో ముస్కెన్స్-పీక్ సెలెనా (నెదర్లాండ్స్) ద్వయంపై నెగ్గింది. -
చైనాతో సవాల్
నేటి నుంచి బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్షిప్ సైనా, సింధు, కశ్యప్లపైనే ఆశలు కోపెన్హగెన్: ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే పట్టుదల ఒకరిది... గతం కంటే మెరుగైన పతకం గెలవాలనే లక్ష్యం మరొకరిది... ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పి.వి. సింధులు ప్రపంచ చాంపియన్షిప్కు సిద్ధమయ్యారు. నేటి నుంచి డెన్మార్క్లోని కోపెన్హగెన్లో జరగనున్న ఈ చాంపియన్షిప్లో వీరిద్దరి కల నెరవేరాలంటే చైనా గోడను అధిగమించాల్సి ఉంటుంది. గతేడాది టోర్నీలో కాంస్యంతో ఆకట్టుకున్న సింధు.. ఈ మెగా ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అలాగే ఇటీవల గ్లాస్గో గేమ్స్లోనూ కాంస్యంతో మెరిసింది. కాబట్టి ఈసారి కూడా ఆమెపై భారీ ఆశలే ఉన్నాయి. మరోవైపు సైనా మాత్రం ప్రపంచ చాంపియన్షిప్లో ఇప్పటి వరకు క్వార్టర్ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. మిగతా ఈవెంట్లలో చైనా క్రీడాకారిణులపై ఆధిపత్యం చెలాయించే హైదరాబాద్ అమ్మాయి ఈ ఈవెంట్లో మాత్రం చతికిలపడుతోంది. కాలి గాయంతో కామన్వెల్త్ గేమ్స్కు దూరమైన సైనా ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉంది. సైనా ఏడోసీడ్గా, సింధు 11వ సీడ్గా ఈవెంట్లో బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరికి తొలి రౌండ్లో బై లభించింది. అన్ని అనుకున్నట్లు జరిగితే సైనాకు క్వార్టర్స్లో, సింధుకు సెమీస్లో చైనా క్రీడాకారిణులు ఎదురుపడే అవకాశాలున్నాయి. కశ్యప్పై భారీ అంచనాలు పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్పైనే ఎక్కువ ఆశలున్నాయి. కామన్వెల్త్లో స్వర్ణం గెలవడంతో ఇవి రెట్టింపయ్యాయి. సోమవారం డైటర్ డొమెక్ (జర్మనీ)తో జరిగే తొలి రౌండ్ మ్యాచ్తో అతను ఈ టోర్నీని ప్రారంభిస్తాడు. అజయ్ జయరామ్ నాలుగోసీడ్ కనిచి టగో (జపాన్)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ సంచలనం కోసం ఎదురుచూస్తున్నాడు. మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని మరోసారి పతకం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. 2011 టోర్నీలో ఈ జోడి కాంస్యం గెలుచుకుంది. అయితే రెండో రౌండ్లో ఈ జంటకు చైనీస్ ద్వయం క్వియాంగ్ టియాన్-యునెలి జావోల నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పంకజ్ సావంత్-ఆరతి సారా సునీల్; పురుషుల డబుల్స్లో అక్షయ్ దివాల్కర్-ప్రణయ్ చోప్రా; సుమీత్ రెడ్డి-మను ఆత్రిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిక్స్డ్లో అశ్విని...తరుణ్ కోనాతో కలిసి బరిలోకి దిగుతోంది. జూలై చివరి వరకు గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాతి నుంచి ఈ గాయంతో బాధపడుతున్నా. దీంతో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయా. గత మూడు వారాల నుంచి మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఈసారి టోర్నీలో సత్తా మేరకు రాణిస్తా. -సైనా -
కామన్వెల్త్ వీరులు బిజీ బిజీ
-
అమ్మ అడిగిన మాట...
ఆ రెండు పాయింట్లే తేడా ఆసియాగేమ్స్లోనూ సాధిస్తా కామన్వెల్త్ ‘స్వర్ణ’ విజేత కశ్యప్ సాక్షి, హైదరాబాద్: ‘గత ఏడాది కాలంలో ఎన్నో టోర్నీలలో స్వల్ప తేడాతో ఓడిపోయాను. మూడో గేమ్ ఆడిన ప్రతిసారీ 19-21, 20-22, 22-24... ఇలాంటి స్కోర్లతో చివర్లో ఓడేవాడిని. దాంతో అమ్మ నన్ను పిలిచి ఆ రెండు పాయింట్లు ఇంకెప్పుడు సాధిస్తావు అని అడిగింది. ఈ సారి మాత్రం అమ్మను నిరాశపర్చలేదు. ఆ రెండు పాయింట్లూ సాధించాను. స్వర్ణాన్నీ గెలుచుకున్నాను’... గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ భావోద్వేగంతో అన్న మాట ఇది. కోచ్ గోపీచంద్, సహచరులు గురుసాయిదత్, సింధులతో కలిసి నగరానికి చేరుకున్న అనంతరం కశ్యప్ తన విజయానందాన్ని పంచుకున్నాడు. మీడియా సమావేశానికి ముందు గుర్రపు బగ్గీలో ఊరేగిస్తూ కశ్యప్ తదితరులకు గోపీచంద్ అకాడమీ ముందు ఘనస్వాగతం లభించింది. ఆసియా క్రీడల్లోనూ పతకం సాధిస్తానంటున్న కశ్యప్ మనోభావాలు అతని మాటల్లోనే... కామన్వెల్త్ గెలుపు: రెండేళ్ల తర్వాత మేజర్ ఈవెంట్లో పతకం నెగ్గడం ఎంతో సంతోషంగా ఉంది. చాన్నాళ్లుగా భారత నంబర్వన్గా ఉంటున్నాను. వరల్డ్ ర్యాంకింగ్స్లోనూ టాప్-20లో ఉన్నాను. పురుషుల సింగిల్స్లో పోటీ బాగా పెరిగిన ఈ సమయంలో ఈ స్వర్ణం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. నాతో పాటు అకాడమీలో ఆడుతున్న కుర్రాళ్లకు కూడా ఇది స్ఫూర్తినిస్తుంది. ఈ విజయాలన్నీ మా కోచ్ గోపీచంద్ వల్లే సాధ్యమయ్యాయి. విజయం ప్రత్యేకత: ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్షిప్, ఆల్ ఇంగ్లండ్లలో వరుసగా క్వార్టర్స్లోనే ఓడాను. దాంతో కీలక టోర్నీల్లో నేను గెలవలేనేమో అన్న పరిస్థితి వచ్చింది. నాపై తీవ్ర ఒత్తిడి ఉంది. సెమీస్లో నేను తలపడ్డ ఇంగ్లండ్ ఆటగాడిని కొన్నేళ్ల క్రితం ఎదుర్కొని ఓడాను. అప్పుడు కూడా స్కోర్లు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. దాంతో మళ్లీ ఓడతాననే భయం వచ్చింది. ఆ సమయంలో మానసికంగా కూడా నేను పరీక్షను ఎదుర్కొన్నాను. కానీ పట్టుదలతో ఆడి గెలిచాను. అందుకే ఈ గెలుపు ఎంతో ప్రత్యేకం. ఫైనల్ ప్రత్యర్థి వీడియోలు చూసి అతనిపై అటాకింగ్ గేమ్ ఆడి ఫలితం సాధించాను. భవిష్యత్తు..: త్వరలోనే జరగనున్న ప్రపంచ చాంపియన్షిప్ కోసం సన్నాహకాలు చేస్తున్నాను. ఆ తర్వాత ఆసియా క్రీడలు ఉన్నాయి. అక్కడ చైనా ఆటగాళ్ల వల్ల పోటీ తీవ్రమని తెలుసు. అయితే కష్ట పడతాను. అక్కడా పతకం గెలవాలనేదే నా ప్రస్తుత లక్ష్యం. కామన్వెల్త్ గెలుపు నా భవిష్యత్తును కూడా మారుస్తుందని నమ్ముతున్నాను. -
సింధు సె'మిస్'.. కశ్యప్కు పతకం ఖాయం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలుగుతేజాలు పారుపల్లి కశ్యప్ ఫైనల్కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకోగా, పీవీ సింధుకు సెమీస్లో నిరాశ ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో కశ్యప్ 18-21, 21-17, 21-18 స్కోరుతో ఇంగ్లండ్ షట్లర్ రాజీవ్ ఓసెఫ్పై పోరాడి గెలిచాడు. గంటా 23 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కశ్యప్ మూడు గేమ్లలో మ్యాచ్ను సొంతం చేసుకుని ఫైనల్ బెర్తు దక్కించుకున్నాడు. కాగా మహిళల సింగిల్స్ సెమీస్లో యువ సంచలనం సింధు 20-22, 20-22 స్కోరుతో కెనడా షట్లర్ లీ చేతిలో పోరాడి ఓడింది. 54 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో సింధు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్లో సింధు తలపడనుంది. -
‘షటిల్’ స్పీడ్తో....
సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్, శ్రీకాంత్, గురుసాయిదత్, సాయిప్రణీత్....అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో సంచలనాలు సృష్టిస్తున్న ఈ జాబితా ఇలా కొనసాగుతూనే ఉంటుంది. వీరంతా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఎక్కడ బ్యాడ్మింటన్ టోర్నీ జరిగినా మన ఆటగాళ్లదే హవా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున సాధించే పతకాలన్నీ మన రాష్ట్ర క్రీడాకారులు అందించినవే. సీనియర్ స్థాయిలో ఒలింపిక్ మెడల్ వరకు మన ప్రభ వెలిగితే...జూనియర్ స్థాయిలోనైతే అనేకానేక విజయాలు దక్కాయి. ఒక వైపు స్టార్ ప్లేయర్లు తమ జోరును కొనసాగిస్తుంటే...మరో వైపు వర్ధమాన, యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా మన వద్ద బ్యాడ్మింటన్ ఒక్కసారిగా పాపులర్ క్రీడగా మారిపోయింది. ఆట నేర్చుకునేందుకు, మెరుగుపర్చుకునేందుకు అవకాశాలు పెరగడం కూడా అందుకు కారణం. మన రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ అకాడమీలు, కేంద్రాల్లో బ్యాడ్మింటన్లో చక్కటి శిక్షణ లభిస్తోంది. మన రాష్ట్రంలో ఈ ఆటలో అందుబాటులో ఉన్న శిక్షణా సౌకర్యాలపై ఒక దృష్టి... - మొహమ్మద్ అబ్దుల్ హాది పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ... దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ నంబర్వన్గా ఉన్న అకాడమీ ఇది. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో సంచలన విజయాలు సాధిస్తూ రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తెస్తున్న ఆటగాళ్లంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నవారే. భారత జట్టు చీఫ్ కోచ్ గోపీచంద్ నేతృత్వంలో సైనా, సింధు, కశ్యప్లాంటి ఎందరో ఆటగాళ్లు వరుస విజయాలు సాధించారు. అనేక మంది వర్ధమాన షట్లర్లు ఇక్కడినుంచే వెలుగులోకి వస్తున్నారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, కోర్టులు, శిక్షణతో ఈ అకాడమీ తిరుగులేని ఫలితాలు కనబరుస్తోంది. ప్రవేశం గోపీచంద్ అకాడమీలో ప్రధానంగా అగ్రశ్రేణి ఆటగాళ్లే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక లేదా జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచినవారు ఇక్కడ చేరితే మరింత మెరుగైన ఫలితాలు దక్కే అవకాశం ఉంటుంది. వారి పూర్వ ప్రదర్శనను బట్టి ఇక్కడ ప్రవేశానికి అవకాశం ఉంటుంది. మరోవైపు పూర్తిగా కొత్తవారికి కూడా పరిమిత సంఖ్యలో శిక్షణ లభిస్తుంది. అయితే అందుకోసం ఇక్కడి నిపుణులైన కోచ్లు నిర్దేశించిన ప్రమాణాలు అందుకోవాల్సి ఉంటుంది. వారి ప్రాథమిక పరిజ్ఞానం, చురుకుదనాన్ని బట్టి ఎంపిక చేస్తారు. వివరాలకు గచ్చిబౌలిలోని అకాడమీ కేంద్రంలో సంప్రదించవచ్చు. నంద్యాల అకాడమీ... జూనియర్, సబ్ జూనియర్ స్థాయిలో ఈ ప్రైవేట్ అకాడమీ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లు నిలకడగా విజయాలు సాధిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో నంది పైప్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ అకాడమీలో ప్రస్తుతం 60 మంది ఆటగాళ్లకు ఇద్దరు కోచ్లు శిక్షణనిస్తున్నారు. ఇతర వివరాలకు నంది స్పోర్ట్స్ డాట్ కామ్ వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఇతరత్రా... మే నెలలో కొత్తగా మరో 3 ప్రైవేట్ బ్యాడ్మింటన్ అకాడమీలు అందుబాటులోకి రానున్నాయి. పుల్లెల గోపీచంద్ సహకారంతోనే, చిట్టూరి సుబ్బారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కొత్తగా అకాడమీ ప్రారంభం కానుంది. గతంలో శాప్లో కోచ్గా పని చేసిన గోవర్ధన్ హైదరాబాద్లోని రెండు ప్రాంతాల్లో (షేక్పేట్, ఏఎస్రావునగర్)లలో కొత్తగా అకాడమీలను ప్రారంభిస్తున్నారు. మరో వైపు దిగ్గజ కోచ్, ద్రోణాచార్య అవార్డీ ఎస్ఎం ఆరిఫ్ కూడా అకాడమీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దాదాపు ఏడాది తర్వాత ఇది నగరంలోని బండ్లగూడలో పూర్తి స్థాయిలో ఏర్పాటు కావచ్చు. ప్రభుత్వం తరఫున... ఖమ్మం శాప్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో హాస్టల్ సదుపాయంతో నిర్వహిస్తున్న ఒకే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఖమ్మంలో ఉంది. ఇక్కడినుంచి కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో షట్లర్లు వెలుగులోకి వచ్చారు. 12-18 ఏళ్ల మధ్య వయసువారికి అవకాశం కల్పిస్తారు. గరిష్టంగా 20 మందిని తీసుకుంటారు. ఒక కోచ్ అందుబాటులో ఉన్నారు. ప్రతిభను గుర్తించి ఎంపిక చేయడంతో పాటు అప్పటికే జూనియర్ స్థాయిలో రాణిస్తున్న చిన్నారులను అకాడమీలోకి తీసుకుంటారు. అయితే గత కొన్నాళ్లుగా టాలెంట్ సెర్చ్ కార్యక్రమం నిలిచిపోయింది. సాధారణంగా జూన్లో ఎంపిక ఉంటుంది. ఇతర వివరాలకు ఖమ్మంలోని జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో గానీ హైదరాబాద్లోని శాప్ ప్రధాన కార్యాలయంలో గానీ సంప్రదించవచ్చు. స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ (సరూర్నగర్) రాజధాని నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలో ఒక బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 50 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే హాస్టల్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ అకాడమీలో 12-18 ఏళ్ల మధ్య వయసు ఆటగాళ్లను కోచింగ్ కోసం ఎంపిక చేస్తారు. ముగ్గురు కోచ్లు పని చేస్తున్నారు. కనీసం జిల్లా స్థాయిలో ఆడిన షట్లర్లను వివిధ దశల్లో వడపోతల అనంతరం ఎంపిక చేస్తారు. అయితే పూర్తిగా కొత్తగా ఉండే లెర్నర్స్ను కూడా 6-8 ఏళ్ల మధ్య వయసు వారిని ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వివరాలకు సరూర్నగర్ స్టేడియంలో సంప్రదించవచ్చు. ఎల్బీ స్టేడియం... శాప్ ప్రధాన కార్యాలయం ఉన్న లాల్బహదూర్ స్టేడియంలో కూడా బ్యాడ్మింటన్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ సాధన చేస్తారు. ఎల్బీ స్టేడియంలో పే అండ్ ప్లే పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. ఈ చిన్నారులకు శాప్ నియమించిన కోచ్ శిక్షణ ఇస్తారు. శాప్ పరిధిలోని యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో కూడా పే అండ్ ప్లే పథకం కొనసాగుతోంది. అయితే ఎల్బీ స్టేడియంలో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో కోచ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ శిక్షణ కొనసాగుతోంది. ఆసక్తి గలవారు స్టేడియం అడ్మినిస్ట్రేటర్ను సంప్రదించవచ్చు. విజయవాడలో.... ఒకప్పుడు అత్యుత్తమ క్రీడాకారులను అందించిన విజయవాడలో ఇప్పుడు బ్యాడ్మింటన్ కళ తప్పింది. కొన్నాళ్ల క్రితం చేతన్ ఆనంద్ అకాడమీని ప్రారంభించినా... వివిధ కారణాలతో అందులో శిక్షణ ఆగిపోయింది. ప్రస్తుతం మున్సిపల్ స్టేడియంలో చిన్నారులకు కోచింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వం తరఫున ఇక్కడ ఒక కోచ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్నారులకు ఆటలో బేసిక్స్ నేర్పించేందుకు అవకాశం ఉంది. -
కశ్యప్ శుభారంభం
శ్రమించి నెగ్గిన సింధు, గురుసాయిదత్ శ్రీకాంత్ పరాజయం ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): అనుకూలమైన ‘డ్రా’ను సద్వినియోగం చేసుకొని... కనీసం కాంస్యం సాధించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన భారత స్టార్ పారుపల్లి కశ్యప్ తొలి అడ్డంకిని అధిగమించాడు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో కశ్యప్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 21-14, 21-17తో గో సూన్ హువాట్ (మలేసియా)పై గెలిచాడు. 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో కశ్యప్ రెండు గేముల్లోనూ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సూ జెన్ హావో (చైనీస్ తైపీ)తో కశ్యప్ ఆడతాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సూ జెన్ హావోతో ఆడిన ఏకైక మ్యాచ్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వరుస గేముల్లో నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల్లో గురుసాయిదత్ ముందంజ వేయగా... కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో గురుసాయిదత్ 22-20, 23-21తో ఫెట్ప్రదాబ్ ఖోసిట్ (థాయ్లాండ్)పై కష్టపడి గెలుపొందాడు. ప్రపంచ చాంపియన్ లిన్ డాన్ (చైనా)తో జరిగిన మ్యాచ్లో శ్రీకాంత్ 7-21, 14-21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు శ్రమించి గెలిచింది. ప్రపంచ 147వ ర్యాంకర్ చుయెంగ్ ఎన్గాన్ యి (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్లో సింధు 21-15, 15-21, 21-18తో విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ హిరోస్ (జపాన్)తో సింధు తలపడుతుంది. హిరోస్తో గతంలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ సింధు ఓడిపోవడం గమనార్హం. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప (భారత్) జోడి 21-18, 21-15తో ఫూ మింగ్తియాన్-నియో వానెస్సా (సింగపూర్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) 21-16, 13-21, 20-22తో లో జువాన్ షెన్-హెగ్ నెల్సన్ (మలేసియా) చేతిలో; అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా (భారత్) 18-21, 19-21తో జాంగ్ వెన్-వాంగ్ యిల్వ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సింధు నిష్ర్కమణ
కశ్యప్ సంచలన విజయం ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ: సింధుపై ఈ సారి షిజియాన్ వాంగ్దే పైచేయి అయింది. గతంలో ఈ ఏపీ అమ్మాయి చేతిలో మూడు సార్లు ఓడిన ఈ చైనా షట్లర్ ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్లో సత్తా చాటింది. రెండో సీడ్ వాంగ్ జోరుకు సింధు తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం ఇక్కడి సిరిఫోర్ట్ స్పోర్ట్స్ కాంపెక్స్లో 70 నిమిషాలపాటు జరిగిన మారథాన్ మ్యాచ్లో సింధు 15-21, 21-12, 10-21 స్కోరుతో రెండో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి గేమ్ను కోల్పోయిన అనంతరం సింధు కోలుకుని రెండో గేమ్లో చెలరేగింది. అయితే చివరి గేమ్లో సింధు ఒక దశలో 3-0తో ఆధిక్యంలో నిలిచినప్పటికీ.. షిజియాన్ తన నైపుణ్యంతో 16-4తో పైచేయి సాధించింది. చివరికి షిజియాన్ వాంగ్ 21-10తో గేమ్తో పాటు మ్యాచ్ను కూడా నెగ్గింది. ఇక స్టార్ షట్లర్, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21-7, 21-9తో సిమోన్ (ఆస్ట్రియా)పై అలవోకగా నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించింది. కశ్యప్ అదుర్స్ తెలుగుతేజం కశ్యప్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కశ్యప్ 21-12, 17-21, 21-12తో ప్రపంచ ఏడో ర్యాంకర్, ఆరో సీడ్ జెంగ్మింగ్ వాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. కశ్యప్ గతంలో రెండు సార్లు (2012లో చైనా, 2013లో హాంకాంగ్ టోర్నీ) వాంగ్ చేతిలో ఓడిపోయాడు. అయితే మూడో ప్రయత్నంలో సఫలమయ్యాడు. మరో మ్యాచ్లో మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ ఫైనలిస్ట్ సౌరభ్ వర్మ 21-16, 17-21, 21-14తో వ్లాదిమిర్ ఇవనోవ్ (రష్యా)పై నెగ్గాడు. ఇక తెలుగుతేజం గురుసాయిదత్ 17-21, 21-16, 21-17తో తిన్ చెన్ చౌ (చైనీస్ తైపీ)పై గెలిచాడు. ఇతర భారత ఆటగాళ్లు ప్రణయ్, కె. శ్రీకాంత్, సాయి ప్రణీత్, అనూప్ శ్రీధర్, శ్రేయాంష్ జైస్వాల్, ఆనంద్ పవార్, అజయ్ కుమార్ తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్లో సయాలీ గోఖలె, తృప్తి ముర్గండే రెండో రౌండ్కి చేరగా... సయాలీ రాణే, తాన్వీలాడ్, శృతి, తులసి నిష్ర్కమించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి 21-19, 17-21, 21-14తో చాయానిత్-ముంకితామొర్న్ (థాయ్లాండ్)పై గెలిచి ప్రి క్వార్టర్ ఫైన్లలోకి ప్రవేశించింది. ఐబీఎల్లో ఆడతారా ? ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) రెండో ఎడిషన్కు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పి.వి.సింధుతో పాటు ప్రపంచ స్టార్లు ఐబీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఐబీఎల్-2 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 14 వరకు జరగనుంది. అయితే ఈ టోర్నీ ముగిసే లోపే (అక్టోబర్ 14 నుంచి) డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ ప్రారంభమవుతుంది. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) నిబంధనల ప్రకారం టాప్-10 ప్లేయర్లు సూపర్ సిరీస్ టోర్నీల్లో కచ్చితంగా పాల్గొనాలి. గాయపడిన వారికి మినహాయింపు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఐబీఎల్-2 చివరి దశలో మ్యాచ్లకు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే ఐబీఎల్ నిర్వాహకులు మాత్రం డెన్మార్క్ సూపర్ సిరీస్ వల్ల ఐబీఎల్కు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. స్టార్ ప్లేయర్లు ఐబీఎల్లో పాల్గొంటారని... అవసరమైతే షెడ్యూల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. -
కశ్యప్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్కు ఊహించని ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ కశ్యప్ 19-21, 18-21తో భారత్కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిపోయాడు. ఈ గెలుపుతో ప్రణయ్ 2010 ఇండియా గ్రాండ్ప్రి టోర్నీలో కశ్యప్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. భారత్కే చెందిన ఆనంద్ పవార్, అరవింద్ భట్ మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్లో ఆనంద్ పవార్ 21-16, 21-12తో ఉత్రోసా (స్లొవేనియా)పై నెగ్గగా... అరవింద్ భట్ 21-17, 16-21, 21-11తో ప్రపంచ 10వ ర్యాంకర్ యున్ హూ (హాంకాంగ్)ను కంగుతినిపించాడు. -
కొరియా ఓపెన్కు కశ్యప్ దూరం
న్యూఢిల్లీ: భుజం గాయం కారణంగా పారుపల్లి కశ్యప్ సీజన్ తొలి సూపర్ సిరీస్ టోర్నమెంట్ కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాడు. వచ్చే జనవరి 7 నుంచి 12 వరకు జరిగే ఈ టోర్నీ నుంచి ఇప్పటికే మరో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తప్పుకున్న సంగతి విదితమే. ‘గతవారం ప్రాక్టీస్ సమయంలో నా భుజంలో గాయమైంది. మరో వారంలో తగ్గే అవకాశముంది. అయినప్పటికీ నేను కొరియా ఓపెన్ నుంచి వైదొలిగాను. గాయం కారణంగానే నేను జాతీయ సీనియర్ పోటీల్లో టీమ్ ఈవెంట్లో పాల్గొనలేదు. డిఫెండింగ్ చాంపియన్ కావడంతో వ్యక్తిగత విభాగంలో పోటీపడుతున్నాను’ అని కశ్యప్ వివరించాడు. -
టాప్-5 ర్యాంక్పై కశ్యప్ దృష్టి
న్యూఢిల్లీ: భారత స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ టాప్-5 ర్యాంకుపై కన్నేశాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నప్పటికీ దీన్ని సాధించే సత్తా తనలో ఉందని అన్నాడు. ‘నేను టాప్-5లో స్థానం దక్కించుకోగలను. ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో మూడో ర్యాంకు ఆటగాడిని ఓడించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఎంతకష్టమైనా సరే మేటి ఐదు ర్యాంకుల్లో నిలుస్తా’ అని ప్రపంచ 12వ ర్యాంకర్ కశ్యప్ అన్నాడు. పీఎస్పీబీ టోర్నమెంట్ కోసం ఇక్కడికొచ్చిన అతను ఇందులో ఆడేది అనుమానంగానే ఉంది. 27 ఏళ్ల ఈ ఏపీ స్టార్ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపైనే దృష్టి సారించినట్లు చెప్పాడు. అనంతరం డెన్మార్క్, ఫ్రాన్స్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీల్లో పాల్గొంటాడు. మూడు వారాల వ్యవధిలో ఈ టోర్నీలు జరుగుతాయని ఇందుకు సన్నద్ధమవుతానని చెప్పాడు. వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్, ప్రపంచ చాంపియన్షిప్లాంటి మెగా టోర్నీలు జరగనున్నాయని దీంతో ఫిట్నెస్ను కాపాడుకోవడంపైనే దృష్టిపెడతానన్నాడు. సింధు, కశ్యప్లకు టాప్ సీడింగ్ నేటి నుంచి పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ) ఇంటర్ యూనిట్ టోర్నమెంట్ జరగనుంది. ఇందులో ఏపీ రైజింగ్ స్టార్ పి.వి.సింధు టాప్ సీడ్గా బరిలోకి దిగుతోంది. పురుషుల ఈవెంట్లో కశ్యప్కు టాప్ సీడింగ్ దక్కింది. ఇక్కడి సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగే ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గుత్తా జ్వాల, శ్రీకాంత్, గురుసాయిదత్లతో పాటు అశ్విని పొన్నప్ప, వి. దిజు, అజయ్ జయరామ్ తదితరులు పాల్గొంటారు.