
స్క్వాష్లో రెండు పతకాలు ఖాయం!
ఇంచియాన్:ఇప్పటిదాకా ఆసియా గేమ్స్లో మహిళలు స్క్వాష్ విభాగంలో వ్యక్తిగత పతకం సాధించలేదు. ఈసారి ఆ లోటు తీరనుంది. తన పుట్టిన రోజు నాడు స్టార్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ మెరిసింది. సహచరురాలు జోష్న చినప్పతో జరిగిన సింగిల్స్ క్వార్టర్స్లో విజయం సాధించిన దీపిక తన ఖాతాలో కాంస్య పతకం ఖాయం చేసుకుంది. 1998 ఏషియాడ్లో ఈ క్రీడను ప్రవేశ పెట్టినప్పటినుంచి భారత సింగిల్స్ విభాగంలో క్రీడాకారిణులు పతకం అందుకోలేకపోయారు. అయితే హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో దీపిక 7-11, 11-9, 11-8, 15-17, 11-9 తేడాతో జోష్నను ఓడించి సెమీస్లో ప్రవేశించింది.
అటు పురుషుల సింగిల్స్లోనూ ఆసియా నంబర్ వన్ సౌరభ్ ఘోశల్ కూడా సెమీస్కు చేరి పతకంపై భరోసానిచ్చాడు. భారత ఆటగాడు ఘోషల్ 11-6 9-11 11-2 11-9 పాకిస్తాన్ ఆటగాడు నజీర్ ఇక్బాల్ ను బోల్తా కొట్టించి పతకం ఖాయం చేసుకున్నాడు. దీంతో భారత్ తొలిసారిగా రెండు సింగిల్స్ విభాగాల్లో పతకాలు సాధించినట్లవుతుంది.