అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-5 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రావ్య శివాని జోడీ సత్తా చాటింది.
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్-5 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రావ్య శివాని జోడీ సత్తా చాటింది. అస్సాంలోని గువాహటిలో జరిగిన ఈ టోర్నీలో బాలికల డబుల్స్ విభాగంలో టైటిల్ను కై వసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రావ్య శివాని- తనీషా కశ్యప్ (భారత్) ద్వయం 6-4, 6-4తో శ్రీవల్లి రష్మిక (భారత్)- మారియా కృపేనినా (రష్యా) జోడీపై గెలుపొందింది.