
ఢిల్లీ వన్డే: రైనా అవుట్
ఢిల్లీ: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా.. న్యూజిలాండ్తో రెండో వన్డేకూ దూరంకానున్నాడు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న రైనా ఇంకా కోలుకోలేదు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతనికి సూచించారు. దీంతో ఈ నెల 20న ఢిల్లీలో జరిగే వన్డేకు రైనా అందుబాటులో ఉండటం లేదు.
న్యూజిలాండ్తో ధర్మశాలలో ఆదివారం జరిగిన తొలి వన్డేకు కూడా రైనా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో విజయం సాధించింది. కాగా అతని స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకోలేదు.