second ODI
-
సిరీస్ విజయమే లక్ష్యంగా...
ఇంగ్లండ్పై టి20 సిరీస్ జోరును కొనసాగిస్తూ వన్డేల్లోనూ శుభారంభం చేసిన భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. అన్ని రకాలుగా ఫామ్లో ఉన్న టీమిండియా ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో చెలరేగుతున్న భారత్ను నిలువరించడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతూ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఈ సారైనా కోలుకొని పోటీనిస్తుందా చూడాలి. కటక్: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై తమ సత్తాను ప్రదర్శిస్తున్న భారత జట్టు ఇంగ్లండ్పై వన్డే సిరీస్ను గెలుచుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బారాబతి స్టేడియంలో నేడు జరిగే రెండో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసి 38.4 ఓవర్లలోనే ఛేదన పూర్తి చేసిన భారత్ అదే స్థాయి ఆటను ప్రదర్శిస్తే మరో మ్యాచ్ కూడా రోహిత్ సేన ఖాతాలో చేరుతుంది.టి20ల్లో చిత్తుగా ఓడి తొలి వన్డేలో కూడా 248కే పరిమితమైన ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శనతో సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. 2006 నుంచి భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లండ్ 5 మ్యాచ్లే గెలిచి 25 ఓడింది. కోహ్లి సిద్ధం... గాయంతో తొలి మ్యాచ్కు దూరమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పూర్తి ఫిట్గా సిద్ధమయ్యాడు. రెండో వన్డేలో అతను బరిలోకి దిగడం ఖాయమైంది. కోహ్లి కూడా చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. లయ అందుకునేందుకు అతనికి ఇదే సరైన అవకాశం. అయితే ఎవరి స్థానంలో విరాట్ ఆడతాడనేది ఆసక్తికరం. గత మ్యాచ్లో చెప్పినదాని ప్రకారం శ్రేయస్ను తప్పించి కోహ్లిని తీసుకోవాలి. కానీ మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న శ్రేయస్ను పక్కన పెడితే టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర విమర్శలు రావచ్చు. కోచ్ గంభీర్ సాధారణంగా ఓపెనింగ్ ఎడమ, కుడిచేతివాటం కాంబినేషన్ను ఇష్టపడతాడు. అలా చూస్తే శ్రేయస్పైనే వేటు వేసి జైస్వాల్ను ఆడించవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రయోగాలు చేయకుండా జైస్వాల్ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమవుతుంది. మరో వైపు రాహుల్ స్థానంలో కీపర్గా పంత్ను ఆడించే ఆలోచన కూడా ఉంది. లెఫ్టార్మ్ పేసర్ అర్ష్ దీప్ సింగ్ను పరీక్షించేందుకు రాణాను పక్కన పెట్టాలనే చర్చ కూడా జరుగుతోంది. ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని భావిస్తే భారత జట్టు మార్పులపై దృష్టి పెట్టకపోవచ్చు. కానీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్లో ఆటగాళ్లను పరీక్షించాలనే ఆలోచన ఉంటే మాత్రం మార్పులు ఖాయం. సీనియర్ పేసర్ షమీ గత మ్యాచ్లో వికెట్లు తీయకపోయినా చక్కటి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్ అక్షర్ బ్యాటింగ్లో రాణించడం సానుకూలాంశం. అయితే అన్నింటికి మించి కెపె్టన్ రోహిత్ ఫామ్లోకి రావడం భారత్కు ముఖ్యం. చాలా కాలంగా వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. గిల్, పాండ్యా, జడేజాలతో మన బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గెలిపించేదెవరు? ఈ పర్యటనలో ఐదు మ్యాచ్లలో ఓడిన ఇంగ్లండ్ ఆట దిశానిర్దేశం లేకుండా సాగుతోంది. పేరుకు భారీ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తున్నా ఆ జట్టు వ్యూహాల్లో పదును లోపించింది. గుడ్డిగా బ్యాట్లు ఊపడం తప్ప ఆటగాళ్లు విఫలమవుతున్న చోట రెండో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కోచ్ మెక్కలమ్ ప్రణాళికలు ఏవీ పని చేయడం లేదు. భారత గడ్డపై అనుభవం ఉన్న బట్లర్ మాత్రమే ఎంతో కొంత రాణిస్తుండగా బెతెల్ కాస్త పట్టుదలగా ఆడగలిగాడు. జట్టు ఆధారపడుతున్న రూట్, బ్రూక్ స్థాయికి తగ్గ ఆటను కనబర్చాల్సి ఉంది. ముఖ్యంగా బ్రూక్ 5 టి20లు, వన్డే కలిపి 91 పరుగులే చేశాడు. డకెట్ ఇంకా వన్డే ఓపెనర్గా కుదురుకోకపోగా, సాల్ట్ మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఆర్చర్, కార్స్ పేస్ భారత బ్యాటర్లపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, రషీద్ తేలిపోయాడు. ఈ మ్యాచ్లో మరో పేసర్ వుడ్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 40 ఓవర్లలోపే భారత్ తొలి వన్డే ముగించడం ఇంగ్లండ్ బౌలింగ్ బలహీనతను కూడా చూపించింది. దీనిని ఆ జట్టు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్/ పంత్, పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్ దీప్, షమీ ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్ ),సాల్ట్, రూట్, బ్రూక్,డకెట్, లివింగ్స్టోన్, బెతెల్, కార్స్, ఆర్చర్, రషీద్, వుడ్. పిచ్, వాతావరణం ఈ మైదానంలో ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. మొదటినుంచి ఇక్కడి పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలం. భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈ సారి కూడా పరుగుల వరద ఖాయం. వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. -
సిరీస్ విజయంపై గురి
రాజ్కోట్: స్వదేశంలో వరుస విజయాల జోరు కొనసాగిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మరో పోరుకు సిద్ధమైంది. యంగ్ ప్లేయర్లు సత్తా చాటడంతో ఐర్లాండ్పై తొలి వన్డేలో ఘన విజయం సాధించిన స్మృతి మంధన సారథ్యంలోని భారత జట్టు... ఆదివారం రెండో వన్డే ఆడనుంది. మొదటి మ్యాచ్లో ప్రతీక రావల్, తేజల్ హసబ్నిస్ అర్ధ శతకాలతో సత్తా చాటడంతో సునాయాసంగా గెలుపొందిన టీమిండియా... ఈ మ్యాచ్లోనూ సమిష్టిగా రాణించి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్లో ఆకట్టుకున్న భారత జట్టు... ఫీల్డింగ్లో మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. సులువైన క్యాచ్లను సైతం జారవిడిచి ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచి్చంది. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. హర్మన్ప్రీత్ కౌర్ గైర్హాజరీలో స్మృతి మంధన మరోసారి జట్టును నడిపించనుండగా... ప్రతీక రావల్ ఫామ్ కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్లో ఎక్కువసేపు నిలవలేకపోయిన హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ కూడా మంచి ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటే టీమిండియాకు తిరుగుండదు. తేజల్, రిచా ఘోస్, దీప్తి శర్మతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే టిటాస్ సాధు, సయాలీ, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, దీప్తి శర్మ కీలకం కానున్నారు.ఏడాది స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రిజర్వ్ బెంచ్ సత్తా పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. మరోవైపు తొలి మ్యాచ్లో బ్యాటింగ్లో ఆకట్టుకొని ఆత్మవిశ్వాసం నింపుకున్న ఐర్లాండ్ అదే జోష్లో సిరీస్ సమం చేయడంతో పాటు... భారత్పై తొలి విజయం సాధించాలని చూస్తోంది. -
సిరీస్పై భారత మహిళల గురి
అహ్మదాబాద్: భారత మహిళల జట్టు సిరీస్ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి మ్యాచ్లో పర్యాటక న్యూజిలాండ్ను కంగు తినిపించిన భారత్ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్ ఈ మ్యాచ్లో పుంజుకొని సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. స్మృతి రాణిస్తేనే... గత మ్యాచ్లో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్తో అరంగేట్రం చేసిన తేజల్ హసబి్నస్ మిడిలార్డర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్మన్ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. కివీస్కు మరో దెబ్బ సిరీస్లో వెనుకబడిన న్యూజిలాండ్కు అమెలియా కెర్ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్ కెర్, మోలి ఫెన్ఫోల్డ్, ఎడెన్ కార్సన్, లీ తహుహు. -
స్పిన్ వలలో చిక్కిన భారత్.. 32 పరుగుల తేడాతో ఓటమి
కొలంబో: భారత్ ముందున్న లక్ష్యం 241. రోహిత్ శర్మ మెరుపులతో 13.2 ఓవర్లలోనే భారత్ (97/0) వందకు చేరువైంది. ఈ స్కోరు చూసిన వారెవరికైనా భారత్ గెలుపు సులువే అనిపిస్తుంది. కానీ ‘హిట్మ్యాన్’ అవుటవడంతోనే భారత్ మెడకు లంక స్పిన్ ఉచ్చు బిగించింది. అంతే 208 పరుగులకే భారత్ కుప్పకూలింది. దీంతో తొలి వన్డేను ‘టై’ చేసుకున్న ఆతిథ్య శ్రీలంక రెండో వన్డేలో 32 పరుగులతో విజయం సాధించింది. టి20ల్లో క్లీన్స్వీప్ అయిన లంక వన్డేల్లో 1–0తో ఇక సిరీస్ కోల్పోలేని స్థితిలో నిలిచింది. మొదట శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (62 బంతుల్లో 40; 5 ఫోర్లు), కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్లు), అక్షర్ పటేల్ (44 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ జెఫ్రే వాండెర్సే (6/33) ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. అసలంక 3 వికెట్లు తీశాడు. సిరీస్లోని చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. తొలి బంతికే వికెట్... ఫామ్లో ఉన్న ఓపెనర్ నిసాంక (0)ను ఇన్నింగ్స్ తొలి బంతికే భారత బౌలర్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు) కుదురుగా ఇన్నింగ్స్ను నడిపించారు. అయితే సుందర్ తన వరుస ఓవర్లలో ఫెర్నాండో, కుశాల్లను అవుట్ చేయడంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. దీంతోపాటు 79 పరుగుల వద్ద మూడు వికెట్లను కోల్పోయింది. తర్వాత కెప్టెన్ చరిత్ అసలంక (42 బంతుల్లో 25; 3 ఫోర్లు), సమరవిక్రమ (14) జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. అక్షర్ ఈ జోడీని ఎక్కువసేపు నిలువనీయలేదు. సమరవిక్రమను అవుట్ చేయడంతో 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. కొద్దిసేపటి తర్వాత జనిత్ లియనగే (12)ను కుల్దీప్, అసలంకను సుందర్ అవుట్ చేయడంతో లంక ఒక దశలో 136 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. ఇలాంటి పరిస్థితిలో భారత బౌలర్లు పట్టుబిగించకుండా కమిండు మెండిస్ (44 బంతుల్లో 40; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. దునిత్ వెలలగే (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్లు)తో కలిసి కమిండు ఏడో వికెట్కు చకచకా 72 పరుగులు జోడించడం లంకను నిలబెట్టింది. దునిత్ అవుటయ్యాక కూడా స్కోరులో వేగం తగ్గకుండా కమిండు, అకిల ధనంజయ (15; 2 ఫోర్లు) పరుగులు సాధించడంతో ఆఖరి 5 ఓవర్లలో శ్రీలంక 44 పరుగులు చేసింది. సిరాజ్, అక్షర్ పటేల్లకు చెరో వికెట్ దక్కింది. రోహిత్ ఉన్నంత వరకే... ఓపెనర్లు రోహిత్, శుబ్మన్ గిల్ (44 బంతుల్లో 35; 3 ఫోర్లు) తొలి వన్డే కంటే మరింత పటిష్టమైన పునాది వేశారు. నాలుగో ఓవర్ నుంచి కెప్టెన్ రోహిత్ దూకుడు పెంచాడు. వెలలగే వేసిన ఆ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. అసిత ఏడో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో జట్టు స్కోరు 50కి చేరింది. తర్వాత ధనంజయ, కమిండు మెండిస్ ఓవర్లలో భారీ సిక్సర్లతో రోహిత్ 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ స్కోరు 76/0. వెలలగే వేసిన 13వ ఓవర్లో సిక్స్ కొట్టిన రోహిత్... తర్వాతి వాండెర్సే బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడి నిసాంక చేతికి చిక్కాడు. దీంతో 97 పరుగుల ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కోహ్లి బౌండరీతో ఆ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. కానీ కాసేపటికే వాండెర్సే ఒకే ఓవర్లో గిల్, దూబే (0)లను అవుట్ చేశాడు. తన తదుపరి ఓవర్లలో కోహ్లి (14), శ్రేయస్ అయ్యర్ (7) వికెట్లు తీశాడు. దీంతో 133 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది. అక్షర్ ధాటిగా ఆడుతుంటే... ఇంకోవైపు కేఎల్ రాహుల్ (0)ను వాండెర్సే డకౌట్ చేశాడు. అక్షర్, సుందర్ (15) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ జట్టును ఒడ్డున పడేయలేకపోయారు. వీళ్లిద్దరితో పాటు సిరాజ్ను అసలంక పెవిలియన్ చేర్చడంతో 201 పరుగుల వద్దే భారత్ 9వ వికెట్ కోల్పోయింది. అర్‡్షదీప్ (3) రనౌట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; అవిష్క (సి అండ్ బి) సుందర్ 40; కుశాల్ మెండిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సుందర్ 30; సమరవిక్రమ (సి) కోహ్లి (బి) అక్షర్ 14; అసలంక (సి) అక్షర్ (బి) సుందర్ 25; జనిత్ (సి అండ్ బి) కుల్దీప్ 12; వెలలగే (సి) దూబే (బి) కుల్దీప్ 39; కమిండు (రనౌట్) 40; ధనంజయ (రనౌట్) 15; వాండెర్సే (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 240. వికెట్ల పతనం: 1–0, 2–74, 3–79, 4–111, 5–136, 6–136, 7–208, 8–239, 9–240. బౌలింగ్: సిరాజ్ 8–1–43–1, అర్‡్ష దీప్ 9–0–58–0, అక్షర్ 9–0–38–1, శివమ్ దూబే 2–0–10–0, సుందర్ 10–1–30–3, కుల్దీప్ 10–1–33–2, రోహిత్ 2–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) నిసాంక (బి) వాండెర్సే 64; గిల్ (సి) కమిండు (బి) వాండెర్సే 35; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 14; దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 0; అక్షర్ (సి అండ్ బి) అసలంక 44; అయ్యర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వాండెర్సే 7; రాహుల్ (బి) వాండెర్సే 0; సుందర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 15; కుల్దీప్ (నాటౌట్) 7; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అసలంక 4; అర్‡్షదీప్ (రనౌట్) 3; ఎక్స్ట్రాలు 15; మొత్తం (42.2 ఓవర్లలో ఆలౌట్) 208. వికెట్ల పతనం: 1–97, 2–116, 3–116, 4–123, 5–133, 6–147, 7–185, 8–190, 9–201, 10–208. బౌలింగ్: అసిత ఫెర్నాండో 7–0–31–0, వెలలగే 6–0–41–0, ధనంజయ 10–1–54–0, కమిండు మెండిస్ 3–0–19–0, వాండెర్సే 10–0–33–6, అసలంక 6.2–2–20–3. -
IND VS SL 2nd ODI: బంతి పట్టిన హిట్మ్యాన్.. వైరల్ వీడియో
ప్రస్తుత శ్రీలంక పర్యటనలో టీమిండియా స్పెషలిస్ట్ బ్యాటర్లు పార్ట్ టైమ్ బౌలర్లుగా అవతారమెత్తుతున్నారు. టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్ బంతితో మ్యాజిక్ చేయగా.. తొలి వన్డేలో శుభ్మన్ గిల్, రెండో వన్డేలో రోహిత్ శర్మ బంతితో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ రెండు ఓవర్లు వేసి పర్వాలేదనిపించాడు. క్రీజ్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటంతో హిట్మ్యాన్ తనలోని ఆఫ్ స్పిన్ బౌలింగ్ నైపుణ్యాన్ని వెలికితీశాడు. రోహిత్ రెండు ఓవర్లలో 11 పరుగులిచ్చాడు. రోహిత్ అంతర్జాతీయ వేదికపై ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ.. ఐపీఎల్ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఐపీఎల్లో హిట్మ్యాన్ పేరిట హ్యాట్రిక్ కూడా ఉంది.Rohit Sharma this series:Batting ✅Bowling ✅Captaincy ✅Watch #SLvIND 2nd ODI LIVE NOW on #SonyLIV 🍿 pic.twitter.com/qBIl1vNwsU— Sony LIV (@SonyLIV) August 4, 2024మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. లంక ఇన్నింగ్స్లో పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12, వెల్లలగే 37, కమిందు మెండిస్ 40, అఖిల ధనంజయ 15 పరుగులు చేసి ఔట్ కాగా.. జెఫ్రీ వాండర్సే 1 పరుగుతో అజేయంగా నిలిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. All-rounders in India's limited-overs set up after T20 World Cup 2024 💹📸: Sony LIV pic.twitter.com/oorO7IJdIR— CricTracker (@Cricketracker) August 4, 2024 -
IND VS SL 2nd ODI: మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ (పథుమ్ నిస్సంక) తీశాడు. తద్వారా వన్డేల్లో ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో దేబశిష్ మహంతి, జహీర్ ఖాన్, ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున తొలి బంతికే వికెట్ తీశారు. వీరిలో జహీర్ ఖాన్ అత్యధికంగా నాలుగు సార్లు ఈ ఘనత సాధించాడు.దేబశిష్ మహంతి- 1999లో వెస్టిండీస్పై (రిడ్లే జాకబ్స్)జహీర్ ఖాన్- 2001లో న్యూజిలాండ్పై (మాథ్యూ సింక్లెయిర్)జహీర్ ఖాన్- 2002లో శ్రీలంకపై (సనత్ జయసూర్య)జహీర్ ఖాన్- 2007లో ఆస్ట్రేలియాపై (మైఖేల్ క్లార్క్)జహీర్ ఖాన్- 2009లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)ప్రవీణ్ కుమార్- 2010లో శ్రీలంకపై (ఉపుల్ తరంగ)మొహమ్మద్ సిరాజ్- 2024లో శ్రీలంకపై (పథుమ్ నిస్సంక)మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. పథుమ్ నిస్సంక 0, అవిష్క ఫెర్నాండో 40, కుశాల్ మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనగే 12 పరుగులు చేసి ఔట్ కాగా.. వెల్లలగే (37), కమిందు మెండిస్ (18) క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
‘టై’ని బ్రేక్ చేసేదెవరో?
కొలంబో: వన్డే సిరీస్లోనూ శుభారంభం చేస్తుందనుకున్న భారత్కు తొలి మ్యాచ్ ‘టై’ ఫలితం ఏమాత్రం ఊహించనిది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై ఆతిథ్య బౌలర్లు ఓడే మ్యాచ్ను సమం చేసుకున్నారు. బంతులు మిగిలున్నా... స్పిన్ ఉచ్చులో పడి ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయిన భారత్ ఇప్పుడు ఆ ‘టై’ని బ్రేక్ చేసే పనిలో పడింది. ఆదివారం జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. పైగా ఈ వేదికపై టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఇక్కడ 6 వన్డేల్లో గెలిచిన ఘనత భారత్ది! సరిగ్గా మూడేళ్ల క్రితం 2021లో చివరిసారిగా లంక చేతిలో ఓడింది. తర్వాత గత ‘టై’ మినహా ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచింది. మిడిలార్డర్ బాధ్యతగా ఆడితే... తొలి వన్డేలో భారత బౌలర్లు, ఓపెనర్లు బాగానే ఆడారు. 231 లక్ష్యఛేదనలో 130/3 స్కోరు వద్ద పటిష్టంగానే ఉంది. 101 పరుగులు చేస్తే గెలిచే చోటా ఏడు వికెట్లు చేతిలో ఉన్న టీమిండియా సరిగ్గా 100 చేసింది. మిడిలార్డర్లో నిలకడలేమి వల్లే జట్టు చివరకు ‘టై’ చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒక్క మ్యాచ్తో వేలెత్తిచూపేలా బ్యాటింగ్ ఆర్డర్ అయితే లేదు. కాస్త ఓపిక, అదేపనిగా స్పిన్ను ఎదుర్కోనే సహనం కనబరిస్తే చాలు జట్టు గాడిన పడుతుంది. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు బ్యాట్ ఝళిపిస్తే సిరీస్లో 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లవచ్చు. స్పిన్ ట్రాక్ కావడంతో మూడో పేసర్కు అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి అర్‡్షదీప్, సిరాజ్లకు తోడుగా ముగ్గురు స్పిన్నర్లు అక్షర్, సుందర్, కుల్దీప్లతో బౌలింగ్ దళం బరిలోకి దిగుతుంది. పైచేయి సాధించే పనిలో... పొట్టి ఫార్మాట్లో క్లీన్స్వీప్ అయిన ఆతిథ్య శ్రీలంక తొలి వన్డేలో ప్రత్యర్థికి దీటుగా పోరాడింది. ఈ మ్యాచ్లో విజయం లభించకపోయినా... వచ్చిన కొండంత ఆత్మవిశ్వాసమే బలంగా ఇప్పుడు లంక బరిలోకి దిగుతోంది. ఓపెనర్లలో నిసాంక సూపర్ఫామ్లో ఉండటం... స్పిన్నర్లు పట్టు బిగించడం జట్టు స్థయిర్యాన్ని పెంచింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో రెండో మ్యాచ్లో గెలిచి పైచేయి సాధించాలని అసలంక సేన భావిస్తోంది. కలిసొచ్చే పిచ్పై నమ్ముకున్న స్పిన్ బౌలింగ్ దళం జట్టును ఒడ్డున పడేస్తుందని జట్టు మేనేజ్మెంట్ అంచనాలతో ఉంది. టాపార్డర్లో అవిష్క, కుశాల్ మెండిస్, సమరవిక్రమ కూడా తమవంతు పాత్ర పోషిస్తే పరుగుల రాక సులువవుతుంది. లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే రూపంలో జట్టును ఆదుకునే బ్యాటర్ ఉండటం జట్టుకు అదనపు బలం. బౌలింగ్లో స్పిన్నర్లు హసరంగ, అసలంక, ధనంజయ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టి20 సిరీస్ల కాకుండా వన్డే సిరీస్ పోటాపోటీగా జరగడం ఖాయం. పిచ్, వాతావరణం ప్రేమదాస స్టేడియం స్పిన్కే అనుకూలం. గత మ్యాచ్లో పడిన 18 వికెట్లలో స్పిన్నర్ల (13) వాటానే అధికం. దీంతో బ్యాటర్లకు ఇబ్బందులు తప్పవు. ఆదివారం చిరుజల్లు కురిసే అవకాశముంది. జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, అక్షర్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, సిరాజ్, అర్‡్షదీప్. శ్రీలంక: అసలంక (కెప్టెన్ ), నిసాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్, సమరవిక్రమ, లియనగే, వెలలగే, హసరంగ, ధనంజయ, షిరాజ్, అసిత ఫెర్నాండో. -
SL vs ZIM, 2nd ODI: రసవత్తర సమరం.. అంతిమంగా శ్రీలంకదే విజయం
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంక 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ సమరంలో శ్రీలంక మరో ఓవర్ మాత్రమే మిగిలి ఉండగా విజయతీరాలకు చేరింది. జనిత్ లియనగే (95) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవ ఐదు వికెట్ల ఘనతతో (5/32) శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. అయినా అంతిమంగా శ్రీలంకనే విజయం వరించింది. కెరీర్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నగరవ రికార్డు స్థాయిలో వరుసగా 28వ పరిమిత ఓవర్ల మ్యాచ్లో వికెట్ తీసి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. తీక్షణ (4/31), చమీరా (2/44), వాండర్సే (2/47), మధుషంక (1/24) ధాటికి 44.4 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే ఇన్నింగ్స్లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (82) మాత్రమే రాణించాడు. జాయ్లార్డ్ గుంబీ (30), మిల్టన్ షుంబ (26), ర్యాన్ బర్ల్ (31), క్లైవ్ మదాండే (14) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంకకు నగరవ ముచ్చెమటలు పట్టించాడు. నగరవ ధాటికి శ్రీలంక ఓ దశలో ఓడిపోయేలా కనిపించింది. అయితే లియనగే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి తన జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఆఖర్లో సహన్ అరచ్చిగే (21), తీక్షణ (18), చమీరా (18 నాటౌట్), వాండర్సే (19 నాటౌట్) తలో చేయి వేయడంతో శ్రీలంక విజయతీరాలకు చేరింది. జింబాబ్వే బౌలర్లలో నగరవతో పాటు సికందర్ రజా (2/32), ముజరబానీ (1/41) వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జనవరి 11న జరుగుతుంది. వర్షం కారణంగా తొలి వన్డే తుడిచిపెట్టుకపోయిన విషయం తెలిసిందే. -
రిచా పోరాటం వృథా
ముంబై: గెలవాల్సిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు పోరాడి ఓడింది. సిరీస్ పరాజయంతో ఈ ఏడాదిని ముగించింది. 259 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 47 ఓవర్లలో 237/6 వద్ద పటిష్టంగానే కనిపించింది. 18 బంతుల్లో 22 పరుగుల విజయ సమీకరణం భారత మహిళలకే అనుకూలంగా ఉంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూజ (8), హర్లీన్ (1) అవుట్ కావడంతో ఓటమి ఖాయమైంది. 6 బంతుల్లో 16 పరుగులు చేయలేకపోయింది. తుదకు ఆసీస్ మహిళల జట్టు 3 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. గాయం పంటిబిగువన భరించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (117 బంతుల్లో 96; 13 ఫోర్లు)... జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు) అండతో అది్వతీయ పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. సిరీస్లోని చివరిదైన మూడో వన్డే జనవరి 2న జరుగుతుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఓపెనర్ లిచ్ఫిల్డ్ (98 బంతుల్లో 63; 6 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ ఎలీస్ పెరీ (47 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఇద్దరు మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. తర్వాత వచ్చిన వారిలో తాలియా (24; 2 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (23; 1 ఫోర్), జార్జియా (22; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. అయితే టెయిలెండర్ అలానా కింగ్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్స్లు) కొట్టిన భారీ సిక్సర్లతో ఆసీస్ 250 పైచిలుకు స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (5/38) వరుస విరామాల్లో వికెట్లను పడగొట్టింది. తర్వాత భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 255 పరుగులకే పరిమితమైంది. అనాబెల్ సదర్లాండ్ (3/47) కీలక సమయంలో విలువైన వికెట్లను తీసి భారత్ గెలుపు రాతను మార్చింది. ఫీల్డింగ్లో గాయపడిన స్నేహ్ రాణా స్థానంలో హర్లీన్ డియోల్ కన్కషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగింది. బెత్ మూనీ కొట్టిన షాట్ను బంతిని అందుకునే క్రమంలో చెరోవైపు నుంచి వచ్చిన స్నేహ్ రాణా, పూజ ఇద్దరి తలలు పరస్పరం ఢీకొని విలవిలలాడారు. తలనొప్పితో స్నేహ్రాణా మైదానం వీడింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: లిచ్ఫిల్డ్ (సి) రిచా (బి) శ్రేయాంక 63; అలీసా హీలీ (బి) పూజ 13; ఎలీస్ పెరీ (సి) శ్రేయాంక (బి) దీప్తి శర్మ 50; బెత్ మూనీ (ఎల్బీడబ్ల్యూ) (బి) దీప్తి శర్మ 10; తాలియా (బి) దీప్తి శర్మ 24; గార్డ్నెర్ (సి) అమన్జీత్ (బి) స్నేహ్ రాణా 2; అనాబెల్ (సి అండ్ బి) దీప్తి 23; జార్జియా (సి) స్మృతి (బి) దీప్తి శర్మ 22; అలానా కింగ్ (నాటౌట్) 28; కిమ్ గార్త్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 258. వికెట్ల పతనం: 1–40, 2–117, 3–133, 4–160, 5–170, 6–180, 7–216, 8–219. బౌలింగ్: రేణుక 7–0–36–0, పూజ 10–0–59–1, అమన్జోత్ 3–0–21–0, శ్రేయాంక 10–0–43–1, స్నేహ్ రాణా 10–0–59–1, దీప్తి శర్మ 10–0–38–5. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (ఎల్బీడబ్ల్యూ) (బి) కిమ్ గార్త్ 14; స్మృతి (సి) తాలియా (బి) అలానా 34; రిచా ఘోష్ (సి) లిచ్ఫిల్డ్ (బి) అనాబెల్ 96; జెమీమా (సి) లిచ్ఫిల్డ్ (బి) వేర్హమ్ 44; హర్మన్ప్రీత్ (సి) హీలీ (బి) వేర్హమ్ 5; దీప్తి శర్మ (నాటౌట్) 24; అమన్జోత్ (బి) అనాబెల్ 4; పూజ (సి) గార్డ్నెర్ (బి) అనాబెల్ 8; హర్లీన్ (బి) గార్డ్నెర్ 1; శ్రేయాంక (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 255. వికెట్ల పతనం: 1–37, 2–71, 3–159, 4–171, 5–218, 6–224, 7–240, 8–243. బౌలింగ్: గార్డ్నెర్ 10–0–46–1, బ్రౌన్ 7–0–37–0, కిమ్ గార్త్ 6–0–24–1, అనాబెల్ సదర్లాండ్ 9–0–47–3, అలానా కింగ్ 7–0–43–1, తాలియా 4–0–15–0, జార్జియా వేర్హమ్ 7–0–39–2. -
రిచా ఘోష్ వీరోచిత పోరాటం వృధా.. రెండో వన్డేలోనూ టీమిండియా ఓటమి
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్ను సైతం 0-2తో కోల్పోయింది. రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు. అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ లిచ్ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్గ్రాత్ (24), సదర్ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ ఆసీస్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్గా రికార్డుల్లోకెక్కింది. -
INDW VS AUSW 2nd ODI: ఆసీస్ వెన్ను విరిచిన దీప్తి శర్మ
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్లో టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దీప్తి శర్మ సత్తా చాటింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేయగా.. దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ వెన్ను విరిచింది. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో వస్త్రాకర్ 18 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్లు జారవిడిచడం విశేషం. ఆసీస్ ఇన్నింగ్స్లో ఓపెనర్ లిచ్ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్గ్రాత్ (24), సదర్ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్లో భారత్ ఆసీస్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది. చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ఆసీస్పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్గా రికార్డుల్లోకెక్కింది. -
భారత్కు చుక్కెదురు
పోర్ట్ ఎలిజబెత్: వరుసగా రెండో వన్డే గెలిచి సిరీస్నూ కైవసం చేసుకోవాలనుకున్న భారత్ ఆశలు మూకుమ్మడి వైఫల్యంతో ఆవిరయ్యాయి. నిలకడలేని బ్యాటింగ్, పసలేని బౌలింగ్, నిలువెత్తు నిర్లక్ష్యం భారత్ కొంపముంచాయి. ఇదే అదనుగా దక్షిణాఫ్రికా ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ను దెబ్బకొట్టింది. దీంతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం చవిచూసింది. ఆతిథ్య జట్టు సిరీస్ను 1–1తో సమం చేసింది. చివరిదైన మూడో వన్డే రేపు పార్ల్లో జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్లో సాయి సుదర్శన్ (83 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో కేఎల్ రాహుల్ (64 బంతుల్లో 56; 7 ఫోర్లు)... ఈ ఇద్దరు తప్ప ఇంకెవరూ కనీసం 20 పరుగులైన చేయలేకపోయారు. సఫారీ బౌలర్లు బర్జర్ (3/30), బ్యురన్ హెన్డ్రిక్స్ (2/34), కేశవ్ మహరాజ్ (2/51) సమష్టిగా దెబ్బతీశారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయింది. అనంతరం సులువైన లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి ఛేదించింది. ఓపెనర్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టోని డి జోర్జి (122 బంతుల్లో 119 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్లు) అజేయ సెంచరీతో కదంతొక్కగా, రీజా హెన్డ్రిక్స్ (81 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. ఇద్దరు తొలి వికెట్కు 130 పరుగులు చేయడంతోనే భారత్ పరాజయం ఖాయమైంది. వాన్ డర్ డసెన్ (36; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఈ మ్యాచ్తో రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బర్జర్ 4; సాయి సుదర్శన్ (సి) క్లాసెన్ (బి) విలియమ్స్ 62; తిలక్వర్మ (సి) బ్యురన్ హెన్డ్రిక్స్ (బి) బర్జర్ 10; రాహుల్ (సి) మిల్లర్ (బి) బర్జర్ 56; సామ్సన్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 12; రింకూ సింగ్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) కేశవ్ 17; అక్షర్ (సి) సబ్–వెరెన్ (బి) మార్క్రమ్ 7; కుల్దీప్ (సి) బ్యురన్ హెన్డ్రిక్స్ (బి) కేశవ్ 1; అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బ్యురన్ హెన్డ్రిక్స్ 18; అవేశ్ (రనౌట్) 9; ముకేశ్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 11; మొత్తం (46.2 ఓవర్లలో ఆలౌట్) 211. వికెట్ల పతనం: 1–4, 2–46, 3–114, 4–136, 5–167, 6–169, 7–172, 8–186, 9–204, 10–211. బౌలింగ్: బర్జర్ 10–0–30–3, విలియమ్స్ 9–1–49–1, బ్యురన్ హెన్డ్రిక్స్ 9.2–1–34–2, ముల్డర్ 4–0–19–0, కేశవ్ 10–0–51–2, మార్క్రమ్ 4–0–28–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రీజా హెన్డ్రిక్స్ (సి) ముకేశ్ (బి) అర్ష్దీప్ 52; టోని (నాటౌట్) 119; డసెన్ (సి) సామ్సన్ (బి) రింకూ 36; మార్క్రమ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (42.3 ఓవర్లలో 2 వికెట్లకు) 215. వికెట్ల పతనం: 1–130, 2–206. బౌలింగ్: ముకేశ్ 8–2–46–0, అర్ష్దీప్ 8–0–28–1, అవేశ్ 8–0–43–0, అక్షర్ 6–0–22–0, కుల్దీప్ 8–0–48–0, తిలక్ వర్మ 3–0–18–0, రింకూ సింగ్ 1–0–2–1, సాయి సుదర్శన్ 0.3–0–8–0. -
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) అర్ధసెంచరీలతో రాణించగా.. సౌతాఫ్రికాను యువ ఓపెనర్ టోనీ జోర్జీ (119) అజేయమైన శతకంతో విజయతీరాలకు చేర్చాడు. ఈ సిరీస్లో తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే డిసెంబర్ 21న జరుగనుంది. శతక్కొట్టిన టోనీ జోర్జీ దక్షిణాఫ్రికా యువ ఓపెనర్ టోనీ జోర్జీ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. టోనీకి కెరీర్లో ఇది తొలి సెంచరీ. 37 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 187/1. ఎట్టకేలకు తొలి వికెట్ పడింది.. 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 130 పరుగుల వద్ద (27.5వ ఓవర్) తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రీజా హెండ్రిక్స్ (52) ఔటయ్యాడు. టోనీ జోర్జీ (75), డస్సెన్ క్రీజ్లో ఉన్నారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోర్జీ సౌతాఫ్రికా ఓపెనర్ టోనీ జోర్జీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 25 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. 18 ఓవర్ల తర్వాత సౌతాఫ్రికా స్కోర్ 77/0గా ఉంది. టార్గెట్ 212.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా 212 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆచితూచి ఆడుతుంది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/0గా ఉంది. టోనీ డి జర్జీ (21), రీజా హెండ్రిక్స్ (7) క్రీజ్లో ఉన్నారు. 211 పరుగులకు ఆలౌటైన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. ఆవేశ్ ఖాన్ (9) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ (62), కేఎల్ రాహుల్ (56) మాత్రమే అర్ధసెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో నంబ్రే బర్గర్ 3, హెండ్రిక్స్, కేశవ్ మహారాజ్ చెరో 2, లిజాడ్ విలియమ్స్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 186 పరుగుల వద్ద టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మార్క్రమ్ బౌలింగ్లో అక్షర్ పటేల్ (7) ఔటయ్యాడు. పేక మేడలా కూలుతున్న టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త మెరుగ్గా ఆడిన టీమిండియా, ఆతర్వాత వరుసగా వికెట్లు కోల్పోతుంది. 172 పరుగుల వద్ద భారత జట్టు ఏడో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (1) ఔటయ్యాడు. ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా 169 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రింకూ సింగ్ (17) స్టంపౌటయ్యాడు. 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా టీమిండియా 167 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. హాఫ్ సెంచరీ అనంతరం కేఎల్ రాహుల్ (56) ఔటయ్యాడు. నండ్రే బర్గర్ బౌలింగ్లో మిల్లర్కు క్యాచ్ ఇచ్చి రాహుల్ పెవిలియన్ బాట పట్టాడు. సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ 136 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. హెండ్రిక్స్ బౌలింగ్లో సంజూ శాంసన్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా.. సాయి సుదర్శన్ ఔట్ 114 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 62 పరుగులు చేసి సాయి సుదర్శన్ ఔటయ్యాడు. లిజాడ్ విలియమ్స్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి సుదర్శన్ పెవిలియన్కు చేరాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి సుదర్శన్ టీమిండియా ఓపెనర్ సాయి సుదర్శన్ తన వన్డే కెరీర్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. సౌతాఫ్రికాతో సిరీస్లో భాగంగా జరిగిన తొలి వన్డేలో అజేయమైన అర్ధశతకం సాధించిన సుదర్శన్.. రెండో వన్డేలోనూ హాఫ్ సెంచరీ మార్కును దాటాడు. 20 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 84/2గా ఉంది. సుదర్శన్తో పాటు కేఎల్ రాహుల్ (15) క్రీజ్లో ఉన్నాడు. నత్త నడకన సాగుతున్న టీమిండియా బ్యాటింగ్ టీమిండియా బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 15 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 54/2గా ఉంది. సాయి సుదర్శన్ (36), కేఎల్ రాహుల్ (1) క్రీజ్లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. 46 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన తిలక్ వర్మ.. బర్గర్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. క్రీజులోకి కెప్టెన్ రాహుల్ వచ్చాడు. రెండో బంతికే వికెట్ కోల్పోయిన టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా రెండో బంతికే వికెట్ కోల్పోయింది. నంబ్రే బర్గర్ బౌలింగ్లో తొలి బంతికి బౌండరీ బాదిన రుతురాజ్ ఆతర్వాతి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రుతురాజ్ రివ్యూకి వెళ్లడంతో భారత్ ఓ రివ్యూ కోల్పోయింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకటి, సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. భారత్ తరఫున శ్రేయస్ అయ్యర్ స్థానాన్ని రింకూ సింగ్ భర్తీ చేశాడు. ఈ మ్యాచ్తో రింకూ వన్డే అరంగట్రేం చేయనున్నాడు. మరోవైపు సౌతాఫ్రికా రెండు మార్పులు చేసింది. ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రేజ్ షంషి స్థానాల్లో బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు: భారత్: సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రింకూ సింగ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్ హెండ్రిక్స్, లిజాడ్ విలియమ్స్ -
సిరీస్ విజయమే లక్ష్యంగా...
పోర్ట్ ఎలిజబెత్: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో అదరగొట్టిన భారత జట్టు ఇప్పుడు అదే తరహాలో మరో గెలుపుపై కన్నేసింది. ఒక మ్యాచ్ ముందే సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ ఘన విజయం ఇచ్చి న ఉత్సాహం టీమిండియాలో కనిపిస్తుండగా... సొంతగడ్డపై అనూహ్యంగా 116 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా తమ టీమ్ ప్రదర్శనపై కొత్త సందేహాలు రేపింది. మూడో టి20లో ఓటమి తర్వాత తొలి వన్డేలో ఆ జట్టు ఆటతీరు మరీ పేలవంగా కనిపించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమైంది. భారత్ సిరీస్ అందుకుంటుందా లేక సఫారీ టీమ్ కోలుకొని తగిన రీతిలో బదులిస్తుందా అనేది చూడాలి. రజత్ పటిదార్కు అవకాశం! గత మ్యాచ్లో భారత బౌలర్లు అర్‡్షదీప్, అవేశ్ ఖాన్ ప్రత్యర్థిని పడగొట్టగా... ఐదో బౌలర్ అవసరం కూడా రాకుండానే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. అరంగేట్ర మ్యాచ్లోనే సాయి సుదర్శన్ ఆకట్టుకున్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో ఎలాంటి మార్పు అవసరం లేకుండానే జట్టు బరిలోకి దిగేది. అయితే టెస్టు సిరీస్ సన్నద్ధత కోసం శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో పాటు తర్వాతి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో బ్యాటింగ్ విభాగంలో ఒక ఖాళీ ఏర్పడింది. చాలా కాలంగా తొలి అవకాశం కోసం ఎదురు చూస్తున్న మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పటిదార్కు నేరుగా చోటు దక్కనుంది. ఈ స్థానం కోసం రింకూ సింగ్ నుంచి కూడా పోటీ ఉన్నా... టి20 సిరీస్లో అవకాశం దక్కించుకున్న రింకూకంటే రజత్కే మొదటి ప్రాధాన్యత దక్కనుంది. తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేయని రాహుల్, సంజు సామ్సన్లు కూడా రాణిస్తే భారత్కు తిరుగుండదు. బౌలింగ్లో మరోసారి కుల్దీప్ పదునైన బంతులను సఫారీలు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. హెన్డ్రిక్స్పై దృష్టి... దక్షిణాఫ్రికా కూడా గత ఓటమిని మరచి కోలుకునే ప్రయత్నంలో ఉంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్లో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. ఎన్నో అంచనాలతో వన్డేల్లో వరుసగా అవకాశం దక్కించుకుంటున్న ఓపెనర్ హెన్డ్రిక్స్ పేలవంగా ఆడుతుండగా... డసెన్, మార్క్రమ్, మిల్లర్ కూడా ప్రభావం చూపలేకపోతున్నారు. భారత గడ్డపై వరల్డ్ కప్లో చెలరేగిన క్లాసెన్ సొంత మైదానంలో మాత్రం ఇంకా తన స్థాయిని ప్రదర్శించలేదు. అనుభవం లేని బర్జర్, ముల్దర్ల బౌలింగ్ భారత్కు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. పిచ్ కారణంగా ఈ సారి కూడా ఇద్దరు స్పిన్నర్లు కేశవ్, షమ్సీ తుది జట్టులో ఉంటారు. పిచ్, వాతావరణం దక్షిణాఫ్రికా అత్యంత నెమ్మదైన మైదానాల్లో ఇదొకటి. సాధారణ పిచ్. భారీ స్కోర్లకు అవకాశం లేదు. గత 12 ఏళ్లలో ఇక్కడ 8 వన్డేలు జరగ్గా... ఒక్కసారి కూడా స్కోరు 300 దాటలేదు. మ్యాచ్కు అనుకూల వాతావరణం ఉంది. వర్షసూచన లేదు. -
ఇండోర్లో ఇరగదీశారు.. సిరీస్ మనదే
వరల్డ్ కప్కు ముందు భారత్ అదరగొట్టే ప్రదర్శన... పలువురు కీలక ఆటగాళ్లు లేకపోయినా అద్భుత ఆటతో టీమిండియా బృందం ఆ్రస్టేలియాకు చుక్కలు చూపించింది. భారీ విజయమే కాకుండా ఇప్పటి వరకు వరకు బెంగగా ఉన్న శ్రేయస్ ఫామ్ సమస్య కూడా తొలగిపోగా... సూర్యకుమార్ కూడా ఎట్టకేలకు తన అసలు ప్రతాపాన్ని చూపించాడు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్ భారత్ సొంతమైంది. ఇండోర్: సమష్టి ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ ఆదివారం హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 99 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టుపై భారత్కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్స్లు), శుబ్మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీలతో సత్తా చాటారు. వీరిద్దరు రెండో వికెట్కు 164 బంతుల్లోనే 200 పరుగులు జోడించడం విశేషం. ఈ ఇద్దరితో పాటు సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. భారత్ ఇన్నింగ్స్లో ఏకంగా 31 ఫోర్లు, 18 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరుగులకు ఆలౌటైంది. వార్నర్ (39 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్), అబాట్ (36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధసెంచరీలు చేశారు. చివరి వన్డే బుధవారం రాజ్కోట్లో జరుగుతుంది. చివరి వరకు మెరుపులు... అరంగేట్ర బౌలర్ స్పెన్సర్ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన రుతురాజ్ (8) ఎక్కువసేపు నిలవలేదు. అయితే నాలుగో ఓవర్ ఐదో బంతి నుంచి మొదలైన గిల్, శ్రేయస్ భాగస్వామ్యం ఆస్ట్రేలియాను ఒక ఆటాడుకుంది. గత మ్యాచ్లో రనౌటై తీవ్ర నిరాశకు గురైన శ్రేయస్ ఈసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో జోరు ప్రదర్శించాడు. తన తొలి 14 బంతుల్లోనే అతను 5 ఫోర్లు కొట్టాడు. అబాట్ ఓవర్లో గిల్ 6, 4 కొట్టడంతో భాగస్వామ్యం 29 బంతుల్లోనే 50 పరుగులకు చేరింది. వానతో 40 నిమిషాల విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. గిల్ 37 బంతుల్లో, శ్రేయస్ 41 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా లాభం లేకపోయింది. తన ధాటిని కొనసాగిస్తూ 86 బంతుల్లో కెరీర్లో మూడో సెంచరీ అందుకున్న శ్రేయస్ తర్వాతి ఓవర్లో వెనుదిరగ్గా... కొద్ది సేపటికే 92 బంతుల్లో గిల్ ఆరో వన్డే సెంచరీ పూర్తయింది. గిల్ కూడా అవుటయ్యాక ఇషాన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్, సూర్య కలిసి మరింత దూకుడుగా ఆడారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 311/4. ఈ దశలో సూర్య మెరుపు బ్యాటింగ్తో ఇండోర్ దద్దరిల్లింది. తర్వాతి 7 ఓవర్లలో భారత్ 88 పరుగులు చేయగా... అందులో సూర్య ఒక్కడే 68 పరుగులు సాధించడం విశేషం. 24 బంతుల్లోనే అతను హాఫ్ సెంచరీ మార్క్ను చేరుకున్నాడు. అశ్విన్కు 3 వికెట్లు... ఛేదనలో ఆసీస్ ఆరంభంలోనే తడబడింది. ప్రసిధ్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షార్ట్ (9), స్మిత్ (0)లను అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వార్నర్, లబుషేన్ (27) కలిసి మూడో వికెట్కు 80 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరితో పాటు ఇన్గ్లిస్ (6)ను 12 పరుగుల వ్యవధిలో అశ్విన్ అవుట్ చేయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. ఆఖర్లో సీన్ అబాట్, హాజల్వుడ్ (23) కలిసి తొమ్మిదో వికెట్కు 44 బంతుల్లోనే 77 పరుగులు జోడించి పోరాడినా లక్ష్యానికి జట్టు చాలా దూరంలో ఆగిపోయింది. వరుసగా 4 సిక్సర్లు... గత మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన సూర్యకుమార్ ఈసారి తన అసలైన 360 డిగ్రీ ఆటను ప్రదర్శించాడు. ముఖ్యంగా గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అతను అద్భుత షాట్లతో చెలరేగాడు. తొలి నాలుగు బంతులను అతను లాంగ్ లెగ్, ఫైన్ లెగ్, కవర్స్, డీప్ మిడ్వికెట్ మీదుగా సికర్లుగా మలచడం విశేషం. ఆట చూస్తే తర్వాతి రెండు బంతులూ సిక్సర్లుగా మారతాయేమో అనిపించింది. అయితే గ్రీన్ రెండు చక్కటి బంతులతో కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. వార్నర్ రైట్ హ్యాండర్గా... ఆసీస్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో వార్నర్ అనూహ్యంగా గార్డ్ తీసుకొని మరీ పూర్తి స్థాయి ‘రైట్ హ్యాండ్’ బ్యాటర్గా ఆడాడు. అశ్విన్ వేసిన ఈ ఓవర్లో ఒక చక్కటి ఫోర్ సహా అతను 6 పరుగులు చేశాడు. అయితే అశ్విన్ తర్వాతి ఓవర్లోనూ ఇలాగే దిగి లెఫ్ట్ హ్యాండర్ తరహాలో రివర్స్ స్వీప్ ఆడబోయి తొలి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. వార్నర్ దీనిని రివ్యూ చేయకపోగా, రీప్లేలో బంతి అతని బ్యాట్ను తాకినట్లు తేలింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) క్యారీ (బి) హాజల్వుడ్ 8; గిల్ (సి) క్యారీ (బి) గ్రీన్ 104; శ్రేయస్ (సి) షార్ట్ (బి) అబాట్ 105; రాహుల్ (బి) గ్రీన్ 52; ఇషాన్ కిషన్ (సి) క్యారీ (బి) జంపా 31; సూర్యకుమార్ (నాటౌట్) 72; జడేజా (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 14; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 399. వికెట్ల పతనం: 1–16, 2–216, 3–243, 4–302, 5–355. బౌలింగ్: స్పెన్సర్ 8–0–61–0, హాజల్వుడ్ 10–0–62–1, అబాట్ 10–0–91–1, గ్రీన్ 10–0–103–2, జంపా 10–0–67–1, షార్ట్ 2–0–15–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (సి) అశ్విన్ (బి) ప్రసిధ్ 9; వార్నర్ (ఎల్బీ) (బి) అశ్విన్ 53; స్మిత్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 0; లబు షేన్ (బి) అశ్విన్ 27; ఇన్గ్లిస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; క్యారీ (బి) జడేజా 14; గ్రీన్ (రనౌట్) 19; అబాట్ (బి) జడేజా 54; జంపా (బి) జడేజా 5; హాజల్వుడ్ (బి) షమీ 23; స్పెన్సర్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (28.2 ఓవర్లలో ఆలౌట్) 217. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–89, 4–100, 5–101, 6–128, 7–135, 8–140, 9–217, 10–217. బౌలింగ్: షమీ 6–0–39–1, ప్రసిధ్ 6–0–56–2, అశ్విన్ 7–0–41–3, శార్దుల్ 4–0–35–0, జడేజా 5.2–0–42–3. -
భారత బ్యాటర్ల విశ్వరూపం.. చెత్త రికార్డు మూటగట్టుకున్న గ్రీన్
ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఆసీస్ యువ పేసర్ కెమరూన్ గ్రీన్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు బౌల్ చేసిన గ్రీన్ రికార్డు స్థాయిలో 103 పరుగులు సమర్పించుకుని, వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ గణాంకాలను (పరుగుల పరంగా) నమోదు చేశాడు. 2006లో జోహనెస్బర్గ్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆసీస్ బౌలర్ మిక్ లెవిస్ సమర్పించుకున్న 113 పరుగులు వన్డేల్లో ఆసీస్ తరఫున అత్యంత చెత్త బౌలింగ్ ప్రదర్శన కాగా.. కొద్ది రోజుల కిందట అదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆడమ్ జంపా కూడా 113 పరుగులు సమర్పించుకుని ఆసీస్ తరఫున రెండో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. తాజాగా గ్రీన్ భారత్తో జరుగుతున్న మ్యాచ్లో 103 పరుగులు సమర్పించుకుని వన్డేల్లో ఆసీస్ తరఫున మూడో చెత్త బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్ తరఫున ఓ ఇన్నింగ్స్లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు మొత్తం నలుగురు కాగా.. వారిలో మిక్ లెవిస్, ఆడమ్ జంపా, కెమరూన్ గ్రీన్, ఆండ్రూ టై (100) ఉన్నారు. ఇవాల్టి మ్యాచ్లో గ్రీన్ 2 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో భారత్పై అత్యంత చెత్త ప్రదర్శనల్లో గ్రీన్ ఇవాల్టి మ్యాచ్ ప్రదర్శన (2/103) మూడో స్థానంలో నిలిచింది. గ్రీన్ కంటే ముందు లంక బౌలర్ నువాన్ ప్రదీప్ (0/106), టిమ్ సౌథీ (0/105) ఉన్నారు. కాగా, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 12 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 82/2గా ఉంది. లబూషేన్ (26), వార్నర్ (43) క్రీజ్లో ఉన్నారు. 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.. వర్షం కారణంగా సమయం వృధా కావడంతో మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించి, డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్ధేశించారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వన్డే క్రికెట్లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో భారత క్రికెటర్లు రికార్డు స్థాయిలో 18 సిక్సర్లు బాదడంతో భారత్ వన్డే క్రికెట్లో 3000 సిక్సర్ల మార్కును (3007) తాకిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ వన్డేల్లో ఏ జట్టు ఇప్పటివరకు 3000 సిక్సర్లు కొట్టలేదు. భారత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా విండీస్ (2953) ఉంది. ఈ జాబితాలో పాక్ (2566), ఆస్ట్రేలియా (2476), న్యూజిలాండ్ (2387), ఇంగ్లండ్ (2032), సౌతాఫ్రికా (1947), శ్రీలంక (1779), జింబాబ్వే (1303), బంగ్లాదేశ్ (959) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (38 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాపై భారత్కు ఇదే అత్యధిక స్కోర్గా నిలిచింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు కొట్టిన 18 సిక్సర్లు వన్డేల్లో భారత్ రెండో అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదైంది. 2013లో బెంగళూరులో ఆసీస్పై బాదిన 19 సిక్సర్లు వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో భారత అత్యధిక సిక్సర్ల రికార్డుగా నమోదై ఉంది. కాగా, ఆసీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిర్ధేశించిన 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 56/2 వద్ద ఉండగా వర్షం మొదలై ఆటకు అంతరాయం కలిగింది. లబూషేన్ (17), వార్నర్ (26) క్రీజ్లో ఉన్నారు. -
2023 అంతా 'శుభ్'మయం.. రికార్డులు కొల్లగొడుతున్న టీమిండియా యంగ్ డైనమైట్
అంతర్జాతీయ క్రికెట్లో 2023 సంవత్సరమంతా 'శుభ్'మయంగా మారింది. ఈ ఏడాది ఈ టీమిండియా యంగ్ డైనమైట్ ఫార్మాట్లకతీతంగా చెలరేగుతూ, సెంచరీల మీద సెంచరీలు చేస్తూ, పరుగుల వరద పారిస్తూ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆసీస్తో ఇవాళ (సెప్టెంబర్ 24) జరుగుతున్న రెండో వన్డేలో శతక్కొట్టిన గిల్ (97 బంతుల్లో 104; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వన్డేల్లో ఆరో సెంచరీని, ఈ ఏడాది ఐదో వన్డే శతకాన్ని, ఓవరాల్గా (అన్ని ఫార్మాట్లలో) ఈ ఏడాది ఏడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో గిల్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 5 అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన ఏడో భారత ఆటగాడిగా.. 25 ఏళ్లలోపే ఈ ఘనత సాధించిన ఐదో ప్లేయర్గా.. భారత్ తరఫున వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 6 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డులతో పాటు గిల్ ఈ ఏడాది దాదాపు అన్ని విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాడు. అవేంటంటే.. వన్డే కెరీర్లో మొత్తంగా 35 మ్యాచ్లు ఆడి 66.10 సగటున 6 సెంచరీలు, 9 అర్ధసెంచరీల సాయంతో 1919 పరుగులు చేసిన గిల్.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఆడిన 20 మ్యాచ్ల్లో 1230 పరుగులు చేసి, వన్డేల్లో ఈ ఏడాది టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. 2023లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ పరుగులు (అన్ని ఫార్మాట్లలో): 1763 ఈ ఏడాది అత్యధిక సెంచరీలు (అన్ని ఫార్మాట్లలో): 7 ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (అన్ని ఫార్మాట్లలో): 46 ఈ ఏడాది అత్యధిక ఫోర్లు (అన్ని ఫార్మాట్లలో): 186 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు: 10 ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక బౌండరీలు: 139 ఇలా గిల్ ఈ ఏడాది దాదాపుగా అన్ని విభాగాల్లో టాప్లో కొనసాగుతున్నాడు. వన్డే అగ్రపీఠం దిశగా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో కొనసాగుతున్న గిల్.. ప్రస్తుతం ఆసీస్తో జరుగుతున్న సిరీస్లో విచ్చలవిడిగా పరుగులు చేస్తూ అగ్రపీఠం దిశగా దూసుకుపోతున్నాడు. ఆసీస్తో సిరీస్కు ముందు 814 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ర్యాంకింగ్స్లో టాప్లో ఉన్న బాబర్ ఆజమ్ను దాటేందుకు 44 పాయింట్ల దూరంలో ఉన్నాడు. ఆసీస్పై తొలి వన్డేలో 74 పరుగులు, రెండో వన్డేలో 104 పరుగులు చేసిన గిల్.. వన్డే అగ్రస్థానం దక్కించుకునేందుకు కావాల్సిన 44 పాయింట్లను ఈ రెండు ప్రదర్శనలతోనే సాధిస్తాడు. ఈ సిరీస్లో మరో మ్యాచ్ కూడా ఉండటంతో గిల్ వన్డే టాప్ ర్యాంక్కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ ఏడాది ఐపీఎల్లోనూ ఇరగదీసిన గిల్.. అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా ఈ ఏడాది గిల్ ఐపీఎల్లోనే సత్తా చాటాడు. 2023 ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడిన గిల్ 59.33 సగటున, 157.80 స్ట్రయిక్రేట్తో 890 పరుగులు చేసి, ఎడిషన్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఎడిషన్లో మొత్తం 3 సెంచరీలు బాదిన గిల్.. అత్యధిక పరుగులతో పాటు అత్యధిక వ్యక్తిగత స్కోర్, అత్యుత్తమ సగటు, అత్యధిక శతకాలు,అత్యధిక ఫోర్లు.. ఇలా పలు విభాగాల్లో టాప్లో నిలిచాడు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 400 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మాథ్యూ షార్ట్ (9), స్టీవ్ స్మిత్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. 7 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 43/2గా ఉంది. లబూషేన్ (12), వార్నర్ (19) క్రీజ్లో ఉన్నారు. -
సూర్యకుమార్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది విధ్వంసం సృష్టించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో భారత్ తరఫున ఆరో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 37 బంతులు ఎదుర్కొన్న స్కై 6 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డేల్లో ఆసీస్పై భారత్కు ఇదే అత్యధిక స్కోర్. వన్డేల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరిదంటే..? వన్డేల్లో భారత్ తరఫున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ప్రస్తుత భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేరిట నమోదై ఉంది. 2000 సంవత్సరంలో అగార్కర్ జింబాబ్వేపై 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆతర్వాత వేగవంతమైన హాఫ్ సెంచరీ కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ 1983లో వెస్టిండీస్పై 22 బంతుల్లో ఫిఫ్టి కొట్టాడు. ఆతర్వాత వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇవాల్టి మ్యాచ్లో స్కై చేసిన 24 బంతుల ఫిఫ్టి వన్డేల్లో భారత్ తరఫున ఆరో ఫాసెస్ట్ ఫిఫ్టిగా రికార్డైంది. వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన స్కై.. గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో సూర్యకుమార్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా నాలుగు సిక్సర్లు బాది గ్రీన్కు దడ పుట్టించాడు. ఈ ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. ఓవర్లో మొత్తంగా 26 పరుగులు పిండుకున్నాడు. స్కై ధాటికి గ్రీన్ 10 ఓవర్లలో 103 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా గ్రీన్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్లో 100 అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న మూడో ఆస్ట్రేలియన్గా రికార్డుల్లోకెక్కాడు. ఓ ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా.. ఈ మ్యాచ్లో గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన స్కై.. వన్డేల్లో ఓ ఓవర్లో ఆసీస్పై అత్యధిక సిక్సర్లుగా బాదిన భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్మన్ గిల్ (104), శ్రేయస్ అయ్యర్ (105) శతకాలతో విరుచుకుపడగా.. ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (52) అర్ధసెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (31) పర్వాలేదనిపించాడు. రుతురాజ్ (8) ఒక్కడే విఫలమయ్యాడు. ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
శతక్కొట్టిన శ్రేయస్, శుభ్మన్.. భారీ స్కోర్ దిశగా టీమిండియా
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస్ అయ్యర్ (90 బంతుల్లో 105; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు ఫామ్ను దొరకబుచ్చుకుని కెరీర్లో మూడో వన్డే శతకాన్ని సాధించి ఔట్ కాగా.. ఓపెనర్ శుభ్మన్ గిల్ (92 బంతుల్లో 100 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తన భీకర ఫామ్ను కొనసాగిస్తూ వన్డే కెరీర్లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 33 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 230/2గా ఉంది. గిల్ (100), రాహుల్ (9) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన భారత్ 16 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ (8) వికెట్ కోల్పోయింది. హాజిల్వుడ్ బౌలింగ్లో అలెక్స్ క్యారీకు క్యాచ్ ఇచ్చి రుతు ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. బుమ్రా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. మిచెల్ మార్ష్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ స్థానాల్లో అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్వుడ్, స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సీన్ ఆంథోనీ అబాట్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, జోష్ హాజిల్వుడ్ ఇండియా : శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ -
నేడు ఆసీస్తో రెండో వన్డే: సిరీస్ విజయం లక్ష్యంగా భారత్
ఇండోర్: వన్డే ప్రపంచకప్కు ముందు జరుగుతున్న చివరి సిరీస్ను సొంతం చేసుకొని మెగా ఈవెంట్లో పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగాలనే లక్ష్యంతో భారత్... తొలి మ్యాచ్లో జరిగిన లోపాలను సరిదిద్దుకోవాలనే పట్టుదలతో ఆ్రస్టేలియా... నేడు ఇక్కడి హోల్కర్ స్టేడియంలో జరిగే రెండో వన్డేలో తలపడనున్నాయి. రెండు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే భారీ స్కోర్లకు పెట్టింది పేరైన హోల్కర్ స్టేడియంలో అభిమానులకు మరో పరుగుల విందు లభించడం ఖాయం. శనివారం ఇండోర్లో వర్షం కురిసినా ఆదివారం మ్యాచ్ సమయంలో ఒకట్రెండుసార్లు చిరుజల్లులు పడే అవకాశముందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. తొలి వన్డేలో రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు సాధించడం శుభపరిణామం. అయితే శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. రెండో వన్డేలో అయ్యర్ భారీ స్కోరు సాధిస్తే అతను ప్రపంచకప్ మ్యాచ్ల్లో ఆడే అవకాశాలు మెరుగవుతాయి. మరోవైపు భారత సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ బంతితో చెలరేగాడు. తొలి వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న సిరాజ్ను ఆడిస్తే బుమ్రా ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆకట్టుకున్నా ఈ ఒక్క ప్రదర్శన అతనికి సరిపోదు. రెండో మ్యాచ్లోనూ ఈ తమిళనాడు స్పిన్నర్ రాణించాల్సి అవసరం ఉంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ చేతి వేలి గాయం నుంచి కోలుకోకపోతే అతని స్థానంలో అశ్విన్ ప్రపంచకప్ జట్టులోకి చివరి నిమిషంలో వచ్చే అవకాశముంది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ రెండో మ్యాచ్లోనూ గెలిస్తే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ చేతిలో ఎదురైన సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సిరీస్లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో నిలిచింది. తొలి మ్యాచ్లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్, లబుషేన్ రాణించినా క్రీజులో నిలదొక్కుకున్న తరుణంలో అవుటవ్వడం ఆసీస్ను దెబ్బ కొట్టింది. ఓపెనర్గా వచ్చిన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ బ్యాట్ నుంచి కూడా పరుగులు వస్తే ఆసీస్ స్కోరు 300 పరుగులు దాటే అవకాశముంటుంది. ఈ మైదానంలో ఈ ఏడాది జనవరి 24న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిసారి వన్డే జరిగింది. రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ సెంచరీలతో కదంతొక్కడంతో భారత్ 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 295 పరుగులకు ఆలౌటైంది. బౌండరీల దూరం తక్కువగా ఉండటంతో ఈసారీ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముంది. జట్ల వివరాలు (అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్/ఇషాన్ కిషన్, శుబ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), జడేజా, వాషింగ్టన్ సుందర్, అశ్విన్, శార్దుల్ ఠాకూర్, షమీ, సిరాజ్/బుమ్రా. ఆ్రస్టేలియా: వార్నర్, మిచెల్ మార్ష్, స్మిత్, లబుషేన్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, జోస్ ఇన్గ్లిస్/ఆరోన్ హార్డీ, కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజల్వుడ్. -
ENG VS NZ 2nd ODI: లివింగ్స్టోన్ విధ్వంసం.. తృటిలో సెంచరీ మిస్
4 మ్యాచ్లో వన్డే సిరీస్లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (సెప్టెంబర్ 10) జరుగుతున్న రెండో మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రత్యర్ధి ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. వర్షం కారణంగా 34 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. లియామ్ లివింగ్స్టోన్ (78 బంతుల్లో 95 నాటౌట్; 9 ఫోర్లు, సిక్స్) సూపర్ ఇన్నింగ్స్తో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. లివింగ్స్టోన్కు బట్లర్ (30), మొయిన్ అలీ (33), సామ్ కర్రన్ (42) తోడ్పాటునందించడంతో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఈ సిరీస్లో లివింగ్స్టోన్ వరుసగా రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ కష్టాల్లో ఉన్నప్పుడు (12.1 ఓవర్లలో 55/5) ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన లివింగ్స్టోన్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొలి సెంచరీకి చేరువగా వచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి రెండు బంతులు ఎదుర్కొనే అవకాశం లివింగ్స్టోన్కు వచ్చినప్పటికీ అతను 4 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. దీంతో శతకానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 4.2 ఓవర్లలోనే ఇంగ్లండ్ టాప్-3 బ్యాటర్లను పెవిలియన్కు పంపి ఇంగ్లండ్ పతనాన్ని శాశించిన బౌల్ట్ మొత్తంగా ఈ మ్యాచ్లో 7 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీ 2, హెన్రీ, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే డేవిడ్ విల్లే.. ఫిన్ అలెన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని విల్ యంగ్.. విల్లే వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో తొలి 3 బంతులను బౌండరీలుగా మలచి సత్తా చాటాడు. యంగ్ (17), కాన్వే (1) క్రీజ్లో ఉన్నారు. -
తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తు.. రెండో వన్డేలో 227/0.. ఇంతలో ఎంత మార్పు..!
ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కేవలం గంటల వ్యవధిలో భారీ మార్పు వచ్చింది. మొన్న (ఆగస్ట్ 24) హంబన్తోటలో పాకిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో 59 పరుగులకే చిత్తై, చెత్త రికార్డులు మూటగట్టుకున్న ఆఫ్ఘన్లు.. ఇవాళ (ఆగస్ట్ 24) అదే పాకిస్తాన్తో అదే హంబన్తోటలో జరుగుతున్న మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ పలు అరుదైన రికార్డులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆ జట్టు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్భాజ్ (135), ఇబ్రహీమ్ జద్రాన్ (80) తొలి వికెట్కు ఏకంగా 227 పరుగులు జోడించి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. పాక్పై 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ఓపెనింగ్ జోడీగా.. అలాగే ఆఫ్ఘనిస్తాన్ తరఫున వన్డేల్లో రెండు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడీగా.. 2010 తర్వాత పాక్పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (227) నమోదు చేసిన రెండో జోడీగా పలు రికార్డులు మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రహ్మానుల్లా గుర్భాజ్.. పాకిస్తాన్పై వన్డే సెంచరీ చేసిన తొలి ఆప్ఘన్ ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. తొలి వికెట్కు 227 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించిన అనంతరం ఉసామా మిర్ బౌలింగ్లో ఇఫ్తికార్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి జద్రాన్ (80) ఔట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 43 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 247 పరుగులు చేసింది. గుర్భాజ్ (147), మహ్మద్ నబీ (7) క్రీజ్లో ఉన్నారు. తేలిపోయిన పాక్ పేసర్లు.. తొలి వన్డేలో ఆఫ్ఘన్ ప్లేయర్ పాలిట సింహస్వప్నల్లా ఉండిన పాక్ పేసర్లు ఈ మ్యాచ్లో తేలిపోయారు. తొలి మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో నిప్పులు చెరిగిన హరీస్ రౌఫ్ ఈ మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షాహీన్ అఫ్రిది, నసీం షా సైతం అతన్ని ఫాలో అయ్యారు. ఈ మ్యాచ్లో ఈ పేస్ త్రయం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. -
విండీస్ చేతిలో ఘోర పరాభవం.. టీమిండియాను ఏకి పారేసిన భారత మాజీ
విండీస్తో రెండో వన్డేలో ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకున్న టీమిండియాపై ముప్పేట దాడి జరుగుతుంది. అభిమానులు, మాజీలు భారత ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు. రోహిత్, కోహ్లిలను రెస్ట్ ఇచ్చి టీమిండియా మేనేజ్మెంట్ పెద్ద తప్పిదమే చేసిందని మండిపడుతున్నారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ చెత్త వ్యూహాల వల్ల వరల్డ్కప్కు అర్హత సాధించలేని జట్టు చేతిలో టీమిండియా ఓటమిపాలైందని ధ్వజమెత్తుతున్నారు. డబ్బు, గర్వం వల్ల భారత క్రికెటర్లు ఆటపై దృష్టి పెట్టడం లేదని 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ విమర్శిస్తే.. తాజాగా మరో భారత మాజీ (వెంకటేశ్ ప్రసాద్) టీమిండియాను తూర్పారబెట్టాడు. రెండో వన్డేలో విండీస్ చేతిలో ఓడిన భారత జట్టుపై అతను విరుచుకుపడ్డాడు. టెస్ట్ క్రికెట్ను పక్కన పెడితే, గత కొంతకాలంగా టీమిండియా మిగతా రెండు ఫార్మాట్లలో అతి సాధారణమైన జట్టుగా తయారైందని.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, చివరకు బంగ్లాదేశ్ చేతిలో కూడా సిరీస్లు కోల్పోయిందని దుయ్యబట్టాడు. గత రెండు టీ20 వరల్డ్కప్లలో టీమిండియా ప్రదర్శన పేలవంగా ఉందని, మనకంటే చిన్న జట్లు చాలా మెరుగైన ప్రదర్శనలు చేసాయని గుర్తు చేశాడు. టీమిండియా పరిస్థితి ప్రస్తుతం చాలా దారుణంగా ఉందని.. డబ్బు, అధికారం ఉండటంతో భారత జట్టు సాధారణ విజయాలకే పొంగిపోతుందని, ఛాంపియన్ జట్టుకు కావాల్సిన లక్షణాలు టీమిండియాలో అస్సలు కనిపించడం లేదని విమర్శలు గుప్పించాడు. Despite the money and power, we have become used to celebrating mediocrity and are far from how champion sides are. Every team plays to win and so does India but their approach and attitude is also a factor for underperformance over a period of time. — Venkatesh Prasad (@venkateshprasad) July 30, 2023 టీమిండియాలో ప్రస్తుత ఇంగ్లండ్ జట్టులోని దూకుడు కానీ, 90ల్లో ఆస్ట్రేలియా జట్టులోని భీకరత్వం కానీ లేవని అన్డాను. గతకొంతకాలంగా భారత పరిమిత ఓవర్ల జట్టు అతి సాధారణ జట్టులా ఉంటుందని ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రతి జట్టు గెలవడానికే ఆడుతుందని, టీమిండియా కూడా అదే లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నప్పటికీ.. ఆట విషయంలో వారి వైఖరి గత కొంత కాలంగా ఏమీ బాగోలేదని, ఇదే భారత జట్టు పేలవ ప్రదర్శనకు ప్రధాన కారణమని ట్వీట్లో జోడించాడు. ఇదిలా ఉంటే, విండీస్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను విండీస్ 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. విండీస్ బౌలర్ల ధాటికి 40.5 ఓర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ (55), శుభ్మన్ గిల్(34) మాత్రమే రాణించారు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్, గుడకేశ్ మోటీ తలో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్.. 36.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ హోప్ (63 నాటౌట్), కార్టీ (48 నాటౌట్) రాణించారు. -
వరుసగా రెండో మ్యాచ్లో విండీస్ ప్రతాపం
వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో మ్యాచ్లో పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విండీస్.. నిన్న (జూన్ 6) జరిగిన రెండో వన్డేలో 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (47 బంతుల్లో 63; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), చివర్లో ఓడియన్ స్మిత్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లు ఆడటంతో 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బౌలర్లలో జహూర్ ఖాన్ 3.. అఫ్జల్ ఖాన్, సంచిత్ శర్మ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, ఆదిత్య షెట్టి ఓ వికెట్ పడగొట్టారు. 307 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బాసిల్ అహ్మద్ (49), అలీ నసీర్ (57), అయాన్ అఫ్జల్ ఖాన్ (25 నాటౌట్) ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యూఏఈ.. ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో హాడ్జ్, రోస్టన్ ఛేజ్ తలో 2 వికెట్లు.. అకీమ్ జోర్డన్, ఓడియన్ స్మిత్, యాన్నిక్ కారియా తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జూన్ 9న నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది. చదవండి: పసికూనపై విండీస్ ప్రతాపం.. శతక్కొట్టిన కింగ్ -
ప్రతీకారం తీర్చుకున్న లంకేయులు.. భారీ విజయం
తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకున్నారు. హంబన్తోట వేదికగా ఇవాళ (జూన్ 4) జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్లో ఆతర్వాత బౌలింగ్లో రెచ్చిపోయిన లంకేయులు.. పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపొందారు. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్లో ప్రతి ఒక్కరు బ్యాట్ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. ఓ దశలొ (146/2) విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించినప్పటికీ.. స్పిన్నర్ ధనంజయ డిసిల్వ (10-0-39-3) ఆ జట్టును భారీగా దెబ్బకొట్టాడు. సెట్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ (54), హస్మతుల్లా షాహిది (57)లను ఔట్ చేసి ఆఫ్ఘన్ల ఓటమికి బీజం వేశాడు. అనంతరం హసరంగ (9-2-42-3) వారి పతనాన్ని శాశించాడు. వీరితో పాటు చమీరా (2/18), తీక్షణ (1/35), షనక (1/29) తలో చేయి వేయడంతో ఆఫ్ఘన్లు 42.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. ఫలితంగా 132 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో జద్రాన్, షాహిది హాఫ్ సెంచరీలతో రాణించగా.. రహ్మత్ షా (36), అజ్మతుల్లా ఒమర్జాయ్ (28) ఓ మోస్తరుగా రాణించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. -
తొలి వన్డేలో పరాభవం ఎఫెక్ట్.. రెండో వన్డేలో లంక బ్యాటర్ల ఉగ్రరూపం
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న ఆఫ్ఘనిస్తాన్.. హంబన్తోట వేదికగా ఇవాళ (జూన్ 4) రెండో వన్డే ఆడుతుంది. తొలి వన్డేలో ఎదురైన పరాభవం (ఓటమి) నేపథ్యంలో ఈ మ్యాచ్లో లంక బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. భారీ స్కోర్ చేశారు. ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. పథుమ్ నిస్సంక (43), కరుణరత్నే (52), కుశాల్ మెండిస్ (78), సమర విక్రమ (44), ధనంజయ డిసిల్వ (29 నాటౌట్), షనక (23), హసరంగ (29 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. తొలి వన్డేలో సత్తా చాటిన అసలంక (6) మినహా లంక ఇన్నింగ్స్లో ప్రతి ఒక్కరు బ్యాట్ను ఝులిపించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో నబీ, ఫరీద్ అహ్మద్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్.. 11 పరుగులకే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ధాటిగా ఆడే రహ్మానుల్లా గుర్భాజ్ 12 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చమీర బౌలింగ్లో కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ స్కోర్ 28/1గా ఉంది. రహ్మత్ షా (9), ఇబ్రహీమ్ జద్రాన్ (14) క్రీజ్లో ఉన్నారు. కాగా, అంతకుముందు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్.. తమ కంటే మెరుగైన శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. చరిత్ అసలంక (95 బంతుల్లో 91; 12 ఫోర్లు), ధనంజయ డిసిల్వ (59 బంతుల్లో 51; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 268 పరుగులు చేసి ఆలౌటైంది. ఛేదనలో ఇబ్రహీం జద్రాన్ (98 బంతుల్లో 98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (55) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి ఆఫ్ఘనిస్తాన్ను గెలిపించారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే జూన్ 7న ఇదే వేదికగా జరుగనుంది. -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు.. కివీస్తో రెండో వన్డే వర్షార్పణం, అంతలోనే మరో షాక్
2 టెస్ట్లు, 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన శ్రీలంకకు ఏది కలిసి రావడం లేదు. 2-0తో టెస్ట్ సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లాలని భావించిన ఆ జట్టును ఆతిధ్య దేశం చావుదెబ్బకొట్టగా.. కనీసం వన్డే సిరీస్ అయినా గెలిచి వన్డే వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించాలని భావిస్తే, ఆ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. తొలి వన్డేలో ఓటమిపాలై వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక.. కివీస్తో ఇవాళ (మార్చి 28) జరగాల్సిన రెండో వన్డే వర్షార్పణం కావడంతో వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించే అశలను పూర్తిగా వదిలేసుకుంది. ఇంతలోనే ఆ జట్టుకు ఐసీసీ మరో షాకిచ్చింది. కివీస్తో తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గాను ఐసీసీ ఆ జట్టుకు ఓ పాయింట్ కోత విధించింది. దీంతో శ్రీలంక అధికారికంగా వరల్డ్కప్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు చిన్న జట్లతో క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడి వన్డే వరల్డ్కప్కు అర్హత సాధించాల్సి ఉంటుంది. కాగా, క్రైస్ట్చర్చ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో శ్రీలంక సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే తొలి వన్డేలో నెగ్గిన కివీస్ 3 మ్యాచ్ల సిరీస్లో 2 వన్డేల అనంతరం 1-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ శ్రీలంక ఆఖరి వన్డేలో గెలిచినా సిరీస్ డ్రా అవుతుందే తప్ప, ఒరిగేదేమీ ఉండదు. మూడో వన్డే మార్చి 31న హామిల్టన్ వేదికగా జరుగనుంది. అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. -
అరుదైన క్లబ్లో చేరిన తమీమ్ ఇక్బాల్.. తొలి బంగ్లాదేశీగా రికార్డు
బంగ్లాదేశ్ వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తన 34వ పుట్టిన రోజున ఓ అరుదైన క్లబ్లో చేరాడు. బంగ్లాదేశ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా, ఓవరాల్గా ఈ ఘనత సాధించిన 40వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. సిల్హెట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో తమీమ్ ఈ మైలురాయిని అధిగమించాడు. Congratulation Tamim Iqbal on becoming the first Bangladeshi batsman to complete 15000 runs in International Cricket. 🔥🏏#BCB | #Cricket pic.twitter.com/J4mj5W8k9T — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ మ్యాచ్లో 31 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి రనౌటైన తమీమ్ 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 15000 పరుగుల మైలురాయిని టచ్ చేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన తమీమ్.. ఇప్పటికే అత్యధిక సెంచరీలు, అత్యధిక వన్డే పరుగులు, టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక బంగ్లాదేశీగా రికార్డు, బంగ్లాదేశ్ తరఫున 3 ఫార్మట్లలో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా పలు రికార్డులు కలిగి ఉన్నాడు. తమీమ్ ఖాతాలో 3 ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 25 సెంచరీలు ఉన్నాయి. మరే బంగ్లాదేశీ క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లో ఇన్ని సెంచరీలు చేయలేదు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 383 మ్యాచ్లు ఆడిన తమీమ్ 15009 పరుగులు చేశాడు. తమీమ్.. 69 టెస్ట్ల్లో 10 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీల సాయంతో 5082 పరుగులు, 235 వన్డేల్లో 14 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8146 పరుగులు, 78 టీ20ల్లో సెంచరీ, 7 హాఫ్ సెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఐర్లాండ్తో రెండో వన్డేలో ముష్ఫికర్ రహీం సునామీ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 నాటౌట్), లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. బంగ్లాదేశ్కు ఇది వన్డేల్లో అత్యధిక స్కోర్. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ రికార్డు స్కోర్
BAN VS IRE 2nd ODI: సిల్హెట్ వేదికగా ఐర్లాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో బంగ్లాదేశ్ వెటరన్ ముష్ఫికర్ రహీం సునామీ శతకం సాధించాడు. కేవలం 60 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులతో అజేయంగా నిలిచిన ముష్ఫికర్.. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు షకీబ్ పేరిట ఉండేది. 2009లో షకీబ్ జింబాబ్వేపై 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. Mushfiqur Rahim 100 not out off 60 balls. Fastest hundred in ODIs for Bangladesh.#BCB | #Cricket | #BANvIRE. pic.twitter.com/NtjZXAR7a5 — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 ఈ క్రమంలో బంగ్లా టైగర్స్ వన్డేల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు కూడా నెలకొల్పారు. ముష్ఫికర్ మెరుపు సెంచరీతో పాటు లిటన్ దాస్ (71 బంతుల్లో 70; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), నజ్ముల్ హొస్సేన్ షాంటో (77 బంతుల్లో 73; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), తౌహిద్ హ్రిదొయ్ (34 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. Just days after posting their highest ever ODI score of 338 in the first ODI, Bangladesh have broken it again with 349/6 in the second ODI! Mushfiqur Rahim brings up a 60-ball century - the quickest for his nation - with the last ball of the innings #BANvIRE — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 20, 2023 వన్డేల్లో బంగ్లాదేశ్కు ఇదే అత్యధిక స్కోర్. రోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అత్యధిక టీమ్ స్కోర్ రికార్డును బద్దలుకొట్టడం విశేషం. ఇదే సిరీస్లో మార్చి 18న ఐర్లాండ్తో జరిగిన తొలి వన్డేలో 338 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. 2 రోజుల గ్యాప్లోనే రికార్డును మెరుగుపర్చుకుంది. Mushfiqur Rahim became the 3rd Bangladeshi batsman to complete 7000 runs in ODIs after Tamim Iqbal and Shakib Al Hasan during the second ODI against Ireland. 🔥#BCB | #Cricket | #BANvIRE pic.twitter.com/xdat9MLMfS — Bangladesh Cricket (@BCBtigers) March 20, 2023 6వ స్థానంలో బరిలోకి దిగిన ముష్ఫికర్ ఆకాశమే హద్దుగా చెలరేగి వన్డే కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేయడంతో పాటు 7000 పరుగుల మైలురాయిని కూడా అధిగమించాడు. తద్వారా తమీమ్ ఇక్బాల్, షకీబ్ అల్ హసన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో బంగ్లా క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీతో ముష్ఫికర్ మరో రికార్డు కూడా సాధించాడు. వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో తమీమ్ ఇక్బాల్ 14 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ముష్ఫికర్ (9), షకీబ్ (9)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. కాగా, ఇన్ని రికార్డులు నమోదైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియడంతో బంగ్లాదేశ్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తివగానే మొదలైన వర్షం ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
IND vs AUS 2nd ODI 2023: ఆసీస్ పేస్కు భారత్ బోల్తా
రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం... తీరా మ్యాచ్ సమయానికి వరుణుడు కూడా కరుణించడంతో ... నిర్ణీత సమయానికే ఆట ప్రారంభం... ఇక పరుగుల విందు ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా... పిచ్పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు. స్టార్క్ స్వింగ్ బౌలింగ్కు భారత స్టార్ బ్యాటర్లు గిల్, రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్పై ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టి 11 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు. సాక్షి, విశాఖపట్నం: సిరీస్లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్పై ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఎలిస్ (2/13) తమ స్వింగ్ బౌలింగ్తో భారత్ను దెబ్బ కొట్టారు. భారత ఇన్నింగ్స్లో కోహ్లి (35 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్కాగా... రోహిత్ శర్మ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16; 1 ఫోర్), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్లు) అలరించారు. స్టార్క్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా... సిరీస్లోని చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరుగుతుంది. సూర్యకుమార్ మళ్లీ విఫలం... బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉన్న విశాఖ పిచ్పై భారత బ్యాటర్లు తడబడ్డారు. పిచ్పై ఉన్న తేమను ఆసీస్ పేసర్ స్టార్క్ సద్వినియోగం చేసుకున్నాడు. స్వింగ్తోపాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. స్టార్క్ బౌలింగ్లో గిల్, రోహిత్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడి అవుటయ్యారు. సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్, కోహ్లి, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయారు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా (1) షాట్ ఆడతా... స్టీవ్ స్మిత్ స్లిప్లో తన కుడి వైపునకు గాల్లో అమాంతం డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ హైలైట్గా నిలిచింది. ధనాధన్ ఆట... స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు ఓపెనర్లు హెడ్, మార్ష్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా మార్ష్ చెలరేగిపోయాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మార్ష్ 2 సిక్స్లు, 1 ఫోర్ కొట్టగా... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అనంతరం హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మార్ష్ 3 సిక్స్లతో అలరించాడు. దాంతో ఆసీస్ 8 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించి ఆసీస్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; శుబ్మన్ గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 9; హార్దిక్ పాండ్యా (సి) స్మిత్ (బి) అబాట్ 1; రవీంద్ర జడేజా (సి) క్యారీ (బి) ఎలిస్ 16; అక్షర్ పటేల్ (నాటౌట్) 29; కుల్దీప్ యాదవ్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (26 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–3, 2–32, 3–32, 4–48, 5–49, 6–71, 7–91, 8–103, 9–103, 10–117. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–1–53–5, కామెరాన్ గ్రీన్ 5–0–20–0, సీన్ అబాట్ 6–0–23–3, నాథన్ ఎలిస్ 5–0–13–2, ఆడమ్ జంపా 2–0–6–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (నాటౌట్) 51; మిచెల్ మార్‡్ష (నాటౌట్) 66; ఎక్స్ట్రాలు 4, మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121. బౌలింగ్: షమీ 3–0–29–0, సిరాజ్ 3–0–37–0, అక్షర్ పటేల్ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కుల్దీప్ యాదవ్ 1–0–12–0. -
Viral Video: శతాబ్దపు అత్యుత్తమ క్యాచ్ అందుకున్న స్టీవ్ స్మిత్
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ నమ్మశక్యంకాని క్యాచ్ను అందుకున్నాడు. పక్షిలా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవిండ్ క్యాచ్ను క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు క్యాచ్ ఆఫ్ ద సెంచరీగా అభివర్ణిస్తున్నారు. భారత ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో సీన్ అబాట్ బౌలింగ్ చేస్తుండగా ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టాడు. వాస్తవానికి ఈ క్యాచ్ సెకెండ్ స్లిప్ ఫీల్డర్ అందుకోవడం కూడా కష్టమే. Hardik Pandya dismissed for 1. what a catch by Smith#HardikPandya #INDvsAUS #ViratKohli #SuryakumarYadav India 49/5 now. pic.twitter.com/idE6IjpaSR — Rajkumar (@Rajkumar0507) March 19, 2023 అలాంటిది స్మిత్ సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగురుతూ కళ్లు చెదిరే డైవింగ్ క్యాచ్ అందుకుని యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఔరా అనిపించాడు. స్మిత్కు ఇలాంటి ఫీల్డింగ్ విన్యాసాలు కొత్త కానప్పటికీ, ఈ క్యాచ్ మాత్రం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. స్మిత్ సెన్సేషనల్ డైవింగ్ క్యాచ్ను సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి స్మిత్ను వ్యతిరేకించే వారు సైతం అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇదిలా ఉంటే, ఆసీస్తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1), జడేజా (16) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (31) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. -
సూర్యకుమార్ 'ఖేల్' ఖతమైనట్టే..!
IND VS AUS 2nd ODI: భారీ అంచనాల నడుమ ప్రతి మ్యాచ్ బరిలోకి దిగే టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని మ్యాచ్లుగా చెత్త ప్రదర్శన చేస్తూ ఉసూరుమనిపిస్తున్నాడు. జనవరి 7న శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో (51 బంతుల్లో 112) చివరిసారిగా సెంచరీ చేసిన స్కై.. ఆతర్వాత వరుస విఫలమవుతూ ఫ్యాన్స్కు విసుగు తెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన సూర్యకుమార్.. తొలి వన్డేలోనూ ఇదే తరహాలో తొలి బంతికే ఔటయ్యాడు. రెండు సార్లు మిచెల్ స్టార్కే స్కై వికెట్ తీశాడు. అది కూడా ఒకే తరహాలో ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సూర్యకుమార్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కైని వెంటనే వన్డే జట్టు నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వన్డేల్లో స్కైకి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని అంటుంటే.. మెజార్టీ శాతం అతన్ని సాగనంపాలని కోరుతున్నారు. పొట్టి ఫార్మాట్లో ఇరగదీసే స్కై.. వన్డేల్లో తేలిపోతుండటం అతని అభిమానులతో పాటు అతన్ని కూడా బాధిస్తుంది. గత 10 వన్డే ఇన్నింగ్స్ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడంతో స్కైని మర్యాద పూర్వకంగా వన్డే జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ వర్గాలు కూడా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఆసీస్తో రెండో వన్డేలో సూర్యకుమార్, శుభ్మన్ గిల్ డకౌట్లు కావడంతో పాటు రోహిత్ శర్మ (13), కేఎల్ రాహుల్ (9), హార్ధిక్ పాండ్యా (1) దారుణంగా విఫలం కావడంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (30), జడేజా (8) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి
ఆసీస్ ఓపెనర్ల విధ్వంసం.. రెండో వన్డేలో భారత్ ఓటమి టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లలోనే చేదించింది. ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్(36 బంతుల్లో 66 నాటౌట్), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 51 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లు నిప్పులు చేరగడంతో కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 5వికెట్లతో టీమిండియా వెన్ను విరచగా.. అబాట్ మూడు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు సాధించారు. విజయానికి చేరువలో ఆసీస్.. 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 8 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్(54) హాఫ్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో ఇప్పటి వరకు 5 ఫోర్లు, 5 సిక్స్లు ఉన్నాయి. అతడితో పాటు హెడ్(32) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 118 పరుగుల టార్గెట్.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్ 118 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతుంది. 3 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (10), ట్రవిస్ హెడ్ (10) క్రీజ్లో ఉన్నారు. నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు.. 117 పరుగులకే కుప్పకూలిన భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఇల్లీస్ (2/13) నిప్పులు చెరగడంతో భారత్ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. 103 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా 103 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయింది. కుల్దీప్ (4), షమీ (0)లను అబాట్ పెవిలియన్కు పంపాడు. క్రీజులో అక్షర్ పటేల్, సిరాజ్ ఉన్నారు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. జడ్డూ (16) ఔట్ 91 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్లో వికెట్కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టడంతో రవీంద్ర జడేజా (16) ఔటయ్యాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ క్రీజ్లో ఉన్నారు. ఆరో వికెట్ కోల్పోయిన భారత్... కోహ్లి ఔట్ 71 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లీస్ బౌలింగ్లో విరాట్ కోహ్లి (31) ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. స్మిత్ సెన్సేషనల్ క్యాచ్.. 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ ఫస్ట్ స్లిప్లో స్టీవ్ స్మిత్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో హార్ధిక్ పాండ్యా (1) పెవిలియన్ బాటపట్టక తప్పలేదు. దీంతో టీమిండియా 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. విరాట్ కోహ్లి (22), జడేజా క్రీజ్లో ఉన్నాడు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్.. రాహుల్ ఔట్, 4 వికెట్లు స్టార్క్ ఖాతాలోకే మిచెల్ స్టార్క్ టీమిండియాను దారుణంగా దెబ్బకొడుతున్నాడు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. కేఎల్ రాహుల్ (9)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 9 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 49/4. కోహ్లి (22), హార్ధిక్ (1) క్రీజ్లో ఉన్నారు. వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన భారత్.. స్కై మరో డకౌట్ టీమిండియా కష్టాల్లో పడింది. స్టార్క్ వరుస బంతుల్లో రోహిత్ శర్మ (13), సూర్యకుమార్ యాదవ్లకు ఔట్చేసి టీమిండియాను దారుణంగా దెబ్బకొట్టాడు. 4.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 32/3గా ఉంది. విరాట్ కోహ్లి (15), కేఎల్ రాహుల్ క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మ ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్లో స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. మూడు ఓవర్లలో టీమిండియా స్కోరు 29/1 మూడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. కోహ్లి 14, రోహిత్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గిల్ డకౌట్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత్ విశాఖ వేదికగా ఇవాళ (మార్చి 19) జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డే వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకు శుభవార్త. వరుణుడు శాంతించి, ఎండ కాయడంతో జరుగదనుకున్న మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ రెండు మార్పులతో బరిలోకి దిగనుండగా.. టీమిండియా ఒక్క మార్పు చేసింది. మ్యాక్స్వెల్ స్థానంలో నాథన్ ఇల్లీస్, జోస్ ఇంగ్లిస్ ప్లేస్లో అలెక్స్ క్యారీ బరిలోకి దిగనుండగా.. భారత్ నుంచి శార్దూల్ ఠాకూర్ స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేయనున్నాడు. తుది జట్లు.. భారత్: శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, నాథన్ ఇల్లీస్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా -
సెంచరీల మీద సెంచరీలు బాదుతూ జాత్యాహంకారుల నోళ్లు మూయించిన ధీరుడు
SA VS WI 2nd ODI: జాతి వివక్ష.. వర్ణ భేదం.. ఆహార్యంపై వెకిలి మాటలు..జాతీయ జట్టుకు సారధి అయినప్పటికీ, సొంతవారి నుంచే వ్యతిరేకత.. ఇలా చెప్పుకుంటూ పోతే వర్ణించరాని ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటుపోట్లను ఎదుర్కొన్న సౌతాఫ్రికా టెస్ట్, వన్డే జట్టు సారధి టెంబా బవుమా.. అవకాశం దొరికిన ప్రతిసారి తనను విమర్శించిన వారికి తన ఆటతీరుతో బదులిస్తున్నాడు. పేలవ ఫామ్ కారణంగా ఇటీవలే టీ20 కెప్టెన్సీని కోల్పోయిన బవుమా.. ప్రస్తుతం కెరీర్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు. తాజాగా స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో (118 బంతుల్లో 144; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) విజృంభించిన బవుమా.. అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా రెండో శతకాన్ని (విండీస్తో రెండో టెస్ట్లో 172) బాదాడు. బవుమాకు గత 3 వన్డేల్లో ఇది రెండో శతకం. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లండ్తో జరిగిన మూడో వన్డేలో 35 పరుగులు చేసిన బవుమా అంతకుముందు జరిగిన రెండో వన్డేలో 109 పరుగులు చేశాడు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ల్లో డకౌట్ కావడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న బవుమాను ఓ దశలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు జాత్యాహంకారులు డిమాండ్ చేశారు. బవుమా సౌతాఫ్రికా కెప్టెన్ కావడం ఇష్టం లేని కొందరు అతను ఒక్క మ్యాచ్లో విఫలమైనా పని కట్టుకుని మరీ విమర్శలు చేసేవారు. అలాంటి వారికి బవుమా ప్రతిసారి తన బ్యాట్తో సమాధానం చెప్తూ వస్తున్నాడు. తాజా సెంచరీతో బవుమా తన జట్టును గెలిపించలేకపోయినా.. అద్భుతమైన పోరాటపటిమ, ఆటతీరుతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. విండీస్తో రెండో వన్డేలో శైలీకి భిన్నంగా 7 భారీ సిక్సర్లు బాదిన బవుమా విమర్శకులు ముక్కునవేళ్లేసుకునేలా చేశాడు. ఈ మ్యాచ్లో భారీ షాట్లతో పాటు మాస్టర్ క్లాస్ ఆటను ఆడిన బవుమా..సొగసైన బౌండరీలు కొట్టి, స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బెస్ట్ వన్డే నాక్ ఆడాడు. కెరీర్ ఆరంభం నుంచే జాత్యాహంకారులకు టార్గెట్గా మారిన బవుమా.. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఏమాత్రం నిరుత్సాహానికి లోను కాకుండా ప్రతిసారి బ్యాట్తో సమాధానం చెప్పడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. క్లిష్ట సమయంలో ముళ్ల కిరీటం లాంటి సౌతాఫ్రికన్ కెప్టెన్సీని చేపట్టిన బవుమా.. సారధిగానూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, సహచరుల నుంచి సరైన మద్దతు లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. సౌతాఫ్రికా కెప్టెన్గా నియమితుడైన మొట్టమొదటి బ్లాక్ అఫ్రికన్ అయిన బవుమా.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్ల్లో సెంచరీ చేసిన తొలి నల్లజాతీయుడిగా, వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికన్గా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, సౌతాఫ్రికాలో జాతి వివక్ష గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నెల్సన్ మండేలా ఎందు కోసం పోరాడాడో యావత్ ప్రపంచం చూసింది. కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా కొంత మంది సౌతాఫ్రికన్లలో జాత్యాహంకారం బీజాలు పోలేదు. ఈ వరుస సౌతాఫ్రికా క్రికెట్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మోకాలిపై నిలబడాలని క్రికెట్ సౌతాఫ్రికా ఆదేశించినా ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్తో పాటు కొందరు అలా చేసేందుకు నిరాకరించడం ఇందుకు నిదర్శనం. మున్ముందు ఇలా చేయాల్సి వస్తుందేమోనని డికాక్ ఏకంగా తన కెరీర్నే వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. గతంలో సౌతాఫ్రికా జట్టులో బ్లాక్స్ను వ్యతిరేస్తూ కొందరు స్టార్ ఆటగాళ్లు ఏకంగా దేశం వదలి ఇతర దేశాలకు వలస వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. బవుమా లాంటి ఆటగాళ్లు తమ టాలెంట్తో కెప్టెన్ స్థాయికి ఎదగడంతో కొందరు కడుపు మంటతో అనునిత్యం విమర్శలు చేస్తూనే ఉంటారు. నేషనల్ టీమ్కు కెప్టెన్ అయినప్పటికీ స్వదేశంలో ఇటీవల జరిగిన ఎస్ఏ20 లీగ్లో బవుమాను ఏ ఫ్రాంచైజీ తీసుకోకుండా ఘోరంగా అవమానించింది. రేసిజమ్ కారణంగా ఇలా జరిగిందని క్రికెట్ సర్కిల్స్లో ప్రచారం జరిగింది. ఆతర్వాత రీప్లేస్మెంట్గా బవుమాను ఓ ఫ్రాంచైజీ అక్కును చేర్చుకున్నప్పటికీ ఇది క్రికెట్ సౌతాఫ్రికాకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. కెరీర్లో 56 టెస్ట్లు, 24 వన్డేలు, 33 టీ20లు ఆడిన బవుమా.. మొత్తంగా 4500 పైచిలుకు పరుగులు సాధించాడు. ఇందులో 2 టెస్ట్ శతకాలు, 20 అర్ధసెంచరీలు.. 4 వన్డే హండ్రెడ్స్, 2 ఫిఫ్టీలు.. ఓ టీ20 హాఫ్ సెంచరీ ఉన్నాయి. -
వైజాగ్లో సిరీస్ సాధిస్తారా!
సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్లో ఓడించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా పడగొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో ఉంది. ఇరు జట్ల నేడు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. మరోవైపు సిరీస్ను సజీవంగా ఉంచేందుకు ఆసీస్కు ఈ మ్యాచ్లో గెలవడం తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే నుంచి తప్పుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సారథిగా బాధ్యతలు తీసుకుంటాడు. మూడో స్పిన్నర్కు చోటు... తొలి వన్డేలో భారత పేసర్లు షమీ, సిరాజ్ చక్కగా రాణించారు. స్పిన్ విభాగంలో జడేజా రాణించగా, కుల్దీప్ మాత్రమే కొన్ని పరుగులిచ్చాడు. అయితే ముంబైతో పోలిస్తే వైజాగ్ పిచ్ స్పిన్కు మరింత అనుకూలంగా ఉండటంతో రెండో రెగ్యులర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కు అవకాశం దక్కవచ్చు. మూడో పేసర్ పాత్రను హార్దిక్ సమర్థంగా నిర్వహిస్తుండటంతో శార్దుల్ అవసరం ఇప్పుడు జట్టుకు కనిపించడం లేదు. బ్యాటింగ్లో ఊహించినట్లుగానే మిడిలార్డర్లో శ్రేయస్ లేని లోటు కనిపిస్తోంది. సూర్యకుమార్ మరోసారి వన్డేల్లో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ మ్యాచ్లోనైనా ఆడకపోతే అతను వన్డే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. రోహిత్ రాకతో ఓపెనింగ్లో జట్టు బలం పెరిగింది. గత మ్యాచ్లో విఫలమైన కోహ్లి తన స్థాయికి తగ్గట్లు ఆడితే భారీ స్కోరు ఖాయం. వార్నర్ ఆడితే... మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ బలహీనత తొలి వన్డేలో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఆడితే జట్టులో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయి. కీపర్ ఇన్గ్లిస్ స్థానంలో క్యారీ వస్తాడు. హెడ్, లబుషేన్ రాణించడం కీలకం. అయితే అన్నింటికి మించి స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్ను ఆందోళన పరుస్తోంది. భారత్లో అడుగు పెట్టినప్పటి నుంచి అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇప్పటికైనా అతను ఆ లోటును తీర్చుకుంటాడా చూడాలి. స్టార్క్ తన బౌలింగ్ పదును భారత్కు చూపించగా... తొలి వన్డేలో ఒక బౌలర్ను తక్కువగా ఆడించి ఇబ్బంది పడిన కంగారూలు ఈసారి ఎలా వ్యూహం మారుస్తారో చూడాలి. వాన గండం... విశాఖ పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్కు బాగా అనుకూలం. దాదాపు అన్ని మ్యాచ్లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటి పిచ్ ఎదురు కావచ్చు. అయితే వర్షం ఆటకు ఇబ్బందిగా మారవచ్చని తెలుస్తోంది. స్థానిక వాతావరణ సూచన ప్రకారం ఆదివారం వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), మార్‡్ష, హెడ్, లబుషేన్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్వెల్, స్టొయినిస్, అబాట్, స్టార్క్, జంపా. 7:విశాఖపట్నంలో భారత్ 9 వన్డేలు ఆడగా...7 గెలిచింది. ఒక మ్యాచ్లో ఓడిపోగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఈ వేదికపై ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి 118, 117, 99, 65, 157 నాటౌట్, 0 స్కోర్లు నమోదు చేశాడు. -
IND VS AUS 2nd ODI: హాట్కేకుల్లా ‘విశాఖ’ వన్డే టికెట్ల విక్రయం
విశాఖ స్పోర్ట్స్: భారత్, ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా ఈనెల 19న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేకు సంబంధించిన టికెట్లు మంగళవారం హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. స్టేడియం సామర్థ్యం 27 వేలు కాగా.. పేటీఎం సంస్థ ఈ నెల 10, 11, 12 తేదీల్లో రూ.600 నుంచి రూ.6 వేల వరకు వివిధ విభాగాల్లో 70 శాతం టికెట్లను ఆన్లైన్లో విక్రయించింది. మిగిలిన 30 శాతం టికెట్లను స్థానిక అభిమానులను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ స్టేడియంతో పాటు మరో రెండు సెంటర్లలో ఏసీఏ నిర్వాహక కమిటీ మంగళవారం అందుబాటులో పెట్టింది. వీటి కోసం తెల్లవారుజాము నుంచే క్రికెట్ అభిమానులు ‘క్యూ’లు కట్టారు. దీంతో టికెట్లన్నీ హాట్కేకుల్లా అమ్ముడుపోయాయి. కాగా, సిరీస్లో తొలి వన్డే 17వ తేదీన ముంబైలో, మూడో వన్డే 22న చెన్నైలో జరగనుంది. -
టీమిండియా చేతిలో పరాజయం.. టాప్ ర్యాంక్ కోల్పోయిన న్యూజిలాండ్
IND VS NZ 2nd ODI: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే తర్వాత ఐసీసీ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టీమిండియా చేతిలో ఓటమి అనంతరం న్యూజిలాండ్ వన్డేల్లో తమ టాప్ ర్యాంక్ కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకోగా టీమిండియా నాలుగు నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ ఖాతాల్లో సమానంగా 113 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్తో సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేస్తే సింగిల్గా టాప్ ర్యాంక్కు చేరుకుంటుంది. ఇప్పటికే టీ20ల్లో టాప్ ర్యాంక్లో ఉన్న భారత్.. వన్డేల్లో ఆ స్థానాన్ని చేరుకునేందుకు మరో మ్యాచ్ దూరంలో మాత్రమే ఉంది. ఇక టెస్ట్ ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆస్ట్రేలియా (126 రేటింగ్ పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్.. త్వరలో స్వదేశంలో జరిగే 4 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకోగలిగితే, ఈ విభాగంలోనూ అగ్రపీఠానికి చేరుకుంటుంది. మొత్తంగా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టీమిండియా టాప్ ర్యాంక్కు చేరుకునేందుకు మరో 5 మ్యాచ్ల దూరంలో (ఓ వన్డే, 4 టెస్ట్లు) మాత్రమే ఉంది. ఇదిలా ఉంటే, రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 20.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) భీకర ఫామ్ను కొనసాగించాడు. వేగంగా మ్యాచ్ ముగించే క్రమంలో విరాట్ కోహ్లి (9 బంతుల్లో 11; 2 ఫోర్లు) సాంట్నర్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. కివీస్ బౌలర్లలో హెన్రీ షిప్లే, మిచెల్ సాంట్నర్లకు తలో వికెట్ దక్కింది. నామమాత్రమైన మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరుగనుంది. -
Ind Vs NZ: మన బౌలింగ్ భళా... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే
ఎలాంటి సంచలన ప్రదర్శనలు, ఎలాంటి ప్రతిఘటన, పోరాటాలు లేవు... అంతా ఏకపక్షమే, భారత్ పక్షమే.. తొలి వన్డేలో మన జట్టును వణికించిన న్యూజిలాండ్ రెండో పోరులో పూర్తిగా చేతులెత్తేసింది. భారత బౌలింగ్ను ఎదుర్కోలేక 108 పరుగులకే ఆట కట్టేసి ముందే ఓటమికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ ఛేదన పూర్తి చేసిన భారత్ మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. రాయ్పూర్: తొలి అంతర్జాతీయ మ్యాచ్లో రాయ్పూర్ అభిమానులకు తగిన ఆనందం దక్కలేదు. మొత్తం మ్యాచ్ 54.4 ఓవర్లలోనే ముగిసిపోయింది. శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత్పై ఆ జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోరు. గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (3/18) కివీస్ను దెబ్బ తీశాడు. అనంతరం భారత్ 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్స్లు), శుబ్మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) తొలి వికెట్కు 72 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. భారత్కు సొంతగడ్డపై ఇది వరుసగా ఏడో వన్డే సిరీస్ విజయం. చివరిదైన మూడో వన్డే మంగళవారం ఇండోర్లో జరుగుతుంది. సమష్టి వైఫల్యం... ఇన్నింగ్స్ ఐదో బంతికి అలెన్ (0)ను షమీ బౌల్డ్ చేయడంతో కివీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత పరుగు తేడాతో నికోల్స్ (2), మిచెల్ (1) వెనుదిరగ్గా... ఆరు బంతుల వ్యవధిలో కాన్వే (7), లాథమ్ (1) అవుటయ్యారు. దాంతో కేవలం 15 పరుగుల స్కోరు వద్దే కివీస్ సగం బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఈ దశలో ఫిలిప్స్తో కలిసి గత మ్యాచ్ హీరోలు బ్రేస్వెల్, సాన్ట్నర్ పోరాడారు. ఫిలిప్స్... ఆరో వికెట్కు బ్రేస్వెల్తో 41 పరుగులు, ఏడో వికెట్కు సాన్ట్నర్తో 47 పరుగులు జోడించాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేసిన బ్రేస్వెల్ తర్వాతి బంతికి అవుట్ కాగా, కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన సాన్ట్నర్ను పాండ్యా వెనక్కి పంపించాడు. స్కోరు 100 దాటాక తర్వాతి రెండు వికెట్లు సుందర్ ఖాతాలో చేరగా, కుల్దీప్ చివరి వికెట్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, గిల్ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 52/0కు చేరింది. 47 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తయ్యాక టిక్నర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లి (11) విఫలంకాగా... అప్పటికే కుదురుకున్న గిల్... ఇషాన్ కిషన్ (8 నాటౌట్)తో కలిసి మ్యాచ్ను ముగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: అలెన్ (బి) షమీ 0; కాన్వే (సి అండ్ బి) పాండ్యా 7; నికోల్స్ (సి) గిల్ (బి) సిరాజ్ 2; మిచెల్ (సి అండ్ బి) షమీ 1; ఫిలిప్స్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 36; బ్రేస్వెల్ (సి) ఇషాన్ (బి) షమీ 22; సాన్ట్నర్ (బి) పాండ్యా 27; షిప్లీ (నాటౌట్) 2; ఫెర్గూసన్ (సి) సూర్యకుమార్ (బి) సుందర్ 1; టిక్నర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 2; ఎక్స్ట్రాలు 7; మొత్తం (34.3 ఓవర్లలో ఆలౌట్) 108. వికెట్ల పతనం: 1–0, 2–8, 3–9, 4–15, 5–15, 6–56, 7–103, 8–103, 9–105, 10–108. బౌలింగ్: షమీ 6–1–18–3, సిరాజ్ 6–1–10–1, శార్దుల్ 6–1–26–1, హార్దిక్ పాండ్యా 6–3–16–2, కుల్దీప్ 7.3–0–29–1, వాషింగ్టన్ సుందర్ 3–1–7–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) షిప్లీ 51; గిల్ (నాటౌట్) 40; కోహ్లి (స్టంప్డ్) లాథమ్ (బి) సాన్ట్నర్ 11; ఇషాన్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు 1; మొత్తం (20.1 ఓవర్లలో 2 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–72, 2–98. బౌలింగ్: ఫెర్గూసన్ 5–0– 21–0, షిప్లీ 5–0–29–1, టిక్నర్ 4–0–19–0, సాన్ట్నర్ 4.1–0–28–1, బ్రేస్వెల్ 2–0–13–0. రోహిత్ మతిమరుపు... టాస్ సమయంలో అనూహ్య ఘటన జరిగింది. టాస్ గెలిచిన రోహిత్ ఏం ఎంచుకోవాలో చెప్పకుండా కొన్ని క్షణాల పాటు తటపటాయించాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలో తాను మరచిపోయానని అంటూ కొంత ఆలోచించి, ఆలోచించి చివరకు ఫీల్డింగ్ అంటూ చెప్పడం నవ్వు తెప్పించింది. -
IND VS NZ 2nd ODI: హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ
3 వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు. -
తొలి వన్డేలో 7 ఓవర్లలో 70.. రెండో మ్యాచ్లో 6-3-16-2
Hardik Pandya: రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా బంతితో విజృంభించాడు. 6 ఓవర్లలో కేవలం 16 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు (కాన్వే, సాంట్నర్) పడగొట్టాడు. హార్ధిక్ తన స్పెల్లో ఏకంగా 3 మెయిడిన్ ఓవర్లు సంధించడం విశేషం. హార్ధిక్తో పాటు షమీ (6-1-18-3), సిరాజ్ (6-1-10-1), శార్దూల్ (6-1-26-1), కుల్దీప్ (7.3-0-29-1), వాషింగ్టన్ సుందర్ (3-1-7-2) అద్భుతమైన గణాంకాలు నమోదు చేయడంతో రెండో వన్డేలో భారత్.. న్యూజిలాండ్ను 108 పరుగులకే కుప్పకూల్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కాగా, తొలి వన్డేలో 7 ఓవర్లలో 70 పరుగులు సమర్పించుకుని చెత్తగా బౌలింగ్ చేసిన హార్ధిక్.. మరుసటి మ్యాచ్లోనే ఊహించని రీతిలో రికవర్ అయ్యి బౌలింగ్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హార్ధిక్ ఓ ఫైటర్ అంటూ తెగ మోసేస్తున్నారు. 6 ఓవర్లలో ఏకంగా 3 మెయిడిన్లు వేయడం అద్భుతమని కొనియాడుతున్నారు. నిజానికి హార్ధిక్ ఈ మ్యాచ్లో ఫ్రంట్ లైన్ పేసర్గా సత్తా చాటాడు. షమీ, సిరాజ్లతో పోటీ పడి మరీ అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండో వన్డేలో హార్ధిక్ ప్రదర్శన తర్వాత కొందరు భారత అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ మ్యాచ్లో విఫలమైతే దూషించడం, మరుసటి మ్యాచ్లో రాణిస్తే ఆకాశానికెత్తడం షరా మామూలుగా మారిందని కామెంట్లు పెడుతున్నారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్ను ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్వెల్ ఈ మ్యాచ్లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు. కివీస్ ఇన్నింగ్స్లో ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (7), హెన్రీ నికోల్స్ (2), డారిల్ మిచెల్ (1), టామ్ లాథమ్ (1), ఫెర్గూసన్ (1), బ్లెయిర్ టిక్నర్ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
IND vs NZ 2023: మరో హోరాహోరీకి రె‘ఢీ’
రాయ్పూర్లోని షహీద్ వీర్నారాయణ్ సింగ్ స్టేడియం... 60 వేలకు పైగా సామర్థ్యంతో దేశంలోని మూడో అతి పెద్ద క్రికెట్ మైదానం... ఇప్పుడు తొలి అంతర్జాతీయ మ్యాచ్కు సిద్ధమైంది. అయితే భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేపై ఆసక్తి పెరిగేందుకు ఇది మాత్రమే కారణం కాదు. బుధవారం హైదరాబాద్ మ్యాచ్ అందించిన వినోదం ఈ సిరీస్ను ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేసింది. భారత్ ఏకపక్ష విజయం సాధించి ఉంటే... కివీస్ 131/6 నుంచి గెలుపు అంచుల దాకా వెళ్లకుండా ఉంటే ఈ మ్యాచ్కు ఇంత ఆకర్షణ వచ్చి ఉండేది కాదేమో! ఈ నేపథ్యంలో మరోసారి ఇరు జట్ల మధ్య మ్యాచ్లో అదే తరహాలో పరుగుల వరద పారుతుందా అనేది చూడాలి. రాయ్పూర్: సొంతగడ్డపై మరో వన్డే సిరీస్ను గెలుచుకునే లక్ష్యంతో భారత జట్టు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమైంది. శనివారం న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ టీమిండియా ఖాతాలో చేరుతుంది. మరోవైపు పట్టుదలకు మారుపేరైన కివీస్ గత మ్యాచ్లో చేజారిన విజయాన్ని అందుకొని సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. తొలి వన్డేలో ఇరు జట్ల ఆట, బలాబలాలను చూస్తే హోరాహోరీ పోరు ఖాయం. ఉమ్రాన్కు చాన్స్! ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఒకేసారి ముగ్గురు ‘డబుల్ సెంచూరియన్’లు భారత తుది జట్టులో ఆడబోతుండటం విశేషం. ఇది భారత బ్యాటింగ్ బలాన్ని చూపిస్తోంది. రోహిత్, గిల్ ఓపెనర్లుగా మెరుపు ఆరంభం అందిస్తే టీమిండియాకు తిరుగుండదు. గత మ్యాచ్లో విఫలమైనా... కోహ్లి ఎప్పుడైనా చెలరేగిపోగలడు కాబట్టి సమస్య లేదు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడటం జట్టుకు కీలకం. ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా తగిన న్యాయం చేయలేకపోతున్నాడు. బౌలింగ్లో సిరాజ్ మినహా మిగతా వారంతా విఫలమవుతున్నారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు పనికొస్తాడని తొలి వన్డేలో శార్దుల్ను తీసుకున్నారు. అయితే అది పెద్దగా ఫలితం చూపలేదు. దానికంటే రెగ్యులర్ బౌలర్కే అవకాశం ఇవ్వడం మంచిదని భావిస్తే మూడో పేసర్గా ఉమ్రాన్ జట్టులోకి తిరిగొస్తాడు. సోధి ఆడతాడా! న్యూజిలాండ్ పోరాటపటిమ ఏమిటో తొలి వన్డేలోనే కనిపించింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా... అనామకుడు అనుకున్న మైకేల్ బ్రేస్వెల్ తన విధ్వంసకర బ్యాటింగ్ను చూపించాడు. స్పిన్నర్ సాన్ట్నర్ కూడా బ్యాటింగ్తో జట్టుకు ఉపయోగపడగలనని నిరూపించుకున్నాడు. ఇదే ఆర్డర్ను చూసుకుంటే ఎనిమిదో స్థానం వరకు ఆ జట్టులో బ్యాటర్లకు కొదవ లేదు. గత మ్యాచ్లో విఫలమైనా... అలెన్, ఫిలిప్స్ మెరుపు షాట్లతో చెలరేగిపోగల సమర్థులు. కాన్వే, కెప్టెన్ టామ్ లాథమ్ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే న్యూజిలాండ్ గట్టి పోటీనివ్వగలదు. ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడైన ఫెర్గూసన్ను గిల్ చితక్కొట్టాడు. ఇలాంటి స్థితిలో లెగ్స్పిన్నర్ ఇష్ సోధి గాయం నుంచి కోలుకోవాలని జట్టు ఆశిస్తోంది. పిచ్, వాతావరణం స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్. పిచ్పై బౌన్స్ కొంత ఎక్కువగా కనిపిస్తోంది. అటు బ్యాటర్లు, ఇటు బౌలింగ్కూ అనుకూలం. వర్ష సూచన లేదు. భారత జట్టుకు జరిమానా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. హైదరాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసింది. దాంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు రిఫరీ జవగల్ శ్రీనాథ్ ప్రకటించారు. -
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది. రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు. -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
PAK VS NZ 2nd ODI: పాక్ జెర్సీని నేలకేసి కొట్టిన అంపైర్
కరాచీ వేదికగా పాకిస్తాన్తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో సత్తా చాటడంతో 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) కివీస్ పతనాన్ని శాశించారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. Ouch 😬🙏#PAKvNZ | #TayyariKiwiHai pic.twitter.com/JyuZ0Jwxi5 — Pakistan Cricket (@TheRealPCB) January 11, 2023 కాగా, ఈ మ్యాచ్లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో (39వ ఓవర్లో)పాక్ ఆటగాడు మహ్మద్ వసీం జూనియర్ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్ అంపైర్ అలీం దార్ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్, చేతిలో ఉన్న పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్లో ఉన్న పాక్ ఆటగాళ్లు అంపైర్ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డే సోషల్మీడియాలో షేర్ చేసింది. -
కింగ్ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!
IND VS SL 1st ODI: 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కింగ్ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుంది. -
కాన్వే సూపర్ సెంచరీ.. పాక్ను మట్టికరిపించిన న్యూజిలాండ్
కరాచీ: పాకిస్తాన్తో బుధవారం (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో పర్యాటక న్యూజిలాండ్ 79 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే సూపర్ సెంచరీతో (92 బంతుల్లో 101; 13 ఫోర్లు, సిక్స్) అదరగొట్టగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (100 బంతుల్లో 85; 10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో నవాజ్ (4/38), నసీమ్ షా (3/58) ఆకట్టుకున్నారు. అనంతరం 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (114 బంతుల్లో 79; 8 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. బాబర్ మినహా పాక్ జట్టంతా విఫలమైంది. మహ్మద్ రిజ్వాన్ (28), అఘా సల్మాన్ (25) ఓ మోస్తరుగా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ, సోధీ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, సాంట్నర్, బ్రేస్వెల్, ఫిలిప్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో వన్డే శుక్రవారం (జనవరి 13) జరుగుతుంది. -
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
IND VS SL 2nd ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. రేపటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్తో తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు మాత్రమే. గత మ్యాచ్లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్ 28, రాహుల్ 39 పరగులు చేసి ఔట్ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి. స్కై, ఇషాన్లకు ఛాన్స్ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్ ఎటూ వికెట్కీపింగ్ చేస్తాడు కాబట్టి రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్ స్థానాన్ని సూర్యకుమార్తో ఫిల్ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. తొలి వన్డేలో శ్రేయస్, రాహుల్ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
అందుకే సంజూ శాంసన్ను పక్కకు పెట్టాం: టీమిండియా కెప్టెన్
హామిల్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 27) జరగాల్సిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 12.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్(3) విఫలం కాగా, మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (42 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(25 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రీజ్లో ఉన్నారు. 4.5 ఓవర్ల తర్వాత తొలిసారి మ్యాచ్కు అంతరాయం కలిగించిన వర్షం, మళ్లీ 12.5 ఓవర్ల తర్వాత అడ్డుతగిలింది. ఈ దశలో ప్రారంభమైన భారీ వర్షం, ఎంతకూ తగ్గకపోవడంతో మ్యాచ్ను రద్దు చేశారు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో కివీస్ ఆధిక్యం 1-0తో కొనసాగుతుంది. తొలి వన్డేలో టామ్ లాథమ్ భారీ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పుపై పెద్ద దూమారమే రేగింది. తొలి వన్డేలో పర్వాలేదనిపించిన సంజూ శాంసన్ను జట్టు నుంచి తప్పించడం, గత కొన్ని మ్యాచ్లుగా దారుణంగా విఫలమవుతున్న రిషబ్ పంత్ను జట్టులో కొనసాగిండచడంపై అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నందుకు సోషల్మీడియా వేదికగా కెప్టెన్ శిఖర్ ధవన్, కోచ్ వీవీఎస్ లక్ష్మణ్లను ఎండగట్టారు. సంజూ శాంసన్ దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాడు కాబట్టే ఇలా చేస్తున్నారని కొందరు, కుల వివక్ష కారణంగానే శాంసన్కు అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని మరికొందరు పరుష పదజాలం ఉపయోగించి బీసీసీఐ, కెప్టెన్, కోచ్, సెలెక్టర్లను టార్గెట్ చేశారు. శాంసన్ను జట్టు నుంచి ఎందుకు తప్పించారో టాస్ సమయంలో కెప్టెన్ ధవన్ ఎలాంటి కారణం చెప్పకపోవడంతో అభిమానులు మరింత రెచ్చిపోయారు. జట్టు నుంచి ఎందుకు తప్పించారో చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్పైన ఉంటుంది, అలాంటిది శాంసన్ను తప్పించడంపై కెప్టెన్ ధవన్ కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం అహంకారానికి నిదర్శనమని దుయ్యబట్టారు. అయితే, ఈ విషయం వివాదాస్పదంగా మారడం, నెట్టింట భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుండటంతో మ్యాచ్ రద్దైన అనంతరం కెప్టెన్ ధవన్ స్పందించాడు. రెండో వన్డేలో శాంసన్ను పక్కకు పెట్టడానికి గల కారణాలను వివరించాడు. జట్టుకు ఆరో బౌలర్ అవసరమని, తప్పనిసరి పరిస్ధితుల్లో శాంసన్కు బదులు దీపక్ హుడాను తుది జట్టులో తీసుకున్నామని తెలిపాడు. పిచ్ స్వింగ్కు అనుకూలిస్తుందని భావించి శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్కు అవకాశం కల్పించామని పేర్కొన్నాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసమే శాంసన్ను పక్కకు పెట్టాల్సి వచ్చిందని, దీనిపై రాద్దాంతం అనవసరమని ట్రోలింగ్కు దిగిన వారికి పరోక్షంగా చురకలంటించాడు. -
సిరీస్ కాపాడుకునేందుకు...
హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై గత పర్యటనలో టి20 సిరీస్ గెలిచిన భారత్ వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈసారి కూడా టి20 సిరీస్ గెలిచిన ఊపులో వన్డేల్లో అడుగు పెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ను చేజార్చుకుంది. 306 పరుగులు చేసిన తర్వాత కూడా ఆక్లాండ్లో ఓటమి ఎదురైంది. ఇప్పుడు ఇదే తరహా భారీ స్కోర్లకు వేదికైన పిచ్ సెడాన్ పార్క్లో ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కోలుకొని సిరీస్ను మూడో వన్డే వరకు తీసుకెళుతుందా, లేక కివీస్ ఖాతాలో సిరీస్ చేరుతుందా చూడాలి. న్యూజిలాండ్ చేతిలో భారత్ వరుసగా గత 5 వన్డేలు ఓడగా... సొంతగడ్డపై కివీస్ వరుసగా 13 వన్డేలు నెగ్గి జోరు మీదుంది. మ్యాచ్కు వర్షం వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది. కుల్దీప్కు చాన్స్! తొలి వన్డేలో శిఖర్ ధావన్, గిల్, అయ్యర్ అర్ధ సెంచరీలు చేయగా, సంజు సామ్సన్ కూడా దూకుడుగా ఆడాడు. అయితే ఓపెనర్లు ధావన్, గిల్ మరీ నెమ్మదిగా ఆడటం, పవర్ప్లేను సద్వినియోగం చేసుకోకపోవడం భారత్ను నష్టపరిచింది. సూర్యకుమార్ వైఫల్యం జట్టును కొంత ఇబ్బంది పెడుతోంది. టి20ల్లో విధ్వంసానికి మారుపేరుగా నిలుస్తున్న అతను వన్డేల్లో మాత్రం రాణించడం లేదు. అవసరమైతే ఆరో బౌలింగ్ ప్రత్యామ్నాయం కోసం సూర్య స్థానంలో దీపక్ హుడాను ఎంపిక చేసే అవకాశం ఉంది. భారీగా పరుగులిచ్చిన శార్దుల్ స్థానంలో దీపక్ చహర్కు చాన్స్ దక్కవచ్చు. మరోవైపు లెగ్స్పిన్నర్ చహల్ బౌలింగ్లో మునుపటి పస కనిపించడం లేదు. అతనికి బదులుగా కుల్దీప్ యాదవ్ను ఆడించే ఆలోచనలతో మేనేజ్మెంట్ ఉంది. నీషమ్కు చోటు! విలియమ్సన్ నాయకత్వంలో కివీస్ మంచి ఫామ్లో ఉంది. తొలి వన్డేలో ఆ జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్కు మారినా లాథమ్ బ్యాటింగ్లో జోరు తగ్గలేదు. ఓపెనర్లు అలెన్, కాన్వే దూకుడుగా ఆడగల సమర్థులు. గాయంతో గత మ్యాచ్కు దూరమై ఇప్పుడు కోలుకున్న నీషమ్... ఫిలిప్స్ స్థానంలో జట్టులోకి వస్తాడు. -
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
-
IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్ను సిరీస్లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మార్క్రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు. రాణించిన హెండ్రిక్స్, మార్క్రమ్ డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి. కిషన్ సిక్సర్లు కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277. బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209. బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్రమ్ 3–0–22–0. -
IND vs SA 2nd ODI: సిరీస్ కాపాడుకునేందుకు...
రాంచీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో ఎంతో చేరువగా వచ్చినా, త్రుటిలో గెలుపు అవకాశం చేజార్చుకున్న భారత జట్టు ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలతో ఉంది. మరో మ్యాచ్లో ఓడి సిరీస్ కోల్పోరాదని భావిస్తున్న టీమిండియా నేడు జరిగే రెండో వన్డేలో బరిలోకి దిగుతోంది. టాప్ ఆటగాళ్లు లేకుండా ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతోనే మైదానంలోకి అడుగు పెట్టిన భారత్కు సంబంధించి వన్డే సిరీస్కు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా... దక్షిణాఫ్రికాకు మాత్రం వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్కప్నకు అర్హత సాధించేందుకు ప్రతీ మ్యాచ్ గెలుపు ద్వారా లభించే 10 ‘సూపర్ లీగ్’ పాయింట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పోరు ఖాయం. పేస్ బౌలర్ దీపక్ చహర్ వెన్ను నొప్పితో మిగిలిన రెండు మ్యాచ్లకు దూరం కాగా, అతని స్థానంలో స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను సెలక్టర్లు ఎంపిక చేశారు. తొలి వన్డేలోనూ చహర్ బరిలోకి దిగలేదు. షహబాజ్కు అవకాశం దక్కేనా! 40 ఓవర్లకు కుదించిన మొదటి వన్డేలో భారత్ కేవలం 9 పరుగులతో ఓడింది. ఇన్నింగ్స్ చివర్లో సామ్సన్కు మరికొన్ని బంతులు ఆడే అవకాశం వచ్చి ఉంటే ఫలితం భిన్నంగా ఉండేదేమో. కాబట్టి ఓవరాల్గా చూస్తే అదే జట్టును కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మన బ్యాటింగ్ బృందంలో సామ్సన్ తన సత్తా ఏమిటో చూపించగా, శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు తాను సరైనవాడినని నిరూపించుకున్నాడు. అయితే గత మ్యాచ్లో విఫలమైన టాప్–4 ఈసారి ఎలా ఆడతారన్నది చూడాలి. ఓపెనర్లు ధావన్, గిల్ ప్రభావం చూపించాల్సి ఉండగా... తొలి వన్డేలో మరీ పేలవంగా ఆడిన రుతురాజ్, ఇషాన్ కిషన్లు ఏమాత్రం రాణిస్తారనేది కీలకం. ఆల్రౌండర్ శార్దుల్ రెండు విధాలా ఆకట్టుకోవడం సానుకూలాంశం. కుల్దీప్ యాదవ్ కూడా మరోసారి తన భిన్నమైన బౌలింగ్తో ప్రత్యర్థిని నిలువరించగలడు. అయితే రెండో స్పిన్నర్గా రవి బిష్ణోయ్ స్థానంలో షహబాజ్ అహ్మద్కు చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. షహబాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున అరంగేట్రం చేయలేదు. ఇద్దరు పేసర్లు అవేశ్, సిరాజ్ మరోసారి కొత్త బంతిని పంచుకోవడం ఖాయం. ఇటీవల వన్డేల్లో ఎంతో మెరుగుపడిన సిరాజ్, చివరి ఓవర్లలో మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం సానుకూలాంశం. చహర్ స్థానంలో ఎంపికైన సుందర్కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. రెండు మార్పులతో... వన్డే సూపర్ లీగ్ పాయింట్లలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 11వ స్థానంలో కొనసాగుతోంది. నేరుగా అర్హత సాధించేందుకు టాప్–8లో నిలవాల్సి ఉండగా ఆ జట్టుకు ప్రతీ వన్డే కీలకం కానుంది. రెండో వన్డేతో పాటు చివరి మ్యాచ్లో కూడా గెలిస్తేనే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. అయితే లక్నో మ్యాచ్లోనూ అదృష్టవశాత్తూ గెలిచిన ఆ జట్టు మరో విజయాన్ని అందుకుంటుందా అనేది ఆసక్తికరం. పూర్తి స్థాయి జట్టే అందుబాటులో ఉన్నా, భారత్ను ఓడించేందుకు సఫారీ టీమ్ తీవ్రంగా శ్రమించింది. ఇలాంటి స్థితిలో జట్టులో అందరూ రాణించాల్సి ఉంది. కెప్టెన్ బవుమా జట్టుకు పెద్ద బలహీనతగా మారగా, ఆల్రౌండర్ మార్క్రమ్ గత కొంత కాలంగా వన్డేల్లో ఘోరంగా విఫలమవుతున్నాడు. మలాన్, వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రూపంలో చెప్పుకోదగ్గ ఓపెనర్లు ఉండటం కాస్త నయం. గత మ్యాచ్లోనూ వీరిద్దరు శుభారంభం అందించగా, ఆ తర్వాత టీమ్ తడబడింది. మిల్లర్, క్లాసెన్ ఆదుకోవడంతో పరిస్థితి మెరుగైంది. మరోసారి ఈ జోడీపై దక్షిణాఫ్రికా అమితంగా ఆధారపడుతోంది. ఆల్రౌండర్ ప్రిటోరియస్ గాయంతో దూరం కావడం జట్టు సమతుల్యతను దెబ్బ తీసింది. ఈ నేపథ్యంలో జట్టులో రెండు మార్పులు కనిపిస్తున్నాయి. వేన్ పార్నెల్, షమ్సీ స్థానాల్లో మరో ఇద్దరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లు జాన్సెన్, ఫెలుక్వాయోలకు అవకాశం దక్కవచ్చు. రబడ, కేశవ్ మహరాజ్ ప్రభావం చూపిస్తుండగా... ఇన్గిడి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. పిచ్, వాతావరణం బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్. ఇక్కడ జరిగిన ఐదు వన్డేల్లో నాలుగింటిలో భారీ స్కోర్లే నమోదయ్యాయి. బౌలర్లూ ఎప్పుడూ ప్రభావం చూపలేకపోయారు. మ్యాచ్ రోజు కొన్ని చినుకులు పడే అవకాశం ఉన్నా... ఆటకు అంతరాయం కలగకపోవచ్చు. -
ధవన్ సేన బి టీమ్ కాదు.. భారత్కు ఒకేసారి నాలుగైదు జట్లను ఆడించే సత్తా ఉంది..!
IND VS SA 2nd ODI: రాంచీ వేదికగా టీమిండియాతో రేపు (అక్టోబర్ 9) జరుగబోయే రెండో వన్డేకి ముందు దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల గైర్హాజరీలో తమతో వన్డే సిరీస్ ఆడుతున్న శిఖర్ ధవన్ సేనను భారత-బి టీమ్ అంటే అస్సలు ఒప్పుకోనని అతను వ్యాఖ్యానించాడు. భారత ఆటగాళ్లలో చాలా టాలెంట్ ఉందని, ఒకేసారి నాలుగైదు అంతర్జాతీయ స్థాయి జట్లను బరిలోకి దించే సత్తా వారికి ఉందని టీమిండియా ఆటగాళ్లను పొగడ్తలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జట్టులో లేనంత మాత్రాన ధవన్ సేనను తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదని పేర్కొన్నాడు. తమతో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టులో నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారని, వారితో ఏమరపాటుగా ఉంటే అసలుకే మోసం వస్తుందని సఫారీ ప్లేయర్లను పరోక్షంగా హెచ్చరించాడు. ధవన్ సేనలో చాలా మంది కుర్రాళ్లకు ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని, వారంతా ప్రపంచ స్థాయి ఆటగాళ్లేనని సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్లను ఉద్దేశించి కామెంట్ చేశాడు. టీమిండియాతో ఆడటం ఎంతటి జట్టుకైనా సవాలుతో కూడుకున్న పనేనని, వారు ఒకేసారి నాలుగైదు జట్లను బరిలోకి దించినా వారి బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగానే ఉంటుందని కొనియాడాడు. టీ20 సిరీస్ను 1-2 తేడాతో కోల్పోయిన తమ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉందని, ఈ సిరీస్ను తామ తప్పక చేజిక్కించుకుని ఆస్ట్రేలియాకు (టీ20 వరల్డ్కప్ వేదిక) బయల్దేరుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే, లక్నో వేదికగా భారత్తో జరిగిన తొలి వన్డేలో సఫారీ జట్టు 9 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో సంజూ శాంసన్ (86 నాటౌట్) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి మ్యాచ్ను చివరి నిమిషం వరకు ఆసక్తికరంగా మార్చాడు. అయితే ఆఖర్లో టెయిలెండర్ ఆవేశ్ ఖాన్ చేసిన పొరపాట్ల వల్ల శాంసన్కు స్ట్రయిక్ రాకపోవడంతో భారత్ ఓటమిపాలైంది. 40 ఓవర్ల పాటు సాగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 4 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో టీమిండియా 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేయగలిగింది. -
‘జులన్కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్ల విజయాలతో 2–0తో సిరీస్ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్లో ఆఖరి వన్డే జరుగుతుంది. -
Ind vs Eng 2nd ODI: హర్మన్ హరికేన్
కాంటర్బరీ: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడు మ్యాచ్ల సిరీస్ను గెలిచేందుకు అవసరమైన భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. బుధవారం జరిగిన ఈ డే–నైట్ మ్యాచ్లో మొదట భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది.ఆమె వన్డే కెరీర్లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్తో కలిసి అజేయంగా నిలిచింది. -
WI vs NZ: మెరిసిన అలెన్, సౌతీ, బౌల్ట్.. విండీస్పై కివీస్ విజయం
బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను 1–1తో సమం చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (117 బంతుల్లో 96; 7 ఫోర్లు, 3 సిక్స్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. డరైల్ మిచెల్ (41; 2 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి అలెన్ నాలుగో వికెట్కు 84 పరుగులు జత చేశాడు. జేసన్ హోల్డర్ (3/24), కెవిన్ సింక్లెయిర్ (4/41) కివీస్ ఇన్నింగ్స్ను దెబ్బ తీశారు. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ను ట్రెంట్ బౌల్ట్ (3/18), టిమ్ సౌతీ (4/22) బెదరగొట్టారు. విండీస్ స్కోరు 63/7 వద్ద ఉన్నపుడు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. అనంతరం విండీస్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 212 పరుగులుగా నిర్ణయించారు. చివర్లో యానిక్ కరియా (52; 2 ఫోర్లు, 1 సిక్స్), అల్జారి జోసెఫ్ (31 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్లు) పట్టుదలతో ఆడి తొమ్మిదో వికెట్కు 85 పరుగులు జోడించారు. అయితే నాలుగు పరుగలు తేడాలో వీరిద్దరు అవుటవ్వడంతో విండీస్ ఇన్నింగ్స్ 161 పరుగుల వద్ద ముగిసింది. సిరీస్లో చివరిదైన మూడో వన్డే నేడు జరుగుతుంది. చదవండి: T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్కు భారత జట్టు ప్రకటన.. ఎప్పుడంటే? -
India vs Zimbabwe 2nd ODI: భారత్ జోరుకు తిరుగుందా!
హరారే: జింబాబ్వే గడ్డపై అలవోక విజయంతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు అదే జోరుతో సిరీస్పై కన్నేసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఇక్కడే కప్ గెలవాలనే పట్టుదలతో రాహుల్ సేన బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్తో భారీ స్కోర్లను ఛేదించి మరీ గెలిచిన ఆతిథ్య జింబాబ్వే జట్టు... వారాల వ్యవధిలోనే భారత్ ఆల్రౌండ్ దెబ్బకు విలవిల్లాడింది. ఇప్పుడు సిరీస్లో నిలిచేందుకో, ఈ మ్యాచ్ గెలిచేందుకో కాదు... భారత్ ధాటిని ఎదుర్కోవాలని లక్ష్యంతోనే జింబా బ్వే రెండో మ్యాచ్కు సిద్ధమైంది. టీమిండియా సీమర్లను ఆరంభ ఓవర్లలో ఎదుర్కొంటే... గెలుపు, భా రీస్కోరు సంగతి అటుంచి కనీసం 50 ఓవర్ల కోటా అయినా ఆడుకోవచ్చని జింబాబ్వే ఆశిస్తోంది. ఆకాశమే హద్దుగా భారత్ భారత్ జోరుకు ఆకాశమే హద్దు! ముఖ్యంగా ఓపెనింగ్ జోడి. ధావన్–శుబ్మన్ గిల్ కొన్నాళ్లుగా తమకెదురైన ప్రతీ ప్రత్యర్థిని, ప్రతీ బౌలర్ను అలవోకగా ఎదుర్కొంటున్నారు. సులువుగా పరుగులు, భారీ భాగస్వామ్యాలు నమోదు చేస్తున్నారు. మిడిలార్డర్లో రాహుల్ తన పునరాగమనాన్ని చాటాలని ఉవ్విళ్లూరుతుండగా, సంజు సామ్సన్, దీపక్ హుడా సీనియర్ల గైర్హాజరీలో సత్తా చాటుకుంటున్నారు. బౌలింగ్ విభాగం కూడా ఆతిథ్య జట్టు కంటే పటిష్టంగా ఉంది. బరిలోకి దిగి చాన్నాళ్లయినా... దీపక్ చహర్ తొలి ఓవర్నుంచే లయ అందుకున్నాడు. గత మ్యాచ్లో అతను టాపార్డర్ను కూల్చిన తీరు అద్భుతం. స్పిన్నర్ అక్షర్, సీమర్ ప్రసిధ్ కూడా వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఒత్తిడిలో జింబాబ్వే పటిష్టమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు జింబాబ్వే ఆపసోపాలు పడుతోంది. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో తేలిపోతోంది. తొలి వన్డే ఫలితాన్ని పరిశీలిస్తే ఆతిథ్య జట్టు సిరీస్ను ఆఖరి దాకా తీసుకొ చ్చే అవకాశమైతే లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎటొచ్చీ ఓటమి అంతరాన్ని తగ్గించడం, లేదంటే పరువు నిలుపుకొనే పోరాటంపైనే జింబాబ్వే దృష్టి పెట్టింది. ఇన్నోసెంట్ కైయా, మరుమని, వెస్లీ బాధ్యత కనబరిస్తే మంచి స్కోరు చేయవచ్చు. పిచ్–వాతావరణం తొలి వన్డే ఆడిన పిచే! మ్యాచ్ ఆరంభంలో కొత్తబంతి సీమర్లు చెలరేగొచ్చు. తర్వాత బ్యాటింగ్కు స్వర్గధామం. ఆటకు అనుకూల వాతవరణం ఉంది. వాన ముప్పే లేదు. జట్లు (అంచనా) భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధావన్, గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, కుల్దీప్, ప్రసిధ్ కృష్ణ, సిరాజ్. జింబాబ్వే: రెగిస్ చకాబ్వా (కెప్టెన్), కైయా, మరుమని, సియాన్ విలియమ్స్, వెస్లీ మధెవెర్, సికందర్ రజా, రియాన్ బర్ల్, ల్యూక్ జాంగ్వే, ఇవాన్స్, విక్టర్, రిచర్డ్. -
India vs West Indies: మరో సిరీస్ సాధించేందుకు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్లో విండీస్పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతా ఫామ్లోకి... శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్తో అర్ధసెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్లను కాదని ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న శుబ్మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్కు చూపించగా... రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కే అవకాశం లేని స్థితిలో బరిలోకి దిగిన శ్రేయస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతను తీసిన పూరన్ వికెట్ కీలక దశలో వరుస ఓవర్లలో శార్దుల్ తీసిన రెండు వికెట్లు ఆల్రౌండర్గా అతని బలాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండానే భారత జట్టు రెండో మ్యాచ్లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ టాప్–4 బ్యాటర్లలో ముగ్గురు రాణించారు. అయితే జట్టును గెలిపించడానికి అది సరిపోలేదు. కీలక దశలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు ఆడి వెనుదిరుగుతూ టి20 శైలి బ్యాటింగ్ చేస్తున్న పూరన్.. కెప్టెన్గా జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మేయర్స్, కింగ్స్లకు తోడు బ్రూక్స్ కూడా మెరుగ్గా ఆడితే విండీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. గత ఆరు మ్యాచ్లలో షై హోప్స్ విఫలం కావడంతో టీమ్కు శుభారంభం లభించడం లేదు. దీనికి ఆ జట్టు సరిదిద్దుకోవాల్సి ఉంది. బౌలింగ్లో మాత్రం విండీస్లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఉత్కంఠభరిత ముగింపు తొలి వన్డే చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన తొలి 4 బంతుల్లో ఒక ఫోర్ సహా 7 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. ఆ తర్వాత సిరాజ్ వేసిన బంతి లెగ్స్టంప్కు చాలా దూరంగా ‘వైడ్’గా వెళ్లింది. అది వేగంగా వెళ్లి బౌండరీని తాకి ఉంటే సమీకరణం వేరేలా ఉండేది. కానీ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఎడమ వైపు డైవ్ చేస్తూ దానిని ఆపడంలో సఫలమయ్యాడు. దాంతో ఒక పరుగే వచ్చింది. అనంతరం చివరి 2 బంతుల్లో సిరాజ్ 3 పరుగులే ఇవ్వడంతో 3 పరుగుల తేడాతో విజయం భారత్ సొంతమైంది. భారత్ చేసిన 308 పరుగులకు బదులుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేయగలిగింది. కైల్ మేయర్స్ (68 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (66 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్లు), బ్రూక్స్ (61 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... శార్దుల్, సిరాజ్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ప్రసిధ్ కృష్ణ ఔట్.. ఆవేశ్ ఖాన్కు ఛాన్స్..!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా విండీస్తో రేపు (జులై 24) జరుగబోయే రెండో వన్డే కోసం టీమిండియా సిద్ధమవుతోంది. తొలి మ్యాచ్లో ఆతిధ్య జట్టును 3 పరుగుల తేడాతో ఓడించిన ధవన్ సేన.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం టీమిండియా తుది జట్టులో ఓ మార్పు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో వికెట్ లేకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిధ్ కృష్ణ స్థానంలో మరో పేసర్ ఆవేశ్ ఖాన్కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డేలో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించే ఛాన్స్ ఉంది. ఓపెనర్లుగా ధవన్, గిల్, వన్డౌన్లో శ్రేయస్ అయ్యర్, మిడిలార్డర్లో సూర్యకుమార్, దీపక్ హుడా, సంజూ శాంసన్, ఆల్రౌండర్ల కోటాలో అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్, ఏకైక స్పిన్నర్గా చహల్, పేసర్లుగా ఆవేశ్ ఖాన్, సిరాజ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది. మరోవైపు తొలి వన్డేలో దాదాపు విజయపు అంచుల వరకు వచ్చిన విండీస్ సైతం ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలగా ఉంది. భారత తుది జట్టు (అంచనా).. శిఖర్ ధవన్(కెప్టెన్), శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్ చదవండి: అసలు అతడికి ఇక్కడ ఏం పని? ధావన్పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! -
సఫారీల భరతం పట్టిన ఇంగ్లండ్ బౌలర్లు.. రెండో వన్డేలో బట్లర్ సేన ఘన విజయం
పర్యాటక దక్షిణాఫ్రికా చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 118 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. వర్షం కారణంగా 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 28.1 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయినా, ఆఖర్లో లివింగ్స్టోన్ (26 బంతుల్లో 38; ఫోర్, 3 సిక్సర్లు), సామ్ కర్రన్ (18 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపుల సాయంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ (4/36), నోర్జే (2/53), షంషి (2/39), కెప్టెన్ కేశవ్ మహారాజ్ (1/29)లు వికెట్లు సాధించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో సఫారీ జట్టు 20.4 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ (3/29), మొయిన్ అలీ (2/22), రీస్ టాప్లే (2/17), డేవిడ్ విల్లే (1/9), సామ్ కర్రన్ (1/5) సఫారీల భరతం పట్టారు. వీరి ధాటికి సఫారీల ఇన్నింగ్స్లో ఏకంగా నాలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హెన్రిచ్ క్లాసెన్ (40 బంతుల్లో 33), డేవిడ్ మిల్లర్ (12), ప్రిటోరియస్ (17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే హెడింగ్లే వేదికగా జులై 24న జరుగనుంది. చదవండి: Ind Vs WI: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! -
IND vs ENG 2nd ODI: ‘టాప్’లీ లేపేశాడు...
లండన్: లార్డ్స్లో సీన్ రివర్స్ అయ్యింది. తొలి వన్డేలో మన పేస్కు తలవంచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్లాగే... ఇక్కడ ప్రత్యర్థి నిప్పులు చెరిగే బౌలింగ్కు భారత్ కుదేలైంది. దీంతో భారత్ రెండో వన్డేలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 49 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్లు), విల్లీ (49 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. చహల్ (4/47) తిప్పేయగా, బుమ్రా, పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 38.5 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది.జడేజా (29), హార్దిక్ పాండ్యా (29) టాప్స్కోరర్లుగా నిలువగా, రీస్ టాప్లీ 6 వికెట్లు పడగొట్టాడు. కోహ్లి గాయం నుంచి కోలుకోవడంతో రెండో వన్డే బరిలోకి దిగాడు. దీంతో శ్రేయస్ను తుదిజట్టు నుంచి తప్పించారు. ఆఖరి వన్డే 17న మాంచెస్టర్లో జరుగుతుంది. ఆరంభానికి చహల్ తూట్లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను ఆరంభించిన రాయ్, బెయిర్స్టో జాగ్రత్త పడ్డారు. దీంతో తొలి 4 ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ బాదడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. 10 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 46/1. చహల్ (4/47) అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4) షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆదుకున్న అలీ, విల్లీ ఇంగ్లండ్ 102 స్కోరుకే ప్రధానమైన సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో లివింగ్స్టోన్, మొయిన్ అలీ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఊరించే బంతులు వేసిన హార్దిక్ పాండ్యా... లివింగ్స్టోన్ (33 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్లు)ను బోల్తా కొట్టించాడు. దీంతో అలీతో జతకట్టిన డేవిడ్ విల్లే పరుగుల బాధ్యతను పంచుకున్నారు. ఒక పరుగు వద్ద విల్లీ ఇచ్చిన క్యాచ్ను ప్రసిధ్ వదిలేయడం జట్టుకు కలిసొచ్చింది. అయితే కట్టుదిట్టమైన భారత బౌలింగ్ వల్ల రన్రేట్ మందగించింది. ఇద్దరు ఏడో వికెట్కు 62 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 200పైచిలుకు చేరాక అలీ, కాసేపటికి విల్లీ అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో తగినన్ని పరుగులు రాలేదు. టాప్ లేపిన టాప్లీ ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహం ఆవిరయ్యేందుకు ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9) టాప్లీ పేస్కు తలవంచారు. ఆ వెంటనే రిషభ్ పంత్ (0)ను కార్స్ ఖాతా తెరువనీయలేదు. అయినా విరాట్ కోహ్లి (16) ఉండటంతో కొంత నమ్మకం ఉన్నా, అతని ఆటకు విల్లీ చెక్ పెట్టాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్ది సేపు పోరాడటంతో స్కోరు వంద దాటింది! జట్టు స్కోరు 140 పరుగుల వద్ద జడేజా అవుట్ కావడంతో భారత్ ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 23; బెయిర్స్టో (బి) చహల్ 38; రూట్ (ఎల్బీ) (బి) చహల్ 11; స్టోక్స్ (ఎల్బీ) (బి) చహల్ 21; బట్లర్ (బి) షమీ 4; లివింగ్స్టోన్ (సి) సబ్–శ్రేయస్ (బి) పాండ్యా 33; అలీ (సి) జడేజా (బి) చహల్ 47; విల్లీ (సి) సబ్–శ్రేయస్ (బి) బుమ్రా 41; ఓవర్టన్ నాటౌట్ 10; కార్స్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్ట్రాలు 13; మొత్తం (49 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–41, 2–72, 3–82, 4–87, 5–102, 6–148, 7–210 బౌలింగ్: షమీ 10–0–48–1, బుమ్రా 10–1–49–2, హార్దిక్ 6–0–28–2, ప్రసిధ్ 8–0–53–1, చహల్ 10–0–47–4, జడేజా 5–0–17–0. -
ఇంగ్లండ్తో రెండో వన్డే.. సందడి చేసిన ధోని, రైనా
IND VS ENG 2nd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్లు సందడి చేశారు. ఈ టీమిండియా మాజీ త్రయం వీఐపీ గ్యాలరీలో ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్న ధోని.. తొలి వన్డే సందర్భంగా కూడా మైదానంలో హడావుడి చేశాడు. విండీస్ దిగ్గజం గార్డన్ గ్రీనిడ్జ్, సైఫ్ అలీ ఖాన్లతో కలిసి ఫోటోలు దిగాడు. తాజాగా తలా.. చిన్న తలా (రైనా)తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. Great watching the boys in blue 🇮🇳 @harbhajan_singh @msdhoni pic.twitter.com/1UEGAzEG7R — Suresh Raina🇮🇳 (@ImRaina) July 14, 2022 సహచరులు భజ్జీ, ధోనిలతో కలిసి దిగిన ఫోటోలను రైనా ట్విటర్లో పోస్ట్ చేశాడు. కాగా, ఇంగ్లండ్తో వన్డే సిరీస్ను వీక్షించేందుకు దిగ్గజ ఆటగాళ్లు చాలా మంది హాజరవుతున్నారు. తొలి వన్డే సందర్భంగా సచిన్, గంగూలీలతో పాటు చాలా మంది స్టార్లు మ్యాచ్ను లైవ్లో వీక్షించారు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటైంది. చహల్ 4, బుమ్రా, హార్థిక్ తలో 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ, షమీ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో మొయిన్ అలీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. చదవండి: విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ -
విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ
Rohit-Dhawan: టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్లు మరో అరుదైన రికార్డుపై కన్నేశారు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఈ ద్వయం మరో 43 పరుగులు జోడిస్తే.. విండీస్ దిగ్గజ ఓపెనర్ల రికార్డును అధిగమిస్తారు. వన్డేల్లో విండీస్ లెజెండరీ ఓపెనింగ్ పెయిర్ గార్డన్ గ్రీనిడ్జ్-డెస్మండ్ హేన్స్ జోడీ తొలి వికెట్కు 102 ఇన్నింగ్స్ల్లో 5150 పరుగులు జోడించగా.. రోహిత్-ధవన్ జోడీ 112 ఇన్నింగ్స్ల్లో 5108 పరుగులు చేసింది. ఇంగ్లండ్తో నేటి (జులై 14) మ్యాచ్లో భారత ఓపెనింగ్ ద్వయం మరో 43 పరుగులు సాధించగలిగితే.. వన్డేల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకుతుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడీ (136 ఇన్నింగ్స్ల్లో 6609 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. ఆసీస్ ఆల్టైమ్ గ్రేట్ ఓపెనింగ్ జోడీ మాథ్యూ హేడెన్-ఆడమ్ గిల్క్రిస్ట్ (114 ఇన్నింగ్స్ల్లో 5472) రెండో ప్లేస్లో నిలిచింది. తొలి వన్డేలో హిట్మ్యాన్- ధవన్ పెయిర్ తొలి వికెట్కు అజేయమైన 114 పరుగులు సాధించడం ద్వారా ఫిఫ్టి ఓవర్స్ ఫార్మాట్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకుంది. ఇదిలా ఉంటే, తొలి వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు బుమ్రా (6/19), మహ్మద్ షమీ (3/31) నిప్పులు చెరగడంతో 110 పరుగులకే చాపచుట్టేసింది. ఛేదనలో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్లు) శిఖర్ ధవన్ (54 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు)లు చెలరేగడంతో ఇంగ్లండ్ నిర్ధేశించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. ఫలితంగా టీమిండియా 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకుముందు టీ20 సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో చేజిక్కించుకుంది. చదవండి: విండీస్తో టి20 సిరీస్.. కోహ్లి, బుమ్రా ఔట్ -
England Vs India, 2nd ODI: భారత్ జోరును ఆపతరమా!
బర్మింగ్హామ్ టెస్టు ఫలితం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఊహించి ఉండకపోవచ్చు తాము టి20 సిరీస్ కోల్పోతామని...ఊహించకపోవచ్చు తొలి వన్డేలో ఇంత ఘోరంగా ఓడతామని...బుమ్రా స్వింగ్ బౌలింగ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని అంచనా వేసి ఉండకపోవచ్చు...కానీ ఇప్పుడు వారికి టీమిండియా అసలు సత్తా ఏమిటో తెలిసొచ్చింది. మరో వైపు భారత బృందం ఆత్మవిశ్వాసం అంబరాన ఉంది. టి20ల్లాగే ఇక్కడా రెండో పోరులోనే సిరీస్ను గెలుచుకొని పైచేయి సాధించాలని పట్టుదలగా ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ఇదే లార్డ్స్ మైదానంలో వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ స్ఫూర్తితో ప్రస్తుతానికి సిరీస్ కాపాడుకోగలదా చూడాలి. లండన్: ఏకపక్షంగా సాగిన మొదటి పోరు తర్వాత భారత్, ఇంగ్లండ్ తర్వాతి సమరానికి సన్నద్ధమయ్యాయి. గురువారం జరిగే రెండో వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. భారత్ తమ జోరు కొనసాగిస్తే 2–0తో సిరీస్ సొంతమవుతుంది. ఇంగ్లండ్ కోలుకోగలిగితే సిరీస్ ఫలితం ఆదివారానికి మారుతుంది. భారత్ అన్ని రంగాల్లో బలంగా కనిపిస్తున్నా...సొంతగడ్డపై ఒకే మ్యాచ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ను తక్కువగా అంచనా వేయడం సరైంది కాదు. మార్పుల్లేకుండా... గెలిచిన జట్టును మార్చేందుకు సహజంగా ఏ జట్టూ ఇష్టపడదు. భారత్ కూడా తాజా మ్యాచ్ విషయంలో అదే తరహాలో తుది జట్టును ఎంపిక చేయవచ్చు. గజ్జల్లో గాయంతో తొలి వన్డే ఆడని విరాట్ కోహ్లి కోలుకున్నాడా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అతను ఈ మ్యాచ్కూ దూరమయ్యే అవకాశాలే ఎక్కువ. దాంతో మార్పుల అవసరం కూడా ఉండకపోవచ్చు. బౌలింగ్లో బుమ్రా, షమీ మరోసారి ప్రధానాస్త్రాలుగా ప్రత్యర్థిపై చెలరేగడం ఖాయం. ప్రసిధ్ కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు. కాబట్టి యువ పేసర్ అర్ష్దీప్ అరంగేట్రానికి ఎదురు చూడాల్సి ఉంటుంది. నాలుగో పేసర్గా పాండ్యా రూపంలో భారత్కు చక్కటి ప్రత్యామ్నాయం ఉంది. ఓవల్ మ్యాచ్లో చహల్ 2 ఓవర్లే వేయగా, జడేజా బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. ఈ సారి అవసరమైతే వీరంతా సత్తా చాటాల్సి ఉంది. స్వల్ప లక్ష్యమే అయినా రోహిత్ మెరుపు బ్యాటింగ్ హైలైట్గా నిలిచింది. ధావన్ తన ఇన్నేళ్ల శైలికి భిన్నంగా బాగా నెమ్మదిగా ఆడటం కొంత ఆశ్చర్యపరిచే అంశమే అయినా...ఈ మ్యాచ్లో అతను దూకుడు పెంచాలి. శ్రేయస్, సూర్యకుమార్, పంత్లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. హార్దిక్, జడేజా కూడా భారీ స్కోరులో కీలక పాత్ర పోషించగలరు. మొత్తంగా చూస్తే ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్రను సమర్థంగా పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్లర్కు పరీక్ష... టాప్–6లో నలుగురు డకౌట్! వన్డేల్లో ఐదు వందలుకు చేరువగా టాప్–3 స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టునుంచి ఇలాంటి ప్రదర్శన ఆశ్చర్యం కలిగించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు నమోదు చేయడం, ఆపై ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం...ఇన్నేళ్లుగా ఆ జట్టు అదే తరహాలో విధ్వంసం కొనసాగిస్తోంది. అయితే పిచ్ కాస్త బౌలింగ్కు అనుకూలంగా మారగానే తొలుత బ్యాటింగ్ చేసి కూడా జట్టు కుప్పకూలింది. ఆ ప్రదర్శన ఒకే మ్యాచ్కే పరిమితమని ఇంగ్లండ్ నిరూపించాల్సి ఉంది. చాలా కాలంగా విఫలమవుతున్న రాయ్పై అదనపు ఒత్తిడి ఉండగా, మరో ఓపెనర్ బెయిర్స్టో చెలరేగగలడా చూడాలి. మిడిలార్డర్లో రూట్, స్టోక్స్ ఎంత బాధ్యతగా ఆడతారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అన్నింటికి మించి బట్లర్ పాత్ర కీలకం. బ్యాటర్గా ఘనమైన రికార్డు ఉన్న అతను రెగ్యులర్ కెప్టెన్గా తొలి టి20 సిరీస్లో తడబడ్డాడు. సిరీస్ కోల్పోవడంతో పాటు బ్యాటింగ్లోనూ విఫలమయ్యాడు. మొదటి వన్డేలో కూడా ఓటమి పక్షాన నిలిచిన బట్లర్ ఈ మ్యాచ్లో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ తన సామర్థ్యం నిరూపించుకోవాల్సి ఉంది. కనీస అనుభవం లేని పేస్ బౌలర్లు ఇంగ్లండ్ బలహీనతగా మారారు. విల్లీ, టాప్లీ, ఒవర్టన్, కార్స్లు బలమైన టీమిండియా లైనప్ను నిలువరించడం అంత సులువు కాదు. ఒవర్టన్ స్థానంలో ఆల్రౌండర్ స్యామ్ కరన్కు అవకాశం దక్కవచ్చు. పిచ్, వాతావరణం చక్కటి బ్యాటింగ్ పిచ్, భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్కు వర్షం సమస్య లేదు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, హార్దిక్, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిధ్, చహల్. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), రాయ్, బెయిర్స్టో, రూట్, స్టోక్స్, లివింగ్స్టోన్, అలీ, విల్లీ, కార్స్, టాప్లీ, ఒవర్టన్/స్యామ్ కరన్. -
IPL 2022: రఫ్ఫాడించిన రబాడ.. పట్టలేని ఆనందంలో పంజాబ్
Kagiso Rabada: రబాడ (5/39) ఐదు వికెట్లతో రఫ్ఫాడించడంతో బంగ్లాదేశ్తో ఇవాళ(మార్చి 20) జరిగిన రెండో వన్డేలో ఆతిధ్య ప్రోటీస్ జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో సఫారీలు 3 మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసుకోవడంతో పాటు తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్నారు. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్.. సఫారీ జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించగా, ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో పర్యాటక జట్టుపై రివెంజ్ విక్టరీ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు రబాడ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయగా, డికాక్ (62), కైల్ వెర్రిన్ (58 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో సఫారీ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు అఫీఫ్ హోసేన్ (107 బంతుల్లో 77; 9 ఫోర్లు) ఒంటరి పోరటాం చేయడంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో వన్డే బుధవారం (మార్చి 23) జరగనుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రబాడ భీకరమైన బంతులతో ప్రత్యర్ధులను గడగడలాడించడంతో అతని ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ ఆనందంలో మునిగి తేలుతుంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో రబాడను పంజాబ్ ఏకంగా రూ. 9. 25 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, రబాడ, ఎంగిడి, డస్సెన్, మార్క్రమ్ సహా పలువురు సౌతాఫ్రికా క్రికెటర్లు స్వదేశంలో బంగ్లాదేశ్తో జరగాల్సిన టెస్ట్ సిరీస్కు డుమ్మా కొట్టి ఐపీఎల్ ఆడేందుకు పయనమవుతున్నారు. చదవండి: హిట్టర్లలతో సిద్దమైన పంజాబ్.. పూర్తి జట్టు ఇదే A great catch from Janneman Malan to ensure @KagisoRabada25 five-wicket haul🖐️ #SAvBAN #BetwayPinkODI #BePartOfIt | @Betway_za pic.twitter.com/hlYxZDjyPN — Cricket South Africa (@OfficialCSA) March 20, 2022 -
IND vs WI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
అహ్మదాబాద్: పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్ చేసింది 237 పరుగులే. కాస్త జాగ్రత్తగా ఆడినా వెస్టిండీస్ ఈ లక్ష్యాన్ని ఛేదించవచ్చు. కానీ భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. చక్కటి బౌలింగ్తో విండీస్ను కట్టి పడేశారు. తక్కువ స్కోరును కూడా కాపాడుకుంటూ సిరీస్ను గెలిపించారు. విండీస్ గత మ్యాచ్లాగే మరోసారి పేలవ బ్యాటింగ్తో చేతులెత్తేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 44 పరుగుల తేడాతో విండీస్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2–0తో గెలుచుకోగా, రేపు చివరి వన్డే జరుగుతుంది. కోహ్లి మళ్లీ విఫలం... వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్కు దూరమైన రాహుల్కు జట్టులో చోటు దక్కడంతో ఇషాన్ కిషన్ను పక్కన పెట్టిన భారత్, ప్రయోగాత్మకంగా రిషభ్ పంత్తో కెరీర్లో తొలిసారి ఓపెనింగ్ చేయించింది. అయితే కీమర్ రోచ్ తన రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ (5)ను అవుట్ చేసి భారత్ను దెబ్బ తీయగా... పంత్ (18) ఆశించిన స్థాయిలో దూకుడు కనబర్చలేక తడబడుతూ ఆడాడు. గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్న పొలార్డ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఒడెన్ స్మిత్ ఒకే ఓవర్లో పంత్తో పాటు కోహ్లి (18)ని కూడా అవుట్ చేశాడు. ఈ దశలో రాహుల్, సూర్యకుమార్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. 4 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను కీపర్ హోప్ వదిలేయడం కూడా భారత్కు కలిసొచ్చింది. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో పరుగులు సాధించారు. నాలుగో వికెట్కు 91 పరుగులు జోడించిన అనంతరం రనౌట్తో ఈ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత 70 బంతుల్లో సూర్యకుమార్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య వెనుదిరిగిన తర్వాత చివర్లో దీపక్ హుడా (29), సుందర్ (24) కొన్ని కీలక పరుగులు జత చేశారు. చివరి పది ఓవర్లలో భారత్ 54 పరుగులే చేయగలిగింది. టపటపా... ఛేదనను విండీస్ సానుకూలంగానే ప్రారంభించినా... ప్రసిధ్ ఆ జట్టు పతనానికి శ్రీకారం చుట్టాడు. తన వరుస ఓవర్లలో అతను బ్రండన్ కింగ్ (18), డారెన్ బ్రేవో (1)లను అవుట్ చేశాడు. ఆ తర్వాత షై హోప్ (27)ను చహల్ పెవిలియన్ పంపించగా... పది పరుగుల వ్యవధిలో పూరన్ (9), హోల్డర్ (2) వెనుదిరగడంతో విండీస్ పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి వరకు చక్కగా బ్యాటింగ్ చేసిన బ్రూక్స్ను దీపక్ హుడా తన తొలి అంతర్జాతీయ వికెట్గా అవుట్ చేయడంతో విండీస్ వేగంగా ఓటమి వైపు దూసుకుపోయింది. చివర్లో హొసీన్ (52 బంతుల్లో 34; 3 ఫోర్లు), స్మిత్ (24) కొంత పోరాడినా అది విజయానికి సరిపోలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) హోప్ (బి) రోచ్ 5; పంత్ (సి) హోల్డర్ (బి) స్మిత్ 18; కోహ్లి (సి) హోప్ (బి) స్మిత్ 18; రాహుల్ (రనౌట్) 49; సూర్య కుమార్ (సి) జోసెఫ్ (బి) అలెన్ 64; సుందర్ (సి) జోసెఫ్ (బి) హొసీన్ 24; హుడా (సి) హొసీన్ (బి) హోల్డర్ 29; శార్దుల్ (సి) బ్రూక్స్ (బి) జోసెఫ్ 8; సిరాజ్ (సి) హోప్ (బి) జోసెఫ్ 3; చహల్ (నాటౌ ట్) 11; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–9, 2–39, 3–43, 4–134, 5–177, 6–192, 7–212, 8–224, 9–226. బౌలింగ్: రోచ్ 8–0–42–1, జోసెఫ్ 10–0–36–2, ఒడెన్ స్మిత్ 7–0–29–2, హోల్డర్ 9–2–37–1, హొసీన్ 6–0–39–1, అలెన్ 10–0–50–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హోప్ (సి) సూర్యకుమార్ (బి) చహల్ 27; కింగ్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 18; బ్రేవో (సి) పంత్ (బి) ప్రసిధ్ 1; బ్రూక్స్ (సి) సూర్యకుమార్ (బి) హుడా 44; పూరన్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 9; హోల్డర్ (సి) హుడా (బి) శార్దుల్ 2; హొసీన్ (సి) పంత్ (బి) శార్దుల్ 34; అలెన్ (సి) పంత్ (బి) సిరాజ్ 13; ఒడెన్ స్మిత్ (సి) కోహ్లి (బి) సుందర్ 24; జోసెఫ్ (నాటౌట్) 7; రోచ్ (ఎల్బీ) (బి) ప్రసిధ్ 0; ఎక్స్ట్రాలు 14; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1–32, 2– 38, 3–52, 4–66, 5–76, 6–117, 7–159, 8– 159, 9–193, 10–193. బౌలింగ్: సిరాజ్ 9–1– 38–1, శార్దుల్ 9–1–41–2, ప్రసిధ్ కృష్ణ 9–3– 12–4, చహల్ 10–0–45–1, సుందర్ 5–0–28–1, హుడా 4–0–24–1. -
IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు
Under 19 World Cup Winners Spotted At Narendra Modi Stadium: భారత్-విండీస్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేకు ప్రత్యేక అతిధులు వచ్చారు. అండర్-19 ప్రపంచకప్ విజేతలైన యువ భారత జట్టు సభ్యులు బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. సీనియర్ల ఆటను వీక్షించేందుకు బీసీసీఐ వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. జగజ్జేతలతో పాటు జట్టు కోచ్ హృషికేశ్ కనిత్కర్, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, బీసీసీఐ కార్యదర్శి జై షాలు స్టేడియంలో కాసేపు మ్యాచ్ను ఎంజాయ్ చేశారు. We all are in Ahemdabad 😊 |U-19 players 🇮🇳 #BoysInBlue #ICCUnder19WorldCup #IndianCricketTeam #INDvWI pic.twitter.com/COR14eCBaM — Harnoor Singh 🇮🇳 (@HarnoorSingh40) February 9, 2022 టీమిండియా బ్యాటింగ్ సమయంలో బౌండరీలు వచ్చినప్పుడు వీరు జాతీయ పతాకాన్ని ఊపుతూ ఉత్సాహంగా కనిపించారు. అనంతరం బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రపంచకప్ విజేతలైన యంగ్ ఇండియా సభ్యులకు బీసీసీఐ సన్మానం చేసింది. కాగా, ఆంటిగ్వా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో యశ్ ధుల్ నేతృత్వంలోని యంగ్ ఇండియా.. 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను మట్టికరిపించి ఐదో సారి జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, విండీస్తో రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్లు తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో విండీస్ తడబడుతుంది. 38 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 156 పరుగలు చేసింది. విండీస్ గెలుపుకు 72 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: 9.25 కోట్లు వెచ్చించారు.. కానీ, ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..! -
IND VS WI 2nd ODI: సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు.. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
విండీస్తో జరిగిన రెండో వన్డేలో 83 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఆరు మ్యాచ్ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్గా వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు. గతంలో నెదర్లాండ్స్ ఆటగాళ్లు ర్యాన్ టెన్ డస్కటే, టామ్ కూపర్, పాకిస్థాన్ ఆటగాడు ఫఖర్ జమాన్లు తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్ల్లో 30కి అదనంగా పరుగులు చేశారు. తాజాగా సూర్యకుమార్ వీరిని అధిగమించి ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్.. 65.25 సగటున 261 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, విండీస్తో రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(64), కేఎల్ రాహుల్(49) రాణించగా.. మిగతా భారత ఆటగాళ్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, ఓడియన్ స్మిత్ చెరో 2 వికెట్లు, కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, అకీల్ హొసేన్, ఫేబియన్ అలెన్లు తలో వికెట్ పడగొట్టారు. చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు -
విండీస్తో రెండో వన్డే.. విరాట్ కోహ్లి ఖాతాలో మరో సెంచరీ..!
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగులు సాధించినా, సాధించకపోయినా రికార్డులు మాత్రం అతని ఖాతాలో వాటంతట అవే వచ్చి చేరుతుంటాయి. విండీస్తో రేపు జరగబోయే రెండో వన్డేలో కోహ్లి ఖాతాలో ఇలాంటి ఓ అరుదైన రికార్డే వచ్చి చేరబోతోంది. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి సెంచరీ సాధించి రెండేళ్లకుపైగానే అవుతుంది. అయితే రేపటి మ్యాచ్లో అతని సెంచరీ దాహం తీరనుంది. అదెట్టా అనుకుంటున్నారా..? ఇది చదవండి. విండీస్తో అహ్మదాబాద్ వేదికగా రేపు జరగబోయే రెండో వన్డే, విరాట్ కోహ్లికి స్వదేశంలో 100వ వన్డే మ్యాచ్ కానుంది. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 258 మ్యాచ్లు ఆడిన రన్ మెషీన్.. స్వదేశంలో 99 వన్డే మ్యాచ్లు ఆడాడు. క్రికెట్ చరిత్రలో ఇలా స్వదేశాల్లో 100 వన్డేలు ఆడిన ఆటగాళ్లు కోహ్లి కంటే ముందు 35 మంది మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా నుంచి సచిన్ టెండూల్కర్(164), ఎంఎస్ ధోని(127), అజహారుద్దీన్(113), యువరాజ్ సింగ్(108)లు ఉన్నారు. రేపటి మ్యాచ్లో కోహ్లి వీరి సరసన చేరనున్నాడు. ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా.. పరోక్షంగా అతని ఖాతాలో మరో సెంచరీ చేరడం ఖాయం. ఇదిలా ఉంటే, కోహ్లి స్వదేశంలో ఆడిన 99 మ్యాచ్ల్లో 60 సగటుతో 5002 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, విండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), ప్రసిద్ద్ కృష్ణ(2/29), సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ 176 పరుగుల స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు)తో కలిసి మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి కేవలం 8 పరుగులకే పరిమితమైనప్పటికీ.. సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు. స్వదేశంలో 5 వేలకు పైగా వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు. చదవండి: క్రికెటర్ల సంఖ్యను ప్రకటించిన బీసీసీఐ.. జట్టులో కనీసం..! -
కోవిడ్ నుంచి కోలుకున్న టీమిండియా ఆటగాళ్లు.. రెండో వన్డేకు అతడు దూరమేనా..!
విండీస్తో తొలి వన్డేకు ముందు కరోనా బారిన పడిన నలుగురు టీమిండియా ఆటగాళ్లలో ముగ్గురు కోలుకున్నారు. నిన్న జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, రిజర్వ్ ఆటగాడు నవ్దీప్ సైనీలకు నెగిటివ్ వచ్చిందని, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్లో మాత్రం ఇంకా స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. కోవిడ్ నుంచి కోలుకున్న ముగ్గురు తొలి వన్డేకు దూరమైన కేఎల్ రాహుల్తో కలిసి ఇవాళ జరిగిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అయితే, వీరిలో రాహుల్ను మినహాయించి మిగతా ముగ్గురు రెండో వన్డే ఆడటం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ వీరు వైద్య బృందం పర్యవేక్షణలో ఉండనుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రాహుల్ గైర్హాజరీలో తొలి వన్డేలో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసిన యువ ఆటగాడు ఇషాన్ కిషన్ రెండో వన్డేకు బెంచ్కే పరిమితం కానున్నాడు. టీమిండియాలో ఈ ఒక్క మార్పు మినహా తొలి వన్డే బరిలో దిగే జట్టే యధాతథంగా కొనసాగే అవకాశం ఉంది. తొలి వన్డేలో మిడిలార్డర్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, దీపక్ హూడాలు పర్వాలేదనిపించడంతో ఇషాన్ కిషన్తో పాటు షారూక్ ఖాన్, మయాంక్ అగర్వాల్లు మరో అవకాశం కోసం వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే, ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), ప్రసిద్ద్ కృష్ణ(2/29), సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ 176 పరుగుల స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. చదవండి: కోహ్లిని మరోసారి అవమానించిన బీసీసీఐ.. 100వ టెస్ట్ యధాతథంగా..! -
IND VS WI: రెండో వన్డేకు కేఎల్ రాహుల్ సహా కీలక ఆటగాళ్లు రెడీ..
వ్యక్తిగత కారణాల చేత వెస్టిండీస్తో తొలి వన్డేకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. రెండో వన్డేకు రెడీ అయ్యాడు. అతనితో పాటు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, నవ్దీప్ సైనీలు సోమవారం అహ్మదాబాద్లోని టీమిండియా క్యాంపులో చేరారు. బుధవారం జరగనున్న రెండో వన్డే కోసం ఈ ముగ్గురు ప్రత్యేకంగా నెట్స్లో చెమటోడ్చారు. ‘ఎవరొచ్చారో చూడండి.. ఈ ముగ్గురు జట్టుతో చేరారు. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చారు’ అని బీసీసీఐ ఈ ముగ్గురి ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. బీసీసీఐ ప్రత్యేకంగా ఈ ముగ్గురి ఫోటోలను షేర్ చేయడం బట్టి చూస్తే, రెండో వన్డేలో వీరు తుది జట్టులో ఉండటం ఖాయంగా తెలుస్తోంది. Look who are here! 🙌 The trio has joined the squad and sweated it out in the practice session today. 💪#TeamIndia | #INDvWI | @Paytm pic.twitter.com/Nb9Gmkx98f — BCCI (@BCCI) February 7, 2022 కాగా, విండీస్తో తొలి వన్డేకు ముందు శిఖర్ ధవన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, బ్యాకప్ ప్లేయర్ సైనీలతో పాటు నలుగురు సహాయక సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో సైనీ ఐసోలేషన్ పూర్తి చేసుకుని జట్టుతో చేరగా.. ధవన్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్ మూడు రోజుల క్వారంటైన్ ముగించుకుని గ్రౌండ్లో అడుగుపెట్టాడు. ఇదిలా ఉంటే, ఆదివారం వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా తమ 1000వ వన్డేలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్ధిని 176 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్(4/49), వాషింగ్టన్ సుందర్(3/30), పేసర్లు ప్రసిద్ద్ కృష్ణ(2/29), మహ్మద్ సిరాజ్(1/26) చెలరేగడంతో విండీస్ స్వల్ప స్కోర్కే కుప్పకూలింది. జేసన్ హోల్డర్(71 బంతుల్లో 57; 4 సిక్సర్లు) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఛేదనలో రోహిత్ శర్మ(60), ఇషాన్ కిషన్(28) తొలి వికెట్కు 84 పరుగులు జోడించి టీమిండియా గెలుపుకు పునాది వేయగా, ఆఖర్లో సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 34; 5 ఫోర్లు), దీపక్ హూడా(32 బంతుల్లో 26; 2 ఫోర్లు) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. కోహ్లి(8), పంత్(11) మరోసారి నిరుత్సాహపరిచారు. చదవండి: స్వదేశంలో యశ్ ధుల్ సేనకు ఘన స్వాగతం.. ఉబ్బి తబ్బిబ్బయిన యువ క్రికెటర్లు -
చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా?
కేప్టౌన్: అలసిన శరీరాలు, పరుగులో తగ్గిన చురుకుదనం, మైదానంలో ఏమాత్రం కనిపించని ఉత్సాహం... శుక్రవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఓటమి దిశగా వెళుతున్న సమయంలో భారత ఆటగాళ్ల పరిస్థితి ఇది! దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టినప్పుడు, ఆ తర్వాత తొలి టెస్టులో ఘన విజయం సాధించినప్పుడు చూస్తే టీమిండియా సభ్యుల్లో ఆకాశాన్ని తాకిన ఆత్మవిశ్వాసం, అమితోత్సాహం కనిపించాయి. ఇక పర్యటన చివరకు వచ్చే సరికి అంతా మారిపోయింది. ఎప్పుడు సిరీస్ ముగించి స్వదేశం వెళదామా అన్నట్లుగా కనిపిస్తోంది. బయో బబుల్ ఒక కారణం కాగా...ఫేవరెట్గా బరిలోకి దిగి అనూహ్యంగా ఎదురైన పరాజయాలు భారత ఆటగాళ్లను నిస్సత్తువగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో నేడు దక్షిణాఫ్రికాతో మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన భారత్ చివరిదైన ఈ మూడో మ్యాచ్లోనైనా తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఒక విజయాన్ని నమోదు చేస్తుందా లేక ఓటమితో టూర్ను ముగిస్తుందా అనేది చూడాలి. రెండు వన్డేల్లోనూ కెప్టెన్గా కేఎల్ రాహుల్ ఏమాత్రం ఆకట్టుకోకపోగా...హెడ్ కోచ్గా ప్రధాన ఆటగాళ్లతో తొలి పర్యటనలోనే రాహుల్ ద్రవిడ్కు కూడా సంతృప్తికర ఫలితం దక్కలేదు. చివరి మ్యాచ్లో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగవచ్చు. ప్రధాన పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో సిరాజ్ను ఆడించే అవకాశం ఉండగా... రెండు మ్యాచ్లలోనూ ఘోరంగా విఫలమైన భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్ను, వెంకటేశ్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను తీసుకునే చాన్స్ ఉంది. -
టీమిండియాపై గెలుపు.. సంబరాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు అక్షింతలు
South Africa Fined For Slow Over Rate In 2nd ODI Vs India: టీమిండియాపై 2-0 తేడా వన్డే సిరీస్ గెలుపొందిన దక్షిణాఫ్రికాకు.. గెలుపు సంబరాల నుంచి తెరుకునే లోపే గట్టి షాక్ తగిలింది. రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్లో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ శనివారం ప్రకటన విడుదల చేశాడు. నిర్ణీత సమయంలోగా ఓ ఓవర్ తక్కువగా బౌల్ చేసినందుకు బవుమా సేనకు ఫైన్ విధిస్తున్నట్లు పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు. కాగా, టీమిండియాతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ దక్షిణాఫ్రికానే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్రొటీస్ సేన 31 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కూడా ఆతిధ్య జట్టే 2-1తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్లూ పాయే..! -
పటిష్టంగా కనిపించినా..రెండు సిరీస్లూ పాయే..!
దక్షిణాఫ్రికా గడ్డపై అడుగు పెట్టే ముందు రెండు ఫార్మాట్లలోనూ విజేతగా నిలిచేలా పటిష్టంగా కనిపించిన భారత జట్టు చివరకు పేలవ ప్రదర్శనతో రెండు సిరీస్లూ కోల్పోయింది. టెస్టు సిరీస్ను 1–2తో చేజార్చుకున్న టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్నూ అప్పగించింది. తొలి పోరుకు దాదాపు రీప్లేలా కనిపించిన రెండో వన్డేలోనూ భారత బృందం సునాయాసంగా తలవంచింది. పంత్ మినహా పసలేని బ్యాటింగ్తో ముందుగా సాధారణ స్కోరుకే పరిమితం కాగా... ఆపై బౌలింగ్ పూర్తిగా నిరాశపరచింది. పేలవ ఆటతో ఒకదశలో వికెట్ తీయడమే గగనంగా మారిపోయింది. డి కాక్, మలాన్ జోరైన ఆటతో దక్షిణాఫ్రికా జట్టును గెలిపించారు. పార్ల్: భారత్తో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ను 2–0తో గెలుచుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (71 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ (79 బంతుల్లో 55; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం దక్షిణాఫ్రికా 48.1 ఓవర్లలో 3 వికెట్లకు 288 పరుగులు చేసి గెలిచింది. జేన్మన్ మలాన్ (108 బంతుల్లో 91; 8 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డి కాక్ (66 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్స్లు) తొలి వికెట్కు 132 పరుగులు జోడించారు. చివరి మ్యాచ్ ఆదివారం కేప్టౌన్లో జరుగుతుంది. శతక భాగస్వామ్యం... తొలి వన్డేతో పోలిస్తే ఈసారి భారత్కు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. రాహుల్, శిఖర్ ధావన్ (38 బంతుల్లో 29; 5 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 57 పరుగులకు చేరింది. 8 పరుగుల వద్ద మలాన్ క్యాచ్ వదిలేయడంతో రాహుల్ బతికిపోయాడు. అయితే ధావన్ను అవుట్ చేసి మార్క్రమ్ 63 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీయగా... కేశవ్ మహరాజ్ వేసిన తర్వాతి ఓవర్లోనే కవర్స్లో సునాయాస క్యాచ్ ఇచ్చి విరాట్ కోహ్లి (0) డకౌటయ్యాడు. ఈ దశలో రాహుల్, పంత్ సెంచరీ పార్ట్నర్షిప్ జట్టును నడిపించింది. పంత్ దూకుడు పెంచి షమ్సీ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టడంతో 43 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. 46 పరుగుల వద్ద మార్క్రమ్ క్యాచ్ వదిలేయడంతో మళ్లీ ‘లైఫ్’ లభించిన రాహుల్ ఆ తర్వాత 71 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 31 ఓవర్లు ముగిసేసరికి 179/2తో భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. అయితే మూడో వికెట్కు 115 పరుగులు జోడించిన రాహుల్, పంత్లను వరుస ఓవర్లలో అవుట్ చేసిన సఫారీ బౌలర్లు... శ్రేయస్ అయ్యర్ (11)ను కూడా వెనక్కి పంపి మళ్లీ పట్టు బిగించారు. వెంకటేశ్ అయ్యర్ (22) కీలక పరుగులు జోడించగా... చివర్లో శార్దుల్ ఠాకూర్ (38 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (24 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడి ఏడో వికెట్గా అభేద్యంగా 37 బంతుల్లోనే 48 పరుగులు జత చేయడంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. ఓపెనర్ల జోరు... ఛేదనలో ఓపెనర్లు అందించిన భారీ భాగస్వామ్యమే దక్షిణాఫ్రికా విజయానికి బాటలు వేసింది. మలాన్, డి కాక్ పోటీ పడి పరుగులు సాధించడంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. భువనేశ్వర్ తొలి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన డి కాక్ ఇతర భారత బౌలర్లను కూడా సమర్థంగా ఎదుర్కొన్నాడు. పది ఓవర్లు ముగిసేసరికి సఫారీ టీమ్ 66 పరుగులు చేయగా, ఆ తర్వాత 36 బంతుల్లోనే డి కాక్ అర్ధ సెంచరీ పూర్తయింది. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు డి కాక్ను అవుట్ చేసి శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. అనంతరం బవుమా (36 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా మలాన్కు చక్కటి సహకారం అందించడంతో రెండో వికెట్కు 80 పరుగుల పార్ట్నర్షిప్ నమోదైంది. వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరినా... మార్క్రమ్ (37 నాటౌట్; 4 ఫోర్లు), డసెన్ (37 నాటౌట్; 2 ఫోర్లు) ఇబ్బంది లేకుండా ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) డసెన్ (బి) మగాలా 55; ధావన్ (సి) మగాలా (బి) మార్క్రమ్ 29; కోహ్లి (సి) బవుమా (బి) మహరాజ్ 0; పంత్ (సి) మార్క్రమ్ (బి) షమ్సీ 85; శ్రేయస్ (ఎల్బీ) (బి) షమ్సీ 11; వెంకటేశ్ (స్టంప్డ్) డి కాక్ (బి) ఫెలుక్వాయో 22; శార్దుల్ (నాటౌట్) 40; అశ్విన్ (నాటౌట్) 25; ఎక్స్ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 287. వికెట్ల పతనం: 1–63, 2–64, 3–179, 4–183, 5–207, 6–239. బౌలింగ్: ఎన్గిడి 8–0–35–0, మగాలా 8–0–64–1, మార్క్రమ్ 8–0–34–1, కేశవ్ మహరాజ్ 9–0–52–1, ఫెలుక్వాయో 8–0–44–1, షమ్సీ 9–0–57–2. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: మలాన్ (బి) బుమ్రా 91; డి కాక్ (ఎల్బీ) (బి) శార్దుల్ 78; బవుమా (సి అండ్ బి) చహల్ 35; మార్క్రమ్ (నాటౌట్) 37; డసెన్ (నాటౌట్) 37; ఎక్స్ట్రాలు 10; మొత్తం (48.1 ఓవర్లలో 3 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–132, 2–212, 3–214. బౌలింగ్: బుమ్రా 10–0–37–1, భువనేశ్వర్ 8–0–67–0, అశ్విన్ 10–1–68–0, చహల్ 10–0–47–1, శార్దుల్ 5–0–35–1, వెంకటేశ్ 5–0–28–0, శ్రేయస్ 0.1–0–1–0. -
వసీం జాఫర్ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం
మస్కట్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఒమన్తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్ బౌలర్లలో మహ్మద్ నదీమ్ 4, నెసట్ర్ దంబా 2, కలీముల్లా, ఆకిబ్ ఇలియాస్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ముంబై బౌలర్లు మోహిత్ అవస్థి (4/31), ధుర్మిల్ మట్కర్ (3/21), దీపక్ షెట్టి (2/9), అమాన్ ఖాన్(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్లో మహ్మద్ నదీమ్(35) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్ 2న జరుగనుంది. చదవండి:క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ బౌలర్.. -
టాస్ వేశాక మ్యాచ్ వాయిదా పడింది.. కారణం ఏంటంటే..?
సెయింట్ లూసియా: వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరగాల్సిన రెండో వన్డే మ్యాచ్ వాయిదా పడింది. అయితే ఈ మ్యాచ్ టాస్ వేశాక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం గమనార్హం. ఇలా జరగడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఆసీస్, విండీస్ జట్ల మధ్య రెండో మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇరు జట్ల కెప్టెన్లు టాస్కు కూడా వెళ్లారు. టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ అలెక్స్ క్యారీ బ్యాటింగ్ ఎంచుకున్నట్లు ప్రకటించాడు. అనంతరం విశ్లేషకుడు డారెన్ గంగా పిచ్ రిపోర్టు కూడా చెప్పాడు. ఆసీస్ ఓపెనర్లు బరిలోకి దిగేందుకు రెడీగా ఉన్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు రిఫరీ ప్రకటించాడు. ఆటగాళ్లంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఏం జరిగిందా అని ఆరా తీయగా వెస్టిండీస్ జట్టు సిబ్బంది ఒకరికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో రెండు జట్లలోని ఆటగాళ్లకు మరోసారి కరోనా టెస్ట్లు నిర్వహించారు. ఈ మ్యాచ్ మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది తర్వాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బయో బబుల్లో ఉన్న ఇరు జట్లను ఐసోలేషన్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆటగాళ్లకు సంబంధించిన తాజా కోవిడ్ రిపోర్టులు వెల్లడి కావాల్సి ఉండటంతో రేపటి మూడో వన్డే సైతం వాయిదా పడినట్టేనని అధికారులు తెలిపారు. -
India Vs Srilanka: ప్రయోగాలు చేస్తారా!
కొలంబో: బౌలర్ దీపక్ చహర్ అసమాన బ్యాటింగ్తో రెండో వన్డేలో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. రెండు రోజుల విరామం అనంతరం శ్రీలంకతో సిరీస్లో చివరిదైన మూడో వన్డేకు శిఖర్ ధావన్ బృందం సిద్ధమైంది. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ యోచిస్తోంది. మరోవైపు ఆఖరి పోరులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని లంక పట్టుదలగా ఉంది. మార్పులు ఉంటాయా! ఇప్పటికే సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంతో చివరి వన్డేలో రిజర్వ్ బెంచ్ను పరీక్షించేందుకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా జరిగితే టీమిండియాలో పలు మార్పులు చోటు చేసుకోవచ్చు. పృథ్వీ షా స్థానంలో మరో యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్థానంలో సంజూ సామ్సన్ కూడా తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. సిరీస్లో విశేషంగా రాణిస్తో న్న స్పిన్ ద్వయం కుల్దీప్, చహల్లకు విశ్రాంతి ఇచ్చి రాహుల్ చహర్, కృష్ణప్ప గౌతమ్లను ఆడించొచ్చు. అంతేకాకుండా భారత్ తన లోపాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. రెండో వన్డేలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా... సూర్య కుమార్, మనీశ్ పాండేలు జట్టును ఆదుకున్నారు. చివర్లో దీపక్ చహర్, భువనేశ్వర్ ఆడకుండా ఉంటే భారత్కు ఓటమి తప్పేదికాదు. వీటితో పాటు డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుం టున్నారు. ఈ సమస్యలను అధిగమిస్తే మూడో వన్డేలో భారత్కు విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరోవైపు రెండో వన్డేలో అంచనాలకు మించి ఆడిన లంకేయులు ఒక దశలో మ్యాచ్ను గెలిచేలా కనిపించారు. దీపక్, భువనేశ్వర్ల భాగస్వామ్యం ఆ జట్టుకు గెలుపును దూరం చేసింది. ఈ సిరీస్ ద్వారా శ్రీలంక జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదని తేలింది. వీరు అనుభవం గడిస్తే శ్రీలంక జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, అసలంక, కెప్టెన్ దసున్ షనక, కరుణరత్నే, హసరంగ ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తున్నారు. వీరందరూ చివరి వన్డేలోనూ ఆడితే భారత్కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీలంక జట్టుకు జరిమానా రెండో వన్డేలో స్లో ఓవర్రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలే శ్రీలంక ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించారు. అంతేకాకుండా ఈ సిరీస్ ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్లో భాగం కావడంతో శ్రీలంక జట్టుకు ఒక పాయింట్ కోత విధించారు. ఆర్టికల్ 16.12.2 ప్రకారం నిర్ణీత సమయంలోపు ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఓవర్కు పాయింట్ చొప్పున కోత విధిస్తారు.