సిరీస్‌ భారత్‌ ‘ఎ’ సొంతం | victory over Bangladesh in the second ODI | Sakshi
Sakshi News home page

సిరీస్‌ భారత్‌ ‘ఎ’ సొంతం

Dec 6 2017 12:44 AM | Updated on Dec 6 2017 4:21 AM

victory over Bangladesh in the second ODI - Sakshi

హుబ్లీ: బంగ్లాదేశ్‌ మహిళల ‘ఎ’ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌ను భారత ‘ఎ’ జట్టు మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం రెండో వన్డేలో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 195 పరుగులు చేసింది. 196 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 48.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఎన్‌.ఎమ్‌ చౌదరి (56; 9 ఫోర్లు), వనిత (42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడగా... ఆరేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన నేహా తన్వర్‌ (44; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకుంది. రెండు జట్ల మధ్య మూడో వన్డే గురువారం ఇదే స్టేడియంలో జరగనుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement