
సాక్షి, విజయనగరం: ఆంధ్ర బ్యాట్స్మెన్ చెలరేగడంతో ఒడిషాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్లో జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ హనుమ విహారి (248 బంతుల్లో 143 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), డీబీ ప్రశాంత్ (270 బంతుల్లో 127; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు బాదడంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
కేఎస్ భరత్ (3) అవుటైన తర్వాత విహారి, ప్రశాంత్ రెండో వికెట్కు 270 పరుగులు జోడించడం విశేషం. బయటి వేదికపై తొలి రెండు మ్యాచ్ లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆంధ్రకు ఈ సీజన్లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్.
Comments
Please login to add a commentAdd a comment