![12 arriving flights diverted, 30 departing flights delayed in chennai airport - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/13/fog.jpg.webp?itok=Nk7-AGjN)
సాక్షి, చెన్నై : చెన్నై నగరాన్ని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో పొగమంచు భారీగా పేరుకుపోవడంతో అధికారులు.. 12 విమానాలను దారి మళ్లించారు. అలాగే చెన్నై విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన మరో 30 విమానాలు ఆలస్యంగా వెళ్లనున్నాయి. విమానాలు బయలుదేరడానికి కనీసం 400 మీటర్ల మేర విజిబులిటి ఉండాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. అయితే ప్రస్తుతం పొగమంచు కారణంగా 50 మీటర్ల విజిబులిటి మాత్రమే ఉండటంతో విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు...విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. మరోవైపు చెన్నై నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి నాలుగు విమానాలు రావల్సి ఉండగా, వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment