కారు, బైక్ ఢీ: ఇద్దరి మృతి | 2 killed in road accident | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ: ఇద్దరి మృతి

Published Tue, Dec 6 2016 12:20 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

2 killed in road accident

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. సీతారాంపురం స్టేజీకి చెందిన బోడ అనిల్, తూర్పుగూడెం గ్రామానికి చెందిన వీరన్న బైక్‌పై వెళ్తుండగా బోరింగ్‌ తండా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారును స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement