నాందేడ్, న్యూస్లైన్: నాందేడ్లో మంగళవారం 65వ ‘మరాఠ్వాడా ముక్తిసంగ్రామ్ దివస్’ను పురస్కరించుకొని నాందేడ్-వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్వీఎంసీ) ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ అబ్దుల్ సత్తార్ ఉదయం 8.05 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాపరిషత్ అధ్యక్షుడు దిలీప్ పాటిల్, డిప్యూటీ మేయర్ ఆనంద్ చవాన్, స్థాయి సమితి సభాపతి గణపత్ ధబాలే, సభాగృహ నేత వీరేంద్రసింగ్ గాడీవాలే, మహిళా-శిశు సంక్షేమ సమితి సభాపతి డాక్టర్ శీలా కదమ్, కార్పొరేటర్ రామ్నారాయణ్ కాబరా తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ స్థానిక అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.