వాయుగుండంగా మారిన అల్పపీడనం
Published Thu, Nov 3 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖకు 650 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 72 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Advertisement