low intense
-
తప్పిన వాయుగుండం ముప్పు
-
తప్పిన వాయుగుండం ముప్పు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వాసులను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు తొలిగిపోయింది. నిన్న(శనివారం) అర్ధరాత్రి విశాఖకు ఈశాన్యంగా 160 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతోంది. ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
బలపడుతున్న వాయుగుండం
-
బలపడుతున్న వాయుగుండం
విశాఖపట్నం: పశ్చిమ మధ్య, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కోస్తాలో చెదురు మొదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
-
వాయుగుండంగా మారిన అల్పపీడనం
విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి విశాఖకు 650 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 72 గంటల్లో వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా, అనంతరం తుపానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, ఒడిశా తీరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
ఆంధ్రప్రదేశ్కు మరో వాయుగుండం !
-
మరో వాయుగుండం!
రాష్ట్రంలో 4 నుంచి భారీ వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రవేశం సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఇది వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తూ మరింత బలపడవచ్చని దీనిప్రభావం ఈ నెల మూడో తేదీ నుంచి కనిపిస్తుందని వివరించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గడచిన 24 గంటల్లో బెస్తవారిపేటలో 4, మార్కాపురం, ఉరవకొండ, ఆళ్లగడ్డ, పాడేరుల్లో 3, నెల్లూరు, సీతారాంపురం, గూడూరు, కందుకూరుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. కాగా, ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి.