breaking news
Cyclone
-
ఆటపాక కేంద్రంపై 'మోంథా' పంజా
కైకలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా రాష్ట్రంలో పేరు గడించిన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రంపై మోంథా తుపాను విరుచుకుపడింది. ఆహ్లాదాన్ని ఆవిరి చేసింది. అతిథ్యం కోసం విదేశాల నుంచి వస్తున్నా వలస పక్షులను భయపెట్టింది. తుపాను దాటికి గూళ్ళలో పక్షి కూనలు అల్లాడిపోయాయి. దీంతో పక్షుల కేంద్రాన్ని ఆరు రోజులుగా మూసివేశారు. శీతాకాలం వలస పక్షులకు అనువైన కాలం. ఇటువంటి తరుణంలో తుపాను ప్రభావం పక్షులపై పడుతోంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో పక్షుల వీక్షణకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. వేసవి కాలంలో నీరు లేకపోవడం, వర్షాకాలంలో గట్లు కొట్టుకపోవడం పరిపాటిగా మారుతుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు 275 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడకు రావడంతో పెలికాన్ ప్యారడైజ్గా దీనికి నామకరణ చేశారు. కొల్లేరులో దాదాపు 186 రకాల పక్షి జాతులు సంచరిస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. వీటిపై పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి గావిస్తున్నాయి. ప్రస్తుతం 3,500 పెలికాన్ పక్షులు నివసిస్తున్నాయి. సాధారణ సమయంలో ఆటపాక విహార చెరువు 3 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. దీనిని మరింత లోతు చేయాలని ప్రతిపాదనలు పెడుతున్నా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతతో కార్యరూపం దాల్చడం లేదు. మోంథా మోత మోగించింది మోంథా తుపాను కొల్లేరు ప్రక్షుల కేంద్రంపై ప్రభావం చూపింది. ఆటపాక పక్షుల కేంద్రం సమీపంలో పోల్రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) ఉంది. ఇది బుడమేరు, తమ్మిలేరు వంటి ఏరుల నుంచి వచ్చే నీటిని కొల్లేరుకు చేరుస్తుంది. ప్రతి ఏటా డ్రెయిన్ నుంచి ఏర్పరిచిన తూములతో నీటిని పక్షుల కేంద్రానికి నింపుతారు. పక్షుల కేంద్రం, పోల్రాజ్ డ్రెయిన్ గట్టు ఒకటే కావడంతో గట్లు మునిగి నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి వరవడికి పక్షుల కేంద్రం గట్లు పూర్తిగా కోతగా గురయ్యాయి. కేంద్రంలో ఈసీ సెంటర్ ఆవరణలో నీరు చేరింది. నీటి ప్రవాహం తగ్గకపోతే పక్షుల కేంద్రం చెరువు మరింత ప్రమాదంలో పడుతుంది. పట్టించుకోని ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం కొల్లేరు పర్యాటక అభివృద్ధికి పైసా విదల్చడం లేదు. ఇటీవల ప్రకటించిన పర్యాటకాభివృద్ధి ప్రణాళికలో కొల్లేరు అంశమే లేదు. ప్రధానంగా ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధి పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లాలో ప్లేమింగో ఫెస్టివల్ పేరుతో ప్రతి ఏటా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వపరంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్క పర్యాయం పెలికాన్ ఫెస్టివల్ చేసినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఆటపాక పక్షుల కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. -
మోంథా ఎఫెక్ట్: వరంగల్ అతలాకుతలం (ఫోటోలు)
-
Cyclone Montha: ఖమ్మం టౌన్లోకి వస్తున్న వరద నీరు
-
Vidadala: ఇది చిలకలూరిపేట రైతుల పరిస్థితి.. ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే
-
Cyclone Montha: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణపై మహిళా రైతుల ఫైర్
-
Montha Cyclone: వామ్మో....వారంలో మరో పెనుతుఫాను
-
Montha Cyclone: పార్టీ కేడర్ కు దిశానిర్దేశం చేసిన వైఎస్ జగన్
-
సముద్రంలో బంగారం.. బయటపడ్డ అసలు నిజం
-
Montha Cyclone: మొంథా తుఫానుపై వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
Kasu Mahesh Reddy: ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి
-
Montha Cyclone: వైఎస్ జగన్ ఆదేశాలతో సహాయక చర్యల్లో పాల్గొన్న పార్టీ కేడర్
-
ఏపీపై మోంథా పంజా.. అన్నదాత ఆశలను చిదిమేసిన భారీ తుపాను (ఫొటోలు)
-
#CycloneMontha : వరంగల్ ఉమ్మడి జిల్లాలో వర్షబీభత్సం (ఫొటోలు)
-
వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)
-
Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి
-
Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు
-
Montha Cyclone: తాగడానికి నీళ్లు కూడా లేవు.. ఒకే గదిలో 20 మంది..ప్రభుత్వంపై ఫైర్
-
ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)
-
విరుచుకుపడిన ‘మెలిసా’
కింగ్స్టన్: అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుపాన్లలో ఒకటిగా రూపుదాలి్చన ‘మెలిసా’ తుపాను మంగళవారం జమైకా దేశాన్ని వెన్నులో వణకుపుట్టే స్థాయిలో భీకరంగా తాకింది. జమైకాలో నైరుతి దిశలో ఉన్న ‘న్యూ హోప్’ ప్రాంతం వద్ద తుపాను తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలుల ధాటికి కరీబియన్ ద్వీపదేశం జమైకాలో వేలాదిగా చెట్లు నేలకూలాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయి దేశంలో సగం జనావాసాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో అంతటా అంధకారం అలుముకుంది. రాజధాని నగరం కింగ్స్టన్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.జమైకాలో తుపాన్లను నమోదుచేసే విధానం మొదలైన ఈ 174 ఏళ్లలో ఇంతటి భీకర తుపాను రావడం ఇదే తొలిసారి. కేటగిరీ–5 తుపాన్ అయిన మెలిసా ధాటికి మంగళవారం జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కనీవినీ ఎరుగని శక్తివంతమైన తుపాను దెబ్బకు దేశం చరిత్రలో ఎప్పడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవిచూడబోతోందని ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘తుపాను ఇప్పుడే తీరాన్ని తాకింది. వెంటనే దీని పూర్తి నష్ట తీవ్రతను అంచనావేయలేం’’ అని ఆయన అన్నారు. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. మరోవైపు సహాయక చర్యలను ముమ్మరంచేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటుచేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. తుపాను కారణంగా హైతీ దేశంలో ముగ్గురు, డొమినికన్ రిపబ్లిక్ దేశంలో ఒకరు మరణించారు.ఐక్యరాజ్యసమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యవసరాలను జమైకాకు తరలిస్తున్నాయి. సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, ప్రతి చుక్కా జాగ్రత్తగా వాడుకోవాలని మంత్రి మాథ్యూ సమూడా ప్రజలకు సూచించారు. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను నిలిపేశారు. ఎయిర్పోర్ట్లు, ప్రజారవాణా స్తంభించిపోయింది. కింగ్స్టన్, సెయింట్ ఎలిజబెత్, క్లారెండన్ నగరాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లికన్, బహమాస్పైనా ప్రభావం చూపింది.క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు తుపాన్కు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ)తో సృష్టించిన నకిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అవి చూసిన తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. సోషల్ మీడియాలో సాగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు స్పష్టంచేశారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని ప్రభుత్వం వెల్లడించింది. తూర్పు క్యూబా, బహమాస్ల వైపు వెళ్లాక తుపాను కొనసాగే అవకాశముందని అమెరికా హరికేన్ విభాగం పేర్కొంది. -
Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)
-
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
"మోంథా" తుఫాను కోస్తా తీర ప్రాంత వాసులను వణికిస్తోంది. భారీ వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.పాటించాల్సిన జాగ్రత్తలు 🚨 Cyclone Alert!Severe Cyclonic Storm #Montha over west central Bay of Bengal is likely to cross Andhra Pradesh coast between Machilipatnam and Kalingapatnam around Kakinada during evening/night of 28th October, with a maximum sustained wind speed of 90-100 kmph gusting to 110… pic.twitter.com/ZD4WW6ik2k— PIB India (@PIB_India) October 28, 2025 తుఫాను లాంటి పరిస్థితులను నివారించడానికి ఉత్తమ మార్గం ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం అవసరం. ఆఫీసులోనో, బయటో ఉంటే, వర్షం ఆగే వరకు వేచి ఉండాలి.ఇంట్లో, ఫ్లాష్లైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ,ఇతర ఆహార పదార్థాలను దగ్గర్లో ఉంచుకోవాలిఅధికారుల సూచనలను పరిశీలిస్తూ ఉండాలి.భారీ వర్షాలు, ఈదురు గాలలనుంచి కాపాడుకునేలా ఇంటిలోపలే ఉండాలి. అత్యవసరమైతే తప్ప, కొన్ని జాగ్రత్తలో బయటికి రావాలి. ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలి.కిటికీలు ,తలుపులను సురక్షితంగా మూసి ఉంచాలి. బలమైన గాలులకు కిటికీలుపడిపోకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. గాజు కిటికీలైతే మరింత అప్రమత్తత అవసరం.భారీ వర్షాల సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.విద్యుత్ పరికరాలను టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్లను ఆఫ్ చేయాలి. అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచుకోవాలి. -శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, జాగ్రత్తగా ఉండాలి.విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉండేలా చూసుకోవాలి.నిరంతరం అధికారులను సూచలను గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండిఎవరైనా ఆపదలో ఉన్నట్టు గమనిస్తే తమను తాము కాపాడుకుంటే వారిని ఆదుకోడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు జాగ్రత్తగా ఉండాలి.చలిగాలులనుంచి కాపాడుకునేందుకు వెచ్చని రగ్గులు, స్వెట్లర్లు ధరించాలి. ముఖం , కళ్ళు కప్పి ఉంచుకోవడం చాలా అవసరం. వాహనంలో ఉంటే, ఎగిరే వస్తువుల ప్రమాదం లేని చోట దానిని పార్క్ చేయండి. తుఫాను సమయంలో వాహనం లోపల రేడియో ప్లే చేయవద్దు; అలా చేయడం వల్ల మీరు మెరుపులకు గురవుతారు.తుఫాను సమయంలో స్నానం చేయడం మానుకోండి. నీటిలో కరెంట్ వేగంగా వ్యాపిస్తుంది. (బిగ్బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!) -
Montha Cyclone: ఆ 5 గంటలు జాగ్రత్త.! రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం
-
మోంథా బాధితులకు అండగా పేర్ని కిట్టు నిత్యావసర సరుకుల పంపిణీ
-
Cyclone Montha : ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం.. వామ్మో.. రాకాసి అలలు
-
Montha Cyclone: ఏపీలో 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
-
#CycloneMontha : రాకాసి అలలు.. అత్యంత భారీ వర్షాలతో వైజాగ్ అతలాకుతలం (చిత్రాలు)
-
Montha Cyclone: 500 కి.మీ దూరంలో తుఫాన్ డేంజర్ లో కాకినాడ
-
25ఏళ్ల క్రితం మచిలీపట్నంలో భయంకర తుఫాన్.. ఎంతమంది చనిపోయారు?
-
Montha Cyclone: తుఫాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం
-
Cyclone Montha: భారీ గాలులతో వర్షం విశాఖలో మొదలైన తుఫాను ప్రభావం
-
Cyclone Montha: తుఫాన్ ప్రభావంపై సీఎంకు మోదీ ఫోన్
-
ఏపీకి దూసుకొస్తున్న తుఫాన్
-
తుఫాన్ హెచ్చరిక.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
-
మెంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
-
ముంచుకొస్తున్న సూపర్ సైక్లోన్
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/డోన్/తిరుపతి తుడా: ‘మోంథా’ సూపర్ సైక్లోన్ రాష్ట్రం వైపు వస్తోంది. శనివారం రాత్రి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ పోర్ట్బ్లెయిర్కి 510 కి.మీ., విశాఖకు 920, చెన్నైకి 890, కాకినాడకు 920, ఒడిశాలోని గోపాల్పూర్కి 1,000 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని.. సోమవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అనంతరం వాయువ్య దిశగా, ఆ తర్వాత ఉత్తర–వాయువ్య దిశగా ప్రయాణించి 28న ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తుపానుగా మారిన తర్వాత దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టనున్నారు. తీవ్ర తుపానుగా మారాక 28న సాయంత్రం నుంచి రాత్రిలోపు కాకినాడ వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీరం దాటే సమయంలో గంటకు 90–100 కి.మీ., గరిష్టంగా 110 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే 1–1.5 మీటర్ల ఎత్తుకు అలలు ఎగసిపడతాయని వెల్లడించారు. ఈ నెల 29 వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను అప్రమత్తం చేశారు. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 27 నుంచి అతి భారీ వర్షాలు అల్పపీడనం నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 27నుంచి 30వ తేదీ వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 3 రోజులపాటు కోస్తాలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 27న అత్యంత భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ప్రకాశం, బాపట్ల, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ఇచ్చింది. నంద్యాల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. 28న వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నంద్యాల, శ్రీపొట్టి శ్రీరాములు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ఇచ్చింది. 29న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పల్నాడు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కంభంలో 6.8 సెం.మీ. వర్షం ప్రకాశం జిల్లా కంభంలో శనివారం 6.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షం కురిసింది. చిత్తూరు జిల్లా పలమనేరులో 5.9, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 5.6, అసనపురంలో 5.2, ప్రకాశం జిల్లా అర్థవీడు మండలం నాగులవరం, నెల్లూరు జిల్లా విడవలూరులో 5.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా డోన్ మండలంలో 44.2 మి.మీ. వర్షం కురవడంతో వంకలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎర్రగుంట్ల వద్ద ఆర్టీసీ బస్సు వంకలో ఆగిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు బయటకు నెట్టుకొచ్చారు. ఉమ్మడి తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీగా వర్షం కురిసింది. తిరుపతిలో 2 గంటల పాటు భారీ వర్షం పడటంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. -
అన్నదాతకు ‘మోంథా’ గుబులు
సాక్షి, అమరావతి: అన్నదాతకు మోంథా తుపాను కంటే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగే అపార నష్టం భయం పట్టుకుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో చేతికొచ్చి న పంట ఎక్కడ తుపాను బారిన పడుతుందోననే ఆందోళన కలవరపెడుతోంది. ముంచుకొస్తున్న మోంథా నుంచి పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోతలు ప్రారంభమైన జిల్లాల్లో కనీస మద్దతు ధర లేక, పంటను అమ్ముకునే దారిలేక తీవ్రంగా నష్టపోతున్న రైతులు.. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంటే ఈ తిప్పలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే శాపంగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా వెంటాడింది. అన్నదాతలు తీవ్ర వర్షాభావ, ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి సాగు చేశారు. విత్తనాలు మొదలుకొని ఎరువుల వరకూ ఏదీ సక్రమంగా అందించలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసినా.. నానా అవస్థలు పడి పంటలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. తీరా పంట చేతికొచ్చే దశలో మోంథా రూపంలో విరుచుకుపడుతున్న తుపాను వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడినట్టు వ్యవసాయ శాఖ చెబుతోంది. దాదాపు లక్ష ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైంది. అత్యధికంగా కర్నూలు, ప్రకాశం, విజయనగరం, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అపార నష్టం వాటిల్లింది. కానీ క్షేత్ర స్థాయిలో రెండున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్టుగా రైతులు చెబుతున్నారు. ముంచుకొస్తున్న మోంథా తుపాను ప్రభావం వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్రంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పత్తి, మొక్కజొన్న రైతు దిగాలు పత్తి రైతు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఖరీఫ్లో వరి తర్వాత కాస్త ఆశాజనకంగా సాగైన పంట పత్తి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 5.55 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా ఆగస్టు రెండో వారంలో పూత, పింద రాలిపోగా, సెప్టెంబర్ నాలుగో వారంలో వర్షాలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. కనీస మద్దతు ధర రూ.8,110 కాగా మార్కెట్లో రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఏటా అక్టోబర్ 1న సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ ఏడాది నాలుగో వారం వచ్చి నా కూటమి ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ఊసేలేదు. దీంతో కొతకొచ్చి న పంటను తేమ శాతంతో కొర్రీలు వేయడంతో అయినకాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాజాగా కురుస్తున్న వర్షాలకు పూతకొచ్చి న పత్తి కాయలు కుళ్లిపోతున్నాయి. అధికారికంగానే 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మోంథా తుపాను కూడా జతకలిస్తే పత్తి రైతుల ఆశలు పూర్తిగా గల్లంతైనట్టే. ఇక పత్తి తర్వాత చెప్పుకోతగ్గ స్థాయిలో మొక్కజొన్న 4 లక్షల ఎకరాల్లో సాగైంది. అధిక వర్షాల వల్ల 40 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి కాస్త 15–20 క్వింటాళ్లకు పరిమితమైంది. మరో వైపు కనీస మద్దతు ధర రూ.2,400 కాగా, ప్రస్తుతం దళారీలు రూ.1,600 నుంచి రూ.1,700 మధ్య కొంటున్నారు. ఫలితంగా ఎకరాకు రూ.17,500 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా పంట దెబ్బతింది. ఇదే అదనుతో పంట రంగు మారినట్టుగా, తేమ శాతం ఎక్కువగా ఉందనే సాకుతో ధర తగ్గించేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మొత్తుకుంటున్నా కూటమి ప్రభుత్వం పట్టనట్టుగా ఉంది. పత్తి, మొక్కజొన్నతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం రైతుపై తుపాను పోటు కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కువగా సాగయ్యే వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో మోంథా తుపాను తీరం దాటితే కుంభవృష్టి తప్పదని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలో వరిపంట దాదాపు తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు. గతేడాది మద్దతు ధర లేక 75 కేజీల బస్తాకు రూ.300–రూ.500 వరకు నష్టపోయిన కర్షకులు ఈసారి అంతకంటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈపాటికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. లక్ష్యాలు నిర్దేశించుకున్నారే తప్ప ఒక్క కేంద్రం కూడా ప్రారంభించిన దాఖలాలు లేవు. కనీసం ఆ దిశగా కసరత్తు కూడా చేసే ఆనవాళ్లు కనిపించట్లేదని రైతులు వాపోతున్నారు. -
తుఫాన్ల అడ్డా ఇక ప్రళయమేనా?
-
APకి దూసుకొస్తున్న తుఫాన్
-
హై అలర్ట్.. AP వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్
-
‘మోంథా’ దూసుకొస్తోంది
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారుతుందని, 26వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. 27వ తేదీ ఉదయానికి నైరుతి, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాన్గా మారే అవకాశం ఉందంది. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) సూచనల ప్రకారం ఈ తుపాన్కు మోంథాగా నామకరణం చేయనున్నారు. అల్పపీడనం ప్రభావంతో 26 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇది తుపాన్గా మారిన అనంతరం 27, 28 తేదీల్లో తీరప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 26 నుంచి మోస్తరు వర్షాలు కోస్తాంధ్ర అంతటా మొదలవుతాయని తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబర్ 15వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుసూ్తనే ఉంటాయని చెబుతున్నారు. పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో 5.9, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం బుట్టాయగూడెం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.24 గంటల వ్యవధిలో..గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకూ 24 గంటల వ్యవధిలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 14.4, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరిలో 13, ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 12.3, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 12.2, నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరులో 11.6, ప్రకాశం జిల్లా టంగుటూరులో 11.3, వైఎస్సార్ జిల్లా బద్వేలులో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు, కోనసీమ, పశ్చిమగోదావరి, అనంతపురం, వైఎస్సార్, కాకినాడ, చిత్తూరు, తిరుపతి, కృష్ణా, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.మోంథా అంటే.. మోంథా అంటే థాయ్ భాషలో సువాసన వెదజల్లే పుష్పం అని అర్థం. ఈ పేరును థాయ్లాండ్ సూచించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాన్ 28 లేదా 29వ తేదీల్లో కాకినాడ, ఒంగోలు మధ్యలో తీరం దాటే సూచనలున్నాయని.. 26వ తేదీకి స్పష్టత వస్తుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ తుపాన్ ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ మొత్తం తీర ప్రాంతమంతా ఉంటుందని, ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. -
మూడో వారంలో ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే ఉత్తర, మధ్య భారతాన్ని వీడిన నైరుతి.. ఈ నెల 14 నాటికి రాష్ట్రం నుంచి, 15 నాటికి దేశవ్యాప్తంగా నిష్క్రమించనుంది. ఇదే సమయంలో ఈ నెల మూడో వారంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి మార్గం సుగమమైంది. 17 నుంచి 20వ తేదీ మధ్యలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఇవి తమిళనాడు, పాండిచ్చేరి, ఏపీ, కర్ణాటక, కేరళలో ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ నమూనాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే ప్రపంచ వాతావరణ విశ్లేషణలు మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర పరిస్థితుల కారణంగా ఈశాన్య రుతుపవనాలకు ప్రతికూలతలు కనిపిస్తున్నాయని, దీంతో కాస్త ఆలస్యమయ్యే సూచనలున్నాయని అంచనా వేస్తున్నాయి. 1998, 2005, 2021లో ఈశాన్య రుతుపవనాలు సాధారణం కంటే అధిక వర్షపాతాన్ని అందించాయని, ఈసారి కూడా అదే తరహాలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు, ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణలో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయి.ఈశాన్య రుతుపవనాల రాకతో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య వరుస అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 2 లేదా 3 తుపాన్లు కూడా రానున్నాయని, ఇవి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వద్ద తీరందాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నైరుతి నిష్క్రమణ కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నేడు పలుచోట్ల మోస్తరు వర్షాలు సాక్షి, అమరావతి: ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ కోస్తా వరకూ విస్తరించి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం చిత్తూరు పట్టణంలోని దొడ్డిపల్లిలో 3.4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపురంలో 3.1, శ్రీకాకుళం జిల్లా కొర్లాంలో 2.6 సెం.మీ. వర్షం కురిసింది. ఆదివారం అల్లూరి, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
గోపాల్ పూర్ దగ్గర తీరం దాటిన వాయుగుండం..ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు
-
ఏపీకి తుపాన్ షాక్.. ఒకటి కాదు.. మూడు!
-
హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం
హైదరాబాద్, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, మోహిదీపట్నం, ఆసిఫ్నగర్, కార్వాన్, మలక్పేట్, సైదాబాద్, చాదర్ ఘాట్, మారేడుపల్లి, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, అత్తాపూర్, అంబర్పేట్, అత్తాపూర్, రాజేంద్రనగర్, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ఉప్పల్, రామంతాపూర్లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు -
అమెరికాలో ‘మంచు’ బీభత్సం
వాషింగ్టన్: తుఫాను కారణంగా తూర్పు అమెరికా అంతటా భారీ మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఐదుగురు మృతి చెందారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. 2,400కు పైగా విమానాలు రద్దయ్యాయి. వాషింగ్టన్లో ఒక అడుగు వరకు మంచు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్ల్యూఎస్) అంచనా వేసింది. పరిస్థితులను అధ్యక్షుడు జో బైడెన్ నిశితంగా పరిశీలిస్తున్నారని, ప్రభావిత రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైట్హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా రాజధానిలోని ఇళ్లన్నీ మంచులో కూరుకుపోయాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నగరంలోని పాఠశాలలు మూసివేశారు. కాన్సాస్, మిస్సోరి సహా పలు రాష్ట్రాల్లో మంచు తుఫాను పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందారు. కెంటకీ, మిస్సోరి, వర్జీనియా, మేరీల్యాండ్ సహా పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రోడ్లను క్లియర్ చేయడానికి అత్యవసర నిర్వహణ పనులు జరుగుతున్నాయని, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని గవర్నర్లు, స్థానిక అధికారులు కోరారు. ఆగ్నేయ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, వడగండ్లు, టోర్నడోలు వస్తాయని ఎన్డబ్ల్యూఎస్ హెచ్చరించింది. మంచు దట్టంగా పేరుకుపోతుందని, శక్తివంతమైన గాలులతో చెట్లు కూలిపోతాయని, దీర్ఘకాలిక విద్యుత్ అంతరాయం కలిగే అవకాశముందని తెలిపింది. -
90 ఏళ్ల తర్వాత.. గడగడలాడించిన చిడో తుపాన్
పారిస్ : చిడో తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. హిందు మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను తీవ్రతతో మయోట్ ద్వీపంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులైనట్లు ఫ్రాన్స్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తుపాను కారణంగా గంటకు దాదాపు 220 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు ద్వీపాన్ని అతలా కుతలం చేశాయి. ఫలితంగా తాత్కాలిక గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ గాలుల ప్రభావం వల్ల ప్రాణ,ఆస్తినష్టం భారీ ఎత్తున జరిగిందని అన్నారు.గత 90 ఏళ్లలో మయోట్ను తాకిన అత్యంత భయంకరమైన తుపాను ఇదేనని అధికారులు చెప్పారు. ఫ్రాన్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఆదివారం ఉదయం చిడో తుఫాన్ ప్రారంభంలో 11మంది మరణించగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు ధృవీకరించింది. అయితే మరణాలు, గాయపడ్డ వారి సంఖ్య సోమవారం ఉదయం నాటికి గణనీయంగా పెరిగినట్లు అంచనా వేసింది. 🚨 Intense Tropical #CycloneChido hit Cabo Delgado, Nampula & Niassa early Sunday with winds over 200km/h & heavy rains, impacting an estimated 1.7M people in 🇲🇿IOM, govt & partners are on the ground, assessing needs & coordinating early response, with PSEA measures reinforced. pic.twitter.com/KUd1N5Zbkb— IOM Mozambique (@IOM_Mozambique) December 15, 2024 శనివారం తుఫాను కారణంగా మయోట్ ద్వీపం పూర్తిగా దెబ్బ తిన్నదని, జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎంతనేది అంచనా వేయడం కష్టంగా ఉందన్నారు. ఫ్రాన్స్ రెస్క్యూ టీమ్లు.. మెడిసిన్, ఆహారంతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల్ని ద్వీపానికి తరలించినట్లు మయోట్ ద్వీప ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. -
Year Ender 2024: భారత్ను వణికించిన ప్రకృతి విపత్తులు
ప్రస్తుతం నడుస్తున్న 2024వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ నేపధ్యంలో 2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే 2024 మన దేశానికి కొన్ని చేదు గుర్తులను మిగిల్చింది. వాటిలో ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర విషాదాన్ని అందించాయి.2024లో మనదేశం ఫెంగల్ తుఫాను, వయనాడ్లో కొండచరియలు విరిగిపడటం లాంటి అనేక భీకర విపత్తులను ఎదుర్కొంది. వీటి కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. 2024లో భారతదేశంలో సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వయనాడ్లో కొండచరియలు విరిగిపడి..2024, జూలై 30న కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 420 మందికి పైగా జనం మృతిచెందారు. 397 మంది గాయపడ్దారు. 47 మంది గల్లంతయ్యారు. 1,500కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు.రెమాల్ తుఫాను తాకిడికి..2024లో సంభవించిన రెమాల్ తుఫాను ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించింది. ఇది 2024, మే 26న పశ్చిమ బెంగాల్- బంగ్లాదేశ్లోని సుందర్బన్ డెల్టాను తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన పలు ప్రమాదాలలో 33 మంది మృతి చెందారు. పలు చోట్ల భారీ విధ్వంసం సంభవించింది. ఈ తుఫాను బెంగాల్, మిజోరం, అస్సాం, మేఘాలయలో భారీ నష్టం వాటిల్లింది.ఫెంగల్ తుఫాను 2024, నవంబర్ 30న ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలోని తీరాన్ని తాకింది. ఈ తుఫాను కారణంగా సంభవించిన ప్రమాదాల్లో 19 మంది మృతిచెందారు. వేలమందిని ఈ తుఫాను ప్రభావితం చేసింది. భారీ వర్షాలతో ఈ తుఫాను బీభత్సం సృష్టించింది. నాడు పుదుచ్చేరిలో 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రోడ్లు, పొలాలు జలమయమయ్యాయి. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఫెంగల్ తుఫాను కారణంగా భారీ నష్టం వాటిల్లింది.విజయవాడ వరదల్లో..2024, ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ 9 వరకు భారీ వర్షాలతో పాటు నదులు ఉప్పొంగిన కారణంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.7 లక్షల మందికి పైగా జనం ప్రభావితమయ్యారు. బుడమేరు వాగు, కృష్ణా నది నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.హిమాచల్లో వరదలు2024 జూన్ నుండి ఆగస్టు వరకు హిమాచల్ ప్రదేశ్లో వరదలు సంభవించాయి. ఈ సందర్భంగా సంభవించిన పలు దుర్ఘటనల్లో 31 మంది మృతిచెందారు. 33 మంది గల్లంతయ్యారు. లాహౌల్, స్పితి జిల్లాలో అత్యధిక నష్టం సంభవించింది. 121 ఇళ్లు ధ్వంసమవగా, 35 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తు కారణంగా హిమాచల్ రాష్ట్రానికి రూ.1,140 కోట్ల నష్టం వాటిల్లింది.అస్సాం వరదలు2024లో అస్సాంలో సంభవించిన వరదల కారణంగా చోటుచేసుకున్న వివిధ ప్రమాదాల్లో 117 మంది మృతిచెందారు. 2019 నుంచి ఇప్పటి వరకు అస్సాంలో వరదల కారణంగా మొత్తం 880 మంది మృత్యువాత పడ్డారు. వరదల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
సూరీడు రాక నాలుగు రోజులైంది
శివమొగ్గ: ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శి్చమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి. ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది. -
తుపాను ఎఫెక్ట్.. తడిసిన ధాన్యంతో రైతు కంట కన్నీరు (ఫొటోలు)
-
తడిసిన ధాన్యం.. రైతు కళ్లలో దైన్యం
వరి కోతలు ప్రారంభమై నెల దాటింది. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో రాశులు పోసి అమ్మేందుకు సిద్ధం చేశారు. గతంలో మాదిరిగా ఈ ఏడు కూడా కల్లం వద్దే మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమశాతం పేరుతో అధికారులు ధర తగ్గిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుని దళారులు, మిల్లర్లు.. రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. నాలుగు రోజులు ఆగితే పరిస్థితులు మారకపోతాయా, ప్రభుత్వం పట్టించుకోకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న రైతన్న మీదికి పులిమీద పుట్రలా ఫెంగల్ తుపాన్ వచ్చిపడింది. రైతు కష్టాలను రెట్టింపు చేసింది. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందే వాతావరణశాఖ హెచ్చరించినా సర్కారు మొద్దు నిద్ర కారణంగా తడిసిన ధాన్యపు రాశుల వద్ద రైతు చేష్టలుడిగి చూస్తున్నాడు. ఇంత పెద్ద ఆపద వస్తే సీఎం కనీసం అధికారులతో సమీక్షించిన పాపానపోలేదు. మంత్రులు ట్వీట్లకు, నాయకులు మాటలకు పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి దయనీయంగా మారింది. పరిస్థితులు అంచనావేసి ప్రభుత్వం సకాలంలో స్పందించి ధాన్యం కొనుగోలు చేస్తే ఈ చింత మాకెందుకంటూ రైతన్న గోడు వెళ్లబోసుకుంటున్నాడు. వచ్చిందే అవకాశమనుకుని కళేబరాన్ని పీక్కుతినే రాబందుల్లా దళారులు, నాయకులు ఏకమై రక్తాన్ని పీల్చేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతన్న కల్లం వద్ద కన్నీరు కారుస్తున్నాడు. రహదారుల పక్కన టార్పాలిన్లపై తడిసిన ధాన్యాన్ని ఆరబోసుకుని ఎప్పుడు కొంటారో, ఎంతకి కొంటారో తెలియక బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నాడు. – సాక్షి నెట్వర్క్ -
ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్కు ప్రధాని ఫోన్
చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. -
తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు (ఫొటోలు)
-
Tirumala: తిరుమలపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
-
తుపాను ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు (ఫొటోలు)
-
వణికించే చలిలో వరదలు..చెన్నైని చెల్లాచెదురు చేసిన ‘ఫెంగల్’(ఫొటోలు)
-
చెన్నై ఎయిర్ పోర్ట్ రన్ వే పైకి చేరిన వరద నీరు
-
Fengal Cyclone: దూసుకొస్తున్న ఫెంగల్
-
Cyclone Fengal: చెన్నై ఎయిర్పోర్టు బంద్.. రెడ్ అలెర్ట్ జారీ
ఫెంగల్ తుఫాను తమిళనాడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారిన ఫెంగల్.. శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాగే అవకాశం ఉంది. కారైకాల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో నేటి మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నైతో సహా తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చెన్నై విమానాశ్రయాన్ని రాత్రి ఏడు గంటల వరకు అధికారులు మూసివేశారు. ఈ సమయంలో సబర్బన్ రైళ్లు కూడా తక్కువగా నడుస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది.భారీ వర్షాలు..పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కాంచీపురం, చైన్నె, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అనేక తీర ప్రాంతాలు ఇప్పటికే వాతావరణంలో మార్పు, అధిక ఆటుపోట్లను చూస్తున్నాయని తెలిపింది. తీరాన్ని ఫెంగల్ సమీపించే కొద్దీ గాలిప్రభావం 90 కి.మీ వేగంతో ఉండేందుకు అవకాశాలు ఉండడంతో ముందు జాగ్రత్తలు విస్తృతమయ్యాయి.Beautiful low cyclonic clouds... #ChennaiRains #Cyclone #Fengal pic.twitter.com/VTGxLYNty4— Sreeram (@sreeram) November 30, 2024 వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, పెరంబలూరు, అరియలూర్, తంజావూరు, నాగపట్నం, రాణిపేట, కారైకల్ జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ ప్రకటించారు. రెడ్ అలర్ట్ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి విపత్తు ఎదురైనా తక్షణం బాధితులను ఆదుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. పుదుచ్చేరిలో వర్షాలు కొనసాగుతుండడంతో పాటు కారైక్కాల్–తమి నాడులోని చైన్నె శివారు ప్రాంతం మహాబలిపురం మధ్య తీరాన్ని ఫెంగల్ తుపాను తాకనుండడంతో ఇక్కడి గ్రామీణ, తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.Velachery, Vijayanagar 2nd main road #Fengal #ChennaiRains #velachery pic.twitter.com/nR7Ygwywcm— Swetha Chandran (@SwethaC3110) November 30, 2024మత్స్యకారులకు ఆదేశం..ఈ జిల్లాల్లో పడవలు, జనరేటర్లు, మోటారు పంపులు, ట్రీ కటర్లు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచారు. ఈ జిల్లాల్లో ఎన్డిఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించారు. తమ పడవలు, ఇతర పరికరాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించి నష్టం జరగకుండా చూడాలని అధికారులు సూచించారు.విద్యాసంస్థలు బంద్తుఫాను కారణంగా భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తుండటంతో సాధారణ జనజీవనం స్తంభించింది. పుదుచ్చేరి, తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, మైలాడుతురై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతపడనున్నాయి. ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కంపెనీలను కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అటు విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. చెన్నై నుంచి రాకపోకలు సాగించే విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. వాతావరణం మెరుగుపడిన తర్వాత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. -
మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది, శుక్రవారానికి తుపానుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపానుగా మారుతుందని అంచనా వేసినా, గురువారానికి బలహీనపడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శుక్రవారం మ«ద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్ తుపానుగా బలపడింది. వ్యతిరేక దిశలో ఉన్న షీర్ జోన్ బలహీనపడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.వేటకు వెళ్లొద్దు..తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు డిసెంబర్ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.పోర్టులకు హెచ్చరికలుఫెంగల్ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ నం–6 జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్–2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
Cyclone Alert: తుఫాన్గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
‘ఫెంగల్’ దోబూచులాట!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట రూరల్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను దాగుడుమూతలాడుతోంది. దీన్ని ట్రాక్ చేసేందుకు వాతావరణ శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇది బుధవారం సాయంత్రం నాటికి తీవ్ర వాయుగుండం నుంచి తుపానుగా మారినట్లే మారి కాస్తా బలహీనపడిపోయింది. దీంతో ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. మళ్లీ తుపానుగా బలపడే అవకాశాలున్నా.. ఎప్పుడనే దానిపై అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది. తుపాను వ్యతిరేక శక్తిలా పనిచేస్తున్న బలమైన గాలులతో కూడిన షియర్ జోన్.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుండటమే దీనికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తుపానుకు వ్యతిరేక దిశలో ఇది కొనసాగుతుండటంవల్ల.. 48 గంటలు గడిచినా తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని.. ఈ కారణంగానే ఫెంగల్ ముందుకు కదల్లేకపోతోందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఈ తీవ్ర వాయుగుండం గంటకు కేవలం 10 కిమీ వేగంతో నెమ్మదిగా కదులుతూ స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ట్రింకోమలికి 200 కిమీ, పుదుచ్ఛేరికి ఆగ్నేయంగా 410 కిమీ, చెన్నైకి దక్షిణాగ్నేయంలో 470 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా సముద్రంలోనే బలహీనపడనుందని అధికారులు చెబుతున్నారు. అనంతరం.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతున్న క్రమంలో.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలైన కరైకల్, మహాబలిపురం మధ్య 30వ తేదీ ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 50–60 కిమీ.. గరిష్టంగా 70 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఒకవేళ తుపానుగా బలపడితే మాత్రం గంటకు 65–75 కిమీ.. గరిష్టంగా 85 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయని.. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నేటి నుంచి వర్షాలు..ఇక దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. అలాగే 30 నుంచి డిసెంబరు 2 వరకూ కోస్తాంధ్ర అంతటా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. ఈఓఎస్–06, ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాల సహాయంతో ఫెంగల్ తుపాను కదులుతున్న తీరుపై ఇస్రో అధికారులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. -
Cyclone Fengal: ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
-
దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్..
-
దూసుకొస్తున్న ‘ఫెంగల్’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : ఫెంగల్ తుపాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా గంటకు 12 కి.మీ వేగంతో కదులుతూ ట్రింకోమలీకి తూర్పుగా 110 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 350 కి.మీ., పుదుచ్చేరికి ఆగ్నేయంగా 450 కి.మీ., చెన్నైకి ఆగ్నేయంగా 500 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపాయి. ఇది బుధవారం సా.5.30కు తుపానుగా బలపడింది. అనంతరం.. శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముంది. 30న దక్షిణ తమిళనాడు, శ్రీలంక మధ్యలో తీరం దాటే అవకాశాలున్నాయని.. ఆ తర్వాత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వెల్లడించాయి. దీని ప్రభావం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనూ, రాయలసీమలోని తిరుపతి జిల్లాలోనూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, కోస్తాంధ్రలో అక్కడక్కడ గురు, శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా పడతాయన్నారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మత్స్యకారులెవరూ డిసెంబరు 3 వరకూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక తుపాను కారణంగా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక.. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సిగ్నల్–4తో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీచేశారు. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 9491077356 (చిత్తూరు).. నెల్లూరు ప్రజలు 0861–2331261 టోల్ఫ్రీ నంబర్లలో సంప్రదించాలి. అధికారులకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలి..ఫెంగల్ తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంట పొలాల్లో నిలిచే అదనపు నీరు వీలైనంత త్వరగా బయటకుపోయేలా రైతులు ఏర్పాట్లుచేసుకోవాలి. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలి. – రోణంకి కూర్మనాథ్, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ -
ఫెంగల్ పంజా.. చూస్తుండగానే కూలిన భవనం
చెన్నై: తమిళనాడులో ఫెంగల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఫెంగల్ ధాటికి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాలతో.. తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 15 జిల్లాలలోని కాలేజీలు, స్కూళ్లకు రెండురోజుల పాటు సెలవు ప్రకటించింది.వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆరు గంటలపాటు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించింది. సాయంత్రం 5:30 గంటల సమయంలో త్రికోణమలీకి తూర్పు- ఆగ్నేయంగా 130 కిలోమీటర్లు నాగపట్టినానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు పేర్కొంది. VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W— Press Trust of India (@PTI_News) November 27, 2024 -
వాయు'గండం'.. ఆరు రోజులపాటు వానలే వానలు
-
ముంచుకొస్తున్న ‘ఫెంగల్’ తుఫాన్ ...సముద్రం అల్లకల్లోలం (ఫొటోలు)
-
AP: వాయుగుండం ముప్పు!
సాక్షి, అమరావతి/వాకాడు: దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రం మధ్య భాగాలపై కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం ఇది 30 కిలో మీటర్ల వేగంతో కదులుతూ ట్రింకోమలీకి 530 కి.మీ, నాగపటా్ననికి 810 కి.మీ, పుదుచ్చేరికి 920 కి.మీ, చెన్నైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనుంది.ఆ తర్వాత రెండు రోజుల్లో వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి మంగళవారం గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే జిల్లాలు ఇవీ... ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎగసిపడుతున్న కెరటాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీరంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, కోట, వాకాడు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని సముద్ర తీర ప్రాంతంలో సోమవారం అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్ర కెరటాలు దాదాపు ఏడు అడుగుల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. సముద్రం మూడు మీటర్లు ముందుకు వచ్చింది. పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ముందు జాగ్రత్తగా స్థానిక మత్స్యకారులు తమ బోట్లను ఒడ్డుకు చేర్చుకుని భద్రపరుచుకున్నారు. -
రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల చివరి వారంలో రాష్ట్రాన్ని తుపాను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. 27వ తేదీ నాటికి అది తుపానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
బలహీనపడిన ‘దానా’ తుపాను
సాక్షి, అమరావతి: తీవ్రమైన తుపాను ‘దానా’ బలహీనపడింది. గురువారం రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 3:30 గంటల మధ్య ఒడిశాలోని హబాలిఖతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక), ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. ఇది 10 కి.మీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా ఒడిశాలోని భద్రక్కు 30 కి.మీ, ధమ్రాకు 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కేంద్రం చుట్టూ గరిష్ట స్థిరమైన గాలులు గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతూ కొద్దిగంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
దానా దంచేస్తోంది
-
దానా తుపాను : 86 రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికులు తిప్పలు (ఫొటోలు)
-
దానా తుఫాన్ ఉగ్రరూపం
-
ఒడిశా-బెంగాల్లో 'దానా' విధ్వంసం (ఫొటోలు)
-
తీరం దాటిన ‘దానా’ తీవ్ర తుపాను
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపాను ‘దానా’ తీరం దాటింది. అర్ధరాత్రి 1:30 నుండి 3:30 మధ్య తీరాన్ని తాకింది. ఒడిశాలోని బిత్తర్కని నేషనల్ పార్క్, ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఒడిశా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉత్తరాంధ్ర పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. భద్రక్, జగత్సింగ్పూర్, బాలాసోర్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఒడిశాలో 7వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లొతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో ఏకంగా 400లకు పైగా రైళ్లు రద్దు అయ్యాయి. కోల్కతా, భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ల్లో సేవలను గురువారం సాయంత్రం నుంచే నిలిపివేశారు.బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను కదలికలను ఇస్రో ప్రయోగించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–06), ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాయని ఇస్రో తన అధికారిక వెబ్సైట్లో గురువారం తెలియజేసింది. 2022 నవంబర్ 26న పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈఓఎస్–06, 2016 సెప్టెంబర్ 8న జీఎస్ఎల్వీ ఎఫ్–05 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహాలు విపత్తులను ముందస్తుగా గుర్తించి మానవాళికి మేలు చేస్తుండటంలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయనడానికి ఇదే నిలువెత్తు నిదర్శనం.ఈ నెల 20న బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సముద్రపు గాలి నమూనాలను బట్టి ఈఓఎస్–06 ఉపగ్రహం ముందస్తుగా గుర్తించింది. మేఘాలను బట్టి ఇన్శాట్–3డీఆర్ ఉపగ్రహం ఈ తుపానును ముందస్తుగా గుర్తించింది. తుపాను బెంగాల్, ఒడిశా మీదుగా వెళ్లి తీరం దాటింది. ఈ విషయాన్ని ఈ రెండు ఉపగ్రహాలు ముందస్తుగా ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునే అవకాశం చిక్కింది. -
Cyclone Dana: భారీ గాలులతో అర్ధరాత్రి తీరం దాటనున్న తుఫాను
-
Dana Cyclone: కోల్ కతా ఎయిర్ పోర్ట్ మూసివేత
-
దూసుకొస్తున్న దానా తుఫాన్..
-
భయపెడుతున్న దానా.. ప్రచండ గాలులతో వర్ష సూచన!
Dana Cyclone Updates:తీవ్ర తుఫానుగా ‘దానా’ వాయువ్య బంగాళాఖాతంలో కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 12 కి.మీ వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కు ఆగ్నేయంగా 260 కి.మీ, ధమర (ఒడిశా)కి 290 కి.మీ, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణంగా 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతం అయినట్లు వాతావరణ అధికారుతెలిపారు.దానా తుపాను ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ మనోరమా మొహంతి తెలిపారు. ఈ రాత్రి (గురువారం) అత్యధిక వేగంతో గాలి వీస్తుందని చెప్పారు.‘‘ దానా తుపాను గత అర్ధరాత్రి తీవ్ర తుఫానుగా మారింది. ఇది గత 6 గంటల్లో 12 కి.మీ/గంట వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. బంగాళాఖాతం వాయువ్య దిశలో తీవ్ర తుపానుగా కదులుతోంది’’అని అన్నారు.#WATCH | Bhubaneswar, Odisha | On cyclone 'Dana', Director IMD, Manorama Mohanty says, "The cyclone Dana has intensified into a severe cyclonic storm in last midnight and it is moving north-westward with the speed 12km/hr during last 6 hours and now it is lying over central and… pic.twitter.com/Cff2mVTNgh— ANI (@ANI) October 24, 2024దానా తుపాను భయపెడుతున్న నేపథ్యంలో తీరం దాటకముందే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని ప్రభుత్వం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దానా తుపాను.. గురువారం లేదా శుక్రవారం భిటార్కనికా , ధమ్రా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ అధికారలు తెలిపారు. మరోవైపు.. దానా తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. కోల్కతా, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో నేటి నుంచి రేపు(శుక్రవారం) ఉదయం వరకు కార్యకలాపాలు నిలిపివేసింది.#CycloneDanaLies around 200kms off #Odisha coast at 5.30 am IST on 24th Oct. It is likely to landfall today evening/night (a tough time for relief personnel due to darkness) as a very severe cyclonic storm with expected windspeed of 120 kmph.Take care.@Windycom @zoom_earth pic.twitter.com/6PxsR7MGnS— Prof RV (@TheTechocrat) October 24, 2024 ఒడిశాలోని అనేక తీర జిల్లాల నుంచి దాదాపు 10 లక్షల మంది ప్రజలను తరలించడానికి ఒడిశాలోని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. 120 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ దానా తుపాను ఒడిశాలోని సగం జనాభా ప్రభావం చూపే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.It appears that #Dana is approaching #Cyclone strength and Category 2+ is on the cards as it approaches #India. Hopefully dry air will weaken it before landfall#wx #wxtwitter #tropicswx #CycloneDana #CycloneAlert pic.twitter.com/R8McN71Fnv— Hurricane Chaser Chase (@hurricane_chase) October 24, 2024 ఈ తుపాను బుధవారం రాత్రి 11.30 గంటల సమయానికి పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 330 కి.మీల దూరంలో, ధమర (ఒడిశా)కి 360 కి.మీ దక్షిణ-ఆగ్నేయంగా, సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) దక్షిణ-ఆగ్నేయంగా 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుపాను ఒడిశాలోని భిటార్కనికా నేషనల్ పార్క్ , ధామ్రా ఓడరేవుల మధ్య తీరం దాట వచ్చని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.In view of Cyclone DANA's impact on the coastal region of West Bengal, including Kolkata, it has been decided to suspend the flight operations from 1800 IST on 24.10.2024 to 0900 IST on 25.10.2024 due to predicted heavy winds and heavy to very heavy rainfall at Kolkata. pic.twitter.com/jhd4E7S3NS— Kolkata Airport (@aaikolairport) October 23, 2024 మరోవైపు.. దానా తుపాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, పుర్బా , పశ్చిమ మెదినీపూర్, ఝర్గ్రామ్, కోల్కతా, హౌరా , హుగ్లీ జిల్లాల్లో గురువారం, శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కోల్కతా విమానాశ్రయం గురువారం సాయంత్రం 6 గంటల నుండి రేపు(శుక్రవారం) ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేసింది.🚨 Breaking NewsDon't be alarmed by potential storm 'seeds'.Be careful,be safe. Life is precious.I strongly believe that we all can successfully face the storm this time together as before. #EveryLifeIsPrecious #CycloneDana #Odisha#CycloneDana#BRICS2024 pic.twitter.com/a4bGjDLG3L— Akhilesh Yadav (@Akhiles61939129) October 24, 2024 అదేవిధంగా భువనేశ్వర్ విమానాశ్రయం ఈరోజు సాయంత్రం 5 నుండి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమాన కార్యకలాపాలను నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. ఇక.. దానా తుపాను నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మీదుగా నడిచే దాదాపు 200 రైళ్లను రద్దు చేశారు. ఒడిశాలో, బుధవారం సాయంత్రం నాటికి సుమారు 3 లక్షల మందిని, పశ్చిమ బెంగాల్ 1.14 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. -
తీవ్ర తుపానుగా ‘దానా’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాను తీవ్రరూపం దాల్చింది. ఇది వాయవ్య దిశగా గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణిస్తోంది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది. ప్రస్తుతం పారాదీప్కు ఆగ్నేయంగా 420 కి.మీ., దమరకు 450 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో పూరీ–సాగర్ ద్వీపం మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయానికి ఒడిశాలోని బిటర్క నికా–దమర వద్ద తీరం దాటే సూచనలు కనిపి స్తున్నాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీవ్ర తుపానుగా బలపడటంతో తీరం దాటే సమయంలో గంటకు 100–110 కి.మీ. వేగంతో, గరిష్టంగా 120 కి.మీ. వేగంతో ఉధృత గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఒడిశా, పశ్చిమ బెంగాల్పై తీవ్రంగా ఉంటుందన్నారు. అదేవిధంగా గురువారం మధ్యాహ్నం తర్వాత ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందనీ.. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు పడతాయని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవరూ 25వ తేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. -
రేపు తీవ్ర తుపాన్గా ‘దానా’
సాక్షి,విశాఖపట్నం:తూర్పుమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాన్ గురువారానికి(అక్టోబర్ 24) బలపడి తీవ్ర తుపాన్గా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతానికి పారాదీప్కు 520 కిలోమీటర్ల దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉందన్నారు.‘ తుపాన్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోపు తీరం దాటే అవకాశం ఉంది.పూరీ-సాగర్ ద్వీపం మధ్య సమీపంలో తీరం దాటనుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోంది. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురుస్తాయి. బుధ,గురు వారాల్లో సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు. అన్ని పోర్టులలో రెండో నెంబర్ హెచ్చరిక జారీ చేశాం’అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: దానా తుపాన్ టెన్షన్ -
దూసుకొస్తున్న దానా తుపాన్
-
‘దానా’ తుపాన్ టెన్షన్.. ఏపీకి భారీ వర్ష సూచన
సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘దానా’ టెన్షన్ పెడుతోంది. బుధవారం ఉదయానికి తుపానుగా, గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.దానా తుపాను ముప్పు ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడుకు పొంచి ఉంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మరో నాలుగు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.మరోవైపు.. బెంగాల్లో ఏడు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించారు. రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. సహయక చర్యలు చేపట్టారు. ఇక, తుపాను నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది. 23, 24, 25వ తేదీల్లో తూర్పు కోస్తా రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేశారు. గురువారం అత్యధికంగా 37 సర్వీసులు రద్దయ్యాయి. అలాగే, విశాఖ-భువనేశ్వర్ మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును 24న రద్దు చేశారు.24న రద్దు చేసిన రైళ్లు..సికింద్రాబాద్ - భువనేశ్వర్హైదరాబాద్ - హౌరాసికింద్రాబాద్ - హౌరాసికింద్రాబాద్ - మల్దాటౌన్25న రద్దు చేసిన రైళ్లు:..హౌరా - సికింద్రాబాద్షాలిమార్ - హైదరాబాద్సిల్చార్ - సికింద్రాబాద్ #CycloneDana beauty in bay. Massive intensification seen under favorable conditions. First set of rains from cyclone feeder bands will commence in coastal parts of #Odisha from today evening. Stay tuned for more updates. #Danacyclone pic.twitter.com/o0oro4X4ZX— Eastcoast Weatherman (@eastcoastrains) October 23, 2024 -
బలపడుతున్న వాయుగుండం
Cyclone dana: తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. పారాదీప్కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్లు దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24వ తేదీకి తుపానుగా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది 24వ తేదీన పూరి–పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలో తీరం దాటుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.తీరం దాటే సమయంలో తీరం వెంబడి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.తుపాను కారణంగా నేడు, రేపు పలు రైళ్లు రద్దురైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ఈస్ట్ కోస్ట్ రైల్వేకు ‘దనా’ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. నేడు రద్దయిన రైళ్లు కామాఖ్య–బెంగళూరు (12552), సిల్చార్–సికింద్రాబాద్ (12514), డిబ్రుగర్–కన్యాకుమారి (22504), సికింద్రాబాద్–భువనేశ్వర్ (17016), చెన్నై సెంట్రల్–హౌరా (12840), పుదుచ్చేరి–హౌరా (12868), చెన్నై సెంట్రల్–షాలీమార్ (22826), పుదుచ్చేరి–భువనేశ్వర్ (12897), బెంగళూరు–భువనేశ్వర్ (18464), ముంబై–భువనేశ్వర్ (11019), బెంగళూరు–గౌహతి (12509), హైదరాబాద్–హౌరా (18046), కన్యాకుమారి–డిబ్రుగర్ (22503), సికింద్రాబాద్–హౌరా (12704), బెంగళూరు–హౌరా (22888), సికింద్రాబాద్–మాల్దాటౌన్ (03429), యశ్వంత్పూర్–హౌరా (12864), తిరునెల్వేలి–షాలీమార్ (06087) రైళ్లను బుధవారం పూర్తిగా రద్దు చేశారు. రేపు రద్దయ్యే రైళ్లు... హౌరా–సికింద్రాబాద్ (12703), ఖరగ్పూర్–విల్లుపురం (22603), హౌరా–భువనేశ్వర్ (12073), షాలీమార్–హైదరాబాద్ (18045), సత్రగచ్చి–మంగుళూరు సెంట్రల్ (22851), షాలీమార్–చెన్నై సెంట్రల్ (12841), హౌరా–తిరుచ్చిరాపల్లి (12663), హౌరా–బెంగళూరు (12863), షాలీమార్–వాస్కోడిగామా(18047), హౌరా–చెన్నై సెంట్రల్ (12839), పాట్నా–యర్నాకులం (22644), సత్రగచ్చి–చెన్నై సెంట్రల్ (06090), చెన్నై సెంట్రల్–హౌరా (12842), చెన్నై సెంట్రల్–సత్రగచ్చి (22808), బెంగళూరు–ముజఫర్పూర్ (15227), తాంబరం–సత్రగచ్చి (06095), బెంగళూరు–హౌరా (12246), పూరి–తిరుపతి (17479) రైళ్లను 24న పూర్తిగా రద్దు చేశారు. -
ఏపీకి తప్పిన తుఫాన్ ముప్పు ..!
-
23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
దాన తుపాను ముప్పు లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: అండమాన్ సముద్రం నుంచి దూసుకొస్తున్న తుపాను ముప్పు దాదాపు ఆంధ్రప్రదేశ్కు లేనట్టే. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి.. 22వ తేదీన ఉదయం వాయుగుండంగా బలపడనుంది. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి 23 నాటికి తుపానుగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తుపానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా వాయువ్య బంగాళాఖాతానికి ప్రయాణించి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తొలుత ఈ తుపాను ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. అయితే, వాతావరణ పరిస్థితులు, అల్పపీడనం నెమ్మదిగా దిశ మార్చుకునే సూచనల మేరకు రాష్ట్రానికి ఈ తుపాను ముప్పు లేదని స్పష్టం చేశారు. 23, 24 తేదీల్లో తుపానుగా మారే సమయంలో ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా గంటకు 70 నుంచి 90 కి.మీ. వేగంతోనూ.. తీరం దాటే సమయంలో 100 కి.మీ. గాలుల తీవ్రతతో తుపాను విరుచుకుపడనుంది. తీరం దాటిన తర్వాత బలహీనపడి ఛత్తీస్గఢ్ వైపుగా ప్రయాణించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం కోస్తాంధ్ర జిల్లాల్లో ఉండబోదన్నారు. అయితే.. ఈ తుపాను గాలుల తీవ్రతతో అరేబియా సముద్రం నుంచి తేమని తీసుకోవడం వల్ల దీని ప్రభావంతో రాయలసీమలో 23, 24 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా రాబోయే నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనీ.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నెల 24 వరకూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ.. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా, ఐఎండీ ఈ తుపానుకు ‘దాన’ అని పేరు పెట్టింది. దాన అంటే అరబిక్లో విలువైన ముత్యం అని అర్థం. -
తీరం దాటిన వాయుగుండం..
-
దూసుకొస్తున్న వాయుగుండం..
-
నెల్లూరు వైపు దూసుకొస్తున్న వాయుగుండం
సాక్షి,నెల్లూరు:చెన్నై-నెల్లూరు మధ్య కేంద్రీకృతమైన వాయుగుండం నెల్లూరు వైపు దూసుకువస్తోంది.గురువారం(అక్టోబర్17) వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.తీరందాటే సమయంలో60- 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాయుగుండం తీరం దాటే సమయంలో గూడూరు, మనుబోలు, కావలి, నెల్లూరు సమీప ప్రాంతాలలో భారీ వర్షాలు పడనున్నాయి.ఇప్పటికే నెల్లూరుతో పాటు కావలిలో వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఇదీ చదవండి: వాయుగుండం ముప్పు -
ఏపీకి అల్పపీడనం ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక
-
నాలుగు రోజులు భారీ వర్షాలు..
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
ఏపీకి తుఫాన్ ముప్పు
-
దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీకి మరో గండం!
-
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్హెచ్సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్హెచ్సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. -
వాయుగుండాలు.. పెనుగాలులు.. క్లౌడ్ బరస్ట్!
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరునాగారం–తాడ్వాయి అటవీ ప్రాంతంలోని 332 హెక్టార్ల పరిధిలో ఆగస్టు 31న సుమారు 50 వేల చెట్లు నేలకూలడానికి గల శాస్త్రీయ కారణాలపై శాస్త్రవేత్తలు, నిపుణులు అటవీశాఖ అధికారులతో చర్చించారు. మంగళవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్ డోబ్రియాల్ ఆధ్వర్యంలో ఈ అంశంపై వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు, రిటైర్డ్ అధికారులు, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ), జాతీ య వాతావరణ పరిశోధన ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్), ఎ¯న్జీఆర్ఐ, ఐఎండీ శాస్త్రవేత్తలు, ఎ¯న్ఐటీ వరంగల్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏకకాలంలో ఏర్పడిన వాయుగుండాల వల్ల పెను గాలులు వీయడంతోపాటు కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్ ) వర్షాలు కురవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏటూరునాగారం అటవీ ప్రాంతంలోని సారవంతమైన నేల కూడా భారీ స్థాయిలో చెట్లు కుప్పకూలేందుకు దారితీసిందని భావిస్తున్నట్లు చెప్పారు. అక్కడి నేలలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల వాటి వేర్లు భూమి లోపలకు బదులు అడ్డంగా విస్తరించడం వల్ల చెట్లు 130– 140 కి.మీ. వేగంతో వీచిన పెను గాలులను తట్టుకోలేక పడిపోయి ఉండొచ్చన్నారు. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులతో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. అయితే చెట్లు కూలిన ప్రదేశంలో సారవంతమైన భూమి ఉన్నందున చెట్ల పునరుజ్జీవనానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలో కేంద్ర, రాష్ట్రాలకు నివేదిక.. పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ చెట్లు నేలకొరిగిన ప్రాంతంలో కలుపు మొక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని తద్వారా చెట్లు త్వర గా పెరిగే అవకాశం ఉంటుందని అటవీ సిబ్బందిని ఆదేశించారు. అంతకుముందు ములుగు డీఎఫ్వో రాహుల్ కిషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటవీ నష్టాన్ని శాస్త్రవేత్తలకు వివరించారు. వర్క్షాపులో వెల్లడైన అభిప్రాయాలు, సూచనలతో త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమరి్పంచాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
ఏపీకి మరో తుపాన్ ముప్పు!
సాక్షి, విశాఖపట్నం: ఈ నెలాఖరులో రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 24న ఏర్పడే అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తుపానుగా మారితే.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలుంటాయని తెలిపారు. పశ్చిమ వాయువ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో 20 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పారు. -
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
ప్రచండ గాలులు.. కొట్టుకుపోయిన మనుషులు, వాహనాలు
బీజింగ్: డ్రాగన్ దేశం చైనాలో యాగి తుపాన్ బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో గంటకు 234 కి.మీ వేగాన్ని మించి బలమైన గాలులు వీచాయి. దీంతో, వాహనాలతో సహా మనుషులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల రేకుల షెడ్స్ గాల్లోకి ఎగిరిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మరోవైపు.. యాగి తీవ్ర తుపాను కారణంగా రెండు రాష్ట్రాల్లోని నదులకు వరద ముప్పు పొంచి ఉందని చైనా హెచ్చరించింది. తుపాను నేపథ్యంలో హైనాన్ రాష్ట్రంలో వెంగ్టియాన్ టౌన్షిప్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించవచని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హైనాన్లోని నాండు, చాంగువా నదులకు వరద ముప్పుందని ప్రజలను అలర్ట్ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గౌంగ్డాంగ్లో 5.70 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజా తుపానుపై చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.El #tifon Yagi llegando a China#SuperTyphoonYagi #Yagi #China pic.twitter.com/UHBR2EzHXG— Tutiempo (@tiempobrasero) September 6, 2024 The window glass was broken, it seemed to have been torn off the hotel building 😨🇻🇳🙏SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/6S6BGcmfFC— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 7, 2024SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/iAsYzeoqL6— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 6, 2024A hotel had its windows blown out by the wind and a lot of damage to homes.7 September 2024SUPER TYPHOON ALERT: YAGI INTENSIFIESSuper Typhoon #YAGI Heads Towards Northern #Vietnam#SuperTyphoonYagi #NorthernVietnam pic.twitter.com/348fxSa6xF— BeeLady 🇨🇭 📍🌼🐝 (@BeeLady__) September 7, 2024ఇదిలా ఉండగా.. యాగీ తుపాన్ కారణంగా దాదాపు 8 లక్షల ఇళ్లకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇక, తుపాన్ కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. 92 మంది గాయపడ్డినట్టు చైనా ప్రభుత్వం చెబుతోంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, యాగీ తుపాన్ ప్రభావం ప్రస్తుతం వియత్నం మీద కూడా ఉంది. అక్కడ కూడా ఎడతెరపిలేని వర్షం కురుస్తూ భీకర గాలులు విస్తున్నాయి. Locals scream as truck is overturned # #SuperTyphoonYagi #TyphoonYagi #SouthernChina #915hPapic.twitter.com/ajkvpSyS8z https://t.co/KEocatMPCy— The Vigilante (@NewsByVigilante) September 6, 2024Terrifying winds hits due to Typhoon Yagi in Halong Bay of Quảng Ninh province, Vietnam 🇻🇳 (07.09.2024)TELEGRAM JOIN 👉 https://t.co/9cTkji4D9S pic.twitter.com/MruMSUuGx1— Disaster News (@Top_Disaster) September 7, 2024 -
ఏపీకి మరో ముప్పు.! బలపడనున్న అల్పపీడనం
సాక్షి,విశాఖపట్నం: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అనంతరం ఇది తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది. అల్పపీడనానికి సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తిస్థాయి బులెటిన్ను త్వరలో విడుదల చేయనుంది. బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ఏపీలోని విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముంపునకు గురైన విజయవాడ తదితర ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుపాను ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటం ఏపీ వాసులను కలవరపెడుతోంది. -
ఫిలిప్పీన్స్ను వణికిస్తున్న యాగి
మనీలా: ఫిలిప్పీన్స్ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. క్వెజాన్ ప్రావిన్స్లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు. మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు. పసిఫిక్ రింగ్ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్లో సంభవించిన భీకర తుపాను హయియాన్తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
అరేబియా సముద్రంలో తుపానా?
న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుపాను పుట్టి భారత వాతావరణ శాఖ అధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఆగస్ట్ నెలలో తుపాన్లు ఏర్పడటం చాలా అరుదైన విషయం. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంత జలాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు అనేవి తుపాన్లు ఏర్పడేందుకు అనువైన వాతావరణం కాదు. అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుంచి వీచే పొడిగాలులు సైతం ఇక్కడ తుపాన్లను ఏర్పర్చలేవు. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని దాటుతూ తుపాను ఏర్పడటం వాతావరణ శాఖ అధికారులను సైతం ఆలోచనల్లో పడేసింది. చివరిసారిగా 1976లో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. అది కూడా ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం చివరకు పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి చివరకు అరేబియా సముద్రంలో తుపానుగా రూపాంతరం చెందింది. తర్వాత అది అలాగే వెళ్లి ఒమన్ తీరం వద్ద బలహీనపడింది. అరేబియాలో తుపాన్లు ఎందుకు రావంటే?వర్షాకాల సీజన్లో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో జూలై, సెప్టెంబర్లో తుపాన్లు ఏర్పడటం కష్టం. అల్పపీడనం ఏర్పడినపుడు గాలులు గంటకు 52–61 కి.మీ.ల వేగంతో వీస్తాయి. అదే తుపాను ఏర్పడితే గంటకు 63–87 కి.మీ.ల వేగంతో వీస్తాయి. తుపాను ఏర్పడాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్ను మించి ఉండాలి. అయితే అరేబియా జలాలు ఇంత వేడి ఉండవు. అదే బంగాళాఖాతంలో ఉండే వాతావరణం తుపాన్లు ఏర్పడటానికి అత్యంత అనువుగా ఉంటుంది. చారిత్రకంగా బంగాళాఖాతం, అరేబియాసముద్రాన్ని కలిపి హిందూ మహాసముద్ర ఉత్తరప్రాంతంగా పరిగణిస్తారు. హిందూ మహాసముద్రం ఉత్తరాన 1976 తర్వాత తుపాను ఏర్పడటం ఇదే తొలిసారికావడం విశేషం. 1891 ఏడాది నుంచి చూస్తే ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఆగస్ట్నెలలో కేవలం నాలుగుసార్లే తుపాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రప్రాంతంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపాన్లు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. మే, నవంబర్ మధ్యలో ఇవి విజృంభిస్తాయి. భూతాపం కారణమా?మితిమీరిన కాలుష్యం, విచ్చలవిడిగా పెరిగి పోయిన మానవ కార్యకలాపాలు, పారిశ్రా మికీకరణ, శిలాజ ఇంధనాలను మండించడంతో భూతాపోన్నతి కారణంగా వాతావ రణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో తుపాన్లకు ఈ భూతాపోన్నతికి సంబంధం ఉందేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూతాపం కారణంగా ఇది సంభవించినా ఆశ్చర్యపడా ల్సిన పనిలేదని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అభిప్రాయపడ్డారు. ‘‘దశాబ్దాలుగా ప్రాంతీయ వాతావరణంపై శాస్త్రవేత్తలకు ఉన్న అంచనాలను ఈ కొత్త పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి. వాతావరణ మార్పుల్లో కొత్త ధోరణులు అరేబియా సముద్రప్రాంతంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని చాటిచెప్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగే వర్షాకాల సీజన్, అల్ప పీడనాలు, తుపాన్ల సీజన్లపై మనకున్న అవగాహనను మరింతగా అప్డేట్ చేసుకో వాల్సిన సమయమొచ్చింది. వాతావరణంలో తరచూ ఇలాంటివే సంభవిస్తే మన ఉష్ణమండల ప్రాంత పరిస్థితుల్లోనూ మార్పులు గణనీయంగా రావొచ్చు. ఇలాంటి తుపాన్లు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి’’ అని రాజీవన్ వ్యాఖ్యానించారు. -
AP: బంగాళాఖాతంలో వాయుగుండం.. నేడు, రేపు భారీ వర్షాలు
సాక్షి, విజయవాడ: పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా వాయుగుండం కదులుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాట్లు చేశామని.. వరద ప్రవహిస్తున్న వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని.. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’’ విపత్తుల నిర్వహణ సంస్థ. మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. -
భేటీలతో మోదీ బిజీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించారు. మూడోసారి అధికారంలోకి వస్తే ‘100 రోజుల అజెండా’లో చేయాల్సిన పనులపై చర్చించారు.వరస సమీక్షలు రేమాన్ తుపాను బీభత్సం, సహాయక చర్యలు తదితరాలపై మోదీ సమీక్ష జరిపారు. దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో పౌరుల మరణానికి కారణనమైన హీట్వేవ్పై సమీక్ష జరిగింది. ఆస్పత్రుల్లో సరిపడ పడకలు, వైద్యులు, వైద్యసిబ్బంది, ఔషధాల లభ్యతపై చర్చించారు. జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. అన్నింటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తున్న ‘100 రోజుల అజెండా’పై విడిగా మరో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారంలోకి రాగానే చేపట్టాల్సిన పనుల పురోగతిపై ప్రధాని అధికారులను ఆరాతీశారు. తొలి 100 రోజుల్లో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని గతంలో మంత్రిమండలి సభ్యులను మోదీ ఆజ్ఞాపించడం తెల్సిందే. ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లు చేయండి ఎండలు, వేడి వాతావరణం కారణంగా భవనాల్లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగి అగి్నప్రమాదాలకు దారి తీయకుండా ఎప్పటికప్పుడు ఫైర్, ఎలక్ట్రిక్ సేఫ్టీ ఆడిట్లను చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అధిక ఉష్ణోగ్రతల ధాటికి అటవీప్రాంతాల్లో కార్చిచ్చు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచనలు చేశారు. ‘ మిజోరం, అస్సాం, మణిపూర్, త్రిపుర, మేఘాలయలో రేమాల్ తుపాను బాధితులకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు’ అని కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భేటీల్లో పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బెంగాల్, బంగ్లాదేశ్లో రెమాల్ తుపాను బీభత్సం
-
రెమాల్ తుఫాన్ బీభత్సం (ఫొటోలు)
-
ఉప్పాడలో ‘అల’జడి
కొత్తపల్లి : రెమాల్ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది.కెరటాల తాకిడికి యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కడలిలో కలిసిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల తాకిడికి జియోట్యూబ్ రక్షణ గోడ రాళ్లు సైతం గ్రామంలోకి వచ్చి పడ్డాయి. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. -
తీరం దాటిన తుఫాన్
-
తీరం దాటిన రెమాల్ తుఫాన్
-
తీరం దాటిన రెమాల్.. ఇక భగభగలే!
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా.. దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది.దీనికితోడు ఏపీ, యానాంలో పశ్చిమదిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు రెమాల్ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు(జూన్ 3దాకా) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
కోల్కతా: తీవ్ర తుపాను ‘రెమాల్’ ధాటికి పశ్చిమబెంగాల్ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని ఆదివారం యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెమాల్తో నష్టం తక్కువేనని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లవచ్చని చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు ఆది, సోమవారాల్లో కొన్ని రైళ్లను రద్దు చేశాయి. కోల్కతా విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు బయలుదేరాల్సిన, రావాల్సిన 394 సరీ్వసులను రద్దు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, సహాయక కార్యక్రమాల సన్నద్ధతపై అధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష జరిపారు.బంగ్లాదేశ్లో...బంగ్లాదేశ్లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్ హెచ్చరికను, కోక్స్ బజార్, చిట్టోగ్రామ్లలో 9వ నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్ ఎయిర్పోర్టులో విమాన సరీ్వసులను రద్దు చేశారు. -
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
సాక్షి, ఢిల్లీ: రెమాల్ తుపానుపై ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. వెస్ట్ బెంగాల్లో తీరం దాటనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వెస్ట్ బెంగాల్కు జాతీయ విపత్తు దళం ద్వారా అన్ని రకాల సహాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు.తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్’ ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు. -
దూసుకొస్తున్న రెమాల్ తుపాను
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉధృతంగా మారి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. అర్థరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఎఫెక్ట్తో కోల్కతాలో పలు విమానాలను రద్దయ్యాయి. బెంగాల్లో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్యం రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశముందని.. రేపటి వరకు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. -
Cyclone Remal: ఉరుములు, మెరుపులతో వర్షాలు..
-
ఈశాన్య బంగాళాఖాతం వైపు వెళ్తున్న వాయుగుండంకు రెమల్ తుపానుగా పేరు
-
తుపానుగా మారిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 12 కి.మీ. వేగంతో ఉత్తరం వైపు కదులుతూ ఉత్తర బంగాళాఖాతం మీదుగా శనివారం రాత్రి సమయంలో తుపానుగా మారింది. దీనికి రెమల్ అని నామకరణం చేశారు. రెమల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. తుపాను క్రమంగా ముందుకు కదులుతూ ఆదివారం ఉదయానికి ఈశాన్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్న పశి్చమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో.. గరిష్టంగా 135 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని వెల్లడించారు. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.ఆదివారం నాటికి నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. రాగల రెండు రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజుల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.పలుచోట్ల జల్లులు.. అక్కడక్కడా వర్షాలుమన రాష్ట్రంపై తుపాను ప్రభావం లేకపోయినా.. రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాలెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసి పడుతున్నాయి. తీరంలో చీకట్లు కమ్ముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది. కవిటి మండలంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంత ఇళ్లలో నీరు చేరింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు పడ్డాయి. తెనాలిలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి.అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 86.4 మి.మీ. భారీ వర్షం కురిసింది. శ్రీసత్యసాయి జిల్లాలోని 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలంలో 72.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 41.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ జోరు వాన కురిసింది. పల్నాడు జిల్లాలో శనివారం అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి. జిల్లా మొత్తం చల్లటి వాతావరణం ఏర్పడింది. నరసరావుపేటలో తెల్లవారుజామున మోస్తరు వర్షం కురిసింది.చిలకలూరిపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి పట్టణం, గ్రామాల్లో జల్లులు పడ్డాయి. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. ఏలూరు, జంగారెడ్డిగూడెం, ఏజెన్సీ ప్రాంతం, నూజివీడు, కైకలూరు, ఆచంట, మొగల్తూరు, నరసాపురం తదితర ప్రాంతాల్లో తుంపర్ల వర్ష కురిసింది. కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవనకొండలో 62.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
తెలుగు రాష్ట్రాలపై తుపాన్ ఎఫెక్ట్..
-
బంగాళాఖాతంలో నేడు తుపాను
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం శుక్రవారం ఉదయం మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది. ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో బంగ్లాదేశ్లోని ఖేపుపరాకు దక్షిణ నైరుతి దిశలో 700 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్కు దక్షిణ ఆగ్నేయ దిశలో 660 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ అదే ప్రాంతంలో శనివారం ఉదయానికి తుపానుగా మారనుంది. అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ శనివారం రాత్రికి తీవ్ర తుపానుగా బలపడనుంది. తరువాత అదే దిశలో కదులుతూ ఆదివారం అర్థరాత్రి పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్, బంగ్లాదేశ్లోని ఖేపుపరాల మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.దీని ప్రభావంతో శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లోను, ఆదివారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోను అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. కర్నూలు జిల్లాలో 14.7 సెంటీమీటర్ల వర్షపాతం శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లా తళ్లగోకులపాడులో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడలో 10.3, యలమంచిలి (అనకాపల్లి జిల్లా) 4.5, నెల్లిమర్ల (విజయనగరం) 4.3, చింతపల్లి (అల్లూరి సీతారామరాజు)లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మళ్లీ వడగాడ్పుల ఉధృతి తుపాను ప్రభావం రాష్ట్రంపై లేకపోవడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వడగాడ్పులు క్రమంగా ఉధృతమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో తొమ్మిది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. శనివారం 35 (విజయనగరం జిల్లాలో 15, శ్రీకాకుళంలో 10, పార్వతీపురం మన్యంలో 5, అనకాపల్లిలో 5) మండలాల్లో వడగాడ్పులు, ఆదివారం 14 (పార్వతీపురం మన్యం జిల్లాలో 6 శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 4) మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 64 (విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళంలో 17, పార్వతీపురం మన్యంలో 8, కృష్ణాలో 7, అనకాపల్లిలో 6, విశాఖపట్నంలో 2, ఏలూరులో 2, తూర్పు గోదావరిలో 1, బాపట్లలో 1) మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
బలపడుతున్న రెమాల్ తుఫాను.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మరింత బలపడి రేపటికి తీవ్ర తుఫానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫానుకు 'రెమాల్'గా నామకరణం చేశారు. ఈ తుఫాను ఆదివారం బెంగాల్, బంగ్లాదేశ్ తీరం దాతుతుందని సమాచారం.రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఈశాన్య రాష్ట్రాల మీద ప్రభావం చూపుతుందని, దీంతో బెంగాల్, ఉత్తర ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీ వర్షాలతో పాటు గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, మత్యకారులు ఎవరూ సముద్రం మీద వెళ్లకూడదని వాతావరణ శాఖ పేర్కొంది. రెమాల్ తుఫాన్ ప్రభావం.. ఏపీలో పెద్దగా ఉండకపోవచ్చు.పశ్చిమబెంగాల్లో జూన్ 1 చివరి దశ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపైన తుఫాను ప్రభావం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. తుఫాను నేపధ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని, తగిన ఏర్పాట్లు చెయ్యాలని ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. కోల్కతా, హౌరా, నదియా మొదలైన ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే సూచనలు ఉండటం వల్ల ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. -
ఏపీకి తప్పిన తుపాను ముప్పు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఈ రోజు వాయుగుండంగా బలపడే అవకాశముంది. ఈ నెల 25 నాటికి తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేమాల్ తుపాను ఏపీకి దూరంగా ఒడిస్సా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం పెరిగింది. అండమాన్ నికోబార్ పరిసరాల్లో రుతు పవనాలు విస్తరించాయి. జూన్ 1కి కేరళను తాకుతుందని అంచనా. అల్పపీడనం... ముందస్తు రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు(శుక్రవారం) తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది. -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది.దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర, శనివారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వివరించింది. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవిస్తాయని తెలిపింది.నేడు, రేపు కొన్నిచోట్ల వడగాడ్పులుమరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణంకంటే 3నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండురోజులు వడగాడ్పులు వీయనున్నాయి. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 11, పార్వతీపురం మన్యం 11, కాకినాడ 1, తూర్పు గోదావరి 1 మండలం చొప్పున 33 మండలాల్లోను, శనివారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 7, పార్వతీపురం మన్యం 5, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, బాపట్ల జిల్లాలో రెండు చొప్పున 24 మండలాల్లోనూ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని ఉంది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఈ వాయుగుండం అదే దిశలో పయనిస్తూ 25 సాయంత్రం ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. ఆపై అది తుపానుగా మారే అవకాశం ఉంది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లి బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నామమాత్రంగానే ఉండనుంది. ఫలితంగా రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. గురువారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ, శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, శనివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా మారుతుందని, అందువల్ల మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేడు 26 మండలాల్లో వడగాడ్పులు..రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా మళ్లీ అక్కడక్కడ వడగాడ్పులు వీయనున్నాయి. గురువారం శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 1 (కూనవరం) వెరసి 26 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో 5, విజయనగరం 5, పార్వతీపురం మన్యం 7 మండలాల్లోనూ వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. -
22న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25, 26 తేదీల మధ్య ఇది తుఫాను లేదా తీవ్ర తుఫానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని, అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్ఘడ్ నుంచి కొమరిన్, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో రాయలసీమలో ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మూడు రోజుల పాటు ఉత్తరాం«ధ్ర, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వైఎస్సార్ కడప, పశ్చిమ ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.పలుచోట్ల వర్షాలుశనివారం కృష్ణా, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజలో 67.75 మిల్లీవీుటర్ల వర్షం పడింది. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40 మిల్లీవీుటర్లు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మదీనాపాడులో 37, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిలకలూరులో 27.5, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 27 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదైంది.ఉవ్వెత్తున అలలువాకాడు (తిరుపతి జిల్లా): వాతావరణంలో వచ్చిన మార్పులతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో శనివారం అలలు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. సముద్రంపై పోరు గాలితోపాటు సుడులు తిప్పుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాల మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది.29న అండమాన్కు నైరుతినైరుతి రుతుపవనాలు ఈ నెల 29 నాటికి అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 1వ తేదీకి కేరళను రుతు పవనాలు తాకుతాయని, ఆ తర్వాత 2, 3 తేదీల్లో ఏపీకి విస్తరిస్తాయని పేర్కొంది. -
Sagubadi: విపత్తులకు తట్టుకునే ప్రకృతి సేద్యం.. గొప్పేంటి?
2023 డిసెంబర్ 4,5 తేదీల్లో విరుచుకుపడిన మిచాంగ్ తుపాను ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో పంటలను, ముఖ్యంగా వరి పంటను, నేలమట్టం చేసింది. అయితే, ఆ తీవ్రమైన గాలులు, వర్షాన్ని తట్టుకొని నిలబడే ఉన్నాయి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి పొలాలు. రసాయనిక వ్యవసాయ పద్ధతిలో సాగవుతున్న వరి చేలు నేలకు వాలిపోయి, నీట మునిగి ఉంటే.. వీటి పక్కన పొలాల్లో ఉన్న ప్రకృతి వ్యవసాయ వరి పంట మాత్రం చెక్కుచెదరకుండా దర్జాగా నిలబడి ఉండటం గురించి అప్పట్లోనే వార్తా కథనాలు చదివిన విషయం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. మిచాంగ్ తుపానే కాదు అంతకుముందు కూడా అనేక విపత్కర పరిస్థితుల్లోనూ ఇది స్పష్టంగా కళ్లకు కట్టిన వాస్తవం. అయితే, ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే.. ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులైన ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు డాక్టర్ ఫిల్ లీ ఈ నెల మొదటి వారంలో ఏపీలో పర్యటించారు. అనంతపురం తదితర జిల్లాల్లో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు తుపానును, కరువును దీటుగా తట్టుకొని నిలబడుతూ సుభిక్షంగా, ఉత్పాదకంగా నిలవటానికి వెనుక గల శాస్త్రీయ కారణాలను డా. ఫిల్ లీ అన్వేషించారు. అనేక కోస్తా జిల్లాల్లో మిచాంగ్ తుపానుకు నేలకొరిగిన రసాయనిక వరి పొలాల్లో గడ్డికి, పక్కనే పడిపోకుండా నిలబడిన వరి పొలాల్లో గడ్డికి మధ్య ఉన్న వ్యత్యాసాలేమిటో తన వెంట తెచ్చిన అధునాతన మైక్రోస్కోప్ ద్వారా పరిశోధించారాయన. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన వరి మొక్క కాండంలో కణ నిర్మాణం రసాయనిక వ్యవసాయంలో కన్నా బలంగా, ఈనెలు తేలి ఉండటాన్ని ఆయన గుర్తించారు. రసాయనాలతో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు నేలకొరిగింది (ఎడమ ఫైల్), ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పొలం మిచాంగ్ తుపానుకు తట్టుకుంది (కుడి ఫైల్) "మిచాంగ్ తుపాను నాటి రసాయనిక, ప్రకృతి సేద్య వరి పంటలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డా. ఫిల్ లీ అధ్యయనం" "ప్రకృతి సేద్యంతో ఒనగూడుతున్న అద్భుత ఫలితాలను కళ్లకు కట్టిన అధ్యయన ఫలితాలు" "ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత పెరుగుతుంది. అందువల్లనే ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఈ పంటలకు వస్తోందనడానికి ఇప్పుడు విస్పష్టమైన రుజువులు దొరికాయి". – డాక్టర్ ఫిల్ లీ, ఆస్ట్రేలియన్ సాయిల్ మైక్రోబయాలజిస్టు, ‘రీజెనరేట్ ఎర్త్’ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి మొక్కలు చాలా బలంగా ఉన్నాయి. ఇది ప్రకృతి సేద్య బలానికి నిదర్శనం’ అన్నారు డా. ఫిల్ లీ. అదేవిధంగా, ఏప్రిల్ మొదటి వారంలో అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన రసాయనిక, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగవుతున్న పంటలను పరిశీలించారు. ఆయా పొలాల్లో మట్టి నమూనాలను కూడా సేకరించి అధ్యయనం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన వరి కాండం (మైక్రోస్కోప్ ఎడమ చిత్రం), రసాయనాలతో పండించిన వరి కాండం (కుడి చిత్రం) బంతి పూలను ఏకపంటగా సాగు చేస్తున్న రసాయనిక పొలంలోని మట్టిలో జీవం తక్కువగా ఉందని గుర్తించారు. ఆ పొలం పక్కనే బంతితో పాటు 12 పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న పొలంలోని మట్టి నమూనాలను పరిశోధించగా.. మట్టి కణాల నిర్మాణం, ఆ మట్టిలో వైవిధ్యపూరితమైన సూక్ష్మజీవరాశి ఎంతో సుసంపన్నంగా ఉన్నట్లు గుర్తించానని డా. ఫిల్ లీ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల మట్టిలో పెరుగుతున్న జీవశక్తి, సూక్ష్మజీవరాశి వైవిధ్యత వల్లనే పంటలకు వైపరీత్యాలను తట్టుకునే శక్తి వస్తోందనడానికి విస్పష్టమైన రుజువులు దొరికాయని ఆయన తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వీడియోలు ‘ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్’ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. తిరుపతిలో 20,21 తేదీల్లో ఆర్గానిక్ మేళా.. తిరుపతి టౌన్ క్లబ్ కూడలిలోని మహతి ఆడిటోరియంలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఉ. 10.30 గం. నుంచి రాత్రి 8 గం. వరకు స్వచ్ఛంద సంస్థ ‘కనెక్ట్ 2 ఫార్మర్’ ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తులు ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. రైతులు నేరుగా తమ ఆర్గానిక్ పంట ఉత్పత్తులను వినియోగదారులకు అమ్ముకోగలిగే ఏర్పాటు చేయటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని కనెక్ట్ 2 ఫార్మర్ వ్యవస్థాపకులు శిల్ప తెలిపారు. 20న కషాయాల తయారీపై గంగిరెడ్డి, దేశవాళీ పండ్లు / పూల మొక్కల గ్రాఫ్టింగ్పై జె.ఎస్. రెడ్డి శిక్షణ ఇస్తారు. కంపోస్టింగ్పై డా.సింధు అవగాహన కల్పిస్తారు. 21న 5 దొంతర్ల పండ్లు, కూరగాయల సాగుపై, ఇంకుడుగుంతల నిర్మాణంపై విజయరామ్ ప్రసంగిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రకృతివనం ప్రసాద్ ప్రసంగిస్తారు. వివరాలకు.. 63036 06326. ఇవి చదవండి: Sagubadi: మనసుపెట్టి ఇష్టంగా.. ఏడాదికి మూడు పంటలు! -
6న రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023–24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుపాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈమేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్సార్ రైతు భరోసాతో పాటు సున్నా వడ్డీ రాయితీ కింద రైతన్నలకు రూ.1,294.34 కోట్లు అందించి వారం తిరగకముందే మరోసారి అన్నదాతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా కరువు మండలాలు ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తూ ఐదేళ్లుగా సీఎం జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పైసా కూడా బకాయి పెట్టకూడదన్న సంకల్పంతో ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తోంది. వర్షాభావంతో గతేడాది ఖరీఫ్లో 84.94 లక్షల ఎకరాలకు గానూ 63.46 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు ప్రామాణికాల (వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జలప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల స్థాయిలు) ఆధారంగా ఏడు జిల్లాల్లో 103 మండలాలు కరువుబారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులతో 14,23,995.5 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత 6.96 లక్షల మంది రైతులకు రూ.847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. 22 జిల్లాల్లో మిచాంగ్ ప్రభావం మిచాంగ్ తుపాన్ వల్ల 22 జిల్లాల్లో 6,64,380 ఎకరాల్లో 33 శాతం కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు రూ.442.36 కోట్లు పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఎకరాల్లో పంట నష్టపోయిన 1892 మంది రైతులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు రూ.1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. భారమైనా పెట్టుబడి రాయితీ పెంపు కేంద్రం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు రూ.12 వేలు ఇవ్వగా దాన్ని రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టార్కు రూ.6800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని రూ.8500కు పెంచారు. నీటి పారుదల భూములైతే గతంలో రూ.13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని రూ.17 వేలకు పెంచారు. వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టార్కు రూ.15 వేల చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మ జాతి తోటలకు రూ.20 వేల నుంచి రూ.22,500 చొప్పున, మల్బరీకి రూ.4800 నుంచి రూ.6వేలకు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదేళ్లలో రూ.3,271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా పరిహారం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. కరువు, మిచాంగ్ తుపాన్ వల్ల 2023–24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈనెల 6వతేదీన రూ.1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని సీఎం జగన్ బటన్ నొక్కి ఖాతాలకు జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు రూ.1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు రూ.3,271 కోట్లు అందించినట్లవుతుంది. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
తుపాను బాధితులకు అండగా ఉండాలి
సాక్షి, అమరావతి/తిరుపతి అర్బన్/రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని తుపాను ప్రభావిత జిల్లాల్లో కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సాంకేతిక నిపుణుల బృందం గురువారం పర్యటించింది. బాపట్ల, పశ్చిమ, తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న ధాన్యాన్ని పరిశీలించి నమూనాలు సేకరించింది. శుక్రవారం మిగిలిన జిలా్లల్లో పర్యటన అనంతరం నమూనాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక పంపనుంది. పౌరసఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. కేంద్ర బృందం పరిశీలనలో వచ్చిన ఫలితాల ఆధారంగా ధాన్యం సేకరణలో ప్రత్యేక సడలింపులు కోరతామన్నారు. తద్వారా ధాన్యం రైతులకు ఎటువంటి తగ్గింపులు లేకుండా సంపూర్ణ మద్దతు ధర అందిస్తామన్నారు. ఆహార అవసరాలకు పనికిరాని ధాన్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి కోసం కొనుగోలు చేసేలా కేంద్రాన్ని కోరతామన్నారు. మిచాంగ్ తుపాను బాధితులకు అండగా ఉండాలంటూ గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు వెలగపల్లి వరప్రసాద్రావు, కిలివేటి సంజీవయ్య కేంద్రబృందాన్ని కోరారు. గురువారం తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మీనా హోడాతో కూడిన బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించింది. రాష్ట్రం నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూ, రోడ్డు, భవనాల మంత్రిత్వశాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాకే‹Ùకుమార్, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల కిశోర్, ఆర్డీఓలు కిరణ్కుమార్, చంద్రముని తుపానుతో దెబ్బతిన్న ప్రాంతాలను తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సాయాన్ని ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, భోజన వసతుల గురించి వివరించారు. ఒక్కో వ్యక్తికి రూ.1,000, కుటుంబానికి రూ.2500 ఇవ్వడమే కాకుండా నిత్యావసర సరకులను అందించామని వివరించారు. పెద్ద ఎత్తున ఆస్తుల నష్టం జరిగినా, ప్రాణ నష్టం లేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు. విద్యుత్, రోడ్లు, ఇరిగేషన్, మత్స్యశాఖ, పంచాయతీరాజ్లకు తీవ్రమైన నష్టం జరిగినట్లు తెలియజేశారు. స్థానిక రైతులు, అధికారులు, ఎమ్మెల్యేలు చెప్పిన అన్ని అంశాలను కేంద్ర బృందం నమోదు చేసుకుంది. ఆ మేరకు కేంద్రానికి నష్టాల నివేదికను సమర్పించి అందరికి పూర్తిస్థాయిలో సాయం చేసేలా కృషి చేస్తామని తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు గురువారం పర్యటించాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం, సంగాయగూడెం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లి, కేఈ చిన్నయ్యపాలెం, కోటనందూరు, అల్లిపూడి, తొండంగి మండలం ఎ.కొత్తపల్లి, రావికంపాడు, పీఈ చిన్నాయపాలెం, ఏవీ నగరం, గొల్లప్రోలు మండలం మల్లవరం, కొత్తపల్లి మండలం రమణక్కపేట, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామాల్లో తుపానుకు దెబ్బ తిన్న వరి, అరటి తదితర ఉద్యాన పంటలు, ఇళ్లను బృందం అధికారులు పరిశీలించారు. రైతులు, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నష్టాల వివరాలు నమోదు చేశారు. పలు ప్రాంతాల్లో ధాన్యం నమూనాలు సేకరించారు. తుపాను నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని కేంద్ర బృందం తెలిపింది. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
డెల్టాలను ముంచి ఉల్టా రాతలా!?
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఆ రెండు డెల్టాల్లో అక్కడక్కడ పల్లపు ప్రాంతాల్లో కొంతమేర పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వమే ఆ పంటలను ముంచేసినట్లు చిత్రీకరిస్తూ సీఎం జగన్పై రామోజీరావు ఇష్టమొచ్చినట్లు రాసిపారేశారు. డ్రెయిన్లు, కాలువల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యంవల్లే డెల్టాల్లో పంటలు ముంపునకు గురైనట్లు చేతికొచ్చింది అచ్చేశారు. నిజానికి.. టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాడెల్టా ఆధునీకరణకు వినియోగించాల్సిన రూ.175 కోట్లను కృష్ణా నది కరకట్టపై తాను నివాసం ఉంటున్న అక్రమ నివాసాన్ని సుందరీకరించేందుకు చంద్రబాబు మళ్లించారు. అలాగే, గోదావరి డెల్టా ఆధునీకరణ నిధులనూ గోదావరి పుష్కరాలకు మళ్లించారు. ఆ పనులు చేయకుండానే కాంట్రాక్టర్ల ముసుగేసుకున్న టీడీపీ నేతలకు రూ.150 కోట్లకు పైగా దోచిపెట్టారు. ఏటా డ్రెయిన్లలో గుర్రపుడెక్క, తట్టెడు పూడిక ఎత్తకుండానే ఎత్తినట్లు చూపి రూ.వందల కోట్లను పచ్చమందకు దోచిపెట్టారు. చంద్రబాబు అవినీతివల్లే కృష్ణా, గోదావరి డెల్టాల్లో డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయింది. గత నాలుగున్నరేళ్లుగా కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఆయకట్టు చివరి భూములకు నీళ్లందిస్తూ దన్నుగా నిలుస్తున్న సీఎం జగన్కు రైతులు అండగా నిలుస్తుండటాన్ని భరించలేక రామోజీరావు నిద్రపట్టడంలేదు. దీంతో చంద్రబాబు అవినీతిని కప్పెట్టి.. ఆ నెపాన్ని సీఎం జగన్పై రుద్దుతూ ‘ప్రభుత్వం ముంచింది’ అంటూ ‘ఈనాడు’లో తప్పుడు కథనాన్ని అచ్చేశారు. రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు గత నాలుగున్నరేళ్లుగా గోదావరి, కృష్ణా డెల్టాల్లో రబీ పంటల కోతలు పూర్తికాగానే కాలువలకు మరమ్మతులు చేస్తూ.. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను తొలగిస్తూ.. ఆయకట్టు చివరి భూములకు అధికారులు నీళ్లందిస్తున్నారు. గోదావరి డెల్టాతోపాటు కృష్ణాడెల్టా చరిత్రలో గత నాలుగేళ్లుగా రబీ పంటకూ నీళ్లందిస్తున్నారు. కాలువలు, డ్రెయిన్లను సమర్థవంతంగా నిర్వహిస్తూ సమృద్ధిగా నీళ్లందిస్తుండటంతో పంటల ఉత్పత్తులు పెరగడం.. గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. తుపాన్లు, భారీ వర్షాలవల్ల పంటలకు నష్టం వాటిల్లితే.. ఆ సీజన్ ముగిసేలోగానే నష్టపోయిన రైతులకు సీఎం జగన్ పరిహారం చెల్లిస్తూ దన్నుగా నిలుస్తున్నారు. దీంతో సీఎం జగన్కు రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆదరణ పెరుగుతున్నట్లుగానే.. కృష్ణా, గోదావరి డెల్టా రైతుల్లోనూ ఆయనకు నానాటికీ మద్దతు పెరుగుతోంది. డెల్టాల ఆధునీకరణ నిధులు స్వాహా.. కృష్ణా, గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా పంటలకు సమృద్ధిగా నీళ్లందించి రైతులకు బాసటగా నిలవాలని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పించారు. జలయజ్ఞం కింద గోదావరి, కృష్ణా డెల్టాల ఆధునీకరణ పనులు చేపట్టారు. తన హయాంలో గోదావరి డెల్టా ఆధునీకరణకు రూ.748.58 కోట్లు, కృష్ణాడెల్టా ఆధునీకరణకు రూ.1,093.77 కోట్లు ఖర్చుచేసి కాలువలు, డ్రెయిన్లను అభివృద్ధి చేశారు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన బాబు.. డెల్టాల ఆధునీకరణ నిధులను దోచేశారు. ► కృష్ణాడెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.1,239.24 కోట్లు ఖర్చుచేస్తే.. ఇందులో రూ.175 కోట్లను తాను నివాసం ఉంటున్న అక్రమ కట్టడం సుందరీకరణకు మళ్లించారు. ► కాలువలు, డ్రెయిన్ల ఆధునీకరణ పనులు తూతూమంత్రంగా చేపట్టి కాంట్రాక్టర్ల ముసుగులోని టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు దోచేశారు. ► గోదావరి డెల్టా ఆధునీకరణకు 2014–19 మధ్య రూ.813.02 కోట్లు ఖర్చుచేసిన చంద్రబాబు.. అందులో చాలావరకు నిధులను గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు మళ్లించేశారు. ►పనులు చేయకుండానే చేసినట్లు చూపి పచ్చమందకు దోచిపెట్టారు. -
మానవత్వంతో స్పందించిన సీఎం
సాక్షి, తిరుపతి: ఆర్థిక సాయం కోసం ఆపన్న హస్తం కోరిన వారికి మానవత్వంతో స్పందించి వెంటనే ఆర్థిక సాయం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డిని సీఎం జగన్ ఆదేశించారు. స్థానికుల నుంచి వినతులను స్వీకరించి వాటినీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. తుపాను వల్ల పంటలు నష్టపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాళెంకు సీఎం వచ్చారు. ఆయనను కుటుంబ యాజమానులను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పి.రమణమ్మ, ఐ.కవిత కలిసి తమకు సాయం చేయాలని కోరారు. దీంతో సత్వరమే స్పందించిన సీఎం..తిరుపతి జిల్లా కలెక్టర్ కే వెంకట రమణారెడ్డిని ఇరువురికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించారు. సీఎం సూచనల మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ ఇద్దరు మహిళలరూ రూ.లక్ష వంతున చెక్కులను అందజేశారు. -
అండగా నేనున్నా
సాక్షి తిరుపతి: అధైర్యపడొద్దు.. అండగా నేనున్నానంటూ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించి బాధితులను స్వయంగా కలుసుకుని పరామర్శించారు. పంట చేతికొచ్చే సమయంలో రైతన్నకు జరిగిన అపార నష్టాన్ని చూసి సీఎం జగన్ చలించిపోయారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తామన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తీసుకొచ్చిన వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా అందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు వేళ అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై బాధిత ప్రాంతాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు చర్యలు తీసుకుందన్నారు. గన్నవరం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ తొలుత తిరుపతి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిలాల్లోని తుపాన్ బాధిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం కోట మండలం విద్యానగర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామానికి చేరుకుని కోతకు గురైన స్వర్ణముఖి నది, వరి పంటలను పరిశీలించారు. స్వర్ణముఖి కోతకు గురి కావటానికి కారణాలను ఆరా తీశారు. బాలిరెడ్డిపాళెంలో తుపాను బాధితులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. చెప్పలేనంత బాధగా ఉంది.. 'ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు జిల్లా మొత్తం సగటుతో పోల్చుకుంటే అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిసింది. దాదాపు 40 – 60 సెంటీమీటర్ల వర్షం కురిసిన పరిస్థితి. మనందరికీ జరిగిన ఈ నష్టం, కష్టం చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 92 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 8,364 మందిని తరలించాం. 25 కిలోల రేషన్ బియ్యం, కేజీ కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, లీటరు పామాయిల్ చొప్పున దాదాపు 60 వేల మందికి పైగా బాధితులకు అందచేశాం. ఏ రాష్ట్రంలోనూ లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది.. వలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థ. అందువల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదు.' అని సీఎం జగన్ తెలిపారు. 'ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇచ్చి చెబుతున్నా. నాకు నష్టం జరిగింది.. కానీ ఎదుటివాడికి మాత్రమే సాయం వచ్చింది.. నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ఏ ఒక్కరినీ నష్ట పోనివ్వం. ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. పంపిణీ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 62 వేల కుటుంబాలకు రేషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 చొప్పున డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దానివల్ల ఇళ్లలోకి నీళ్లు వచి్చన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఇవాళ మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 చొప్పున డబ్బులిచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళతారు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఊరట. పంటలు వేసి నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో విత్తనాలను అందచేస్తాం. అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. ఈ రోజు నుంచి వారంలోగా ప్రతి ఒక్కరికీ జరగాల్సిన మంచి జరుగుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు. రెట్టించిన వేగంతో యంత్రాంగం 'తుపాన్ ప్రాంతాల్లో విద్యుత్తును చాలా వేగంగా పునరుద్ధరించారు. యంత్రాంగం అంతా ఇక్కడే నిమగ్నమై రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. ఇంకా కొన్ని కాలనీల్లో విద్యుత్తు లేని పరిస్థితి ఉంటే వలంటీర్ల ద్వారా వివరాలను సేకరించి కలెక్టర్లు సమస్యను పరిష్కరిస్తారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుందని మరోసారి చెబుతున్నా. ' అని అన్నారు. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటనలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్రెడ్డి, తానేటి వనిత, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, మేకపాటి విక్రమ్రెడ్డి, కోనేటి ఆదిమూలం, ఎమ్మెల్సీలు చంద్రశేఖరరెడ్డి, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిగ మురళీధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, దామోదర్రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం మీదే.. 'ఇక్కడికి రాకముందు స్వర్ణముఖి నదిలో కోత కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో స్వయంగా చూశా. దానికి శాశ్వత పరిష్కారం వెతకాలని చెప్పా. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని, అందుకోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ సమస్యను తీరుస్తూ హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా. జిల్లాలో 110 చెరువులు ఉండగా కొన్ని చోట్ల కోతకు గురయ్యాయి. రోడ్లు మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్ల మరమ్మతుల కోసం రూ.32 కోట్ల ప్రతిపాదనలు అందాయి. యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ మంచే జరుగుతుంది. అంతేకానీ చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్యైనా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉంటే వెంటనే ‘జగనన్నకు చెబుదాం’ 1902 నంబర్కు ఫోన్ కొట్టండి. నా ఆఫీస్కే ఫోన్ వస్తుంది. తుపాన్ బాధిత ప్రాంతాల్లో అందరికీ అన్నీ అందించే బాధ్యతను కలెక్టర్ తీసుకుంటారు. నాలుగైదు రోజుల్లో వారి దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటా.' అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్ -
ఆ పత్రికలు చదవొద్దు.. అపోహలు నమ్మొద్దు: సీఎం జగన్
సాక్షి, బాపట్ల జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంలో తుపాను బాధితులతో మాట్లాడారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులు, బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు. ‘‘ఇంతటి బాధాకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ.. మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాల మధ్య ఈ ప్రభుత్వంలో ఏదైనా సంభవించరానిది సంభవిస్తే ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్న నమ్మకం మీ ప్రతి చిరునవ్వులో కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం మీది అని ఈ సందర్భంగా కచ్చితంగా చెబుతున్నా. ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుంది తప్ప.. ఏ ఒక్కరికీ చెడు జరగదని కచ్చితంగా చెబుతున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ♦ఈ రోజు ఇక్కడికి రాకముందు తిరుపతి జిల్లాలో సందర్శించాను. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ♦ఈ తుపాను తిరుపతి నుంచి మొదలుపెడితే సుదీర్ఘంగా కోస్తా తీరంలో తగులుకుంటూ పోయిన పరిస్థితులు ♦విపరీతమైన, ఎప్పుడూ చూడని వర్షం నాలుగు రోజుల వ్యవధిలోనే పడింది ♦దాని వల్ల వాటర్ లాగింగ్ జరిగి ఇబ్బందులు పడ్డాం ♦మిగిలిన ఏ రాష్ట్రాల్లో లేనిది, మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది ఒక గొప్ప వ్యవస్థ. సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ♦ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకొని నడిపించి సహాయం చేయించే ఒక గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది ♦వివక్షకు తావుండదు. నష్టం ఎవరికి జరిగినా కూడా, చివరికి మనకు ఓటు వేయని వారికి జరిగినా ఈ ప్రభుత్వం అందరికీ తోడుగా ఉంటుంది ♦ట్రాన్స్పరెంట్గా నష్టం జరిగిన వారిని గుర్తించి సచివాలయంలో సోషల్ ఆడిట్కు పేర్లు పెట్టడం జరుగుతోంది ♦పొరపాటు జరిగి ఉంటే మీ పేరు నమోదు చేసుకోవాలని లిస్టులు డిస్ప్లే చేసి మరీ సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది ♦ఇంతకు ముందు కరువు, వరదలు వచ్చినా పట్టించుకున్న పరిస్థితులు లేవు ♦గతంలో ఏరోజు ఇన్ పుట్ సబ్సిడీ వస్తుందో తెలియదు, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦ఈ నాలుగున్నరేళ్ల మీ బిడ్డ పరిపాలనలో పూర్తిగా చరిత్ర మారిన పరిస్థితి కనిపిస్తోంది ♦నీళ్లతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరినీ ఆదుకొనేందుకు, వాళ్లకు ఇవ్వాల్సిన రేషన్ తోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు ♦ఇప్పటికే రేషన్, రూ.2,500 ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు. నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీ చేయడం పూర్తవుతుంది ♦దాదాపు 12 వేల మందికి, వారికి ఇవ్వాల్సిన 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికీ రూ.2చ500 ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది ♦ప్రతి ఇంటికీ వాలంటీర్ వచ్చి దగ్గరుండి ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ♦రెండోది.. పంట నష్టానికి సంబంధించి.. ప్రతి రైతన్నకు ఒకటే చెప్పదల్చుకున్నా ♦ఎవరైనా మీకు ఇన్ పుట్ సబ్సిడీ రాదనో, ఇంకొకటి రాదనో చెబితే దయచేసి నమ్మవద్దండి ♦ఇక్కడ ఉన్నది మీ బిడ్డ ప్రభుత్వం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మీకు అన్యాయం జరగదు అనేది గుర్తు పెట్టుకోవాలి ♦మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! ♦పనిగట్టుకొని అదేపనిగా అబద్ధాలనే నిజం చేయాలని, అబద్ధాలనే పనిగట్టుకొని చూపించేవాళ్లు, రాసేవాళ్లు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం ♦ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమం చేస్తున్నారు ♦ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు ♦ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే, మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చినది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే ♦ఈ ఖరీఫ్ సీజన్కు ఇన్సూరెన్స్ వచ్చేది ఎప్పుడు? వచ్చే ఖరీఫ్ మొదలయ్యేనాటికి ♦జూన్కు రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్ కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు అప్పుడు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ♦ఇంతకు ముందు ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు ♦అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈక్రాప్ చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా ఈ క్రాప్లోకి నమోదు చేసి రైతు తరఫున కట్టాల్సిన ప్రీమియం సొమ్ము కూడా ప్రభుత్వమే కడుతూ రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలోనే ♦గతంలో చంద్రబాబు పాలనలో మీకు గుర్తుండే ఉంటుంది. ఐదేళ్లూ వరుసగా కరువు కాటకాలే ♦అయినా కూడా ఇన్సూరెన్స్ ఎంత అంటే.. కేవలం 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు ♦అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర సంవత్సరంలో దేవుడి దయ వల్ల ఎక్కడా కరువు కాటకాలు ఏమీ లేకపోయినా కూడా రైతన్నలు సమృద్ధిగా వ్యవసాయంలో బాగుపడినా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చినది 55 లక్షల మందికి రూ.7,800 కోట్లు ♦బాబు హయాంలో ఎక్కడ 3400 కోట్లు? మీ బిడ్డ హయాంలో ఎక్కడ 7800 కోట్లు? ♦చంద్రబాబు ఐదు సంవత్సరాల లెక్కలు, మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగు సంవత్సరాల లెక్కలే చెబుతున్నా. ♦ఏ సంవత్సరం అయినా ఈ ఖరీఫ్లో రైతన్న ఇబ్బంది పడితే, వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూరెన్స్ కచ్చితంగా వస్తోంది ♦ఇన్ పుట్ సబ్సిడీ కూడా దేశంలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ సీజన్ లో మీకు నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మన ప్రభుత్వం. ♦వెంటనే కలెక్టర్లు అందరూ స్పందిస్తున్నారు. ఎన్యుమరేషన్ కార్యక్రమం రేపో మరునాడో మొదలు పెడతారు ♦కలెక్టర్లు ఎన్యుమరేషన్ పూర్తి చేసే కార్యక్రమం అయిపోయిన తర్వాత 15 రోజులపాటు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో లిస్టును ప్రదర్శిస్తారు ♦గ్రామ సచివాలయంలో ఎవరైనా రైతు మిస్ అయితే, మీరు పేరు చూసుకోండి.. పొరపాటున మిస్ అయి ఉంటే మళ్లీ అవకాశం ఇస్తున్నాం, మళ్లీ వచ్చి చూసుకొని రీవెరిఫై చేసి మీకు వచ్చేట్టుగా చేస్తామని సమయం ఇస్తారు ♦వచ్చే నెలా సంక్రాంతి లోపు మీ అందరికీ ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది ♦ఇది ఇప్పుడు మాత్రమే జరుగుతున్నది కాదు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇది జరిగిస్తున్నాం ♦విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందుబాటులో ఉంచి సప్లయ్ చేస్తూ వెంటనే ఆదుకొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం ♦మీ అందరితో విన్నవించేది ఒక్కటే దయచేసి అపోహలు నమ్మొద్దు ♦మరీ ముఖ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవొద్దండి. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూడొద్దండి. వీళ్లంతా అబద్ధాలు చెబుతున్నారు ♦కేవలం మీ బిడ్డ ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోలేదు కాబట్టి వెంటనే ఈ మనిషిని తప్పించాలి, ఆ మనిషిని తీసుకొచ్చేయాలని దురుద్దేశంతో కావాలనే అబద్ధాలాడుతున్నారు ♦ఇలాంటి వారిని దయచేసి నమ్మొద్దని కోరుతున్నా ♦కచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది ♦మీ బిడ్డ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి నష్టం, ఇబ్బంది జరిగినా కచ్చితంగా మంచి జరిగించేందుకు ఒక పద్ధతి తీసుకొచ్చాం ♦సోషల్ ఆడిట్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తెచ్చి, కలెక్టర్ల వ్యవస్థను డీసెంట్రలైజేషన్ చేసి, 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఆర్డీవోల సంఖ్యను డబుల్ చేసి, జేసీల ♦సంఖ్యను డబుల్ చేసి, సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చి, వాలంటీర్ల వ్యవస్థను గ్రామ స్థాయిలోకి తీసుకొచ్చాం ♦ఎక్కడ ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడిన పరిస్థితులు వచ్చినా, ముఖ్యమంత్రిగా నేను వచ్చి జరిగే పని చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకొని, ఫొటోలకు పోజులిచ్చి, టీవీల్లోనూ, పేపర్లలోనూ నేను రావాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి ఇప్పుడు లేడు ♦ఇంతకు ముందుకు, ఇప్పటికీ తేడా అది. ♦మీ బిడ్డ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కలెక్టర్లకు ఆదేశాలిస్తాడు ♦మీకు వారం రోజులు సమయం ఇస్తున్నా, వారం తర్వాత నేనే వచ్చి ప్రజలను అడుగుతా. నేనొచ్చి అడిగినప్పుడు మా కలెక్టర్ బాగా పని చేశాడు, గొప్పగా పని చేశాడనే మాట ప్రజల నుంచి రావాలి అని చెప్పాను ♦ఇంతకు ముందు చంద్రబాబు కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. టీఆర్27కు అర్థమే చంద్రబాబుకు తెలియదు ♦కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి, వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేసి వాళ్లందరికీ సఫిషియంట్ టైమ్ ఇచ్చి బాగా జరిగిందా లేదా అని మాత్రం చూసేందుకు మీ బిడ్డ వారం తర్వాత నేను వస్తానని చెప్పినప్పుడు, ప్రజలను అడుగుతాడు అని చెప్పినప్పుడు కలెక్టర్లు, సచివాలయాలు, ఎమ్మార్వోలు, వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగెత్తి ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు మాత్రమే జరుగుతోంది. ♦జరిగిన నష్టం అపారమైనది, కాదని నేను అనను, జరగాల్సిన, చేయాల్సిన సహాయం అంతా పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. వేగంగా జరుగుతుంది ♦గత ప్రభుత్వాల కంటే మిన్నగా, ఎక్కువగా జరుగుతుంది ♦ఇవన్నీ కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా ♦ఇక టెంపరరీ డామేజ్లకు సంబంధించి, రోడ్లు, ఇరిగేషన్ ట్యాంకులు, ఇటువంటి వాటికి సంబంధించి ఎలాగూ జరుగుతాయి ♦వాటన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ రిలీఫ్ గా చేయాల్సినవన్నీ ముమ్మరంగా మొదలు పెట్టించే కార్యక్రమం వెంటనే చేస్తాం ♦పర్మినెంట్గా రెగ్యులర్గా చేయాల్సిన పనులు కూడా టేకప్ చేసే కార్యక్రమాలు చేస్తాం ♦మీ అందరి ఆప్యాయతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఇదీ చదవండి: వాలంటీర్ల ద్వారా రూ.2500 సాయం : సీఎం జగన్ -
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట నష్ట నివారణ చర్యలు
-
గాలి వానలో.. వాన నీటిలో.. రెండేళ్ల చిన్నారిని కాపాడేందుకు..
ఇటీవలి మిచౌంగ్ తుపాను.. దేశంలోని దక్షిణాదిని అతలాకుతలం చేసింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు పలు సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలోనే ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని కడంబత్తూర్కు చెందిన మునుస్వామి(40) మానవత్వానికి ప్రతీకగా నిలిచారు. ల్యాబ్ టెక్నీషియన్ అయిన మునుస్వామి.. క్యాన్సర్తో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. ఈదురు గాలులు, భారీ వర్షం, వరదలతో నిండిన రోడ్లను సైతం లెక్కచేయక దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. మునుసామి.. దేశంలోని ప్రముఖ రక్త స్టెమ్ సెల్ దాతల ప్రభుత్వేతర సంస్థ డెట్రాయ్(డీఏటీఆర్ఐ)లో పని చేస్తున్నారు. ఈ సంస్థ రక్త రుగ్మతలతో బాధపడుతున్నవారికి సహాయం అందిస్తుంది. క్యాన్సర్ బాధితల శిశువుకు చికిత్సలో మూలకణాన్ని దానం చేయడానికి ముందుకు వచ్చిన దాతకు గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్ను అందించడానికి మునుస్వామి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆ దాత బాధిత చిన్నారికి తన ఎముక మజ్జను దానం చేయడానికి అండమాన్ నుండి వచ్చి, చెన్నై నగరంలోని పాత పెరుంగులత్తూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఈ సందర్భంగా డెట్రాయ్ ఇన్ఛార్జి సుమతి మిశ్రా మీడియాతో మాట్లాడుతూ బోన్ మ్యారో డొనేషన్ రెండు విధాలుగా చేయవచ్చు. బాధిత కుటుంబంలో వారి లేదా జన్యుపరమైన పోలిక కలిగిన వారి నుంచి దీనిని సేకించవచ్చు. అయితే ఆ రెండేళ్ల బాధిత చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు.. తన బోన్ మ్యారోను దానం చేసేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చారన్నారు. వైద్య ప్రక్రియలో తాము రక్త కణాలను వెలికితీసేందుకు, ఐదు రోజుల పాటు దాతకు గ్రోత్ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చేటప్పుడు గ్యాప్ ఉండకూడదు. అప్పుడే బాధితులకు అవసరమైన మూలకణాలను సేకరించగలమని అన్నారు. ఇలా సంగ్రహించిన స్టెమ్ సెల్ ప్రాసెస్ చేశాక, దానిని బాధితులకు ఉపయోగిస్తామన్నారు. తుఫానుకు ముందు రోజున దాతకు మొదటి డోస్ ఇచ్చాం. తుపాను కారణంగా రెండవ డోస్ ఇవ్వడంపై ఆందోళన చెందాం. దాత ఉంటున్న ప్రాంతంలోని వైద్య నిపుణుల సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో మునుసామి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మునుసామి మాట్లాడుతూ చిన్నారికి చికిత్స ఆలస్యమైతే ఏమి జరుగుతుందో నాకు తెలుసు. దానిని గుర్తించినంతనే ఈ సాహసానికి దిగాను. మోటార్ సైకిల్పై ఇంటి నుండి ఉదయం 9 గంటలకు బయలుదేరాను. జాతీయ రహదారులు ఎక్కడికక్కడ జలమయమంగా ఉన్నాయి. రోడ్లు కనిపించడం లేదు. పెరంబక్కం వైపు వెళ్ళాను. చెన్నైకి వెళ్లే హైవేలను కనెక్ట్ అయ్యేందుకు ఒక అండర్ పాస్ దాటాలి. ఇది జలమయంగా ఉండటంతో మరో మార్గంలో వెళ్లాను. శ్రీపెరంబుత్తూరు నుండి పూనమల్లి రోడ్డు మీదుగా చెన్నై ఔటర్ రింగ్ రోడ్డులోకి ప్రవేశించానని మునుసామి తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా పాత పెరుంగళూరు రహదారిని కలిపే వంతెన జలమయం కావడంతో పోలీసులు అటువైపు వెళ్లడాన్ని అడ్డుకోవడంతో బైక్ని వంతెనపై ఆపి నడిచానని, అలా మూడు కిలోమీటర్ల నడిచి, తరువాత ఈదుకుంటూ చివరికి దాత ఇంటికి చేరుకుని, దాతకు ఇంజిక్షన్ ఇచ్చానని తెలిపారు. తరువాత దాత కుటుంబ సభ్యులు వర్షం తగ్గేవరకూ ఇంటిలోనే ఉండాలని కోరినప్పటికీ, మునుస్వామి తన ఇంటికి తిరిగి బయలుదేరాడు. ఆ మరుసటి కూడా రోజు దాతకు మునుస్వామి ఇంజెక్షన్ ఇచ్చాడు. కదంబత్తూర్లోని మునుస్వామి ఇంటి నుండి దాత ఇల్లు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా చదవండి: రామాలయ నూతన అర్చకులకు శిక్షణ ప్రారంభం -
అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా!
సాక్షి, అమరావతి: అబద్ధాల్లో మహా దిట్టగా పేరొందిన చంద్రబాబు ఎప్పడూ నిజాలు మాట్లాడరు. ఏది చెప్పినా అబద్ధమే. అదే తీరులో తుపాను సాయంపైనా అడ్డగోలు వాదనలతో ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతుంటే.. కళ్లుండి కూడా చంద్రబాబు వాటిని చూడలేకపోతున్నారు. తుపాను బాధితులకు భోజనం కూడా పెట్టడంలేదంటూ అవలీలగా అబద్ధాలాడేస్తున్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన హుదూద్, తిత్లీ తుఫాను సమయంలో చేయని సాయాన్ని కూడా చేసినట్లు, ఇచ్చిన అరకొర పరిహారాలను కూడా భారీగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వచ్చిన మిచాంగ్ తుపాను నుంచి ప్రజలను, ఆస్తులను రక్షించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసింది. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి అవసరమైన సకల ఏర్పాట్లు చేసింది. పునరావాస కేంద్రాల్లో మంచి వాతావరణం కల్పించి, పౌష్టికాహారాన్ని అందించింది. అయినా ప్రజలకు ఏమీ చేయడంలేదంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్న తీరుపై ప్రజల్లోనే అసహనం వ్యక్తమవుతోంది. ఉదారంగా సీఎం జగన్ సాయం తుపాను ముందు జాగ్రత్త చర్యలతోపాటు దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ఉదారంగా నిధులిస్తోంది. ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ఇచ్చే ఎక్స్గ్రేషియా నుంచి కూలిపోయిన ఇళ్లు, దెబ్బతిన్న పంటలు వంటి అన్నింటికీ చంద్రబాబు కంటే ఎంతో మెరుగ్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం అందిస్తున్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన పరిహారానికి సంబంధించి 2022–23 నుంచి 2025–26 సంవత్సరాల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) మార్గదర్శకాలకు అనుగు ణంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనలను సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 5 విడుదల చేసింది. అందుకనుగుణంగా పరిహారం ఇస్తోంది. ఇళ్లకిచ్చే పరిహారంపైనా వక్రీకరణలు టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కూలిపోయిన వారికి రూ.95 వేలతో కొత్త ఇల్లు కట్టించి, రూ.4 లక్షలతో కట్టించి ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటోంది. సీఎం జగన్ మైదాన ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోతే రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల ఇళ్లకు రూ.1.30 లక్షలు పరిహారం ఇస్తున్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇస్తున్నారు. దెబ్బ తిన్న ఇళ్లకు రూ.8 వేలు ఇచ్చిన టీడీపీ.. రూ.10 వేల ఆర్థిక సాయం చేసినట్లు అబద్ధాలాడుతోంది. దెబ్బతిన్న పశువుల షెడ్ల మరమ్మతులకు ఈ ప్రభుత్వంలో రూ.30 వేలు ఇస్తుంటే, దాన్ని రూ.2100 ఇచ్చినట్లు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా వ్యవసాయ భూముల్లో చేరిన మట్టి, ఇసుక మేట తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టారుకి రూ.12 వేలు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం దాన్ని రూ.18 వేలకు పెంచి ఆ సీజన్ చివరలో ఇస్తోంది. దెబ్బతిన్న వరి, వేరుశెనగ, పత్తి, చెరకు పంటలకు హెక్టారుకి రూ.15 వేల పరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇస్తోంది. చంద్రబాబు హయాంలో ఇదే రూ.15 వేలు.. అదీ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియక రైతులు అల్లాడేవారు. కానీ చంద్రబాబు రూ.20 వేలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 ఉన్న పరిహారాన్ని ఈ ప్రభుత్వం రూ.8,500కి పెంచి ఇస్తోంది. నీటి సదుపాయం ఉన్న భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా, సీఎం జగన్ రూ.17 వేలు ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. ఇవిగో నిజాలు చంద్రబాబు హయాంలో తిత్లి, హుదూద్ తుపాన్లకు వరి పంట దెబ్బతింటే హెక్టారుకి రూ.15 వేలు ఇచ్చి రూ.20 వేలు ఇచ్చినట్లు దొంగ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో హెక్టారుకు రూ.17 వేల పరిహారం ఇస్తున్నారు. ఆక్వాకు హెక్టారుకి రూ.30 వేలు పరిహారం ఇచ్చినట్లు చెబుతున్న చంద్రబాబు.. వాస్తవానికి ఇచ్చింది రూ.12,200 మాత్రమే. ఇదే ఆక్వా సాగుకు సీఎం వైఎస్ జగన్ హెక్టారుకి రూ.18 వేల పరిహారం ఇస్తుంటే.. రూ.8,200 ఇస్తున్నట్లు బాబు మాయ మాటలు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తులకు రూ.59 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్న చంద్రబాబు.. రూ. లక్ష ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు గాయాలైన వారికి రూ.74 వేలు ఇస్తున్న విషయాన్ని వక్రీకరిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారికి టీడీపీ హయాంలో రూ.2 లక్షలున్న పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.2.5 లక్షలకు పెంచి ఇస్తోంది. దెబ్బతిన్న బోట్లకిచ్చే పరిహారంపెంపు అయినా బాబు ఏడుపు మత్స్యకారుల బోట్లకు ఇచ్చే పరిహారాన్ని కూడా సీఎం జగన్ ప్రభుత్వం పెంచింది. బోట్లు పాక్షికంగా దెబ్బతింటే చంద్రబాబు హయాంలో రూ.5 వేలు ఇవ్వగా ఇప్పుడు రూ.6 వేలు ఇస్తున్నారు. బోట్ల మరమ్మతులకు చంద్రబాబు రూ.2100 ఇవ్వగా, జగన్ ప్రభుత్వంలో రూ.3 వేలు ఇస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న బోట్ల స్థానంలో కొత్త బోట్ల కొనుగోలుకు చంద్రబాబు హయాంలో రూ.10 వేలు ఉండగా ఇప్పుడు రూ.15 వేలు ఇస్తున్నారు. మోటార్ బోటు దెబ్బతింటే ఇప్పుడు రూ.20 వేలు ఇస్తుండగా.., అప్పట్లో రూ. 8,200 ఇచ్చిన చంద్రబాబు రూ.30 వేలు ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. తుపాను కారణంగా నిరాశ్రయులైన కుటుంబాలకు దుస్తుల కోసం టీడీపీ హయాంలో రూ.2 వేలు ఉన్న పరిహారాన్ని జగన్ ప్రభుత్వం రూ. 2,500కి పెంచి ఇస్తోంది. ఇంట్లో వస్తువులు కోల్పోయిన వారికివ్వాల్సిన సాయాన్ని కూడా జగన్ ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.2500కి పెంచింది. గతంలో లేని విధంగా రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం పునరావాస కేంద్రాల్లో ఉన్న తుపాను బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లే ముందు చంద్రబాబు ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించేది కాదు. తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు ప్రతి కుటుంబానికి రూ.1000 నుంచి రూ.2,500 వరకు ఇస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో ఏ విపత్తు వచ్చినా బాధిత కుటుంబాలకు ఆ సొమ్ము అందించింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాధిత కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. -
బెంబేలెత్తించిన టోర్నడో
సాక్షి, భీమవరం/ఆకివీడు: మిచాంగ్ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరంపైకి దూసుకొచ్చిన టోర్నడో (సుడిగాలులు) సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో టోర్నడో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని తీరప్రాంత సమీప గ్రామాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టోర్నడోలు అమెరికాను వణికిస్తుంటాయని వినడమే తప్ప.. మన ప్రాంతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాలను సైతం ఎగరేశాయి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో మంగళవారం రాత్రి టోర్నడో బీభత్సం సష్టించింది. ట్రాక్టర్లు, వరి కోత మెషిన్లు, ఇతర వాహనాలు సుడిగాలుల్లో చిక్కుకుని పైకి ఎగిరి కొంతసేపటికి నేలపై పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, వీరవాసరం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు మండలాల్లో టోర్నడో బీభత్సం సృష్టించి భారీగా ఆస్తి నష్టం కలగజేసింది. దాని ధాటికి నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి, మల్లవరంలంక గ్రామాల్లో 20 వరకు విద్యుత్ స్తంభాలు పడిపోగా.. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. రోడ్ల వెంబడి చెట్లు నేలకొరిగాయి. వీరవాసరం, అదే మండలంలోని వడ్డిగూడెం, తోలేరు గ్రామాల్లో 40 విద్యుత్ స్తంభాలు, 250 వరకు కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 40 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, పరిసర గ్రామాల్లో 200 కొబ్బరి చెట్లు, 41 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఆచంట మండలం పెదమల్లం, సిద్ధాంతం గ్రామాల మధ్య ఏర్పడిన టోర్నడో వృక్షాలను నేలకూల్చింది. ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం పక్కకు పడిపోయాయి. కాగా.. కాకినాడ జిల్లాలోనూ టోర్నడో బీభత్సం సృష్టించింది. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ ఎదురుగా సుడిగాలి ధాటికి హైవేపై వెళ్తున్న ఆటోలు గాలిలో ఎగిరాయి. సుడిగాలి రావడంతో బంక్లోని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అన్నవరం రైల్వే గేటు సమీపంలో ఆగివున్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గేటుపక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. అన్నవరం క్షేత్రంలోనూ సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఘాట్రోడ్లో వృక్షాలు నేల కూలాయి. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్, వీఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశం నగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాల్లో టోర్నడో కలకలం సృష్టించింది. నివాసాలు, దుకాణాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పీడన వ్యత్యాసమే కారణం తుపాను భూమికి చేరువగా తీరం దాటడం వల్ల టోర్నడో ఏర్పడేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంతం వెంబడి పెద్దఎత్తున ఆక్వా చెరువుల విస్తరించి ఉన్నాయి. సాధారణంగా నీరు, నేల ఉన్న ప్రదేశాల్లో ఉష్ట వ్యత్యాసాల వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులు ఏర్పడినప్పుడు గాలి పొరలు విరూపణం (షియర్) చెంది పీడనంలో కదలికలు వచ్చి సుడులు (ఎడ్డీ ఫ్లో) ఏర్పడుతుంటాయి. ఇవి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. చుట్టుపక్కల పీడన పరిస్థితులను బట్టి 150 కిలోమీటర్లు వేగంతోనూ కదులుతుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మిచాంగ్ తుపాను భూమికి చేరువగా తీరం దాటడం, తీరం వెంబడి ఉన్న అనుకూల పరిస్థితులతో టోర్నడో (సుడిగాలులు) ఏర్పడ్డాయని చెబుతున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులతో.. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని తుపాను పయనించి తీరం దాటడంతో వాతావరణంలో అసాధారణ మార్పులు తలెత్తి టోర్నడోలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వరకు ఉంది. గతంలో కొల్లేరు సరస్సులో సుడిగాలులు వచ్చాయి. – డాక్టర్ పి.రఘురామ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం -
అల్పపీడనంగా మారిన తుపాను
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని వణికించిన మిచాంగ్ తుపాను బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటిన తర్వాత క్రమేపీ బలహీన పడినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో బుధవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా తాడువాయిలో మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 29.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా దార్లపల్లిలో 29.5, ఏలూరు జిల్లా రేచర్లలో 26, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, 8 జిల్లాల పరిధిలో 137 మండలాల్లోని సుమారు వెయ్యి గ్రామాలపై మిచాంగ్ తుపాను ప్రభావం చూపింది. ♦ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల రైతులు వణికి పోయారు. పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం వద్ద గండివాగు, ముచి్చంతాల వద్ద వాగు, అనిగండ్లపాడు వద్ద దూళ్లవాగు, కూచివాగు పొంగటంతో వరి పైరు నీట మునిగింది. పూత, పిందె దశలో ఉన్న మిర్చి పంట నేలకు వంగిపోయింది. గంపలగూడెం మండలంలో కట్టెలేరులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ♦ అనకాపల్లి జిల్లాలో బుధవారం కూడా వర్షాలు పడ్డాయి. అధికారుల ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. అనకాపల్లి జిల్లా పెద్దేరు జలాశయంలోకి 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో అంతే వరద నీరు 3 ప్రధాన గేట్ల ద్వారా పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో తుపాను ప్రభావం ఎక్కువగా కనిపించిందని.. వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని కలెక్టర్ రవి పట్టాన్శెట్టి తెలిపారు. విద్యుత్ శాఖకు రూ.21 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. నాలుగు జెర్సీ ఆవులు చనిపోయాయని, 25 ఇళ్లు, 86 పూరిళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ♦ అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరితోపాటు రాజ్మా, కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది. చింతూరు డివిజన్లో పత్తి, మిరప పంటలు నీట మునిగాయి. ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పరదానిపుట్టు కాజ్వే అవతల ఉన్న పెదబయలు, పాడేరు మండలాల్లోని 150 గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. పెదబయలు మండలం పరదానిపుట్టుకు చెందిన కిల్లో రామకృష్ణ (40) మత్స్యగెడ్డలో చేపలు వేటాడుతూ జారి పడి కొట్టుకుపోయి మృతిచెందాడు. ♦ కాకినాడ జిల్లాలో ఈదురు గాలులు, భారీ వర్షాలతో పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మేడపాడులో పూరిపాక కూలిపోయి ముక్కుర్తి నాగరాజు(62) మృతిచెందాడు. చేబ్రోలులో చెరువుకు గండిపడింది. కొత్తపల్లి కొండవరంలో సుడిగాలితో సుమారు 50 ఇంటి పైకప్పులు ఎగిరిపోగా, మరికొన్ని ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ♦ అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల కాలనీలు ముంపునకు గురయ్యాయి. ♦ తిరుపతి జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాళంగి నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చింది. రిజర్వాయర్లన్నీ నిండిపోవటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి వచ్చే వరద నీటితో జాతీయ రహదారిపై 5, 6 అడుగుల ఎత్తున నీరు ప్రవహించింది. గూడూరు డివిజన్లో ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. -
శరవేగంగా ‘విద్యుత్’ పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేని వర్షాలు, వేగంగా వీచిన ఈదురు గాలులకు వందలాది గ్రామాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల కొద్దీ విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్శాఖ యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను స్థానిక ఎనర్జీ అసిస్టెంట్లతో ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల పెనుప్రమాదాలు జరగకుండా అడ్డుకోగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల సేవలు ఇప్పుడు ఎంతో మేలు చేశాయి. భారీనష్టం జరిగిన చోట కూడా రికార్డు సమయంలో.. 4 నుంచి 18 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ, తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వినియోగదారుల నుంచి టోల్ ఫ్రీ నంబరు 1912కి, కంట్రోల్ రూమ్ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది త్వరితగతిన క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయటం ద్వారా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలుగుతున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో వందశాతం సర్విసులను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి బుధవారం చెప్పారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనూ వేగంగా పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు సీఎండీ ఐ.పృథీ్వతేజ్ తెలిపారు. -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తుపాను బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, పరిహారం అందించే విషయంలో సానుభూతితో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసకురావడంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాలని చెప్పారు. బాధితులకు రేషన్ పరిహారం పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా తుపాను సహాయ, పునరుద్ధరణ చర్యలు, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లపై వారికి మార్గ నిర్దేశం చేశారు. ‘వర్షాలకు తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్ అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా క్షేత్ర స్థాయిలో బాగా పని చేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాలు కూడా మిస్ కాకుండా చూసుకోవాలి’ అని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సాయంలో లోటు రాకూడదు ♦ వర్షాల వల్ల ఇళ్లు దెబ్బ తిన్న వారికి రూ.10 వేలు ఇచ్చే విషయంలో, వర్షాల కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలో, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సందర్భంలో వారికి ఇవ్వాల్సిన ఆర్థిక సాయం తప్పకుండా ఇవ్వాలి. రేషన్ పరిహారం పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను ఉపయోగించుకోవాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలో ఇప్పటికే ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) జారీ చేశారు. ౮౦ శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకు కార్యాచరణ రూపొందించాలి. ♦దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి ఓ కానిస్టేబుల్ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్థైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. గ్రామాల్లో ఉన్న వలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ♦ ఈ సమీక్షలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ జి వీరపాండియన్, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సెక్రటరీ బి మహమ్మద్ దీవాన్, విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ♦ యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనిని కూడా ప్రాధాన్యత కార్యక్రమంగా తీసుకోండి. వర్షాలు తగ్గు ముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి. అధికారులంతా బాగా పని చేస్తున్నారు. మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. -
రైతులను ఆదుకుంటాం
వెంకటాచలం/పామర్రు/నరసాపురం రూరల్/తొండంగి/త్రిపురాంతకం: ‘ఎవరూ అధైర్య పడొద్దు... ఈ కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంది...’ అని పలువురు రాష్ట్ర మంత్రులు చెప్పారు. మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేశ్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతోపాటు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: కారుమూరి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పామర్రులో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలను, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాశులను పరిశీలించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి రూ.1,300కోట్లకు గాను, బుధవారం వరకు రైతుల ఖాతాల్లో రూ.1,089 కోట్లు జమ చేశామని, మిగిలిన మొత్తం కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని వివరించారు. కౌలు కార్డులు లేని కౌలురైతుల ధాన్యాన్ని కూడా స్థానిక సొసైటీల ద్వారా కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లా రైతులు తమ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డ్రయర్స్ ఉన్న మిల్లులకు అమ్ముకునే విధంగా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పొలంలో చల్లిన మినుము విత్తనాలు పాడైపోయిన వారికి మళ్లీ సబ్సిడీపై విత్తనాలు అందించేలా చూస్తామన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్వే: దాడిశెట్టి కాకినాడ జిల్లా ఏ.కొత్తపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. మంత్రి రాజా మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పంట నష్టం అంచనాలు అందినవెంటనే సాయం: ఆదిమూలపు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద దెబ్బతిన్న వరి పొలాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పరిశీలించారు. తహశీల్దార్ వి.కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులను అడగి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనాలు అందిన వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్ రైతు పక్షపాతి అని ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ : కాకాణి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన తిక్కవరప్పాడు, ఇస్కపాళెం, పుంజులూరుపాడు, గుడ్లూరువారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పర్యటించారు. తిరుమలమ్మపాళెం, ఇతర వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమేరకు వరినాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు ఆర్బీకేల ద్వారా 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని అందిస్తామని వివరించారు. ఏర్పాట్లు బాగున్నాయి రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నీరు ఎక్కువగా వస్తే ఎలా ఉండాలో తెలియక అయోమయంలో పడ్డాం. వెంటనే సకాలంలో అధికారులు వచ్చి చర్యలు తీసుకున్నారు. శిబిరానికి తీసుకొచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, టీ కూడా అందజేశారు. అధికారులు మా బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. – రాచూరి ముత్యాలరావు, చెరుకూరి రత్నం, తాళ్లపూడి, తూర్పు గోదావరి జిల్లా పరీక్షలు చేసి మందులిచ్చారు నేను, మా ముసలావిడ ఇద్దరమే ప్రకాశపురంలోని గుడిసెలో నివసిస్తున్నాం. తుపాను రాగానే జోరువానలో మమ్మల్ని ఇద్దర్నీ మా వలంటీర్ వచ్చి వ్యానులో తీసుకెళ్లి పునరావాస కేంద్రంలో అన్నం పెట్టించారు. వయసు మీద పడటంతో ఈ వలంటీరే దిక్కయింది. శిబిరంలో డాక్టర్లు మందులిచ్చారు. – మురాల ప్రభుదాసు, ప్రకాశపురం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సురక్షితంగా బయట పడ్డాను నా ఇల్లు బాగోలేదు. తుపాన్ వేళ ఎలా చేయాలని దిగులు పడుతున్న సమయంలో గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు భోజనాలు, టిఫిన్లు పెట్టారు. నిద్రపోవడానికి వసతి కూడా కల్పించారు. విపత్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శింగోతు నాంచార్లు, కె.పల్లెపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను నేను చాలా తుపాన్లు చూశాను. శిబిరానికి వెళ్లేందుకు నిరాకరిస్తే మా వలంటీర్ అమ్మాయి వచ్చి మామ్మా.. నేను తీసుకెళ్తాను అంటూ పట్టుబట్టింది. సిబ్బందితో వచ్చి వ్యానులో తీసుకెళ్లారు. రెండు రోజులు వేములదీవి ఈస్ట్ గ్రామంలోని తుపాను షెల్టర్లో ఉన్నాను. నేను శిబిరానికి వెళ్లిన తర్వాత నా గుడిసె కూలిపోయింది. వలంటీర్ మాట విని ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి. వలంటీర్ వల్లే బతికి బట్టకట్టాను. – మైలాబత్తుల కమలమ్మ, వేములదీవి ఈస్ట్, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా సకాలంలో ఆదుకున్నారు వర్షం నీటితో ఇల్లు మొత్తం నీరు చేరింది. అధికారులు, పంచాయతీ సిబ్బంది సకాలంలో వచ్చి మమ్మల్ని ఉన్నత పాఠశాల వద్దకు చేర్చారు. అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం, అల్పాహారం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. – గోపిరెడ్డి రమ్య, వేగేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా -
ఒక రైతు గా చెప్తున్నా.. ఎవరు బాధపడకండి..ఎమ్మెల్యే ఆర్కే భరోసా
-
మిగ్జామ్ తుపాను బాధితులకు భీమవరంలో పునరావాసకేంద్రం
-
ధైర్యంగా ఉండండి.. ప్రతీ రైతునూ ఆదుకుంటాం
-
కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్
-
రైతుల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా
-
వరద ప్రభావం నుంచి తేరుకుంటున్న చెన్నై
-
తుపాను సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష
-
Chennai Cyclone Michaung Photos: చెన్నైలో జలప్రళయం (ఫొటోలు)


