తిరుమల కొండపై నమాజ్.. వ్యక్తి అరెస్టు
తిరుపతి: తిరుమలలో నిఘాలోపం బయటపడింది. పరమ పవిత్రమైన తిరుమల కొండపై నమాజ్ చేస్తున్న ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠం కాంప్లెక్స్ క్యూ1 సమీపంలో బుధవారం ఓ వ్యక్తి నమాజ్ చేస్తూ పట్టుబడ్డాడు. నమాజ్ చేయడాన్ని గుర్తించిన భక్తుల్లో ఒకరు వీడియో తీసి భద్రతా సిబ్బందికి తెలిపారు. దీంతో ఆ వ్యక్తిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని పేరు అమీర్ అంజ అని మాత్రం తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.