ములుగును జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది.
ములుగు జిల్లా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Fri, Oct 7 2016 4:34 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM
ములుగు: ములుగును జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రోజు రోజుకు ఎక్కువవుతోంది. అఖిల పక్షాల ఆధ్వర్యంలో గతరెండు రోజులుగా ములుగులో రాస్తారోకోలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మంజల బిక్షపతి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement