
శ్యాంపిల్స్ కేసు మాఫీకి యత్నం?
శ్యాంపిల్స్ మందుల కేసును మాఫీ చేసేందుకు రాజకీయ నేతలు రంగంలోకి దిగారు.
ఎల్.ఎన్.పేట : మండల కేంద్రంలోని శ్రీగోపాల్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్లో మంగళవారం పట్టుబడ్డ శ్యాంపిల్స్ మందుల కేసును మాఫీ చేసేందుకు జిల్లాలో రాజకీయ నేతలు రంగంలోకి ప్రవేశించినట్టు ప్రచారం జరుగుతుంది.
ఏళ్ల తరబడి గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటున్న శ్యాంపిల్స్ విక్రయాలను బయటపడడంతో రెండు రోజులుగా మండల కేంద్రంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేసుకు సంబంధించిన అన్ని మందులను ఆమదాలవలస కోర్టులో అప్పగించడం జరిగిందని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎ.కృష్ణ సాక్షికి బుధవారం తెలిపారు.