Medical Services
-
గాల్లో దీపంలా పేదల ప్రాణాలు
టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీబీఎస్ కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనోగ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు.సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి పాలనలో రాష్ట్రంలోని పేదల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అత్యవసర చికిత్సకు మందులు కరువయ్యాయి. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) కేసుల నమోదు పెరిగింది. దీంతోపాటు మరికొన్ని ఇమ్యూన్ వ్యాధుల చికిత్సలో వాడే ఇమ్యూనో గ్లోబిలిన్స్ ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. సోమవారం నాటికి కర్నూలు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, తిరుపతి, నంద్యాల, విజయనగరం, పాడేరు, మరికొన్ని జీజీహెచ్ల్లో ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ల నిల్వలు “సున్నా’గా ఉన్నాయి. గడిచిన ఐదు, ఆరు నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆయా ఆస్పత్రుల్లోని వైద్యాధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వైద్య సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి సరఫరా నిలిచిపోయిందని ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేశామని చెబుతున్నారు. రాష్ట్రంలో జీబీఎస్ కేసులు క్రమంగా పెరుగుతుయని, ఈ ఇంజెక్షన్లు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఆస్పత్రుల సూపరింటెండెంట్లు పలుమార్లు చెప్పడంతో ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న రెండు, మూడు ఆస్పత్రుల నుంచి మిగిలిన వాటికి చాలీచాలనట్టుగా సర్దుబాటు చేసే పనిలో వైద్య శాఖ నిమగ్నమైంది.కేసులన్నీ రిఫర్ ప్రతి వెయ్యి మందిలో ఒకరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్కు గురవుతారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. జీబీఎస్ బారినపడిన వారిలోను స్వీయ రోగనిరోధక శక్తి దెబ్బతిని ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఈ నేపథ్యంలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడం కోసం చికిత్స సమయంలో ఇమ్యూనో గ్లోబులిన్స్ థెరపీ ఇస్తుంటారు. ప్రైవేట్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.40 వేల వరకు ఉంటోంది. ఇంత ఖరీదైన ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, చికిత్స చేయించుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు స్తోమతకు మించిన వ్యవహారం. ఇక జీబీఎస్తో పాటు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్తో బాధపడే చిన్న పిల్లలు... బోధనాస్పత్రుల్లో చేరిన సందర్భాల్లో చికిత్సకు ఇమ్యూనో గ్లోబులిన్స్ అందుబాటులో లేక ఆ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. కేవలం ఈ కారణంతో గడిచిన ఐదారు నెలలుగా అనేక కేసులను విజయవాడ, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, మచిలీపట్నం ఆస్పత్రుల నుంచి గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేసినట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పాడేరు ఆస్పత్రుల నుంచి విశాఖకు, కర్నూలు ఆస్పత్రికి అనంతపురం, కడప తదితరాల నుంచి రిఫరల్ కేసులు పెరగడంతో ఈ ఆస్పత్రుల్లో ఇంజెక్షన్ల కొరత నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రాణాలతో చెలగాటంవైద్యశాఖలో ఏఐ వినియోగం పెరగాలి.. రోగులకు వైద్య సేవలు మరింత చేరువవ్వాలి... అంటూ సీఎం చంద్రబాబు ఊదరగొడుతుంటారు. అయితే, ఆయన చెబుతున్న మాటలకు.. చేతలకు అస్సలు పొంతన కుదరట్లేదు. అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రులకు వెళితే కనీసం మందులు కూడా అందుబాటులో లేని దీనావస్థలో ఆస్పత్రులను నెట్టేశారు. మెరుగైన వైద్యం కోసం కాకుండా.. కేవలం ఇంజెక్షన్లు, మందులు లేవన్న కారణంతో రోగులను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి రిఫరల్ పేరిట ప్రభుత్వమే బంతాట ఆడుతున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. దీంతో చికిత్సల్లో కాలయాపన జరుగుతోంది. వెరసి రోగులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. మరోవైపు సకాలంలో చికిత్సలు అందక అమాయకులు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నెట్వర్క్ ఆస్పత్రులు ఆ ఇంజక్షన్ ఇవ్వడంలేదుగులియన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) అంటువ్యాధి కాదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. సోమవారం జీబీఎస్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో 43 కేసులు నమోదు కాగా వారిలో 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం పలు ఆస్పత్రుల్లో 749 ఇమ్యూనో గ్లోబులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.అయితే ఎన్టీఆర్ వైద్యసేవ కింద నెట్ వర్క్ ఆస్పత్రులు ఈ ఇంజక్షన్ను ఇవ్వడానికి ముందుకురావడంలేదన్నారు. గత ఏడాది 10 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 301 కేసులు నమోదు కాగా, వీటిలో అధిక మొత్తంలో 115 కేసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యామని వెల్లడించారు. -
మనుషుల వైద్యానికి.. పశువుల వైద్యంతో ముడి
సాక్షి, అమరావతి: బోడి గుండుకు... మోకాలికి ముడిపెట్టినట్టు.. మనుషుల వైద్య సేవల కాంట్రాక్ట్లో పశువుల వైద్య సేవల్లో అనుభవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ముడిపెట్టింది. 104 మొబైల్ మెడికల్ యూనిట్లు (ఎంఎంయూ), 108 అంబులెన్స్ల నిర్వహణ టెండర్లలో సంచార పశువైద్య సేవల్లో అనుభవం ఉన్న సంస్థలకు అర్హత కల్పిస్తూ వైద్యశాఖ నిబంధనలు పొందుపరిచింది. సాధారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల వైద్య శాఖలు ఈ టెండర్లలో పాల్గొనే సంస్థలు గతంలో ఆయా విభాగాల్లో అనుభవం, సామర్థ్యం కలిగి ఉండాలని నిబంధనలు పెడుతుంటాయి. ఏపీలో గతంలో నిర్వహించిన టెండర్లలో సైతం అవే నిబంధనలున్నాయి. కానీ, తొలిసారిగా గతానికి భిన్నంగా పశు వైద్య సేవల కల్పనలో అనుభవాన్ని ప్రస్తుత టెండర్ నిబంధనల్లో చేర్చారు. ‘భవ్య’మైన స్కెచ్లో ఇదీ భాగమేనని తెలుస్తోంది. రూ. రెండు వేల కోట్ల అంచనాలతో కూడిన ఎంఎంయూ, 108 అంబులెన్స్లు, కాల్ సెంటర్ నిర్వహణ కోసం ఐదేళ్ల కాలపరిమితికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్లను ఆహ్వానించింది. ఐదేళ్లకు రూ. రెండు వేల కోట్ల మేర అంచనాలున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీకి స్కెచ్ అయితే... 104, 108 అంబులెన్స్ల నిర్వహణలో అస్మదీయ సంస్థకు పెద్దగా అనుభవం లేదు. ఆ సంస్థ ఉత్తరాదితోపాటు, మధ్య భారత్లోని పలు రాష్ట్రాల్లో పశు సంచార వైద్య సేవల కాంట్రాక్టులు నిర్వహించిన అనుభవం మాత్రమే ఉంది. ఈ క్రమంలో కేవలం 104, 108 నిర్వహణ అనుభవం ప్రాతిపదికన నిబంధనలు ఉన్నట్లయితే అస్మదీయ సంస్థ బిడ్ పరిశీలన దశలోనే తిరస్కరణకు గురవుతుంది. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సంబంధం లేని పశు వైద్య సేవల వాహనాల నిర్వహణ అంశాన్ని టెండర్ నిబంధనల్లో చేర్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున దోచుకోవడం కోసం ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యాన్ని సైతం పణంగా పెట్టడానికి వెనుకాడటం లేదని టెండర్ నిబంధనలు చూసిన వైద్య రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక్కడ మాత్రమే వింత నిబంధనలు దేశవ్యాప్తంగా అనుభవం, అవగాహన ఉన్న సంస్థలకే 108, 104 కాంట్రాక్ట్లు ఇచ్చేలా అనేక రాష్ట్రాలు అడుగులు వేస్తుంటే... చంద్రబాబు పాలనలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం వింత నిబంధనలు విధిస్తోంది. గడిచిన ఐదేళ్లలో అంబులెన్స్లు/ఎంఎంయూలతో పాటు మొబైల్ వెటర్నరీ యూనిట్స్/వెటర్నరీ క్లినిక్స్ వంటి పశు వైద్య సేవల నిర్వహించిన అనుభవాన్ని నిబంధనల్లో చేర్చారు. 108, 104 కలిపి 1700 వాహనాలను నిర్వహించాల్సి ఉండగా బిడ్ వేసే నాటికి వంద వాహనాలు నిర్వహించిన అనుభవం ఉన్నా చాలనే షరతు పెట్టారు. అంతేకాకుండా అంబులెన్స్, ఎంఎంయూ వాహనాల నిర్వహణ అనుభవానికి మార్కులు కేటాయించే విధానాన్ని తొలగించారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని అత్యవసర వైద్య సేవల కల్పన పేరుతో కనీస అనుభవం లేని సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెడితే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలేనని వైద్య శాఖలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇలా..» గడిచిన రెండు, మూడేళ్లలో వివిధ రాష్ట్రాల్లో 108, 104 వాహనాల నిర్వహణ కోసం పిలిచిన టెండర్ల నిబంధనలను ఓసారి పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ దోపిడీ స్కెచ్ అందరికీ అర్థం అవుతుంది. » అసోంలో గతేడాది అంబులెన్స్ల నిర్వహణ కోసం వైద్య శాఖ టెండర్లు నిర్వహించింది. టెండర్ పిలిచిన నాటికి ముందు మూడు ఆర్థిక సంవత్సరాల్లో అంబులెన్స్ సేవలు నిర్వహించి ఉండటంతో పాటు, బిడ్లు వేసిన సంస్థలకు 600లకు పైగా అంబులెన్స్లు నిర్వహించిన అనుభవం, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే షరతు ఉంది. » జమ్ము కశ్మీర్లో గతేడాది అక్టోబర్లో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలకు మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 650 బేసికల్ లైఫ్ సపోర్ట్ (బీఎల్ఎస్), 150 మేజర్ లైఫ్ సపోర్ట్ (ఏఎల్ఎస్)అంబులెన్స్లతో పాటు, 50 సీట్లతో కాల్ సెంటర్ నిర్వహించిన అనుభవం ఉండాలనేది నిబంధన. » కేరళలో ప్రస్తుతం అంబులెన్స్ నిర్వహణకు టెండర్లు నడుస్తున్నాయి. బిడ్లు వేసే సంస్థలు కనీసం 150 అంబులెన్స్లు నడిపిన అనుభవం ఉండాలనే నిబంధన విధించారు. అదే విధంగా అంబులెన్స్ నిర్వహణ అనుభవానికి కూడా మార్కులు ఇచ్చి, అత్యంత అనుభవం కలిగిన సంస్థను ఎంపిక చేస్తున్నారు. » ఇక... తెలంగాణలో 2022లో 108 టెండర్లు నిర్వహించారు. మూడేళ్ల పాటు కనీసం 200 అంబులెన్స్లను, 40 సీటింగ్ సామర్థ్యంతో కాల్ సెంటర్ నిర్వహించి ఉండాలనే నిబంధన పెట్టారు. » ఛత్తీస్గఢ్లో ఎంఎంయూ వాహనాల నిర్వహణ కోసం గత నెలలో టెండర్లు పిలిచారు. బిడ్లు వేసే సంస్థలు మొబైల్ మెడికల్ వ్యాన్స్ (ఎంఎంవీ), ఎంఎంయూ, మొబైల్ హెల్త్ యూనిట్స్ నిర్వహించి ఉండాలని నిబంధన పెట్టారు. ఇక్కడ కూడా అనుభవానికి మార్కులు కేటాయించి, ఎంపిక చేస్తున్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు దొరక్క రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు అవసరమయ్యే ఇన్సులిన్ కొరత.. గ్యాస్ బిళ్లలకు కటకట.. అరకొరగానే రక్తహీనత చికిత్సలో వినియోగించే ఐరన్ సుక్రోజ్.. కనీసం దగ్గు సిరప్లు కూడా ఆస్పత్రుల్లో లభించడంలేదు. గతంలో షుగర్ రోగులకు ఇంటి దగ్గర కూడా ఇన్సులిన్ వేసుకోవడానికి నెలకు 3, 4 వెయిల్స్ ఇచ్చేవారు. నాలుగైదు నెలలుగా ఇన్సులిన్ వెయిల్స్ ఇంటికి ఇవ్వడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హీమోఫీలియా చికిత్సలో వాడే అన్ని రకాల ఇంజెక్షన్లు రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో దొరకడంలేదు. ఇలా.. అన్ని రకాల మందుల కొరత పేద రోగులను వేధిస్తోంది. మందులు బయట కొనుక్కోండంటూ రోగులకు వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఇది రోగులపై భారాన్ని మోపుతోంది.సరఫరా ‘గుండు సున్నా’రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వైద్య శాఖ మందులు సరఫరా చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో నాలుగు క్వార్టర్లుగా మందులు సరఫరా అవుతాయి. తొలి మూడు క్వార్టర్లకే మందులు సరిగా సరఫరా కాలేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టినప్పటికీ కొన్ని రకాల మందులు, సర్జికల్స్ సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి రాలేదు. ఇక నాలుగో క్వార్టర్ (జనవరి, ఫిబ్రవరి, మార్చి) మొదలై నెల రోజులైనా ఈ మూడు నెలలకు రావాల్సిన మందులు రాలేదని వైద్య సిబ్బంది చెబుతున్నారు. నిబంధనల ప్రకారం బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉండాలి. గతేడాది డిసెంబర్కి పూర్తయిన మూడు క్వార్టర్లకు ప్రధానమైన 100 రకాల మందులు కూడా అందుబాటులో లేవు. మందులు లక్షల సంఖ్యలో అవసరమని ఆస్పత్రుల నుంచి ఏపీఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పెట్టారు. రాజధానికి చేరువలోని ఆస్పత్రుల్లోనూ అవస్థలేరాజధానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు, విజయవాడ జీజీహెచ్లను కూడా మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గడిచిన మూడు క్వార్టర్లలో ఈ ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన 100 రకాల మందులు సరిగా సరఫరా కాలేదు. గుండె వైఫల్యానికి అందించే చికిత్సలో వినియోగించే ఇవాబ్రడిన్ హైడ్రోక్లోరైడ్ 5 ఎంజీ మాత్రలు 25 వేలు కావాలని గుంటూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్క మాత్ర కూడా రాలేదు. బ్యాక్టీరియా చికిత్సల్లో వాడే అమోక్సిలిన్, క్లావులనేట్ యాసిడ్ మందు 50 వేలు, మూర్ఛ, కొన్ని రకాల శస్త్ర చికిత్సలకు వినియోగించే లారాజెపామ్ ఇంజెక్షన్లు వెయ్యి కావాలని కోరినా ఇవ్వలేదు. విజయవాడ జీజీహెచ్లో కిడ్నీ, గుండె, జనరల్ మెడిసిన్ వంటి పలు విభాగాలను మందుల కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం జీజీహెచ్ అధికారులు ఫ్యాక్టర్–8 ఇంజెక్షన్ వెయిల్స్ 50, మైగ్రేన్ మాత్రలు ఫ్లూనరిన్ 13 వేలు, తేలికపాటి నొప్పుల నుంచి విముక్తి కోసం వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు 21 వేలకు డిమాండ్ పెట్టినా ఒక్కటీ పంపలేదు. సాధారణ జ్వరం, ఆర్థరైటిస్, గౌట్, తల, కండరాల నొప్పి నిగవారణకు వినియోగించే నాప్రొక్సెన్ 500 ఎంజీ మాత్రలు 30వేలు, తీవ్రమైన నొప్పుల కోసం స్వల్ప కాలిక విముక్తికి వాడే ట్రమాడోల్ హెచ్సీఎల్ 100 ఎంజీ ఇంజెక్షన్లు 8 వేలు అవసరమైన నెల్లూరు జీజీహెచ్ ఇండెంట్ పెట్టగా ఒక్కటీ సరఫరా చేయలేదు. ఇటీవల విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు బయట నుంచి మందులు కొనుగోలు చేసి తెచ్చుకోవాలని రోగులకు రాసిచ్చిన చీటీలు దగ్గు సిరప్లకూ కటకటేప్రీవెంటివ్ కేర్లో కీలకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లనూ మందుల కొరత వేధిస్తోంది. వీటిలో కనీసం దగ్గు సిరప్లకు కూడా కటకటగా ఉంటోందని కొందరు మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఇన్సులిన్, గ్యాస్, నొప్పులు, థైరాయిడ్, యాంటిబయోటిక్స్ అందుబాటులో లేవు. గుండె, న్యూరో వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన మందులు సైతం పూర్తి స్థాయిలో ఉండటంలేదు. స్కిన్ అలర్జీ, గాయాలకు వాడే ఆయింట్మెంట్ల కొరతా తీవ్రంగానే ఉంది.సూపరింటెండెంట్లు లేఖ రాసినా..డ్రగ్ స్టోర్స్లో అన్ని రకాల మందులు లేకపోవడం, కొరత కారణంగా వైద్య సేవల్లో ఇబ్బందులపై పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు సూపరింటెండెంట్లు తెలిపారు. ప్రధాన మందుల కోసం ఇండెంట్ పెట్టినా ఒక్క మందు, ఇంజెక్షన్ కూడా సరఫరా అవలేదని, దీంతో స్థానికంగా కొనాల్సివస్తోందని వెల్లడించారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటంఏపీఎంఎస్ఐడీసీ నుంచి సరఫరా అవ్వని మందులు, అత్యవసర మందుల సరఫరాకు గత ప్రభుత్వంలో ఓ సంస్థను టెండర్ ద్వారా ఎంపిక చేశారు. ఈ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఇక తిరుపతికి చెందిన జన్–ఔషధి మందుల సరఫరా సంస్థతో ఓ మంత్రి డీల్ కుదుర్చుకుని, ఆ సంస్థ ద్వారానే బోధనాస్పత్రులకు మందులు సరఫరా అయ్యేలా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఉత్తర్వులు ఇప్పించారు. జన్–ఔషధికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మెలిక పెట్టారు. అయితే ఆస్పత్రులకు పెద్దమొత్తంలో అవసరమయ్యే జన్–ఔషధి మందులను వేగంగా సరఫరా చేయలేమని సరఫరాదారులు చేతులెత్తేస్తున్నారు. ఇది ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని పలువురు వైద్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘బీమా’కు నైవేద్యం.. ఆరోగ్యం హరీ!
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలో సీఎం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు షాక్ల మీద షాక్లు ఇస్తోంది. సూపర్–6, సూపర్ సెవన్ హామీల ఎగవేతల పరంపరలో భాగంగా ఈసారి ప్రజారోగ్యానికి ఎసరు పెట్టింది. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు ఆరోగ్య బీమా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారు. కేవలం రూ.2.5 లక్షలతో బీమా పథకాన్ని అది కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోని కుటుంబాలకే వర్తింపజేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు! ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితిని రూ.ఐదు లక్షల నుంచి ఇప్పటికే ఏకంగా రూ.25 లక్షలకు పెంచి ట్రస్టు పరిధిలో అమలు చేసి 95 శాతం కుటుంబాలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కాపీ కొట్టి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన చంద్రబాబు ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో ప్రైవేట్ బీమా కంపెనీని తెరపైకి తెచ్చి ప్రజారోగ్యాన్ని దళారీల చేతికి అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఆరోగ్య బీమాను వర్తింపజేస్తే ఆస్పత్రుల మనుగడ కష్టతరం అవుతుందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెబుతుండటం గమనార్హం. పదో వంతుతో సరి.. రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రజలను నమ్మించి గద్దెకెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అందులో పది శాతానికి తగ్గించి రూ.2.5 లక్షలకు బీమాను పరిమితం చేసింది. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తించేలా మెలిక పెడుతోంది. దీన్ని ‘యూనివర్సల్ ఇన్సూరెన్స్’ అంటూ గొప్పలు చెబుతోంది. వాస్తవానికి రూ.25 లక్షల వరకూ పరిమితితో ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 95 శాతం కుటుంబాలకు నగదు రహిత వైద్య సేవలు కల్పిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎగవేతలు, కోతలే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజల ఆరోగ్య భరోసాకు తూట్లు పొడుస్తున్నారు. దేశంలో ఇప్పటికే బీమా విధానాన్ని అమలు చేసిన పలు రాష్ట్రాలు పెదవి విరిచాయి. మహారాష్ట్ర, కేరళ బీమా విధానాన్ని విడనాడి తిరిగి ఆరోగ్యశ్రీ తరహా ట్రస్ట్ విధానం బాట పట్టాయి. దీన్ని పెడచెవిన పెట్టిన కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని బలి పెడుతోంది. అంతా అస్తవ్యస్థం.. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా పథకం నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేసింది. ఎన్టీఆర్ వైద్య సేవ అని పథకం పేరు మార్చడం మినహా కనీసం శాశ్వత సీఈవోను సైతం నియమించలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలు పెట్టింది. దీంతో ఏడాది తిరగకుండానే ఆస్పత్రులు ఏకంగా నాలుగు సార్లు కూటమి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చాయి. అయినప్పటికీ సర్కారులో చలనం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను ఆస్పత్రులు నిలిపివేశాయి. చికిత్స కోసం వచ్చిన రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఇక ఆరోగ్య ఆసరా కింద ఇప్పటికే రూ.నాలుగు కోట్లకు పైగా ప్రభుత్వం రోగులకు బకాయి పడింది. ప్రభుత్వం కొత్తగా తెస్తున్న బీమా విధానంలో ఆసరా సాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది. పేరుకే పెద్దాస్పత్రులు.. ఏ మందులూ ఉండవు దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడితే డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేక పెద్దాస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులపై ప్రభుత్వం మందుల భారాన్ని మోపుతోంది. పెద్దాస్పత్రుల్లో 150 నుంచి 200 రకాల మందుల కొరత వేధిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఆస్పత్రుల్లో సిరంజ్లు, ఐవీ సెట్లు, బ్యాండేజీలు, కాటన్, యూరిన్ ట్యూబ్స్, డిస్పోజబుల్ బెడ్షీట్స్, బెటాడిన్ సొల్యూషన్ కొరత నెలకొంది. విశాఖ కేజీహెచ్లో 200 రకాలకుపైగా మందులు అందుబాటులో లేవు. దీంతో చేసేది లేక మందులు, సర్జికల్ ఐటమ్స్ బయట కొనుగోలు చేయాలని వైద్యులు రోగులకు చీటీలు రాసిస్తున్నారు. ఇక వైద్య పరికరాలు పాడైతే పట్టించుకునే వారే లేరు. ఆదుకున్న ఆరోగ్య ఆసరా.. ఒకవైపు ప్రజలకు సంపూర్ణ వైద్య భరోసా కల్పించిన వైఎస్ జగన్ మరోవైపు చికిత్స అనంతరం రోగులు కోలుకునే వరకూ ఆ కుటుంబం జీవన భృతి కోసం ఇబ్బంది పడకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆదుకున్నారు. వైద్యులు సూచించిన మేరకు నెలకు రూ.5 వేల వరకూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయిన రోజే రోగుల ఖాతాల్లో జమ చేశారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారుల కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి ఆస్పత్రి పాలైతే పోషణ కష్టతరంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం అందించిన ఆరోగ్య ఆసరా సాయం కష్ట కాలంలో వారు ఆర్ధిక ఇబ్బందుల పాలు కాకుండా ఆదుకుంది. ఇలా వైఎస్ జగన్ హయాంలో ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా లభించింది. టీడీపీ, వైఎస్సార్ సీపీ హయాంలో పథకం అమలైన తీరు, లబ్ధిదారుల సంఖ్య ఇందుకు నిదర్శనం. 2014–19 మధ్య టీడీపీ హయాంలో అరకొర ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీకి రూ.5,177.38 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా 2019–24 వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.13 వేల కోట్లకుపైగా వెచ్చించి 45 లక్షల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందించింది. మరో 24.59 లక్షల మంది రోగులకు డిశ్చార్జీ అనంతరం జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లు చెల్లించారు. నాడు కోటిన్నర కుటుంబాలకు భరోసాదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తొలిసారిగా రూ.25 లక్షల వరకూ వైద్య పరిమితితో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసింది. చేతి నుంచి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, పేదలు వైద్యం కోసం అప్పుల పాలు కాకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో కేవలం తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకే పరిమితం అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ఆపద్భాందవిలా అండగా నిలిచింది. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా పథకాన్ని విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. ఏకంగా 3,257 ప్రొసీజర్లలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలతో పాటు బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి అత్యంత ఖరీదైన శస్త్ర చికిత్సలు సైతం గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉచితంగా లభించాయి. 54 వేలకు పైగా పోస్టుల భర్తీ..ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా వైద్యశాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేసింది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ప్రధాన సమస్య మానవ వనరుల కొరతను నివారించేందుకు మునుపెన్నడూ లేని విధంగా 2019–24 మధ్య ఏకంగా 54 వేలకుపైగా వైద్య పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంట్లో వెల్లడించింది. ప్రివెంటివ్ కేర్లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్లకు (ఎంవో) గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని, 22.30 శాతం ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్రమే ఉన్నట్లు స్పష్టమైంది. గత ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేని రీతిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంది. పీహెచ్సీ వైద్యులు తమ పరిధిలోని గ్రామాలను నెలలో రెండు సార్లు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా సందర్శించి.. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందించేవారు. పట్టణ పీహెచ్సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. ఇవన్నీ ప్రజారోగ్యం పట్ల గత సర్కారు తీసుకున్న శ్రద్ధకు నిదర్శనం.జీరో వేకెన్సీ పాలసీ..2019–24 మధ్య వైద్య శాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగ విరమణ, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేశారు. కేవలం వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ –ఇన్ –ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాడు జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు దేశవ్యాప్తంగా 61 శాతం కొరత ఉండగా రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరతను అధిమించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం చాలా సందర్భాల్లో అభినందించింది. ఏపీ విధానాలపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్లు ఇస్తూ మిగిలిన రాష్ట్రాలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడిచింది. ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ కాకపోవడంతో వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది.రెండో రోజు నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, అమరావతి: నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలు రెండో రోజు మంగళవారం నిలిచిపోయాయి. రూ.3 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించలేదు. దీంతో సోమవారం నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు సేవలు అందించడం లేదు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ లబ్ధిదారులు చికిత్సల కోసం ఆస్పత్రులకు వెళ్తున్నా నగదు రహిత వైద్య సేవలు అందించడం లేదని తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేది లేక జేబులో డబ్బులు పెట్టి ప్రజలు, ఉద్యోగులు చికిత్సలు చేయించుకుంటున్నారు. మరోవైపు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధులతో మంగళవారం రాష్ట్ర వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చర్చలు నిర్వహించారు. నిలిపి వేసిన సేవలను పునఃప్రారంభించాలని కోరారు. పెండింగ్ బకాయిలు చెల్లిస్తే గానీ సేవలు అందించలేమని ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. రెండు గంటల పాటు సాగిన చర్చల్లో త్వరలోనే రూ.500 కోట్లు బిల్లులు విడుదల చేస్తామని ఆస్పత్రులకు హామీ ఇచ్చినట్టు వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి వచ్చిన హామీపై అసోసియేషన్ సభ్యులతో చర్చించి, బుధవారం తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆశా ప్రెసిడెంట్ డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. -
10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్: పేరుకుపోయిన ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవలను నిలిపివేస్తామని ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు భారీగా ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలి పాయి. ఈ మేరకు మంగళవారం తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (తెన్హా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేశ్ నేతృత్వంలోని ప్రతినిధులు ఆరోగ్య శ్రీ సీఈవోకు మెయిల్ ద్వారా లేఖ పంపారు. 12 నెలలుగా పెండింగ్లో ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 368 నెట్వర్క్ హాస్పిటల్స్ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కింద రాష్ట్రంలో 368 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఈ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ పథకాలను కూడా చేర్చారు. ఈ పథకాల కింద చేసే చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.672 కోట్లు ఉన్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అధిక ప్రచారంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కేసులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవల కింద ఇప్పటివరకు రూ.920 కోట్లు చెల్లించింది. ఇందులో పాత బకాయి రూ.672 కోట్లు పోను సుమారు రూ. 250 కోట్లు మాత్రమే కొత్తగా ఈ ఏడాది కాలంలో చెల్లించిందన్న మాట. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 368 ఆసుపత్రులకు కలిపి సుమారు రూ.1000 కోట్లకు పైగా రీయింబర్స్మెంట్ రావలసి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి. ఒక్కో ఆసుపత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని ఆసుపత్రులకు గత సంవత్సరం జనవరి బిల్లులు కూడా ఇప్పటి వరకు రాలేదు. ఈ నేపథ్యంలో 10వ తేదీలోపు బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో ఆ తేదీ నుంచే ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు తెన్హా అధ్యక్షుడు వద్దిరాజు రాకేశ్ స్పష్టం చేశారు. బకాయిలు రూ.500 కోట్లే: అధికారులు ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1000 కోట్లు ఉన్నాయన్న వాదనను ఆరోగ్యశాఖ అధికారులు తోసిపుచ్చారు. రూ.500 కోట్ల వరకు ఉంటాయని తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఏడాది కాలంలో రూ.920 కోట్లు చెల్లించామని, డిసెంబర్ చివరి వారంలో కూడా రూ.40 కోట్ల బిల్లులను విడుదల చేశామని చెప్పారు. 2014– 2023 మధ్య ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు సగటున రూ.52 కోట్ల చొప్పున గత సర్కారు చెల్లిస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ మధ్య ప్రతి నెలా నెట్వర్క్ ఆసుపత్రులకు సగటున రూ.72 కోట్లు చొప్పున చెల్లించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. -
Andhra Pradesh: నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు
సాక్షి, అమరావతి: బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ప్రాథేయపడ్డా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ), ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపేశాయి. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఈహెచ్ఎస్ కింద ఔట్పేషెంట్ (ఓపీ), ఇన్ పేషెంట్ (ఐపీ) ఇలా పూర్తి స్థాయిలో సేవలు నిలిచి పోవడంతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ‘రూ. 3 వేల కోట్ల బిల్లులు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా ఉంటోంది. సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నాం. మందులు, సర్జికల్స్, ఇతర పరికరాలు సరఫరా చేసిన వారికి చెల్లింపులు చేయలేకపోతున్నాం. దీంతో విక్రేతలు సరఫరా నిలిపేశారు. వెంటనే ఆదుకుని రూ.2 వేల కోట్లు విడుదల చేసి ఆదుకోకపోతే ఈ నెల ఆరో తేదీ నుంచి సేవలు ఆపేస్తాం’ అని వారం క్రితమే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ద్వారా అందిస్తున్న సేవలను ఆపేశాయి. ప్రజారోగ్యంతో ప్రభుత్వం చెలగాటం.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడు నెలల వ్యవధిలో బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నెట్వర్క్ ఆస్పత్రులు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చాయి. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లతోపాటు ప్రతి నెల గ్రీన్ చానెల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా చెల్లించాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని పలుమార్లు కోరాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది నెలలుగా చాలావరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ కింద ఐపీ సేవలను కూడా నిలిపేశాయి. అనారోగ్యం బారినపడి ఆరోగ్యశ్రీ కార్డుతో ఆస్పత్రులకు పేదలు వెళుతుంటే.. ‘ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు. ఉచిత వైద్యం ఆపేశాం.. మీరే చేతి నుంచి డబ్బు పెట్టుకోవాలి’ అని నిక్కచ్చిగా ఆస్పత్రుల యజమానులు తేల్చిచెబుతున్నారు. ఓ వైపు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్–6, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తూ.. మరోవైపు ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేట్పరం చేయడం కోసం ప్రజారోగ్యంతో సైతం చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాభాపేక్షకు పెద్దపీట వేసే కంపెనీలతో బీమా కార్యక్రమం అమలు కోసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చర్చలకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని.. చర్చల అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చే హామీ ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని ఆశా అధ్యక్షులు డాక్టర్ విజయ్కుమార్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలను నిలిపేసినట్టు వివరించారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కాగా ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020, జనవరి 1 నుంచి రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుందని సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేశాయి. -
ఆయుష్షు పెంచే ‘ఏఐ’
సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎండోస్కోపీ ప్రెసిడెంట్ డా. ప్రతీక్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్టెక్ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాంకృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్ కేర్లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్లో ఏఐ అడాప్షన్ రేట్ 19 శాతమే ఉంది.2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.హెల్త్కేర్ ఏఐలోభారీ పెట్టుబడులు..హెల్త్ కేర్లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్ కేర్లో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది. భారత్లో 2022కి 0.13 బిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.వైద్యంలో ఏఐ అప్లికేషన్స్ వినియోగం ఇలా..హెల్త్కేర్లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి, వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.క్యాన్సర్ చికిత్సలో అద్భుత ఫలితాలుక్యాన్సర్ చికిత్సలో ఆంకాలజీ విభాగంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్ క్యాన్సర్ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్ని గుర్తించారు. సెర్టిస్ ఏఐ యాప్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. ఏఐ–డ్రివెన్ ఆంకాలజీ డ్రగ్ డిస్కవరీతో ఫలితాలు రాబడుతున్నారు. ఊపిరితిత్తులు, మెదడు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తింపు ఫలితాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్ల అభివృద్ధి జరుగుతోంది.మారుమూల పల్లెలకూ వైద్య సేవలుఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్ కూడా ఒక డాక్టర్గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్ రిమోట్ కేర్ యాప్తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్ చెక్ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్బాట్ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి. -
పీహెచ్సీల్లో స్పెషలిస్టు వైద్య సేవలు
సాక్షి, యాదాద్రి: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన డాక్టర్లతో వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీహెచ్సీలలో ప్రాథమిక వైద్యంతో పాటు స్పెషలిస్ట్ వైద్య సేవలను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీ వరకు పీహెచ్సీలలో వారానికి మూడు రోజులు క్యాంపులు నిర్వహి స్తారు. వైద్య, ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్లు సంయుక్తంగా చేపట్టిన ఈ కార్య క్రమంలో 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 29 మంది నిపుణులైన వైద్యులు పీహెచ్సీలకు వెళ్లి 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.ఇందుకోసం భువనగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించింది. భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న స్పెషలిస్ట్ వైద్యులు ఆయా పీహెచ్సీలకు వెళతారు. వీలైతే అక్కడే వైద్యం చేసి మందులను ఇస్తారు. అవసరాన్ని బట్టి మెరుగైన వైద్యం కోసం భువనగిరి మెడికల్ కళాశాల, జిల్లా కేంద్ర ఆస్పత్రి, జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో పీడియాట్రిక్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఈఎన్టీ, సైక్రియాట్రిక్, దంత వైద్యం, ఫిజియోథెరపీ, చర్మవ్యాధులు, సాధారణ శస్త్ర చికిత్సలకు పరీక్షలు నిర్వహిస్తామని భువనగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్ తెలిపారు. -
మంగళగిరి ఎయిమ్స్లో డ్రోన్ వైద్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్కు తీసుకువచ్చారు.పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్కారుకు నిర్లక్ష్యపు సుస్తీ 'ఈ రోగానికి మందేదీ'?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి తల్లీ కొడుకు మృతివిజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన కలిశెట్టి సీతమ్మ ఇటీవల డయేరియాతో మృతి చెందింది. ఆమె మృతితో కొడుకు రవి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవి అప్పటి నుంచి విధులకు వెళ్లకుండా ఊరి బయటే ఉండిపోయాడు. అక్కడే మృతిచెందాడు.రాష్ట్రంలో నాలుగు నెలలుగా అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏ ప్రభుత్వ ఆస్పత్రిని తీసుకున్నా దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. విలేజ్ క్లినిక్లకు దిక్కు లేకుండా పోయింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టకు తిలోదకాలిచ్చింది. 104 వ్యవస్థనూ నిర్వీర్యం చేసింది. పీహెచ్సీల్లో అక్కర్లేదంటూ స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించింది. చాలా చోట్ల వైద్యులు, వైద్య సిబ్బంది స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. మందుల కొరత వేధిస్తోంది. ఏ చిన్న మందు కావాలన్నా బయటకు రాసిస్తున్నారు. ఇక పరీక్షల సంగతి అయితే మాట్లాడుకోక పోవడమే మంచిది. కొంచెం క్రిటికల్ కేసు వస్తే చాలు.. రెఫర్ చేయడమే పరిపాటిగా మారింది. ఇదేంటయ్యా.. అని అడిగితే ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని సీరియస్ అవుతున్నారు. నాలుగవ తరగతి సిబ్బందిపై నియంత్రణ కరువైంది. ఏ అర్ధరాత్రుళ్లో ఎవరికైనా సీరియస్ అయితే దేవుడే దిక్కు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫీవర్ సర్వే ఊసే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆస్పత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజారోగ్యాన్ని దీన స్థితికి తీసుకొచ్చింది.బడి బల్లలే బెడ్లు... కిటికీలే సెలైన్ స్టాండ్లు సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో జూన్ నుంచి ప్రజలు జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రులపాలవుతున్నారు. పెద్ద ఎత్తున డయేరియా కేసులు వెలుగు చూశాయి. తాజాగా విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా పంజా విసిరింది. 450 మందికిపైగా డయేరియా బారిన పడగా, వారిలో 11 మంది మృత్యువాతపడ్డారు. వెంటనే బాధితులకు మెరుగైన వైద్య సేవలు కల్పించి ప్రాణనష్టం జరగకుండా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్యం అందక ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అక్కడా ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద సక్రమంగా ఉచిత వైద్యం లభించడం లేదు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా ప్రవేశపెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ఆ పథకాన్ని ఇప్పటికే గాలికి వదిలేశారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో గ్రామాల్లో బీపీ, సుగర్ ఇతర జబ్బులతో బాధపడే వారికి క్రమం తప్పకుండా వైద్యం అందేది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యం అందించే వారు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమైందో ఎవరికీ తెలియదు. అసలు 104 వ్యవస్థ పని చేస్తోందా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పీహెచ్సీల్లో ఉన్న 150 మంది స్పెషలిస్ట్ వైద్యులనూ తొలగించి కూటమి ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని దూరం చేసింది. భయం గుప్పెట్లో గిరిజనం గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను డెంగీ, మలేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు చుట్టుముట్టాయి. ఉత్తరాంధ్ర, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు వ్యాధులతో బాధపడుతున్నారు. పీహెచ్సీ, సీహెచ్సీల్లో మందులు, పరీక్షలు సక్రమంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ఇంట్లో ఒకరికి విష జ్వరం వస్తే వైద్యానికి కనీసం రూ.5 వేలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై నుంచి మూడు నెలల వ్యవధిలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదుగురు విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారినపడి మృతి చెందారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో పాటు, తాగునీటిని సరిగా శుద్ధి చేయకపోవడంతో జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా డయేరియా ప్రబలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా విజృంభణ మొదలైంది. జగ్గయ్యపేట, వత్సవాయి ప్రాంతాల్లో 107 మంది డయేరియా బారినపడటంతో ఆరుగురు మృతి చెందారు. తిరుపతి జిల్లా కాట్రపల్లిలో డయేరియాతో రెండేళ్ల చిన్నారి, జూలైలో కర్నూలు జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిని మృత్యువు కబళించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో కలుషిత నీటి సరఫరా కారణంగా 250 మంది డయేరియా బారినపడ్డారు. వారిలో ఏడుగురు మరణించారు. ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ఇక్కట్లు జన్యు సంబంధమైన హీమోఫీలియా బాధితులకు మందులు సరిగా దొరకడం లేదు. వ్యాధిగ్రస్తుల్లో రక్తస్రావాన్ని నియంత్రించడానికి యాంటి హీమోఫీలియా ఫ్యాక్టర్ ఇంజెక్షన్లను చికిత్సల్లో వినియోగిస్తారు. ఫ్యాక్టర్ 7, 8, 9 ఇలా వివిధ రకాల ఇంజెక్షన్లు అవసరం ఉండగా, చాలా వరకు జీజీహెచ్లలో ఇవి లేవని తెలుస్తోంది. అలాగే రోగ నిరోధకత బాగా తక్కువగా ఉండే క్యాన్సర్, న్యూరో, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం వాడే ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు కూడా అన్ని జీజీహెచ్లలో లేవు. కేసులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్థానికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వ్యాధులకు చికిత్సల్లో వినియోగించే అన్ని రకాల యాంటిబయోటిక్స్ సీడీసీ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లో ఉండటం లేదు. వైరల్ జ్వరాలకు వాడే ఎమాక్సిలిన్, మలేరియా చికిత్సకు అవసరమైన ఆర్టిసినేట్ ఇంజెక్షన్ చాలా ఆస్పత్రులకు సరఫరా కావడం లేదు. చర్మ సంబంధిత వ్యాధిగ్రస్తులకు పలు రకాల క్రీములు ఆస్పత్రుల్లో లేకపోవడంతో బయటకు రాస్తున్నారు. డీ అడిక్షన్ సెంటర్లలో మందులు సరిపడా లేవు. పెరిగిపోతున్న ఖాళీలు ⇒ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీరో వేకెన్సీ పాలసీని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో ఏర్పడిన, కొత్తగా మంజూరైన పోస్టులను ఎప్పటికప్పుడే భర్తీ చేస్తూ వచ్చారు. ఇలా ఐదేళ్లలో 54 వేల పోస్టులు ఒక్క వైద్య శాఖలోనే భర్తీ చేశారు. ⇒ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జీరో వెకెన్సీ పాలసీకి బ్రేక్ వేసింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పారా మెడికల్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ నియామకాల కోసం డిస్టిక్ సెలక్షన్ కమిటీలు 2 వేలకుపైగా పోస్టుల భర్తీకి 18 నోటిఫికేషన్లు విడుదల చేశాయి. నియామక ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఈ నోటిఫికేషన్లను రద్దు చేశారు.⇒ ఓ వైపు ఆస్పత్రుల్లో ఎఫ్ఎన్వో, ఎంఎన్వో ఇతర వైద్య సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉంటే, ఆ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది. ఇక సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్య పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని కూడా ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. గతంలో గిరిజన, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో సైతం స్పెషలిస్ట్ వైద్యుల కోసం పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలు ఇచ్చి మరీ పోస్టులు భర్తీ చేశారు. ⇒ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెకండరీ హెల్త్లోని గిరిజన, మారుమూల ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ల కొరత ఉన్నప్పటికీ ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల్లో చేరిన వారు సైతం వెళ్లిపోవడం, ఇటీవల కాలంలో పదవీ విరమణలు, పదోన్నతుల అనంతరం డీఎంఈ ఆస్పత్రుల్లో 500కు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అదే విధంగా 900కుపైగా సీనియర్ రెసిడెంట్, 250కి పైగా అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోలేదు. మరోవైపు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయడం కోసం మన విద్యార్థులకు అన్యాయం చేసింది. ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయేలా చేసింది.అత్యవసర మందులూ బయటే⇒ 2019కి ముందు చిన్నారిని ఎలుకలు పీక్కుతిన్న దీనస్థితికి ప్రభుత్వాస్పత్రులు మళ్లీ దిగజారుతున్నాయా.. అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాలను పీకల వరకూ తాగించి ఆరోగ్యాలను గుల్ల చేయడంపై పెట్టిన శ్రద్ధ.. ప్రజారోగ్య పరిరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టలేదని మండిపడుతున్నారు. గ్రామాల్లోని విలేజ్ క్లినిక్ల నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులను మందుల కొరత వేధిస్తోంది. ⇒ జిల్లా, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులు ఉంచాలని వైద్య శాఖ నిర్ణయించింది. 372 మేర సర్జికల్స్, వ్యాధి నిర్ధారణ కిట్లు కూడా ఉండాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులన్నింటినీ మందులు, సర్జికల్స్ కొరత వేధిస్తోంది. గురువారం (17వ తేదీ) అన్ని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్లు అందరూ మందుల కొరత అంశాన్ని ప్రధానంగా లేవనెత్తినట్లు తెలిసింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ అందుబాటులో ఉండటం లేదని, లేని మందులను స్థానికంగా కొనుగోలు చేసుకోవాలని మంత్రి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. స్థానికంగా కొనుగోలు చేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే దీని అర్థం రోగులను బయట తెచ్చుకోమని చెప్పడమే. ⇒ ల్యాబ్లలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సరిపడా రసాయనాలు అందుబాటులో ఉండటం లేదు. పాడైన పరికరాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. కూటమి పాలనలో ప్రభుత్వాస్పత్రుల్లో మార్చురీల్లోని శవాలకు కూడా భద్రత లేకుండాపోయింది. ఏలూరు ఆస్పత్రిలో అనాథ మృతదేహాలు మాయమైన ఘటన వెలుగు చూసింది. పారిశుధ్య నిర్వహణను గాలికి వదిలేయడంతో డయేరియా విలయతాండవం చేస్తోంది. ఈ నిర్లక్ష్యం.. గర్భిణికి ఎంతకష్టం..పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఎల్.అగ్రహారానికి చెందిన గర్భిణి యర్రా శకుంతల జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమె తల్లి కంటిపాటి ధనలక్ష్మి మంగళవారం తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతుండగానే శనివారం ఉదయం ఆరు గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. తన కుమార్తెకు పురిటినొప్పులు వస్తున్నాయని ధనలక్ష్మి నర్సులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. ఈలోగా శకుంతల బాత్రూమ్కు వెళ్లగా, అక్కడే తీవ్ర రక్తస్రావమై కడుపులోని బిడ్డ తల బయటకు వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి శకుంతల వెళ్లిపోయింది. ఇది గమనించిన తల్లి.. గట్టిగా కేకలు వేయగా, శిక్షణలో ఉన్న నర్సులు వచ్చి.. గర్భిణిని డెలివరీ రూమ్కు కాకుండా ప్రసూతి వార్డుకు తరలించారు. మంచంపై పడుకోబెట్టగా ఆ మంచంపైనే శకుంతల ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తీరిగ్గా నర్సులు శకుంతలను ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి మాయ తొలగించి, కుట్లు వేశారు. నర్సింగ్ విద్యార్ధినులు సకాలంలో పట్టించుకోకపోయి ఉంటే గర్భిణి ప్రాణాలకే ముప్పు వచ్చేది. ఆస్పత్రిలో శకుంతల పడిన నరకయాతనను చూసిన వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే అంత జరుగుతున్నా, సిబ్బంది చీమ కుట్టినట్లు కూడా స్పందించక పోవడం దారుణమని మండిపడ్డారు. ఎంతలో ఎంత మార్పు అంటూ నిట్టూర్చారు. కాగా, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ ఏవీఆర్ఎస్ తాతారావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.పట్టించుకోరా అంటే.. బయటికి పొమ్మన్నారు విధుల్లో ఉన్న నర్సుల వల్లే నా బిడ్డకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది. అదృష్టవశాత్తు నా బిడ్డ ప్రాణాలతో దక్కింది. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న నా కూతురిని పట్టించుకోకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించగా.. బయటకు పొమ్మంటూ దుర్భాషలాడారు. ఆస్పత్రిలో మూడురోజుల నుంచి నా కుమార్తె నొప్పులతో బాధపడుతోందని, పరీక్షించమని వేడుకున్నా ఒక్క నర్సు కూడా పట్టించుకోలేదు. డాక్టరు వస్తారు.. సమాచారం ఇస్తాం... అంటూ మమ్మల్ని పంపేశారు. ఆస్పత్రిలో సిబ్బంది గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – ధనలక్ష్మి, గర్భిణి శకుంతల తల్లి, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం -
క్యాష్ లెస్.. యూజ్ లెస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అటకెక్కింది. నగదు రహిత వైద్యసేవలు అందక ఉద్యోగులు, పింఛన్దారులు గగ్గోలు పెడుతున్నారు. నగదు రహిత ఆరోగ్య కార్డుతో వైద్యం చేయడానికి ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. డబ్బులు చెల్లించనిదే అడ్మిట్ చేసుకోవడం లేదని ఉద్యోగులు వా పోతున్నారు. ఉద్యోగులు గత్యంతరం లేక లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పథకంతో తమకు ప్రయోజనం పెద్దగా ఉండటం లేదని వాపోతున్నారు. కొన్నేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నా, పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టడం లేదని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు బకాయిలతో.. ఈహెచ్ఎస్ పరిధిలో సుమారు 5.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 20 లక్షల మంది ఈ పథకంలోకి వస్తారు. ఈహెచ్ఎస్ కార్డు చూపిస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఫీజులేమీ తీసుకోకుండానే అడ్మిషన్ ఇచ్చి వైద్యం చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఆస్పత్రులకు ఆ సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందించడంపై ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగ సంఘాల నేతల లెక్కల ప్రకారం.. ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు దాదాపు రూ. 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. రీయింబర్స్మెంట్తో మరింత సమస్య ప్రభుత్వం ఈహెచ్ఎస్ పథకంతోపాటు రీయింబర్స్మెంట్ను కూడా అమలు చేస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులెవరైనా అనారోగ్యానికి గురైతే.. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో సొంత డబ్బుతో చికిత్స చేయించుకోవాలి. తర్వాత ఆస్పత్రి బిల్లులను ప్రభుత్వానికి సమరి్పస్తే.. ఆ సొమ్ము రీయింబర్స్మెంట్ అవుతుంది. కానీ దీనితో తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని ఉద్యోగులు, పెన్షనర్లు వాపోతున్నారు. రూ.10 లక్షల బిల్లు అయితే.. రూ.లక్ష, లక్షన్నర మాత్రమే వెనక్కి ఇస్తున్నారని, అది కూడా ఆరేడు నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత వైద్య పథకం సరిగా అమలవకపోవడం, రీయింబర్స్మెంట్ పూర్తిగా రాకపోవడంతో.. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామని, ఏటా రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తోందని ఉద్యోగులు అంటున్నారు. కాంట్రిబ్యూటరీ స్కీమ్పై అస్పష్టత గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్కు కొన్ని రోజుల ముందు ‘ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (ఈహెచ్సీటీ)’ ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేసి.. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కొంత, ప్రభుత్వం నుంచి కొంత కలిపి జమ చేయాలని పేర్కొంది. అది అమల్లోకి రాలేదు. కొత్త ప్రభుత్వం ఈ స్కీంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగదు రహిత వైద్యం అందేలా చూడాలి హెల్త్కార్డులు నిరుపయోగంగా మారాయి. రీయింబర్స్మెంట్ ద్వారా పూర్తి మొత్తం అందడం లేదు. ఉపాధ్యాయుల మూల వేతనంలో ఒక శాతం ప్రీమియం చెల్లిస్తామని, ప్రత్యేక ట్రస్టుతో పథకం అమలు చేయాలని గత ప్రభుత్వాన్ని కోరాం. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. విధివిధానాలు ఖరారుకాలేదు. అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఎం.పర్వత్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయడంలేదు హెల్త్కార్డులు నామ్ కే వాస్తేగా మారాయే తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు అందించేలా చూడాలి. – కొమ్ము కృష్ణకుమార్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆదిలాబాద్ జిల్లా బిల్లు కట్టి.. ఎదురుచూపులు నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ ప్రభుదాస్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా.. రూ.లక్ష బిల్లు అయింది. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని నాలుగు నెలలైంది. ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తల్లికి చికిత్స చేయించి.. నిజామాబాద్ జిల్లాలోని డీఆర్డీవో ఆఫీసులో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. రూ.లక్షకుపైగా బిల్లు అయితే సొంతంగా చెల్లించారు. రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుని, మూడు నెలలైనా ఇంకా రాలేదు. రూ.28 వేలు ఖర్చయితే.. రూ.12 వేలు వచ్చాయి మా అమ్మగారికి కంటి ఆపరేషన్ చేయించడం కోసం రూ.28 వేలు ఖర్చయ్యాయి. రీయింబర్స్మెంట్ కింద మెడికల్ బిల్లులు సమర్పించినప్పుడు రూ.12 వేలు మాత్రమే, అదీ ఏడాది తర్వాత అందాయి. ప్రభుత్వం నగదు రహిత చికిత్సఅందిస్తేనే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. – బుర్ర రమేష్, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం -
వెల్నెస్ సెంటర్లో వైద్యనిపుణులు లేక రోగుల తిప్పలు
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగులు, జర్నలిస్టులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్యసేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లాలో వెల్నెస్ సెంటర్ను ఆరేళ్ల కిందట ఏర్పాటు చేసినా ఇప్పటికీ కాంట్రాక్టు ఉద్యో గులతోనే కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018, సెపె్టంబర్ 5న అప్పటి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పాత కలెక్టరేట్ ఆవరణలోని భవనంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సెంటర్కు జనరల్ ఫిజీషియన్లు ముగ్గు రు, డయాబెటిక్, స్కిన్, గైనకాలజిస్ట్, చి్రల్డన్స్ డాక్టర్, కార్డియాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్ ఒక్కొక్కరు అవసరం. అయితే ప్రస్తుతం ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్తో పాటు డిప్యుటేషన్పై జనరల్ ఫిజీషియన్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక ముగ్గురు జీఎన్ఎంలకు ఒక్కరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నలుగురికి ఇద్దరు, స్వీపర్లు నలుగురికి ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. వీరందరికీ ఇన్చార్జ్గా ఫిజియోథెరపీ వివేక్ వ్యవహరిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. జిల్లాస్థాయి అధికారుల అజమాయిషీ కరువు ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి ప్రతిరోజూ కనీసం 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది వృద్ధులే కావడంతో పైఅంతస్తులో ఉన్న ఈ సెంటర్కు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పైకి.. కిందికి వెళ్లి రావడానికి మోకాళ్ల నొప్పులు ఉన్న వారి బాధలు వర్ణణాతీతం. మొదట్లో పాత కలెక్టరేట్ ఆవరణలో సువిశాలమైన భవనంలో గ్రౌండ్ఫ్లోర్లోనే ఉండేది. ఏడాదిన్నర కిందట అక్కడి నుంచి ఊరు చివర ఓ మూలకు విసిరేసినట్లు పాత డీఎంహెచ్ఓ కార్యాలయంలోకి మార్చారు. వేరే గ్రామాలు, జిల్లాల నుంచి వచ్చే వారు వెల్నెస్ సెంటర్కు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రం నడి»ొడ్డున ఉన్న కొత్త బస్టాండు లేదా రైల్వే స్టేషన్ సమీపంలోకి మార్చాలని వారు కోరుతున్నారు. ఈ ఆరేళ్లలో ఉన్నతాధికారులు ఈ కేంద్రాన్ని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడింది. ఉన్న ఒక్క జీఎన్ఎం సెలవు పెట్టిన రోజు స్వీపరే బీపీ, షుగర్ చెక్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా వ చ్చిపోతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మరోవైపు ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దీనివల్ల కొన్ని నెలలుగా వేడి నీటిలో వివిధ పరికరాలను కడిగే ఆటో క్లేవ్ యంత్రం పనిచేయడం లేదు. ఇన్వర్టర్ మరమ్మతుకు గురి కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని అధిగమించలేక పోతున్నారు. కనీసం టోకెన్ నమోదు చేసుకోలేక కొన్నిసార్లు రోగులు వెనక్కి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది కొరతతో అటెండరు, ల్యాబ్ టెక్నీíÙయనే రోగుల పేర్లను రాసుకోవాల్సి వస్తోంది.4 నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేడు నేను డయాబెటిక్ పేషెంట్ను. రెండు మూడేళ్లుగా సొంతూరు నుంచి బస్సులో ఇక్కడికి వచ్చి పోతున్నా. నాలుగు నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేకపోవడంతో వైద్యం సరిగా అందడం లేదు. జనరల్ ఫిజీషియన్ ఇ చ్చిన మందులనే వాడుతున్నాను. తరచూ కరెంట్ పోతున్నందున కొన్నిసార్లు వెనక్కి వెళ్లాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. – సత్యమ్మ, డయాబెటిక్ పేషెంట్, నాగర్కర్నూల్డాక్టర్ల కొరత తీరుస్తాం ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటాం. విద్యుత్ సమస్య పరిష్కరించాలని గతంలో ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సెంటర్లో నెలకొన్న మిగతా సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ స్వప్న, రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్, మహబూబ్నగర్ -
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్లు, ల్యాబ్లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
సుప్రీమ్ ‘అభయ’మ్!
హేయమైన కోల్కతా హత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం స్వచ్ఛందంగా జోక్యం చేసుకోవడం వ్యవస్థలపై సడలుతున్న నమ్మకాన్ని కాస్త నిలబెట్టింది. విధినిర్వహణలోని వైద్యశిక్షణార్థి జీవితాన్ని చిదిమేసిన ఆగస్ట్ 9 నాటి ఉదంతంతో వైద్యసేవకుల భద్రత, ఇతర అంశాలకు సంబంధించి సిఫార్సులు చేసేందుకు నేషనల్ టాస్క్ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను సుప్రీమ్ కోర్టు మంగళవారం ఏర్పాటు చేసింది. సంతృప్తి చెందక జాతీయస్థాయిలో జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నా అసలంటూ రోగాన్ని గుర్తించి, మందు కనుగొనే ప్రయత్నమైనా జరుగుతున్నందుకు సంతోషించాలి. ప్రముఖ డాక్టర్ల సారథ్యంలోని ఈ టాస్క్ఫోర్స్ మహిళలు సురక్షితంగా పని చేసేందుకు చేపట్టాల్సిన సమూల సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది. కోర్ట్ ఆదేశించినట్టు మూడు వారాల్లో మధ్యంతర నివేదిక, రెండు నెలల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. దేశంలో నూటికి 80 ప్రజారోగ్య వసతుల్లో నిర్ణీత ప్రమాణాలైనా లేవని జాతీయ హెల్త్ మిషనే చెబుతోంది. ఈ పరిస్థితుల్లో పనిప్రదేశంలో సురక్షిత వాతావరణ కల్పనకు ఒక విధాన ఏర్పాటుకు జాతీయ వైద్యసంఘం గత వారమే వైద్యకళాశాలలకూ, ఆస్పత్రులకూ నోటీసిచ్చింది. వైద్యులకు విశ్రాంతి గదులు, నిఘాకు సీసీ టీవీలు కరవైన మన ఆరోగ్య వ్యవస్థకు ఇప్పుడు టాస్క్ఫోర్స్ సిఫా ర్సుల చికిత్స చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగానే ఆడవాళ్ళు నైట్డ్యూటీలలో లేకుండా చూడాలని బెంగాల్ సర్కార్, ఒకవేళ డ్యూటీలో ఆడవాళ్ళుంటే వారికి తోడుండేలా చూడాలని కేంద్ర సర్కార్ సూచనలివ్వడం విడ్డూరం. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం తక్కువున్న దేశంలో దాన్ని మరింత తగ్గించే ఇలాంటి ఆదేశాలు తిరోగమన «ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి.కోల్కతా ‘అభయ’ ఘటన, చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం చేతగానితనంపై దేశమంతటా ప్రజాగ్రహం పెల్లుబుకుతుంటే... పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ యంత్రాంగం దృష్టి అంతా విమర్శకుల నోళ్ళు మూయించడంపై ఉండడం విషాదం. నిరసనకారులపై ‘రాజ్యాధికారం’ ప్రయోగించే కన్నా దేశవ్యాప్తంగా లోలోపలి భావోద్వేగాలు బయటపడుతున్న వేళ వారితో మరింత సున్నితంగా వ్యవహరించాలని సాక్షాత్తూ సుప్రీమ్ కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. అదే సమయంలో – ఘటన జరిగిన ఆర్జీ కార్ ఆస్పత్రికి అప్పట్లో ప్రిన్సిపాల్గా వ్యవహరించిన వ్యక్తిపై తీవ్రమైన ఆరోపణలున్నా ప్రభుత్వ పెద్దలు ఆయనను కాపాడాలని చూడడం నీచం. సదరు వ్యక్తి మానవ అక్రమ రవాణాకూ, బలవంతపు వసూళ్ళకూ పాల్పడినట్టు ఆయన మాజీ సహచరులే ఆరోపిస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో సాగిన అవినీతి, అక్రమాలపై కథనాలైతే కొల్లలు. అటు సీబీఐ దర్యాప్తు, ఇటు సుప్రీమ్ సొంత చొరవతో కేసులో ఇంకెన్ని లోతైన అంశాలు బయటపెడతాయో తెలీదు. ఇక, తాజాగా ఆసుపత్రికి భద్రతగా సీఐఎస్ఎఫ్ దళాల పహారా పెట్టాల్సి రావడం పోగొట్టుకున్న నమ్మకానికి పరాకాష్ఠ.అసలు మన దేశంలో ప్రతి వంద మంది డాక్టర్లలో 75 మంది సాధారణంగా రోగులు, వారి బంధువుల నుంచి ఏదో ఒక విధమైన హింస, దాడులను ఎదుర్కొన్నవారే. అమెరికాలో ఆ సంఖ్య 47 శాతమే. ఇలాంటి అనేక కారణాల రీత్యానే రెండేళ్ళ క్రితం 2022లో ప్రవేశపెట్టిన ‘ఆరోగ్య వృత్తి నిపుణులు, సంస్థలపై హింసా నిరోధక బిల్లు’ను తక్షణం ఆమోదించి, అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. నిజానికి, 2007 నుంచి మన దేశంలో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఎంపీఏ) ఉంది. 23 రాష్ట్రాలు దాన్ని తమదైన రూపంలో అమలు చేస్తున్నాయి. ఆరోగ్య సేవకుల భద్రత నిమిత్తం అలా ఇప్పటికే చట్టాలున్నా ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నది వేరే కథ. పైగా, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకం శిక్ష. అంతటా ఒకే విధమైన నమూనా చట్టం అమలయ్యేలా చూడాల్సి ఉంది. అయితే, కేవలం చట్టాలతో పరిస్థితి చక్కబడుతుందనీ, దాడుల నుంచి వైద్యులను కాపాడగల మనీ అనుకోవడం కూడా పొరపాటే. ప్రజారోగ్య సేవకుల భద్రత అనేది దీర్ఘకాలిక ప్రణాళికతో సాగాల్సిన ప్రభుత్వ విధానం. మున్ముందుగా ఉన్నతమైన వైద్యవృత్తికీ, వైద్యులకూ సమాజంలో గౌరవం ఇనుమడించే వాతావరణం పెంపొందించాలి. రోగులకు ప్రాణదాతలై రాత్రీ పగలూ లేకుండా శ్రమించే వైద్యులకు జీతభత్యాలే కాదు... మెరుగైన పని పరిస్థితులు కల్పించడం కనీస బాధ్యత. ఆరోగ్య రంగానికి నిధుల పెంపుతో పాటు ‘అభయ’ లాంటివారు 36 గంటలు ఆపకుండా పని చేయాల్సిన అవస్థ తప్పించేలా తగినంతమంది వైద్య సిబ్బందిని తీసుకోవాలి. ప్రభుత్వాలు, వైద్య సంస్థలు సమష్టిగా దీని మీద దృష్టి పెట్టాలి. సుప్రీమ్ చెప్పినట్టు ఆస్పత్రుల్లో లైంగిక వేధింపుల నిరో ధక చట్టం (పోష్) వర్తిస్తుందని గుర్తించాలి. ఇవాళ్టికీ జూనియర్ డాక్టర్లు అమానవీయ పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తున్న తీరును గుర్తించి, ముందు అక్కడ నుంచే మార్పు మొదలుపెట్టాలి. కోల్కతా ఘటనపై ఆందోళన ఆగక ముందే, మహారాష్ట్రలోని బద్లాపూర్లో బడిలో చదువుకుంటున్న ఇద్దరు కిండర్గార్టెన్ చిన్నారుల్ని కాపలాదారు రూపంలోని ఓ మానవ మృగం కాటేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్ళిన వ్యవస్థలోని విలువల పతనాన్ని మరోమారు నగ్నంగా నిలబె ట్టింది. ఈ వరుస ఘటనలు ఆందోళనతో పాటు సత్వర కార్యాచరణ అవసరాన్ని పెంచుతున్నాయి. ‘బాగా చదువుకోవాలి. బంగారు పతకం సాధించాలి. పెద్ద ఆసుపత్రుల్లో పనిచేయాలి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలి’ అంటూ డైరీలో ఆఖరిరోజున సైతం రాసుకున్న ఓ మధ్యతరగతి అమ్మాయి కలల్ని చిదిమేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాల్సిందే. ఈ ఘటనలకు మూలకారణమవుతున్న వ్యవస్థాగత లోపాల్ని సరిదిద్దాల్సిందే! సుప్రీమ్ తీసుకున్న చొరవ, పాలకుల చర్యలు అందుకు దోహదపడితేనే అభం శుభం తెలియని ‘అభయ’లెందరికో ఆత్మశాంతి. -
నా బిడ్డను బతికించండి
గాందీ ఆస్పత్రి: ప్రాణాపాయస్థితి కొట్టుమిట్టాడుతున్న తన కుమార్తెకు మెరుగైన వైద్యసేవలు అందించి కాపాడాలని ఓ కన్నతల్లి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయింది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడంలేదని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి చేరే వరకు ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం మండపేట గ్రామం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి అంబర్పేట తిరుమల నగర్లోని ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె జ్యోతి (25) తల్లితండ్రులకు చేదోడువాదోడుగా ఉంటోంది. ఈ నెల 18న ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో జ్యోతి తల, వెన్నెముక, కాళ్లు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) నమోదు చేసి అంబులెన్స్లో గాందీఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ప్రాథమిక వైద్యం అందించి, జూడాల సమ్మె కారణంగా అత్యవసర శస్త్ర చికిత్స చేయడం కుదరదని.. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు కావడంతో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ గాంధీ వైద్యులు చేతులెత్తేశారని బాధితురాలి తల్లి సుశీల పేరిట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయింది. సీఎం రేవంత్రెడ్డికి చేరేవరకూ పోస్ట్ను ఫార్వర్డ్ చేయాలని వేడుకుంది. తాము పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సోమవారం వైరల్ కావడంతో అప్పటివరకు పట్టించుకోని గాంధీ వైద్యులు స్పందించారని, న్యూరోసర్జరీ, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారని బాధితురాలి బంధువు రవిశంకర్ మీడియాకు తెలిపారు. కాగా.. గాంధీ అత్యవసర విభాగంలో మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నామని, వైరల్ అయిన పోస్ట్లో వాస్తవం లేదని గాంధీ సూపరింటెండెంట్ సీహెచ్ రాజకుమారి స్పష్టంచేశారు. జ్యోతికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. -
Sadhna Saxena: ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్గా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళగానూ ఆమె వార్తల్లో నిలిచారు. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్కి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్గా పని చేసిన మొదటి మహిళగా కూడా. సాధనా సక్సేనా పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్యా రికార్డుతో డిగ్రీ పొందింది. ఫ్యామిలీ మెడిసి¯Œ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, తల్లి–పిల్లల ఆరోగ్యంలో డిప్లొమాలతో సహా వివిధ విద్యా అర్హతలు సాధించిన సా«ధన సక్సేనా న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో చేరిన సాధనా స్విట్జర్లాండ్లోని స్పీజ్లో ఇజ్రాయెల్ డిఫె¯Œ ్స ఫోర్సెస్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్తో కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ వార్ఫేర్లో శిక్షణ పొందింది. లెఫ్టినెంట్ జనరల్ నాయర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఇపి) 2019లోని మెడికల్ ఎడ్యుకేషన్ కాంపోనెంట్లో కొంత భాగాన్ని రూపొందించడానికి ప్రతిష్టాత్మకమైన డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీకి నిపుణులైన సభ్యురాలిగా నామినేట్ చేయబడింది. మెరిటోరియస్ సర్వీస్ కోసం వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ బాధ్యతలు నిర్వహించింది. భారత రాష్ట్రపతిచే విశిష్ట సేవా పతకం పొందింది. ఆమె కుటుంబంలోని మూడు తరాల వారూ గత ఏడు దశాబ్దాలుగా సాయుధ దళాలలో పని చేశారు. -
మారని చంద్రం.. మళ్లీ ప్రైవేట్ మంత్రం..!
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే.. ఏదైనా సరే.. ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ చార్జీల బాదుడుతో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన, ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ‘ప్రైవేట్’ పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశాన్నంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది.2014-19 బాబు పాలనలో..20 లక్షలకు పైనే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక్కటీ లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి కోరగా.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం. అందుకు రూ.350 కోట్లు కావాలి. నిర్వహణకు ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలకైతే అనుమతి ఇస్తాం’ అని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.2019-24 వైఎస్ జగన్ హయాంలో..‘‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తాం’ అని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. నేడు మళ్లీ బాబు రాకతో..కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధనాస్పత్రి ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాస్పత్రుల్లో నిర్దేశించిన చార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల వైద్య విద్య కలను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కలలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.జగన్ మోడల్ ఇలా..⇒ పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ⇒ మెడికల్ సీట్లు మన రాష్టంలోనే ఉంటాయి... ఫీజులు తక్కువ ⇒ పోటీతత్వం పెరిగి ప్రైవేట్లో కూడా రేట్లు తగ్గుతాయి. ⇒ ప్రభుత్వమే కాలేజీలను నిర్మించి నిర్వహిస్తుంది. ⇒ మెరుగైన నిర్వహణకు కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. ⇒ అవి కాలేజీ అభివృద్ధికే ఉపయోగిస్తారు. ⇒ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తారు. గుజరాత్ మోడల్ ఇదీ..⇒ భూమి, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ⇒ మెడికల్ కాలేజీని మాత్రమే కడతారు ⇒ మొదటి ఏడాదే ఆదాయం రూ.50 కోట్లతో మొదలవుతుంది. ⇒ ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్లి 30 ఏళ్ల తరువాత వదిలించుకుని వెళ్లిపోతారు.ఒకేసారి 17 కళాశాలలు ఓ చరిత్ర2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పిచారు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిజమైన అమ్మకం అంటే ఇదే! గతేడాది మెరుగైన నిర్వహణ కోసం ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు ‘వైద్య విద్యనూ అమ్మేశారు’ ‘వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్’ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు.పీపీపీతో వైద్యానికి తూట్లు ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే.. గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా బోధనాస్పత్రి, కళాశాలను నెలకొల్పడం), బ్రౌన్ ఫీల్డ్ (అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి కొత్త వైద్య కళాశాలను నెలకొల్పడం) ఇలా రెండు విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆస్పత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కళాశాల, బోధనాస్పత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆస్పత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి, ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేట్ వారు నిర్మిస్తారు. ఈ రెండు విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023–24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. అక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా) సీట్లకు రూ.25 వేలు ఫీజు ఉంది. అదే పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు రూ.5.50 లక్షలు, రూ.6.65 లక్షలు వరకూ ఉన్నాయి. యాజమాన్య (బీ కేటగిరి) కోటాకు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఫీజులున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్లో కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పేదల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కి.మీ ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాలో ఒక బోధనాస్పత్రిని అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ భావించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్స్సెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అరకొర వసతులతో నడిపే ఆస్పత్రుల్లో చేసిందే వైద్యం అనే పరిస్థితులున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకూ చింతా లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు చికిత్సలు లభిస్తాయి. అంతేకాకుండా 17 కొత్త కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చి మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ జగన్ యోచించారు. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదుటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ మెడికల్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. తద్వారా కళాశాలల నిర్మాణ భారాన్ని ప్రభుత్వమే భరించి లాభాపేక్ష లేకుండా వాటిని నిర్వహించాలనేది వైఎస్ జగన్ విధానం. తమిళనాడు మోడల్ కావాలిప్రభుత్వాన్ని దోచేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం గుజరాత్ మోడల్. అది ప్రజలకు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసే తమిళనాడు తరహా 69 శాతం రిజర్వేషన్ మోడల్ను ఏపీలో అమలు చేయాలి. సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడమే చంద్రబాబు విధానం అనే విషయం గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ధనికులకే వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను ఆయన పాలనలో అమాంతం పెంచారు. 2014–19 మధ్య రూ.2.5 లక్షలుగా ఉన్న ఎంబీబీఎస్ బీ కేటగిరి ఫీజును అమాంతం పెంచారు. రూ.5 లక్షలున్న మెడికల్ పీజీ బీ కేటగిరి ఫీజును రూ.25 లక్షలకు తీసుకుని వెళ్లారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రభుత్వ పరిధిలోనే కొనసాగాలి పీపీపీ విధానంలో గుజరాత్ తరహాలో కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో అనేక అనుమనాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆ«దీనంలో కళాశాలలు నడవాలన్నదే గుజరాత్ విధానం అయితే దాన్ని ఇక్కడ అమలు చేయకూడదు. గుజరాత్ తరహా ప్రైవేటీకరణ విధానాలను ఏపీ ప్రజలు ఆహ్వానించరు. ప్రభుత్వ పరిధిలోనే కళాశాలలను నిర్వహించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – సీహెచ్. బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
వైద్య సేవలందక వ్యక్తి మృతి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సకాలంలో వైద్య సేవలు అందక నెల్లూరు జిల్లా సైదాపురంలో ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆగ్రహించిన ప్రజలు పీహెచ్సీ ఎదుట ధర్నాకు దిగారు. సైదాపురం దళితవాడకు చెందిన మల్లారపు వీరరాఘవయ్య (49) ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం అతడి నోట్లో నుంచి నురుగు రావడంతో సమీపంలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ కేవలం స్టాఫ్ నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రథమ చికిత్స కూడా చేయకుండానే గూడూరు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సలహా ఇవ్వడంతో గూడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు దళితవాడకు చెందిన యువత పీహెచ్సీకి చేరుకుని ధర్నాకు దిగారు. కనీస వైద్య సేవలు అందకపోవడం వల్లే వీరరాఘవయ్య మృతి చెందాడని వాపోయారు. వివిధ పార్టీల నేతలు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఉన్నతాధికారులు వచ్చేంత వరకు ఆందోళన విరమించమని భీషి్మంచుకు కూర్చున్నారు. ఎస్ఐ డీఎస్ విజయ్కుమార్ అక్కడకు చేరుకుని సమగ్ర విచారణ జరిపారు. ఇక్కడి పరిస్థితిని రాపూరు సీఐ విజయకృష్ణకు వివరించారు. అక్కడి నుంచే సీఐ ఆందోళనకారులను శాంతింపజేశారు. – సైదాపురం -
ఏజెన్సీ ‘నాడి’ పట్టేదెవరు
అందితే సర్కారు వైద్యం.. లేదంటే ఆకు పసర్లే ఆధారం అన్నట్టుగా బతికే గిరిజనులు వారు.. ఏదైనా జబ్బు వస్తే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లడానికే నానా యాతన. అక్కడ డాక్టర్ లేకుంటేనో, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటేనో.. ప్రాణాల మీద ఆశలు పోయినట్టే. పట్టణాలకు వచ్చి ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేక.. దూర ప్రాంతాల్లోని పెద్దాస్పత్రులకు తరలించేలోపే ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు.. ఏనాడూ ఎవరూ సరిగా పట్టించుకోని సమస్య. ప్రభుత్వాలు ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోవడం.. ఆస్పత్రులు కట్టినా పోస్టులు భర్తీ చేయకపోవడం.. చేసినా ఆ వైద్యులు, సిబ్బంది ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోవడం.. పరిస్థితి మళ్లీ మొదటికి రావడం.. ఇంకా ఎన్నాళ్లిలా గోసపడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి నెట్వర్క్: ఏజెన్సీ ప్రాంతాల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించాల్సిన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులు నామ్కేవాస్తేగా మారుతున్నాయి. పీహెచ్సీల నుంచి వచ్చిన రోగులకు స్పెషాలిటీ సేవలు అందించాల్సింది పోయి.. బోధనాస్పత్రులకు రిఫర్ చేసేందుకే పరిమితం అవుతున్నాయి. కాదంటే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు దారి చూపిస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరతే దీనికి కారణమవుతోంది. అయితే స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం, వారు ఉన్నా రేడియాలజిస్టులు, మత్తుమందు నిపుణులు, స్టాఫ్నర్సులు, ల్యాబ్ టెక్నిషియన్ల వంటివారు లేకపోవడంతో.. వైద్య సేవలు సరిగా అందించలేని దుస్థితి నెలకొంది.ప్రోత్సాహక నిర్ణయాలేవీ?ఏజెన్సీ ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది వెనకడుగు వేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రోత్సాహకాలు ఇస్తే పరిస్థితి మారుతుందని, ఏపీలో వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యలు బాగున్నాయని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో కాంట్రాక్టు పద్ధతిలో స్పెషలిస్టు వైద్యుల జీతభత్యాలను రూ.2.50లక్షలకు పెంచారని, బిడ్డింగ్ నెగోషియేషన్కు అవకాశం కల్పించారని.. దీంతో భద్రాచలం పక్కన ఉన్న అల్లూరి జిల్లాలో గైనకాలజిస్టు ఏకంగా నెలకు రూ.3.80 లక్షల జీతం అందుకోగలుతున్నారని వివరిస్తున్నాయి.డాక్టర్లు, సిబ్బంది బదిలీలతో..ఏజెన్సీ ప్రాంతాలు, జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచే సేందుకు డాక్టర్లు, వైద్య సిబ్బంది ఇష్టపడటం లేదు. సౌకర్యాలు, సదుపాయాల లేమితోపాటు వేతనాల సమస్య కూడా దీనికి కారణమవుతోంది. వైద్యవిధాన పరిషత్లో మైదాన, గ్రామీణ, ఏజెన్సీ అన్ని ప్రాంతాల వారికి ఒకేవిధమైన జీతభత్యాలు అందుతున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 శాతం అలవెన్సులు, పాత జిల్లా కేంద్రాల్లో 17శాతం అలవెన్సులు అందితే.. ఏజెన్సీ ఏరియాల్లో 11 శాతమే వస్తాయని వైద్యులు, సిబ్బంది చెప్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే.. అదనంగా అందాల్సిందిపోయి, తక్కువ వేతనం ఉండటం ఇబ్బందికరమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏజెన్సీ ఏరియాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు చాలా మంది వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది వెళ్లిపోవడం గమనార్హం.కొన్ని ప్రాంతాల్లో ఇదీ పరిస్థితి..భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో నాలుగేళ్ల కింద 13 మంది వైద్యులు సేవలందించగా.. ఏటా వేల సంఖ్యలో కాన్పులు, సర్జరీలు జరిగేవి. ఒక్కొక్కరుగా వైద్యులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడంతో వైద్య సేవలు తగ్గిపోయాయి. సరిపడా గైనకాలజిస్టులు లేక కాన్పు కోసం వచ్చే గర్భిణులను ఇతర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇక ఇక్కడ ఒక్కరే నేత్ర వైద్యుడు ఉన్నారు. వారానికి ఒక రోజును పూర్తిగా సర్జరీలకే కేటాయించినా.. వచ్చే డిసెంబర్ వరకు అపాయింట్మెంట్లు ఫుల్ అయ్యాయి.⇒ నాగర్కర్నూల్ జిల్లా టీజీవీవీపీ పరిధిలో నాలుగు ఆస్పత్రులు ఉన్నాయి. 107 మంది డాక్టర్లు పనిచేయాల్సిన చోట 36 మందే ఉన్నారు.⇒ మహబూబాబాద్ జిల్లా గార్లలో ఇటీవలి వరకు 10 మంది వైద్యులు పని చేశారు. ఇటీవలి బదిలీల్లో తొమ్మిది మంది వెళ్లిపోగా ఒక్కరే మిగిలారు.⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 173 డాక్టర్ పోస్టులకుగాను 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ ఆస్పత్రిలో 15 మంది పనిచేయాల్సిన చోట ఐదుగురే ఉన్నారు.⇒ ములుగు జిల్లా ఏటూరునాగారం ఆస్పత్రిలో 17 పోస్టులకుగాను నలుగురే ఉన్నారు.⇒ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆస్పత్రిలో 33 డాక్టర్ పోస్టులుండగా 11 మందే పనిచేస్తున్నారు. ఇక్కడ గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.ములుగు జిల్లా మంగపేట మండలం నర్సాపురానికి చెందిన వల్లె పోగు వినోద్బాబు కడుపునొప్పి తో బాధపడుతూ మణుగూరు ఆస్పత్రికి వెళ్లాడు. సర్జరీ సౌకర్యం లేనందున భద్రాచలం వెళ్లాలని వైద్యులు సూచించారు. అప్పు చేసి ఆటోలో భద్రాచలం వస్తే ఇక్కడ మరో ఇబ్బంది ఎదురైంది. ‘స్కానింగ్ చేసేందుకు రేడియాలజిస్టు లేడు. ఆపరేషన్కు సహకరించే మత్తు డాక్టర్ బదిలీ అయ్యాడు. కొత్తగూడెం వెళ్లాలంటూ వైద్యుల నుంచి సూచన వచ్చింది.కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం మోవాడ్కు చెందిన కుమురం లక్ష్మి జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతోంది. ఆమెకు జ్వరం రావడంతో కాలేజీ సిబ్బంది పారాసిటమాల్ మాత్రలు ఇచ్చారు. పరిస్థితి విషమించడంతో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పూర్తిస్థాయి వైద్యం అందే పరిస్థితి లేదని.. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మి అదే రోజు రాత్రి మృత్యువాత పడింది.ఆసిఫాబాద్ మండలం మానక్గొందికి చెందిన మడావి రవి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ ఆటోడ్రైవర్ అతడిని వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. తలకు బలమైన గాయమవడం, చెవి నుంచి రక్తం కారుతుండటంతో వైద్యులు రవిని మంచిర్యాల ఆస్పత్రికి రెఫర్ చేశారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జనరల్ సర్జన్, న్యూరోసర్జన్, ఇతర స్పెషాలిటీ వైద్య నిపుణులు లేక.. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఎల్మపల్లికి చెందిన నిండు గర్భిణి స్వర్ణకు రాత్రి 8 గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో అమ్రాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అందుబాటులో లేక అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. ఆమెకు బీపీ ఎక్కువగా ఉందంటూ నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రికి పంపించారు. రాత్రి 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడి డాక్టర్లు మహబూబ్నగర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. చివరికి మహబూబ్నగర్ ఆస్పత్రిలో అర్ధరాత్రి ప్రసవం చేసినా తల్లీబిడ్డ ఇద్దరూ మరణించారు. ఆరు నెలల కింద ఈ ఘటన జరిగినా.. ఇప్పటికీ ఇక్కడి ఆస్పత్రుల్లో పరిస్థితులేవీ మారలేదు. -
5 వేల కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స
బీజింగ్: అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర, ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5,000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సచేయడం విశేషం. టెక్నాలజీకి ఆధునిక వైద్యవిధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢీ అయింది. వాయవ్య చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్స్లోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రిలో నూతన 5జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఊపిరితిత్తుల్లో కణతితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూ క్వింగ్క్వాన్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చిన 5జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు.భారత్లోనూ సేవలు మొదలు: ఇలాంటి సేవలు భారత్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఈ సేవలను చేరువచేసింది. ఐదు రోబో చేతులున్న ఈ వ్యవస్థతో గుండె ఆపరేషన్లనూ చేయొచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3డీ విజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరానూ బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్ను ఆపేస్తుంది. శస్త్రచికిత్సలో ఒక్క సెకన్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త ఏర్పాటుచేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తాయి. -
వాగులు దాటి వైద్యసేవలు..
వెంకటాపురం(కె): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటి ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సీతారాంపురంలో వైద్య సిబ్బంది శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే వాగులు దాటాలి. వర్షాలు పడుతుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయినా వైద్యాధికా రి భవ్యశ్రీ, సిబ్బంది వాగులో నడుములోతు నీటిలో నడుచుకుంటూ గ్రామానికి వెళ్లారు. 67 మందికి పరీక్షలు జరిపి మందులు అందజేశారు. కలిపాక గ్రామంలోని ఇద్దరు గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. -
ప్రపంచస్థాయి హెల్త్ హబ్: సీఎం రేవంత్రెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్కు వస్తే.. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హబ్ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో బసవతారకం ఆస్పత్రికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఆయన ఆలోచనా విధానాలను కొనసాగించాలని.. చంద్రబాబునాయుడు ఆస్పత్రిని పూర్తి చేసి పేదలకు సేవలందించేలా చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పెండింగ్లో ఉన్న భూమి లీజు పొడిగించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
పాముల్లో విషం తయారవ్వడానికి ఎంత టైం పడుతుందో తెలుసా..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో పాముల బెడద మొదలవుతుంది. పొలం పనులకు వెళ్లిన వారు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. గతంలో పాముకాటుతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సౌకర్యాలు లేక, మందుల కొరతతో ప్రాణాలు కోల్పోయేవారు. కానీ గత ప్రభుత్వంలో మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలను చేరువచేయడంతో పాటు క్వాలిఫైడ్ వైద్యులను నియమించి, తగిన మందులు అందుబాటులో ఉంచడంతో సకాలంలో మెరుగైన వైద్యం అందుతోంది. ఈ సీజన్లోనే ఇప్పటి వరకు దాదాపు వంద మంది పాముకాటుకు గురవగా ఒక్కరికి కూడా ప్రాణాపాయం లేదు. ఒంగోలు టౌన్: ఇప్పటి దాకా వేసవి ఎండల వలన గుంతలు, పొదలు, గుబురుగా ఉండే చెట్ల మధ్య, గడ్డివాముల్లో తల దాచుకునే పాములు అలా వర్షాలు కురుస్తాయే లేదో బుసలు కొడుతూ బయటకు వస్తాయి. పొలం గట్ల మీద తిరుగుతుంటాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పడగ విప్పి కాటేస్తాయి. పల్లెల్లో చింత చెట్ల మీద తాచు పాములు, నాగు పాములు, పసిరిక పాములు, కట్లపాములు కనిపిస్తుంటాయి. పాము కాటు బాధితుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు, రైతు కూలీలే ఉండడం గమనార్హం. మారుమూల ప్రాంతాల్లో పాము కరిచినప్పుడు సాధ్యమైనంత త్వరగా వైద్యశాలకు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో గతంలో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు సరిగా ఉండేవి కావు. ఎక్కడో ఒకటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండేది. అక్కడ వైద్యుడు ఉండేవారు కాదు. సిబ్బంది కూడా అంతంత మాత్రంగా ఉండేవారు. పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్లు ఉండేవి కావు. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇద్దరు క్వాలిఫైడ్ వైద్యులను నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతు కూలీలు పాము కాటుకు గురవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం పాము కాటు విరుగుడుకు ఉపయోగించే యాంటి వీనమ్ ఇంజక్షన్లను అందుబాటులో ఉంచింది. దీంతో ఇప్పడు పాము కాటు వలన చనిపోయేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 100 పాముకాట్ల నమోదు: జూన్ నుంచి అక్టోబర్ వరకు పాముకాట్లు ఎక్కువగా ఉంటాయి. మామూలు సమయాల్లో జిల్లాలో రోజుకు 1 నుంచి 2 పాము కాటు కేసులు వస్తే వర్షాకాలం ప్రారంభమైన తరువాత రోజుకు 4 నుంచి 5 కేసుల వరకు వస్తున్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది పాముకాట్లు పెరుగుతున్నాయి. అయితే పాముకాటు వలన మరణించేవారి సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గింది. 2022 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 119 మంది పాముకాటుకు చికిత్స కోసం ఒంగోలు లోని జీజీహెచ్కు వచ్చారు. వీరిలో 56 మంది పురుషులు కాగా 63 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 99 మంది అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. 2023 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబరు వరకు 393 మంది పాముకాటు చికిత్స కోసం వచ్చారు. వీరిలో 240 మంది పురుషులు కాగా 153 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 305 మంది అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నారు. ఒకరు మరణించారు. ఇక 2024లో జనవరి నుంచి జూన్ వరకు ఈ ఆరు నెలల్లో 100 మంది పాము కాటుకు గురై చికిత్స కోసం వచ్చారు. వీరిలో 63 మంది పురుషులు కాగా 37 మందిమహిళలు ఉన్నారు. ఈ వంద మందిలో కేవలం 87 మంది మాత్రమే చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఎలాంటి మరణాలు సంభవించలేదు. గత రెండేళ్లలో పాము కాటు వలన మరణించిన వారిలో కేవలం పురుషులు మాత్రమే ఉండడం గమనార్హం. మరణాలు గణనీయంగా తగ్గడానికి సకాలంలో వైద్యం అందడమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి: జిల్లాలో పాము కాటుకు వినియోగించే ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయి. జిల్లాలోని అన్నీ ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన ఔషధాలను తొలి త్రైమాసికంలోనే పంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3642 డోసుల యాంటి స్నేక్ వీనం ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్నేక్ వీనం యాంటి సీరం అనే ఇంజక్షన్లు 229 డోసులు ఉన్నాయి. లక్షణాలను ఇలా గుర్తించాలి... పాము కాటు వేసిన చోట వాపు, నొప్పి ఉంటుంది. కొంత మందిలో మూత్రంలో రక్తం పోతుంది. అందుకే మూత్రం ఎర్రగా వస్తుంది. కళ్లు మూత పడడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, శ్వాస ఆడక ఇబ్బంది పడతారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యం చేస్తామని జీజీహెచ్ జనరల్ ఫిజీషియన్ డా.కళ్యాణి చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మవద్దు: పాముకాటు వేసిన వారు మూడు రోజుల పాటు నిద్ర పోకూడదని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం విస్తృతంగా ప్రచారంలో ఉంది. అలాగే ఫలానా వస్తువులు తినకూడదని పత్యాలు పెడుతుంటారు. నిజానికి ఎలాంటి ఆందోళన చెందకుండా నిద్రపోవచ్చు. ఆహారం విషయంలో కూడా ఎలాంటి పత్యాలు లేవు.విష పాములను గుర్తించడం ఎలా...? పాము కాటేసిన వెంటనే విషం కంటే పాము కాటేసిందన్న భయమే ఒళ్లంతా పాకేస్తుంది. మానసిక ఆందోళనతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నారని వైద్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి పాములన్నీ విషపూరితమైనవి కావు. ఇందులో కొన్ని పాములు విష పాములు ఉంటే మరికొన్ని విషరహిత పాములుంటాయి. విష పాములకు రెండు కోరలు ఉంటాయి. విషరహిత పాములకు ఎలాంటి కోరలు ఉండవు. అందుకే పాము కాటేసినప్పడు గాయాన్ని నిశితంగా పరిశీలించాలి. శరీరంపై రెండు గాట్లు దిగినట్లు కనిపిస్తేనే విష సర్పం కాటేసినట్లు గుర్తించాలి. ఒకసారి పాము కాటేసిన పాములో తిరిగి విషం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ఎక్కువగా నాగు పాము, కట్ల పాములు ఉన్నాయి. నాగుపాము కాటేసినప్పుడు నొప్పితో విలవిల్లాడిపోతారు. అదే కట్ల పాము కనుక కాటేస్తే చీమ కుట్టినట్టు మాత్రమే ఉంటుంది. దాంతో పాము కాటు వేసినట్లు అనుమానించరు. నిర్లక్ష్యం చేస్తారు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది.జిల్లాలో 72 పీహెచ్సీలు.. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీలో ఇద్దరేసి క్వాలిఫైడ్ వైద్యులను నియమించారు. ప్రతి వైద్యశాలలోనూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు తగిన సిబ్బంది, ఔషధాలను ఏర్పాటు చేశారు. నగర శివారు ప్రజలకు అందుబాటు ఉండేలా 18 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒక్క ఒంగోలు నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా 9 పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. నామ మాత్రంగా హాస్పిటళ్లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా ప్రతి యూపీహెచ్సీల ఒక ఎంబీబీఎస్ వైద్యుడితో పాటు ఏడుగురు సిబ్బందిని నియమించారు. ప్రతి పీహెచ్సీ, యూపీహెచ్సీలో పాముకాటు ఇంజక్షన్లు అందుబాటులో ఉంచారు. దీంతో పాముకాటుకు గురైన వారిని సకాలంలో వైద్య చికిత్స చేసేందుకు అవకాశం ఏర్పడింది.సకాలంలో వైద్యశాలకు తరలించాలి ఎవరికైనా పాము కరిస్తే ఆందోళన చెందకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలి. మన ప్రాంతంలో ఎక్కువగా విష సర్పాలు లేవు. ఉన్నా డ్రైడ్ పాములు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి. కాటుకు పై భాగంలో ఎలాంటి కట్లు కట్టాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం మంచి వైద్యం అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీలైనంత త్వరగా వైద్యశాలకు తరలించి సుశిక్షితులైన వైద్యులచేత చికిత్స చేయించడం మంచిది. –డాక్టర్ ఎన్.కళ్యాణి, జనరల్ ఫిజీషీయన్, హెచ్ఓడీప్రజల్లో అవగాహన కలిగించాలి అన్నీ రకాల పాములు విషపాములు కావు. పాము కాట్లన్నీ ప్రమాదం అని అనుకోకూడదు. అలాగని నిర్లక్ష్యం వహించకూడదు. ముందుగా ఎలాంటి పాము కాటు వేసిందో నిర్ధారించాలి. అది విషం కలిగిన పాము అయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి సకాలంలో వైద్యం చేయిస్తే చాలు. జీజీహెచ్లో పాము విషం విరుగుడు ఇంజక్షన్లతోపాటుగా తగిన వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు. – డాక్టర్ జీ.దుర్గాదేవి, సూపరింటెండెంట్, జీజీహెచ్, ఒంగోలు. -
ఏఎంసీలో ఏమైంది?
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలోని పాత అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ఏసీలు పని చేయకపోవడంపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నిమ్స్ మెడికల్ సూరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణను ఆదేశించింది. దీంతో నిమ్స్ యాజమాన్యం ఏఎంసీలోని పరిస్థితులపై సంజాయిషీ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శికి రాసిన లేఖ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. నిమ్స్లోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ యూనిట్లు(ఏసీ) పురాతనమైనవి కారణంగా పనిచేయడం లేదని, మరమ్మతులు చేసినా ఫలితం కని్పంచడం లేదని లేఖలో అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత ప్యాకేజీ యూనిట్లను మరింత సమర్థవంతమైన డక్టబుల్ యూనిట్లతో భర్తీ చేయడానికి రూ.12.50 లక్షల వ్యయంతో అంచనా వేశామని తెలిపారు. ఈ మేరకు నిపుణుల అభిప్రాయం కోసం అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా టెండర్లు వేయడం కుదరదని అడ్మిని్రస్టేషన్ సూచించిందని, ఈ కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని తాత్కాలికంగా అదే బ్లాక్లోని పాత ఐసీయూకి మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా..బుధవారం సాయంత్రానికల్లా ఏసీలను తాత్కాలికంగా మరమ్మతు చేయించారు. దీంతో పనిచేయడం మొదలు పెట్టాయని రోగుల బంధువులు పేర్కొన్నారు. ‘సాక్షి’ పుణ్యమా అని తమకు ఉపశమనం లభించిందని ఓ రోగి సహాయకుడు డానియేల్ సంతృప్తి వ్యక్తం చేశారు. -
ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
ఇది మామూలు ఆసుపత్రి కాదు..ఏ పట్టణంలోదో..పల్లెల్లోదో అంతకన్నా కాదు. సాక్ష్యాత్తు రాజధాని నగరం హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్). కానీ ఇక్కడి అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)సెంటర్లో ఏసీ పనిచేయడం లేదు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవు. దీంతో ‘ఏసీ పనిచేయడం లేదు..మీరే ఫ్యాన్లు తెచ్చుకోండి’ అంటూ ఆస్పత్రి సిబ్బంది రోగుల సంబందీకులకు సెలవిస్తున్నారు. వాస్తవానికి ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యంత వైద్య సంరక్షణ అందించేందుకు ఏఎంసీని వినియోగిస్తారు. కానీ ఇప్పుడు నిమ్స్ ఏఎంసీని చూస్తే జనరల్ వార్డుకన్నా అధ్వానంగా మారింది. లక్డీకాపూల్: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందించే నిమ్స్ ఆస్పత్రిలో సేవలు పొందడం చాలా కష్టతరమైంది. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా మెరుగైన సేవలు, సౌకర్యాలు కలి్పంచడంలో యాజమాన్యం విఫలమవుతోంది. ఇందుకు ఉదాహరణగా ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డును పేర్కొనవచ్చు. వ్యాధి సమస్య తీవ్రరూపం దాలి్చన స్థితిలో రోగిని ఇక్కడకి తరలించి వైద్యసేవలను అందిస్తారు. వాస్తవానికి ఏఎంసీ సాధారణ వ్యాధులు(జనరల్ మెడిసిన్) విభాగానికి సంబంధించిన ఐసీయూ(అత్యవసర చికిత్సా కేంద్రం). ఇందులో రోగి ప్రాణపాయస్థితికి చేరినప్పడు వైద్యసేవలను అందిస్తారు.ముఖ్యంగా అన్ కంట్రోల్ డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్న వారిని, డెంగ్యూ ఫీవర్, తీవ్రమైన స్థాయిలో రక్తాన్ని కోల్పోతున్న రోగులకు ఏఎంసీలో చికిత్స అందిస్తుంటారు. అదే విధంగా జ్వరంతో బాధపడుతున్న వాళ్లతో పాటు ఇతర మెడికల్ కండిషన్లో రోగులకు సైతం ఏఎంసీలో వైద్యసేవలను అందిస్తారు. ప్రస్తుతం ఈ వార్డులో 16 పడకలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ రోగులతో నిండుకున్నాయి. అయితే..అత్యంత కీలకమైన ఈ విభాగంలో ఏసీలు పని చేయకపోవడంతో రోగుల బాధలు వర్ణణాతీతం. ఇక్కడకి చికిత్స కోసం వచ్చే రోగులకు ముందు ఫ్యాన్ తెచ్చుకోవాలని అక్కడి వైద్య సిబ్బంది నేరుగా సూచించడం పరిపాటి. రెండు దశాబ్దాల నాటి ఏసీలు చెడిపోయాయి. దీంతో ఏఎంసీ దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. కాలం చెల్లిన ఏసీలు.. దాదాపు 15 ఏళ్ల నాటి ఏసీలే ఇప్పటికీ వినియోగిస్తుండడంతో అవి మొరాయిస్తున్నాయి. కనీసం రిపేరుకు స్పేర్ పార్ట్స్ కూడా దొరక్క వాటిని ఆపేస్తున్నారు. ఏఎంసీ వార్డులో కూడా ఇదే జరిగింది. కండెన్సర్లు దెబ్బతినడంతో ఏసీలు పని చేయడం మానేశాయి. మరొపక్క ఆస్పత్రిలో ఏసీ లోడ్ భారం కూడా విపరీతంగా పెరిగిందనే చెప్పాలి. ఆస్పత్రిలో ఒకప్పుడు 200 పడకల సామర్ధ్యం కలిగిన ఐసీయూ యూనిట్లు ఉండేవి. ప్రస్తుతం 500ల వరకు ఐసీయూ పడకలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. దానికి తోడు వైద్య పరీక్షల్లో మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో అందుబాటులోకి తీసుకువచి్చన అత్యాధునికి వైద్య పరికరాలకు సైతం ఏసీల అవసరం ఉంది.మరమ్మతులు చేయిస్తాం.. ‘ఏఎంసీలో ఏసీలు పని చేయడం లేదు..రోగులే ఫ్యాన్లు తెచ్చకుంటున్నారు. ఇది నిజమే. ఆ ఏసీలను రిపేరు చేయాలంటే ఆ వార్డును ఖాళీ చేయాలి. అందులో ఉన్న రోగులను ఎక్కడికి షిప్ట్ చేయాలో తెలియడం లేదు. అందుకే సకాలంలో రిపేరు చేయించలేకపోతున్నాం. ఏఎంసీని పూర్తిగా ఆధునీకరించేందుకు దాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. త్వరలో చర్యలు తీసుకుంటాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. హెచ్డీయూ లేదు..సాధారణంగా ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగానికి సంబంధించి ఏఎంసీతో పాటు హై డిఫెడెంట్ యూనిట్(హెచ్డీయూ)ను కూడా ఏర్పాటు చేయాలి. కానీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రిఫరల్ ఆస్పత్రిగా ఖ్యాతి చెందిన నిమ్స్లో హెచ్డీయూను విస్మరించారు. ఏఎంసీలో వైద్య సేవలకు అంతరాయం కలిగినప్పుడే కాకుండా వ్యాధి తీవ్రత మేరకు ఏంఎంసీపై భారం తగ్గించడానికి హెచ్డీయూ ఉపయుక్తంగా ఉంటుంది. ఒక విధంగా ఈ విభాగాన్ని ఏఎంసీ సపోరి్టంగ్ యూనిట్గా వినియోగిస్తారు. అలాంటి దాని విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. ఫలితంగా ప్రస్తుత పరిస్థితుల్లో రోగులు నానా అగచాట్లకు గురవుతున్నారు. ఏసీలు పని చేయని కారణంగా.. రోగులే సొంతంగా ఫ్యాన్లు తెచ్చుకుని వైద్యసేవలు పొందాల్సి వస్తోంది. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
మీ ఆరోగ్యానికి పూచీ మాది
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థలో అంబులెన్స్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వైద్యుడైన మాజీ సీఎం వైఎస్సార్ ఆ విషయాన్ని గుర్తించి ఉమ్మడి రాష్ట్రంలో 108 అంబులెన్స్, గ్రామీణ వైద్య సేవల కోసం 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప వ్యవస్థ 2014–19 మధ్య బాబు పాలనలో నిర్విర్యమైంది. తర్వాత ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి కలిగిన సీఎం వైఎస్ జగన్ గడిచిన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చారు. వైఎస్సార్ కన్నా మరో రెండడుగులు ముందుకు వేసి దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దారు. 108 అంబులెన్స్లు 768, ఎంఎంయూలు 936, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు 500 చొప్పున అందుబాటులోకి తెచ్చి వైద్య పరంగా సేవలందించారు. మొత్తంగా 2,204 వాహనాల ద్వారా ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద వ్యవస్థను నెలకొల్పారు. దేశంలో అగ్రస్థానంలో ఏపీ దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సుమారు 25 కోట్లకుపైగా ప్రజలకు 988 అంబులెన్స్లు ఉన్నాయి. యూపీ కంటే ఐదు రెట్లు తక్కువ జనాభా ఉన్న ఏపీలో 768 అంబులెన్స్లు సేవలందిస్తున్నారు. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో తక్కువ సంఖ్యలో అంబులెన్స్లు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్స్ ఉంది. తెలంగాణలో 75,524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒకటి చొప్పున అంబులెన్స్లు ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు సేవల విస్తరణ 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్స్లు 336 లే ఉన్నాయి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేదు. దీంతో సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్స్లు ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలు తీసుకొచ్చారు. దీంతో అంబులెన్స్ల సంఖ్య 748కు పెరిగింది. దీనికి రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 అంబులెన్స్లు గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. దీనికి రూ.4.76 కోట్లు వెచి్చంచారు. ఈ క్రమంలో 108 అంబులెన్స్ల సంఖ్య 768కి చేరింది. 2023లో 2.5 లక్షల కిలో మీటర్లు తిరిగిన పాత వాహనాలను తొలగించి 146 కొత్త అంబులెన్స్లు కొనుగోలు చేసింది. ఇందుకు రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచి్చస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. రోజుకు సగటున 3 వేలకు పైగా అత్యవసర కేసుల్లో అంబులెన్స్లు సేవల్లో ఉన్నాయి. 2020 జూలై నుంచి 43 లక్షల మంది ప్రాణాలను 108 అంబులెన్స్లు కాపాడాయి. పల్లె చెంతకే వైద్యులు వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కార్యక్రమం కింద 500 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. బాబు పాలనలో ఒక వాహనంలోనే ఆస్పత్రుల నుంచి ఇద్దరు, ముగ్గురు బాలింతలను ఇళ్లకు తరలించేవారు. ఈ ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఏసీ వాహనంలో ఒక బాలింతను, ఆమె సహాయకులను మాత్రమే ఇంటి వరకూ సురక్షితంగా చేరుస్తున్నారు. గతంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ. 499 మాత్రమే ఖర్చు చేస్తుండగా, ప్రస్తుతం రూ.895 ఖర్చు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 4 లక్షల మందికిపైగా బాలింతలు, గర్భిణులు ఈ సేవలను పొందారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పల్లె ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతీ పీహెచ్సీ వైద్యుడు నెలలో రెండుసార్లు పల్లెలకు 104 ఎంఎంయూలతో పాటు వెళుతున్నారు. అన్ని పల్లెలను నెలలో రెండుసార్లు సందర్శించేందుకు వీలుగా 936 ఎంఎంయూలను సమకూర్చారు. ఈ విధానంలో 2022 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వైద్య సేవలను ప్రభుత్వం అందించింది. -
ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రజాదరణ పెరిగింది. పట్టణాల్లోనూ ఇంటి పక్కనే సర్కారు వైద్యం అందుబాటులోకి వచ్చింది. ప్రాథమిక స్థాయి నుంచి ఆస్పత్రులను సీఎం వైఎస్ జగన్ సర్కారు బలోపేతం చేయడంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(యూపీహెచ్సీ)నూ సకల పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. నాడు–నేడు పేరుతో యూపీహెచ్సీల్లో సౌకర్యాలు, వైద్య పరీక్షలు, అవసరమైన మందులతో పాటు ఇద్దరేసి వైద్యులు, నర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సుమారు రూ.700 కోట్లతో వీటిని ఆధునికీకరించారు. ఫలితంగా ఇప్పుడు యూపీహెచ్సీలకు వైద్య సేవల కోసం వెళ్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. చంద్రబాబు హయాంలో పడకేసిన వైద్యం చంద్రబాబు హయాంలో యూపీహెచ్సీల్లో వైద్య పరీక్షలతోపాటు అన్ని సేవలనూ ప్రైవేట్ పరం చేయడమే కాకుండా వైద్యులు, నర్సులను భర్తీ చేయలేదు. టీడీపీ పాలనలో యూపీహెచ్సీలపై నిర్లక్ష్యం వహించడంతో ప్రజలు యూపీహెచ్సీల వైపు చూసేవారు కాదు. చిన్నపాటి అనారోగ్యమైనా జనమంతా ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. అప్పట్లో నెలకు కేవలం వేల సంఖ్యలోనే ఔట్ పేషెంట్ల సేవలందేవి. ఇందుకు ప్రధాన కారణం వైద్య పరికరాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉండేది కాదు. దీంతో ప్రజలంతా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వచ్చేదని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ఇప్పుడు అన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, వైద్యులు అందుబాటులో ఉండటంతో యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అప్పటికి ఇప్పటికీ ఇదే మార్పు అని వైద్యులతోపాటు పేషెంట్లు సైతం చెబుతున్నారు. ఇంతలోనే.. ఎంతో మార్పు సీఎం వైఎస్ జగన్ వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి.. సంపూర్ణ సౌకర్యాలు సమకూర్చడంతోపాటు వైద్యులు, వైద్య సిబ్బందిని భారీగా నియమించారు. ఫలితంగా పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రుల గడప తొక్కడం మానేసి.. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. ఫలితంగా యూపీహెచ్సీలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గర్భిణి పరీక్షల నుంచి చిన్నపాటి సుస్తీ చేసినా వైద్య సేవలకు, పరీక్షలకు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రజలు వెళ్తున్నారు. మొత్తం 65 రకాల పరీక్షలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీహెచ్సీలలో ఔట్ పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రికార్డు స్థాయిలో 61.47 లక్షల మందికి ఔట్ పేషెంట్ సేవలను అందించారు. అంటే రోజుకు సగటున ఒక్కో యూపీహెచ్సీలో 40 మందికి పైగా ఔట్ పేషెంట్ సేవలు అందించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఎస్) ద్వారా ఔట్ పేషెంట్ల డేటాను నమోదు చేశారు. మరోవైపు 2022 ఫిబ్రవరి నుంచి 542 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గత నెల 21వ తేదీ వరకు 92,82,536 ల్యాబ్ పరీక్షలు సైతం నిర్వహించారు. ఖరీదైన పరీక్షలు ఉచితం గత ప్రభుత్వంలో గర్భిణి పరీక్షల్ని ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఖరీదైన వైద్య పరీక్షల్ని సైతం ఉచితంగా పొందగలుగుతున్నాం. ఆర్థిక స్థోమత లేకపోతే కేజీహెచ్కి వెళ్లే వాళ్లం. ఇప్పుడు సమీపంలోని ఇసుక తోటలో పట్టణ ఆరోగ్య కేంద్రాలు రావడంతో ఆరోగ్యానికి భరోసా లభించింది. – పి.సుజాత, గర్భిణి, మద్దిల పాలెం, విశాఖపట్నం నాణ్యమైన వైద్య సేవలందుతున్నాయి పట్టణాల్లో వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా పెద్దాస్పత్రికి పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా ఇంటి పక్కనే వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ వైద్యం అందేది కాదు. చిన్నపాటి ఆరోగ్య సమస్య వచ్చినా దూర ప్రాంతాలకు వెళాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. సీఎం వైఎస్ జగన్పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించడంతో పేదలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందుతున్నాయి. పరీక్షలన్నీ ఇక్కడే చేస్తున్నారు. ముందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. – సూరాడ ఈశ్వరమ్మ, 12వ డివిజన్, సంజయ్ నగర్, కాకినాడ -
30 లక్షల మందికి సేవల దిశగా ఆరోగ్య సురక్ష–2
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష (జేఏఎస్)’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. 30 లక్షల మందికి వైద్య సేవల దిశగా రెండో దశ ఆరోగ్య సురక్ష కార్యక్రమం (జేఏఎస్–2) కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన రెండో దశ కార్యక్రమంలో నిర్దేశిత షెడ్యూల్ మేరకు గ్రామాలు, వార్డుల్లో శిబిరాలను ఏర్పాటు చేసి, స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు సేవలందిస్తోంది. ప్రతి జిల్లాలో సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణ, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో మండలంలో గ్రామీణంలో వారానికి ఒక గ్రామం చొప్పున, పట్టణాల్లో ఒక వార్డు చొప్పున ఆరు నెలల్లో రాష్ట్రం మొత్తం శిబిరాలను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మందికి సేవలు జేఏఎస్ –2 లో రాష్ట్రవ్యాప్తంగా 13,954 శిబిరాలను నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 7,974 శిబిరాలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5,929 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 2,045 నిబిరాలు నిర్వహించారు. ఒక్కో శిబిరంలో సగటున 362 మంది చొప్పున 28,79,408 మందికి ఇప్పటివరకూ వైద్య సేవలందించారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 1.63 లక్షలు, నంద్యాలలో 1.51 లక్షలు, వైఎస్సార్ జిల్లాలో 1.44 లక్షల మంది ప్రజలు వైద్యం చేయించుకున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను, వందల సంఖ్యలో మందులను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. శిబిరాలకు వద్దకు వచ్చి సేవలు అందుకున్న వ్యక్తుల్లో సుమారు 13 వేల మందికి ఆస్పత్రుల్లో చికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించి, దగ్గరలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వారందరినీ ఆస్పత్రులకు తరలించి వైద్య సేవలందించేలా స్థానిక పీహెచ్సీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 5 వేల మంది ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుకున్నారు. ప్రజలకు సొంత ఊళ్లలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 మంది జనరల్ మెడిసిన్, 645 మంది గైనకాలజీ, 349 మంది జనరల్ సర్జన్లు, 345 ఆర్థోపెడిక్, 378 మంది ఇతర స్పెషలిస్ట్ వైద్యులు, 3 వేల మంది వరకూ వైద్యులు, కంటి సమస్యల గుర్తింపునకు 562 మంది ఆప్తాల్మిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. -
విప్లవ భేరి
ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను గెలవటం ఓ విప్లవం.. ఆ తర్వాత.. స్కూళ్లు, విద్యార్థుల నుంచి.. చెప్పే చదువుల వరకూ విద్యా రంగం సమూలంగా మారింది. ఇంటికే వైద్యులు, గ్రామాల్లోనే పరీక్షలు సహా... పేదల ప్రతి చికిత్సకూ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఆర్బీకేల నుంచి పంటల కొనుగోళ్లు, బీమా వరకూ ప్రతి చర్యా రైతుకు భరోసా ఇస్తోంది. ఈ రాష్ట్ర మహిళలకు సొంతింటి పట్టాలున్నాయి. సొంత కాళ్లపై నిలబడగలిగే సత్తా ఉంది. ఇవే కాదు.. ఇంటింటికీ పథకాలు చేరవేసే వలంటీర్లు, గ్రామాల్లో పాలన భవనాలు, వ్యవసాయ– వైద్యారోగ్య కేంద్రాలు.. ఇవన్నీ ఐదేళ్లలోనే. కోవిడ్ కబళించిన రెండేళ్లను మినహాయిస్తే మూడేళ్లలోనే ఇంతటి సంక్షేమాభివృద్ధితో కూడిన విప్లవాన్ని... బహుశా ఈ రాష్ట్రమే కాదు.. ఏ రాష్ట్రమూ ఇదివరకెన్నడూ చూడలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలనూ అభివృద్ధిలో భాగం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఫలితమే ఈ విప్లవం. అందుకే దేశంలో ఏ నాయకుడూ చెప్పని విధంగా ఆయన ధైర్యంగా జనానికి ఓ మాట చెబుతున్నారు. ‘గత ఎన్నికల ముందు చేస్తానని చెప్పినవన్నీ చేశా. మీ కుటుంబానికి మంచి జరిగిందని మీరు నమ్మితేనే మళ్లీ నాకు ఓటెయ్యండి’ అని. ఇలాంటి నాయకత్వమే అసలైన విప్లవం. విప్లవంతోనే చరిత్ర మారుతుంది. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో గత 58 నెలలుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోనే దిక్సూచిగా పరిపాలిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి.. మద్యపాన నియంత్రణ, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు వంటి వాటిని ఎందుకు అమలు చేయలేదో సహేతకమైన కారణాలు చెప్పడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో 58 నెలల్లో నియమించిన వారే 2.13 లక్షలు కావడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. –సాక్షి, అమరావతి -
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వైఎస్ జగన్ సర్కార్ నిలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్ విడుదల చేస్తు న్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణ చర్యల్లో భేష్ రక్తహీనత నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది. అంగన్వాడీలు, పాఠశాలల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోష ణ ప్లస్, జగనన్న గోరుముద్ద కార్యక్రమాల కింద ప్రభుత్వం పోషకాహారం పంపిణీ చేస్తోంది. స్కూల్ హెల్త్ యాప్తో విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపడుతోంది. డిజిటల్ వైద్య సేవల్లో ఫస్ట్ ప్రజలకు డిజిటల్ వైద్యసేవల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ నిలుస్తోంది. పౌరులకు డిజిటల్ హెల్త్ అకౌంట్లు సృష్టించి, అందులో వారి ఆరోగ్య వివరాలను అప్లోడ్ చేయడం, భవిష్యత్లో వారు పొందే వైద్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తం జనాభాలో అత్యధికులకు హెల్త్ అకౌంట్లు సృష్టించడంతోపాటు ఆస్పత్రుల్లోనూ డిజిటల్ వై ద్యసేవల కల్పనలో ఏపీకి ఇప్పటికే జాతీయస్థాయిలో అనేక మొదటి బహుమతులు లభించాయి. డిజిటల్ వైద్య సేవల కల్పనలో ఇతర రాష్ట్రాలు సై తం ఏపీ విధానాలను అవలంభించాలని అన్ని రా ష్ట్రాలకు నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో లేఖ రాశారు.రాష్ట్రంలోని పౌరులకు టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలో ఏపీ తొలి స్థానంలో నిలుస్తోంది. 2019 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 20.41 కోట్లకు పైగా టెలీకన్సల్టేషన్లు నమోదు కాగా.. ఇందులో 25 శాతానికిపైగా టెలీకన్సల్టేషన్లు కేవలం ఏపీ నుంచే ఉంటున్నాయి. ఆరోగ్య ధీమా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా మధ్యతరగతి, పేద కు టుంబాల ఆరోగ్యానికి సీఎం జగన్ ప్రభు త్వం అండగా నిలుస్తోంది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చింది. దీంతో ఏపీలోని 95 శాతం కుటుంబా లకు ఆరోగ్య బీమా లభిస్తోంది. అత్యధిక జనా భాకు పూర్తి ఆరోగ్య బీమా కలి్పస్తున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని నీతిఆయోగ్ ప్రశంసించింది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్యరంగం బలోపేతానికి తీసుకున్న చర్యలివీ ► వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తున్న ప్రభుత్వం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ► రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం ►గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు ►దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు ► టీడీపీ హయాంలో నిర్విర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య 1,059 నుంచి 3,257కు పెంపు. వైద్య ఖర్చుల పరిమితి రూ.25 లక్షలకు పెంపు ►108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. -
టెలిమెడిసిన్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశి్చమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు ఈ–సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్ట్లు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ఫోన్ ద్వారా కూడా సేవలు.. ఇక స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ–సంజీవని ఔట్ ఫేషెంట్ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు
ఇది గతం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యానికి జిల్లా ఆస్పత్రికో లేదా ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లాల్సిందే. వైద్య సదుపాయం ఉన్న గ్రామాలే తక్కువ. అక్కడ వైద్యుడు ఉంటాడన్న నమ్మకం లేదు. ప్రాంతీయ ఆస్పత్రులూ అంతంతమాత్రమే. అక్కడా వైద్యులు ఉండరు. దీంతో వృద్ధులైనా, మహిళలైనా, దివ్యాంగులైనా వ్యయప్రయాసలకోర్చి జిల్లా ఆస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లక తప్పని పరిస్థితి. అక్కడా పెద్ద క్యూలు. ఉండేదే అరకొర వైద్య సిబ్బంది. ఆరోజు తమను చూస్తారో లేదోనన్న ఆందోళన. నేడు గ్రామాలకే వైద్యులు.. ఇప్పుడున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్.. గ్రామాల్లోని ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాదు.. గ్రామీణ ప్రజలు చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులనే గ్రామాలకు పంపిస్తున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గ్రామీణులెవరూ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరంలేదు. వారి వద్దకే వైద్యులు వస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, పరీక్షలు చేసి, అవసరమైన మందులు కూడా ఇస్తున్నారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’. ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులు వెళ్లే ఈ కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ట్రయల్ రన్ మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు అందించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1142 పీహెచ్సీలకు అదనంగా 88 కొత్త వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న 63 చోట్ల వైద్యులను నియమించింది. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులకు వారి పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను సమానంగా విభజించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,032 విలేజ్ క్లినిక్లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లతో పాటు వైద్యులు గ్రామాలకు వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూలకు అదనంగా 260 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 104 యూనిట్, వైద్యుడు గ్రామానికి వెళ్లిన రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రజలకు అవుట్పేòÙంట్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్సీడీ) సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది. వీరిలో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్న వారికి నిర్దేశించిన ప్రమాణాలతో మెడికల్ ఫాలోఅప్ చేస్తూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరం సాధారణంగా బీపీ, షుగర్, ఇతర ధీర్ఘకాలిక వ్యాధిగ్రçÜ్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. మారుమూల గ్రామాల్లో ఉండే వారు ప్రతి నెలా వైద్యుడిని సంప్రదించాలంటే 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే పీహెచ్సీలు, సీహెచ్సీలకు వెళ్లాలి. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణ చార్జీలతో పాటు, ఒక రోజంతా కేటాయించాలి. మంచానికే పరిమితమైన వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఆ కుటుంబాలు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ కష్టాలకు చెక్ పెడుతూ సీఎం వైఎస్ జగన్ వైద్యులనే ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. విలేజ్ క్లినిక్లలోనే 105 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. థైరాయిడ్, గుండె సంబంధిత, ఇతన సమస్యలకు మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంటున్నాయి. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ♦ జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ♦ బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ♦ గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. ♦ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ♦ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ♦ తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ♦ పాలియేటివ్ కేర్ ♦ రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ♦ గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ♦ హిమోగ్లోబిన్ టెస్ట్ ♦ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (సుగర్) ♦ మలేరియా టెస్ట్ ♦ హెచ్ఐవీ నిర్ధారణ ♦ డెంగ్యూ టెస్ట్ ♦ మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ♦ అయోడిన్ టెస్ట్ ♦ వాటర్ టెస్టింగ్ ♦ హెపటైటిస్ బి నిర్ధారణ ♦ ఫైలేరియాసిస్ టెస్ట్ ♦ సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ♦ విజువల్ ఇన్స్పెక్షన్ ♦ స్పుటమ్ (ఏఎఫ్బీ) -
ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 9.48 లక్షల మందికి వైద్యం ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రామాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 58,474 మంది ఉచిత చికిత్సలు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్ వైద్య సేవలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్ టెస్ట్లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు. తొలి దశలో 60.27 లక్షలు తొలి దశ జేఏఎస్ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రెఫర్ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది. యూరినరీ సమస్యకు పరిష్కారం కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్సీ వైద్యులు, ఏఎన్ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు. – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా నిరంతరం ఫాలోఅప్ సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్ ఉంచుతున్నాం.రిఫరల్ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
ఆరోగ్యశ్రీతో 3,67,305 మందికి పునర్జన్మ
గుండె పోటు అనగానే ఎవరికైనా సరే సగం ప్రాణాలు పోతాయి. మిగతా సగం ప్రాణాలు పోకుండా కాపాడుకోవాలంటే వెంటనే అత్యుత్తమ వైద్యం అందాలి. ఇది జరగాలంటే చేతిలో కనీసం రెండు మూడు లక్షల రూపాయలుండాలి. డబ్బులున్నోళ్లయితే వెంటనే కార్లో వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రిలో జాయినైపోతారు. మరి రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పరిస్థితి ఏమిటి? ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా? ఇదంతా గతం. గత టీడీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలనలో, మనసు లేని పాలకుల హయాంలో ఇలాగే జరిగేది. ఇప్పుడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. నేనున్నానంటూ ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ రూపంలో సీఎం వైఎస్ జగన్ గుండె గుండెకూ భరోసా ఇస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా వంద కాదు.. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 3.67 లక్షల మందికి పునర్జన్మ ఇచ్చారు. ఇంతటి మేలు ఏపీ మినహా ఏ రాష్ట్రంలోనూ జరగలేదనడం పచ్చి నిజం. అతనో ఆటో డ్రైవర్.. పేరు పొందూరు విజయ్ కుమార్.. ఊరు పార్వతీపురం. వచ్చే ఆదాయం ఇంట్లో వాళ్లు మూడు పూటలా తినడానికి కూడా సరిగా సరిపోదు.. ఒకరోజు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. గుండెలో మూడు రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుర్తించి, వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆ మాట వినగానే అతడు వణికిపోయారు. తానిక బతకనంటూ కుటుంబ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతుంటే.. ‘ఏదో ఒక పెద్దాసుపత్రికి వెంటనే వెళ్లిపోండి.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తారు’ అని అక్కడి వారు చెప్పారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఇతనికి వెంటనే రెండున్నర లక్షల రూపాయల ఆపరేషన్ను ఉచితంగా చేశారు. రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ వైఎస్సార్ ఆసరా కింద రూ.10,000 అందజేశారు. ఇప్పుడు చక్కగా ఆటో తోలుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాడు. –సాక్షి, అమరావతి 3.67 లక్షల మందికి పునర్జన్మ 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,67,305 మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. వీరికి 4,87,303 ప్రొసీజర్లలో చికిత్సలు అందించడానికి ప్రభుత్వం ఏకంగా రూ.2,229.21 కోట్లు ఖర్చు చేసింది. కాగా, 3.67 లక్షల మందిలో 2,22,571 మంది యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, హార్ట్ స్ట్రోక్, స్టెంట్లు వంటి కార్డియాలజీ సంబంధిత 2.82 లక్షల ప్రొసీజర్లలో చికిత్సలు అందుకున్నారు. మిగిలిన 1,44,734 మంది బైపాస్ సర్జరీలు, వాల్వ్ రిపేర్, కార్డియాక్, కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో 2.05 లక్షల ప్రొసీజర్లలో ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. మరో వైపు చికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి నెలకు గరిష్టంగా రూ.5 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం అరకబద్ర గ్రామానికి చెందిన కె.సాహూ ఇంటి వద్ద చిన్న కొట్టు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నిరుపేద కుటుంబం. 2020 డిసెంబర్ 23 అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో తొలుత బరంపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వెంటనే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పగా, కుటుంబ సభ్యులు విశాఖకు తీసుకెళ్లారు. ఆరోగ్య శ్రీ కింద అక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహించారు. తర్వాత ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం రూ.5 వేలు అతని ఖాతాలో జమ చేసింది. గుంటూరు రాజీవ్గాంధీనగర్లో ఉంటున్న ఆటో డ్రైవర్ రావెల ప్రభాకర్దీ అదే పరిస్థితి. రూ.3 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్ను ఉచితంగా చేయించిన ప్రభుత్వం పునర్జన్మనిచ్చింది. ఇలాంటి వారు తక్కువలో తక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఊరికొకరున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో బతికి బట్టకట్టగలిగారు. ఈ పథకమే లేకపోయి ఉండుంటే తామంతా ప్రాణాలతో ఉండే వాళ్లం కాదంటున్నారు. చేతి నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టే పని లేకుండా ఖరీదైన గుండె ఆపరేషన్, గుండె మార్పిడి చికిత్సలను సైతం ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది. ఏపీతో పాటు, రాష్ట్రం వెలుపల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితం నిరుపేదలు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాల ప్రజలకు ఒక్క గుండె సంబంధిత చికిత్సలే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యల్లో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ఈ పథకాన్ని విప్లవాత్మకంగా బలోపేతం చేశారు. ఇటీవల వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచారు. గత ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్లు ఉండగా, వాటిని 3,257కు పెంచారు. 2019 నుంచి ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కోసం ఏకంగా రూ.13 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసింది. 40 లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు నడుం బిగించారు. ఇందులో ఐదు కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరో ఐదు వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. నాడు–నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రులన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారు. 53 వేల మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బందిని కొత్తగా నియమించారు. ఉద్దానంలో వైఎస్సార్ కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో గ్రామీణులకు వైద్యాన్ని మరింత చేరువ చేశారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ ఆరోగ్య సురక్ష క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారు. తొలి విడత 12,423 శిబిరాలు నిర్వహించి, 60.27 లక్షల మందికి ఓపీ సేవలు అందించారు. రెండవ దశలో ఇప్పటి వరకు 2,838 క్యాంపులు నిర్వహించి, 9.48 లక్షల మందికి వైద్యం అందించారు. దేవుడిలా ఆదుకున్నారు నాకు 71 ఏళ్లు. అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకునే చిరు వ్యాపారిని. ఆయాసంతో బాధ పడుతున్నాను. దీంతో గత ఏడాది ప్రభుత్వం మా ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టినప్పుడు వైద్యులను సంప్రదించా. రాజమండ్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడకు వెళ్లగా పరీక్షలు చేసి రక్తనాళాలు పూడిపోయాయని చెప్పారు. బైపాస్ సర్జరీ చేయాలన్నారు. మా అబ్బాయి ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి మాది. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ చేయించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తుందని భయపడ్డాను. ఆరోగ్యశ్రీ పథకం దేవుడిలా అదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అక్టోబర్ 25న సర్జరీ చేయించింది. డిశ్చార్జి అయ్యాక కోలుకునే సమయానికి రూ.9500 భృతి బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రభుత్వం మేలును ఎన్నటికీ మరువము. – గుత్తికొండ వెంకటరమణ, తేతలి గ్రామం, పశ్చిమగోదావరి జిల్లా ఆరోగ్యశ్రీ నా ప్రాణం నిలబెట్టింది వీధి వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాను. 2022 జూన్లో ఎక్కువగా గుండె నొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లి చూపిస్తే వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు. దీంతో నా గుండె ఆగినంత పనైంది. ముగ్గురు ఆడపిల్లల్లో ఇద్దరికి పెళ్లి చేశాను. ఇంకా ఒక అమ్మాయి ఉంది. రోజంతా రోడ్డు మీద కొబ్బరికాయలు, పళ్లు అమ్మితేనే నోటికి కూడు దక్కుతాది. వచ్చే డబ్బుతో కుటుంబ పోషణ, మూడో అమ్మాయి పెళ్లి ఇలా చాలా సమస్యలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ అంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీతో డబ్బులు లేకుండానే ఆపరేషన్ చేస్తారని మా ఊరి నర్స్ చెప్పంది. దీంతో శ్రీకాకుళంలో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేశారు. ఈæ పథకం లేకపోతే.. నాలాంటి పేదోడికి దిక్కేది? ఈ పథకమే నా ప్రాణం నిలబెట్టింది. – బోర రామ్మూర్తి, రాందాస్పేట, శ్రీకాకుళం జిల్లా పేదలపై వైద్య ఖర్చుల భారం లేదు రాష్ట్రంలో వైద్యం కోసం పేదలు, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలు కాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. అర్హులందరికీ ఉచితంగా చికిత్సలు అందేలా చూస్తున్నాం. గుండె, కాలేయం, కిడ్నీ సంబంధిత, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బులకు చికిత్సలు పథకం పరిధిలో ఉన్నాయి. సేవలు పొందడంలో ఏవైనా సందేహాలుంటే 104ను సంప్రదించవచ్చు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పథకం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. – డి.కె.బాలజీ, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
సులభంగా ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: డిజిటల్ వైద్య సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వండిజిటల్ విధానంతో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలనూ సులభతరం చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ రిజిస్ట్రేషన్ను తేలికగా పూర్తి చేస్తోంది. ఈ విధానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏపీలోని 909 ప్రభుత్వాస్పత్రుల్లో స్కాన్ అండ్ షేర్ విధానంలో ఓపీ రిజిస్ట్రేషన్ అమలు చేస్తోంది. ఇలా గడిచిన 4 నెలల్లో 23.80 లక్షల ఓపీలు నమోదయ్యాయి.55.04 లక్షలతో యూపీ తొలి స్థానంలో, 24.67 లక్షలతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఓపీ కౌంటర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత రోగి ఏ సమస్యతో వైద్య సేవలు పొందాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆ విభాగానికి రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. దీనికి 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చాలా సమయం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్తో త్వరగా అయిపోతుంది. రోగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్కు వెళ్లి స్మార్ట్ ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేసి, టోకెన్ను తీసుకుని డాక్టర్ను సంప్రదించవచ్చు. క్యూలో వేచి ఉండటం, ఇతర అగచాట్లు తప్పుతాయి. ఇలా చేసుకోవాలి.. ► స్మార్ట్ ఫోన్ నుంచి ఆస్పత్రిలో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే యూఆర్ఎల్ కోడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే..ఆభా,ఆరోగ్యసేతు, వంటి యాప్లు కనిపిస్తాయి ► ఆ యాప్లు ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్లో రిజిస్టర్ అవ్వాలి ► యాప్లోకి లాగిన్ అయితే ఆభా వివరాలు వస్తాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. ఈ టోకెన్కు అరగంట వ్యాలిడిటీ ఉంటుంది. టోకెన్ నంబర్ వచ్చాక ఆస్పత్రిలోని కౌంటర్కు వెళ్లి ఆభా నంబర్, ఫోన్ నంబర్ చెప్పి, ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే సిబ్బంది ఓపీ స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని డాక్టర్ను సంప్రదించవచ్చు. -
AP: ‘పెద్ద’ భరోసా..!
కడుపు కింద భాగంలో జిస్ట్ అనే కణితి సమస్యతో బాధపడుతున్న విజయవాడకు చెందిన సునీల్కు గత మార్చిలో గుంటూరు జీజీహెచ్లో క్లిష్టమైన సర్జరీ విజయవంతంగా పూర్తైంది. బాధితుడికి చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర కణితి ఉన్నట్లు జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ గుర్తించారు. మెడికల్ జర్నల్స్ ప్రకారం ప్రపంచంలో ఇటువంటి కేసులు రెండు మాత్రమే నమోదయ్యాయి. అరుదైన ఈ సమస్యకు ఎలా ఆపరేషన్ చేయాలో నిర్దిష్ట విధానాలు లేకున్నా జనరల్ సర్జరీ విభాగం వైద్యులంతా చర్చించుకుని సాహసోపేతంగా నిర్వహించారు. సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు పెద్దాస్పత్రి అంటే విజయవాడ జీజీహెచ్! 2019కి ముందు వరకూ ఇక్కడ న్యూరో విభాగంలో వైద్యులు అరకొరగా ఉండటంతో సేవలపై తీవ్ర ప్రభావం పడేది. రోజంతా కలిపినా కేవలం వంద లోపే ఓపీలు నమోదు అయ్యేవి. ఐపీలు అంతంత మాత్రంగానే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూరో విభాగంలో మంజూరైన పోస్టులన్నింటిలో వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన చికిత్సలను సైతం ఉచితంగా అందించేలా మందులు, సదుపాయాలను సమకూర్చింది. ప్రస్తుతం ఇక్కడ రోజుకు 250 వరకూ ఓపీలు నమోదు అవుతున్నాయి. పడకలన్నీ ఫుల్గా ఉంటున్నాయి. ఒక్క న్యూరో మాత్రమే కాకుండా అన్ని విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను అందుబాటులోకి తేవడంతో పాటు అధునాతన వైద్య పరికరాలను సమకూర్చింది. సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో ప్రజల్లో పెద్దాస్పత్రిపై విశ్వాసం పెరిగింది. 2018–19లో 9,202 మేజర్ సర్జరీలు నిర్వహించగా 2022–23లో ఏకంగా 51 శాతం అదనంగా అంటే 13,095 సర్జరీలు జరగడం గమనార్హం. 2018–19లో 3.85 లక్షల ల్యాబ్ టెస్ట్లు చేయగా 2022–23లో 5.83 లక్షల టెస్ట్లు చేశారు. వైద్య రంగంలో సంస్కరణలు.. సీఎం జగన్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది. రోగుల తాకిడికి సరిపడా వైద్యులు, సిబ్బంది, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చారు. విజయవాడ జీజీహెచ్లోనే కాకుండా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో గతంతో పోలిస్తే రోగుల సేవల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సర్జరీల్లో పెరుగుదల ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో బోధనాస్పత్రుల్లోని స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు, సిబ్బంది కొరతకు తావులేకుండా పోయింది. ఆపరేషన్ థియేటర్లలో అధునాతన వైద్య పరికరాలు సమకూరడంతో సర్జరీలు పెరిగాయి. 2022–23లో ఏకంగా 3,45,482 మైనర్, 1,50,592 మేజర్ సర్జరీలను నిర్వహించారు. 2023–24లో జూలై నెలాఖరు నాటికి 2.04 లక్షల మేజర్ సర్జరీలు జరిగాయి. టీడీపీ హయాంలో 2018–19లో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 1.99 లక్షల మైనర్, 98 వేల మేజర్ సర్జరీలు మాత్రమే జరిగాయి. గతంతో పోలిస్తే 73.05 శాతం మైనర్, 52.56 శాతం మేజర్ సర్టరీలు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ల్యాబ్లను బలోపేతం చేయడంతో ఏటా కోటికిపైనే ల్యాబ్ టెస్ట్లు జీజీహెచ్లలో చేపడుతున్నారు. 2021–22లో 1.06 కోట్లు, 2022–23లో 1.32 కోట్ల మేర ల్యాబ్ టెస్ట్లు ఉచితంగా నిర్వహించారు. ఈ ఏడాది ఇప్పటికే 70 లక్షల టెస్ట్లు పూర్తి అయ్యాయి. ► 2021–22లో బోధనాస్పత్రుల్లో 49.32 లక్షల ఓపీ సేవలు నమోదు కాగా గతేడాది 83.16 లక్షలకు పెరిగాయి. ఐపీ సేవల్లో 33.63 శాతం పెరుగుదల నమోదైంది. ► డబ్ల్యూహెచ్వో ప్రమాణాలతో కూడిన 608 రకాల మందులను ప్రభుత్వం బోధనాస్పత్రుల్లో అందుబాటులోకి తెచ్చింది. 530కిపైగా రకాల మందులను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ రూపంలో సరఫరా చేస్తుండగా మిగిలినవి స్థానిక ఫార్మా కంపెనీల ద్వారా అందిస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ల నిర్వహణకు అవసరమయ్యే రీ ఏజెంట్స్ (రసాయనాలను) సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సరఫరా ప్రారంభించింది. ► నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో అదనపు వార్డులు, సూపర్ స్పెషాలిటీ బ్లాక్ల నిర్మాణం చేపట్టారు. గతంలో రూ.40 మాత్రమే ఉన్న డైట్ చార్జీలను రూ.80కు పెంచడం ద్వారా రోగులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. చక్కగా ఆపరేషన్ చేశారు 20 ఏళ్ల క్రితం గుండె కవాటం చెడిపోయింది. నా కుమార్తె సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నా మందులతోనే కాలం గడిపా. రానురాను సమస్య పెరగడంతో గత ఆగస్టులో కర్నూలు జీజీహెచ్లో అడ్మిట్ అయ్యా. సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్రెడ్డి ఆపరేషన్ చేశారు. మైట్రల్ వాల్వ్ రీ ప్లేస్మెంట్, కార్డల్ ప్రిజర్వేషన్ శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆపరేషన్ చక్కగా చేశారు. నర్సింగ్ సేవలు చాలా బాగున్నాయి. వారి చొరవతో చకచకా కోలుకోగలిగా. సాధారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అంటే అందరూ తెలియని భయానికి లోనవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. వసతులు బాగున్నాయి. అనుభవజ్ఞలైన వైద్యులు, సిబ్బంది మంచి వైద్యం అందిస్తున్నారు. – వెంకట రెడ్డి, ప్రజా పరిరక్షణ ఐక్యవేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్కు మించి సేవలు.. నాన్న అనారోగ్యం బారిన పడటంతో విజయవాడ జీజీహెచ్కు తీసుకొచ్చాం. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి అడ్మిట్ చేసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించారు. నర్సులు, వైద్య సిబ్బంది రోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం ఈ తరహాలో సేవలుండవు. – జి. రవి, ఎండపల్లి, ఏలూరు జిల్లా సేవలు వినియోగించుకోవాలి బోధనాస్పత్రుల్లో ఎంతో అనుభవజ్ఞలైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. అరుదైన జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందుతున్నాయి. ప్రభుత్వం సౌకర్యాలను మెరుగుపరిచింది. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలి. ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించి అనవసర వ్యయ ప్రయాసలకు గురి కావద్దు. ప్రభుత్వాస్పత్రుల్లో సేవలను సద్వినియోగం చేసుకోవాలి. అరుదైన సర్జరీలు అలవోకగా చేసేందుకు వసతులున్నాయి. కోత, కుట్లు లేకుండా చిన్న గాటుతో సర్జరీలు చేస్తున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
AP: ఆరోగ్య సురక్ష రెండోదశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు. శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్ ఆఫీసర్తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్ వైద్య సేవలందించేందుకు 543 జనరల్ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్ కోసం 562 మంది పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. చేయి పట్టి నడిపిస్తూ.. వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది. రిఫరల్ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్లు, ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు జేఏఎస్–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు. ప్రజల వద్దకే వైద్యం జేఏఎస్–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఆరోగ్యశ్రీ కార్డుంటే.. రూ.25 లక్షల వైద్యం చేతిలో ఉన్నట్టే
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ. ఈ పథకం కింద ప్రభుత్వం రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తోంది. దురదృష్టవశాత్తు కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేసినా.. ప్రమాదం సంభవించినా ఈ పథకం కింద ఉచితంగా చికిత్సలు పొందవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు వెంటబెట్టుకుని మీ దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లండి’ అంటూ వైద్య సిబ్బంది ఆరోగ్యశ్రీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద వైద్య ఖర్చుల పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో విస్తరించిన ప్రయోజనాలతో కూడిన కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తూ.. పథకం సేవలు ఎలా పొందాలన్న దానిపై ప్రతి ఒక్కరికీ వివరించేలా ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సరికొత్త ఫీచర్లతో రూపొందించిన 1.48 కోట్ల స్మార్ట్ కార్డులను వైద్య శాఖ ముద్రించింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా కార్డుల పంపిణీ చేస్తున్నారు. కాగా.. ఇప్పటివరకు 1,04,326 కార్డుల పంపిణీ పూర్తి అయింది. ఒక్కో వారంలో నియోజకవర్గంలో నాలుగు వరకు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ కార్డుల పంపిణీ కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సేవలు పొందడం ఇలా.. ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలు పొందడం ఎలా అనే అంశంపై ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎం, సీహెచ్వో, వలంటీర్లతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ సేవలను 1,059 రోగాల నుంచి 3,257 రకాల రోగాలను పెంచారు. ఆరోగ్య ఆసరా కింద చికిత్స అనంతరం అందిస్తున్న భృతి, రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందగలగటం వంటి ప్రయోజనాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నారు. సులువుగా ప్రజలు పథకం సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ యాప్ను రూపొందించింది. ఈ యాప్ను ప్రతి ఇంటిలో మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేయించి, కుటుంబ సభ్యుల ఐడీ ద్వారా లాగిన్ చేయించి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. కాగా.. గడచిన వారంలో లక్షకు పైగా లబ్ధిదారుల ఫోన్ల ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించారు. యాప్లో లాగిన్ అవ్వడం ద్వారా పథకం కింద అందే వైద్య సేవలు, నెట్వర్క్ ఆస్పత్రులు, గతంలో పొందిన చికిత్సల వివరాలను ఏ విధంగా తెలుసుకోవచ్చో ఏఎన్ఎం, సీహెచ్వోలు ప్రజలకు వివరించారు. పథకం కింద సేవలు పొందడంలో ఇంకా ఏవైనా అనుమానాలు, సందేహాలు ఉంటే 104కు ఫోన్ను ఎలా సంప్రదించాలన్న దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు. పనిలో పనిగా మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్ను మహిళల ఫోన్లో ఇన్స్టాల్ చేయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటివరకూ దిశ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోని యువతులు, మహిళలు ఉన్నట్లైతే వారి ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేయించి, అత్యవసర సమయంలో యాప్ ఎలా సహాయపడుతుందో వివరిస్తున్నారు. -
పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం వైఎస్సార్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బద్వేలు నియోజకవర్గం గోపవరం మండల పరిధిలోని ఇండస్ట్రియల్ పార్కులో రూ.956 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన సెంచురీ ప్యానల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే, కడప రిమ్స్ ప్రాంగణంలో అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మించిన డా.వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, డా. వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, డా.వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్లతో పాటు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ భవనాలకు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత.. ఆధునీకరించిన వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని, రూ.56.70కోట్లతో నిర్మించిన అంబేద్కర్ సర్కిల్–వై జంక్షన్ రోడ్డును, 15వ ఆర్థిక సంఘం, ‘కుడా’ సహకారంతో నిర్మించిన కోటిరెడ్డి సర్కిల్ను ఆయన ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోనే జిల్లాలోని అర్హులైన 50 మంది దివ్యాంగులకు ముఖ్యమంత్రి జగన్ రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. సెంచురీ ప్యానెల్స్ పరిశ్రమ జిల్లా పారిశ్రామిక ప్రగతిలో మరో మైలురాయి అని సీఎం జగన్ అభివర్ణించారు. అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైందన్నారు. లాంజ్ రూమ్లో కంపెనీకి సంబంధించిన వీడియోను తిలకించారు. సెంచురీ సంస్థ చైర్మన్ సజ్జన్ బజంకా, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశన్ బజంకా సంస్థ గురించి సీఎంకు వివరించారు. అనంతరం.. ప్రజలకు మెరుగైన వైద్యసేవలతో పాటు ఆరోగ్యకర సమాజం కోసం ఎంతోమంది వైద్యులను అందిస్తున్న రిమ్స్ (రాజీవ్గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్).. మెడికల్ హబ్గా రాయలసీమకే తలమానికంగా మారిందని సీఎం జగన్ ప్రశంసించారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా రాయలసీమ స్థాయిలో కూడా అత్యుత్తమ, మెరుగైన వైద్యసేవలు రిమ్స్ అందిస్తోందన్నారు. సువిశాలమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలతో వేలాది మంది ప్రజలకు నిత్యం ప్రాణరక్షణ కల్పిస్తూ సంజీవనిగా రిమ్స్ పేరొందిందన్నారు. రిమ్స్ బోధనాసుపత్రి ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కేన్సర్ రీసెర్చ్ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందన్నారు. వైద్య విభాగాధిపతులు కేవలం వైద్యం వరకే పరిమితం కాకుండా ఆయా విభాగాల్లో పరికరాల నిర్వహణ, యాజమాన్యంపై ప్రత్యేక దృష్టిసారించి వైద్యరంగం పటిష్టత కోసం కృషిచేయాలని ముఖ్యమంత్రి ఆకాక్షించారు. స్మార్ట్ సిటీగా కడప ఇక కడప నగరాన్ని స్మార్ట్ సిటీగా చూడాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని, కడపకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్యకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దడంలో మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. నగరం అభివృద్ధి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు కూడా చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని.. మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రధాన రహదారులకు విస్తరణ పనులు చేపట్టి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కడపను అభివృద్ధి చేసి చూపించామన్నారు. అలాగే, నైపుణ్యతకు, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్ అని, పుష్కలమైన పరిపాలన వనరులకు కేంద్ర బిందువుగా రాష్ట్రంలో నిలిచిందని సీఎం అభివర్ణించారు. రోడ్డుమార్గాన ఇడుపులపాయకు.. అనంతరం శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళ్లాల్సి ఉంది. అయితే, కార్యక్రమాలు ఆలస్యం కావడంతో అనుకున్న సమయానికి హెలికాపర్టర్లో వెళ్లలేకపోయారు. ఏవియేషన్ అధికారుల సూచన మేరకు రోడ్డు మార్గాన రాత్రి 7గంటలకు ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రికి అక్కడ వైఎస్సార్ గెస్ట్హౌస్లో బసచేశారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని ఆదివారం ఇడుపులపాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నెమళ్ల పార్కు పక్కనున్న ఓపెన్ ఎయిర్ చర్చిలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. అనంతరం.. సింహాద్రిపురం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళ్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, ఎంపీ అవినాష్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కడప మేయర్ కె. సురేష్బాబు, కుడా (కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ గురుమోహన్, ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయప్రతాప్రెడ్డిలతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్, జేసీ గణేష్కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కడప కమిషనర్ సీఎస్ఎస్ ప్రవీణ్చంద్ తదితరులు పాల్గొన్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో ‘సెంచురీ’... బద్వేలు నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో గోపవరం మండల పరిధిలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కులో అన్ని మౌలిక సదుపాయాలతో సహా ఎకరా రూ.15 లక్షల రాయితీ ధరతో ఏపీఐఐసి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 100 ఎకరాల విస్తీర్ణంలో సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ (సీపీఎల్) పరిశ్రమ ఏర్పాటైంది. రూ.956 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకున్న ఈ పరిశ్రమలో.. మీడియం డెన్సిటీ ఫైబర్బోర్డు, హై ప్రెజర్ లామినేట్స్ ఉత్పత్తిని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. చెక్క పలకలు, అలంకరణ సంబంధ వుడ్ షీట్స్ తయారీలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ సంస్థ.. 2,266 మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా.. ఈ ప్రాంతంలో ఏర్పాటైంది. మరోవైపు.. కంపెనీ ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకును.. బద్వేలు నియోజకవర్గ రైతుల నుండే నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్య అవసరాల కొరతను తీర్చేందుకు ఈ కంపెనీ ద్వారా రానున్న ఎనిమిదేళ్లలో 80,000 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను పెంచేందుకు స్థానిక రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే.. 1,000 మంది రైతులకు సంబంధించి 5,000 ఎకరాల్లో రాయితీ ధరతో చెట్లను నాటడానికి అవకాశం కల్పించారు. ఇక ఈ పరిశ్రమ నీటి అవసరాలకుగాను.. రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నుండి 0.07 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. దీనికోసం.. రిజర్వాయర్ నుండి ప్లాంట్ సైట్ వరకు రూ.45 కోట్లతో వాటర్ పైప్లైన్ ఏర్పాటుచేశారు. అలాగే, నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం ఏపీఐఐసి ద్వారా రూ.19.11 కోట్లు వెచ్చించి 132 కేవీ విద్యుత్ లైన్ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి.. రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా రిమ్స్ ప్రాంగణంలో 452 పడకల సామర్థ్యంతో జి+4 అంతస్తులతో ఏ, బీ, సీ, డీ, ఈ బ్లాకులుగా డా. వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టింది. 2,38,062.46 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆసుపత్రి కోసం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లను వెచ్చించింది. అందులో రూ.75 కోట్లు నిర్మాణ పనులకు, రూ.50 కోట్లు వైద్య పరికరాల కోసం ఖర్చుచేశారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, నెఫ్రాలజీ, కార్డియో థొరాసిక్–వాసు్కలర్ సర్జరీ, న్యూరో సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ మొదలైన 10 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సంబంధించి వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో సాధారణ వార్డులో 300 పడకలు, పేషెంట్ కేర్ యూనిట్లు, 100 పడకల ఐసీయూ, 12 పడకల క్యాజువాలిటీ, 40 పడకలు ఇతరులకు కేటాయించారు. అంతేకాక.. 12 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, అన్ని సూపర్ స్పెషాలిటీలకు అనువైన సెంట్రల్ లాబొరేటరీ, రేడియాలజీ విభాగం, సీఎస్ఎస్డీ, సెంట్రల్ ఫార్మసీ, అధునాతన క్యాథ్ ల్యాబ్, అధునాతన బ్లడ్ బ్యాంక్, అధునాతన సీటీ, ఎమ్మారై స్కానింగ్ సెంటర్లను ఏర్పాటుచేశారు. డా. వైఎస్సార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్.. మానసిక రోగులకు అత్యుత్తమ ఉపశమనం కలిగించేలా.. నిపుణులైన మానసిక వైద్యులతో వైద్యం, కౌన్సెలింగ్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో.. రిమ్స్ ప్రాంగణంలో 100 పడకల మానసిక వైద్యశాలను రూ.40 కోట్లు వెచ్చించి నిర్మించింది. 97,844 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి+1 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 23 మంది వైద్యులు, 27 మంది నర్సింగ్ స్టాఫ్, 29 మంది పారామెడికల్ స్టాఫ్, 37 మంది ఇతర సహాయక సిబ్బంది మానసిక రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో ప్రతిరోజు ఓపీ సేవలతో పాటు.. డెడిక్షన్ సెంటర్, బీపాడ్ క్లినిక్, స్కిజోఫ్రెనియా క్లినిక్ సేవలతో ఐపీ సేవలతో పాటు ఇంకా అనేకం అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ సెంటర్.. క్యాన్సర్ రోగులకు అధునాతన వైద్యసేవలతో సరికొత్త జీవితాన్నందించే దిశగా.. రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్య సదుపాయాలతో రిమ్స్ ప్రాంగణంలోనే 100 పడకల క్యాన్సర్ కేర్ సెంటర్ను రూ.107 కోట్లతో నిర్మించింది. 1,58,295 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా జి+2 అంతస్తుతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 మంది వైద్యులతో పాటు ఇతర సిబ్బంది అందరూ కలిపి మొత్తం 148 సిబ్బందితో క్యాన్సర్ రోగులకు వైద్యసేవలు అందనున్నాయి. ఇందులో మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలున్నాయి. ఇందులో 96 పడకల సాధారణ వార్డు, ఐసీయూ, క్యాజువాలిటీ, నాలుగు పడకల మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ వార్డు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక.. అధునాతన పరికరాలతో లీనియర్ యాక్సిలరేటర్, డే కేర్ ఫెసిలిటీ, పెయిన్ మరియు పాలియేటివ్ కేర్, పునరావాస సేవలు, లేబొరేటరీ, రేడియాలజీ సేవలు, బ్లడ్ బ్యాంక్ యూనిట్లు అందుబాటులో వున్నాయి. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి.. జిల్లాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి క్యాంపస్లో ఏర్పాటైన ఎల్వీ ప్రసాద్ నేత్ర ఆసుపత్రి.. టెరిటరీ నెట్వర్క్లో 4వ తృతీయ నేత్ర సంరక్షణ కేంద్రం. ఆంధ్ర రాష్ట్రంలో మూడవది. ఏపీ ప్రభుత్వం.. ఇతర దాతృత్వ ఫౌండేషన్ల మద్దతుతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఇక్కడ మొత్తం 66,600 చ.అ.ల విస్తీర్ణంలో 40 పరీక్షా గదులు, నాలుగు ఆధునిక ఆపరేషన్ గదులతో నిర్మితమైంది. వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక కంటి సంరక్షణ సేవల యూనిట్ మరియు అన్ని ఇతర ప్రత్యేక నేత్ర సంరక్షణ సేవలతో పాటు దృష్టి మెరుగుదల సేవలను అందిస్తుంది. రోజుకు సుమారు 400లకు పైగా ఔట్ పేషెంట్లకు పరీక్షలు, రోజుకు 60కి పైగా శస్త్రచికిత్సలు నిర్వహించే సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. నైపుణ్యతకు, నాణ్యతకు నిదర్శనం వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్.. రూ.6 కోట్ల డీఎంఎఫ్ నిధులతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కలెక్టరేట్ భవనాన్ని ఆధునీకరించారు. ఇందులో అన్ని విభాగాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పార్కింగ్ సౌకర్యం ఏర్పాటుతో పాటు మెకానికల్, ప్లంబింగ్, ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్ వంటి సేవలను పునరుద్ధరించారు. అలాగే, పరిపాలనాపరమైన, ఉద్యోగుల పునశ్చరణ శిక్షణ కోసం సమగ్రమైన జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఉంది. సభా భవన్, స్పందన హాల్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ వంటి వేదికలలో ఓరియంటేషన్లు, శిక్షణతో సహా ఉద్యోగుల సామర్థ్య నిర్మాణ సెషన్లు ఇక్కడ నిర్వహిస్తారు. రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్ల పంపిణీ.. శారీరక వైకల్యాలున్న వ్యక్తులు ఎదుర్కొనే చలనశీలత సవాళ్లను పరిష్కరించడానికి, వారికి సౌకర్యవంతమైన స్వతంత్ర రవాణా మార్గాలను అందించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ స్కూటర్లను అర్హులైన వారికి పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్) కాంపోనెంట్ కింద జిల్లా పరిపాలన యంత్రాంగం, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల సహకారంతో దివ్యంగుల జీవన ప్రమాణాలు, వారి జీవనోపాధి, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. అంతేకాక.. ఏడీఐపీ పథకం కింద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నియోజకవర్గస్థాయి శిబిరాల్లో 6,509 మంది వికలాంగులకు సహాయాలు, సహాయక పరికరాలను పంపిణీ చేశారు. ఇందుకు మొత్తం రూ.5.85 కోట్లు వెచ్చించారు. అగ్నిమాపక ఉపకరణాల ప్రారంభోత్సవం.. వరదలు, తుపానులు మొదలైన ప్రకృతి విపత్కర సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే ఉద్దేశ్యంతో.. రూ.77.423 లక్షల వ్యయంతో.. వైఎస్సార్ జిల్లా అగ్నిమాపక విభాగం కొనుగోలు చేసిన రెస్క్యూ పరికరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. వీటిలో.. రెస్క్యూ బోట్లు, వీటిని నడపడానికి ఉపయోగించే అవుట్ బోర్డ్ మోటార్లు, బాధితులను వరద నీటిలో తేలియాడేలా చేయడానికి ఉపయోగించే లైఫ్జాకెట్లు, లైఫ్ బాయ్స్, రెస్క్యూ బోట్లను శుభ్రం చేసే పోర్టబుల్ పంపులు.. రెస్క్యూ రోప్లు ఉన్నాయి. -
ఆరోగ్యానికి మరింత భరోసా
‘విద్య, వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అందుకే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే మన ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య పథకం కోసం ఇప్పటిదాకా దాదాపు రూ.12,000 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కోసం రూ.1,309 కోట్లు ఖర్చు చేశాం. 108, 104 అంబులెన్స్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరో రూ.750 కోట్లు వెచ్చించాం. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేస్తూ.. ఆరోగ్య శ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు శ్రీకారం చుడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పన విషయంలో అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ క్రమంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్య రంగంలోనే ఇది చరిత్రాత్మక నిర్ణయమని ఉద్ఘాటించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ.25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుందని తెలియజేయండి. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన అనంతరం వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చికిత్స చేయించుకున్న వారు తిరిగి ఫాలో అప్ చెకప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లేలా చూడాలి. ఇందులో భాగంగా ఫాలో అప్ కన్సల్టేషన్ కోసం రవాణా చార్జీల కింద రూ.300 చొప్పున అందజేయండి. మరోవైపు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నుంచి ఆస్పత్రులకు రెఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. వీరు ఆస్పత్రులకు వెళ్లడం కోసం రవాణా చార్జీల కింద రూ.500 చొప్పున అందిస్తున్నాం. మరో విషయం ఏమిటంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే దానిపై రూపొందించిన వీడియో అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహా ప్రజలందరికీ ఈ వీడియోను అందుబాటులో ఉంచాలి’ అని ఆదేశించారు. కిడ్నీ రోగులకు బాసటగా నిలవాలి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులకు అందుతున్న వైద్య సేవలు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. స్క్రీనింగ్, మందులు, చికిత్స తదితర అంశాల్లో రోగులకు బాసటగా నిలవాలన్నారు. డయాలసిస్పై ఉన్న రోగులు వాడుతున్న మందులు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అందుబాటులోకి తీసుకురావాలని, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంతో అనుసంధానం చేసి.. బాధితుల ఆరోగ్యంపై వాకబు చేయాలని సూచించారు. మార్కాపురంలోనూ పలాస తరహా వైద్య చికిత్స సౌకర్యాలు అందుబాటులోకి తేవాలన్నారు. కొత్తగా కడుతున్న మెడికల్ కాలేజీలో ఇప్పటికే నెఫ్రాలజీ విభాగం కోసం ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. దీంతో పాటు యూరాలజీ విభాగం కూడా తీసుకురావాలని, ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరతకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కోసం అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలని సూచించారు. 18న సీఎం చేతుల మీదుగా ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 18వ తేదీన ప్రారంభించనుంది. 19వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో 5 గ్రామాల చొప్పున జరిగే కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. మండలంలో వారానికి నాలుగు గ్రామాల చొప్పున కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపడతారు. ప్రతి ఇంటికీ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టి, జనవరి నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చనే దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఆశా వర్కర్లు, వలంటీర్లు, మహిళా పోలీసులు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ సహా, పథకంపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యశ్రీ మొబైల్ యాప్ను ప్రజల సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసి, యాప్ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. పనిలో పనిగా దిశ యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తారు. ఇదిలా ఉండగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫేజ్–2 జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతివారం మండలానికి ఒక గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో ఒక వార్డు పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించనున్నారు. జిల్లాల్లో సగం మండలాల్లో మంగళవారం, సగం మండలాల్లో శుక్రవారం శిబిరాల నిర్వహణ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుధవారం నిర్వహిస్తారు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ పాల్గొన్నారు. -
టెలీమెడిసిన్ సేవల్లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటికి చేరువలోనే వైద్య సేవల కల్పనలో సీఎం జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య శాఖలో పలు సంస్కరణలు తె చ్చింది. పీహెచ్సీల నుంచి జిల్లా ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రులను అధునాతనంగా తీర్చి దిద్దుతోంది. ప్రజలకు అత్యంత అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్యులనే గ్రామాలకు పంపి, ప్రజల ముంగిటకే వైద్య సేవలను తీసుకెళ్లింది. టెలీమెడిసిన్లోనూ అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందించడంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ–సంజీవని టెలిమెడిసిన్ సేవలను 2019 నవంబర్లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ విధానంలో ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల ద్వారా అత్యంత వేగంగా, సమర్ధవంతమైన సేవలు అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తోంది. ఏపీ స్థానాన్ని మరే రాష్ట్రం అధిగమించలేకపోతోంది. నాలుగో వంతు ఏపీ నుంచే 2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా, వీటిలో 25 శాతం ఒక్క ఏపీ నుంచే ఉన్నాయి. ఏపీ 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. 2.60 కోట్లతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో ఉంది. మన రాష్ట్రం నుంచి సగటున రోజుకు 70 వేల కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 1.64 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. మూడు రకాల స్పెషలిస్ట్ వైద్యులు రాష్ట్రంలో టెలిమెడిసిన్ సేవలు అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం 26 జిల్లాల్లోని వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్లను చేసింది. ఈ హబ్లకు పీహెచ్సీలు, వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేసింది. ప్రతి హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ స్పెషలిస్ట్ వైద్యులతో పాటు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు సేవలందిస్తున్నారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమున్న సందర్భాల్లో టెలీమెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స చేస్తున్నారు. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు మందులు సూచిస్తారు. ఆ మందులను పీహెచ్సీ, విలేజ్ క్లినిక్లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. -
నాడు కేసీఆర్ను కాపాడింది మీరే
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. 11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. -
రైతు ముంగిట పశు వైద్యసేవలు
సాక్షి, అమరావతి: గత సర్కారు పాడి పరిశ్రమను గాలికొదిలేసింది. పశు సంవర్ధక శాఖను నిర్వీర్యం చేసి.. పశువులకు కనీస వైద్యం కూడా అందించలేని స్థితికి నెట్టేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. పంటలు పండించే రైతులతోపాటు పాడి రైతులకు పెద్దపీట వేస్తోంది. పశు పాలకులకు చేయూత అందిస్తుండటంతోపాటు పశువులకు 24 గంటలూ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 340 సంచార పశువైద్య ఆరోగ్య సేవారథాలను రంగంలోకి దించింది. 7,396 ఆర్బీకే క్లస్టర్లలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పశు వైద్య నిపుణులను నియమించి పశువులకు అన్నిరకాల వైద్య సేవలు అందిస్తోంది. అయినా.. ‘ఈనాడు’కు ఇవేమీ కనిపించడం లేదు. తన సహజ నైజంలో పశువుల పైనా విషం చిమ్మింది. ‘పశువులూ అల్లాడుతున్నాయ్’ శీర్షికన రామోజీ మార్కు జర్నలిజంతో మంగళవారం నాటి సంచికలో అబద్ధపు కథనాన్ని వండి వార్చింది. ఆ కథనం పూర్తిగా సత్యదూరం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనాన్ని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ రెడ్నం అమరేంద్రకుమార్ ఖండించారు. కథనంలో పేర్కొన్న అంశాలన్నీ పూర్తి సత్యదూరంగా ఉన్నాయన్నారు. మూగజీవాలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. వైద్య సేవలు అందక పశువులు చనిపోతున్న ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా చోటుచేసుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 1,577 పశు వైద్యశాలలు, 323 ప్రాంతీయ పశు వైద్యశాలలు, 12 వెటర్నరీ పాలీ క్లినిక్స్ ద్వారా పశు పోషకులకు అత్యంత చేరువలో నాణ్యమైన, మెరుగైన అత్యాధునిక పశు వైద్యాన్ని అందిస్తున్నామని వివరించారు. క్లిష్టమైన శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేస్తూ పశువులను ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నామన్నారు. రాష్ట్ర స్థాయిలో 2 సూపర్ స్పెషాలిటీ పశు వైద్యశాలల ద్వారా మనుషుల తరహాలో పశువులకూ 24 గంటల వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో 1.66 కోట్ల పశుగణ యూనిట్లు ఉండగా.. 1,527 పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. నియోజకవర్గ స్థాయిలో రూ.240.69 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 340 సంచార పశు వైద్య ఆరోగ్య సేవారథాల్లో మరో 701 మంది పశు వైద్యులు సేవలందిస్తున్నారని చెప్పారు. గ్రామస్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా.. వాటిలో 7,396 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన పశు వైద్య నిపుణులు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్బీకేల ద్వారా ప్రాథమిక పశువైద్య సేవలతోపాటు కృత్రిమ గర్భధారణ సేవలు, పశు యాజమాన్యం, పశుగ్రాసాల పంపిణీ, పశు పోషణకు కావలసిన సేవలన్నీ అందిస్తున్నామని వివరించారు. ఆర్బీకేల్లో రెండు విడతల్లో నియమించిన 4,652 మంది గ్రాడ్యుయేట్స్ సేవలందిస్తుండగా.. తాజాగా మరో 1,896 ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా.. దేశంలో మరెక్కడా లేనివిధంగా నియోజకవర్గ స్థాయిలో రూ.24.14 కోట్లతో 154 పశు వ్యాధి నిర్ధారణ ల్యాబ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. ప్రతి ల్యాబ్లో ఒక ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్ని నియమించారని చెప్పారు. ల్యాబ్ల ద్వారా పేడ పరీక్షలు, రక్త పరీక్షలు, పాల పరీక్షలు, మూత్ర పరీక్షలు, చర్మ సంబంధ వ్యాధి పరీక్షలు, యాంటీ బయోటిక్ సెన్సిటివిటీ, జీవక్రియ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారని చెప్పారు. వీటి ఫలితాల ఆధారంగా సత్వర, కచ్చితమైన పశు వ్యాధులను నిర్ధారించి, నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పశ్చిమ బెంగాల్లో 51,772, గుజరాత్లో 36,540, బిహార్లో 32,138, తెలంగాణలో 32,127, ఉత్తరప్రదేశ్లో 27,480, రాజస్థాన్లో 20,821 జీవాలకు ఒక పశువైద్యుడు చొప్పున సేవలు అందిస్తుంటే.. మన రాష్ట్రంలో మాత్రం ప్రతి 17,808 జీవాలకు ఒక పశు వైద్యుడు సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. పశు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. -
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
సంచార పశు వైద్యంపై అసత్య రాతలా?
సాక్షి, అమరావతి: పాడి రైతులకు తోడుగా ప్రభుత్వం ఉంటుంటే చూడలేని రామోజీరావు తన పాడు రాతలతో ప్రభుత్వంపై బురద జల్లడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై కూడా ఈనాడులో విషంకక్కారు. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోపే పాడి రైతుల ఇంటి ముంగిటకు చేరుకొని వైద్య సేవలందిస్తున్న ఈ వాహన సేవలపై దుష్ప్రచారం చేశారు. ‘సంచార పశు వైద్యం చాపచుట్టేశారు’అంటూ ‘ఆవు కథ’మాదిరే ఈనాడులో ఓ కథనం అచ్చేశారు. ఆ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిస్తే.. ఆరోపణ: కానరాని వాహనాలు వాస్తవం : గతంలో పాడి పశువులకు చిన్న పాటి అనారోగ్యం వచ్చినా 5–20 కిలోమీటర్ల దూరంలోని పశువైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులోకి వచ్చిన పశు సంవర్ధక సహాయకులు సకాలంలో వ్యాక్సిన్లు, ప్రాథమిక వైద్యసేవలు అందిస్తున్నారు. నాణ్యమైన పశువైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్రంలో రూ. 278 కోట్లతో 340 మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ వైద్యసేవల కోసం టోల్ ఫ్రీ నం.1962తో ప్రత్యేకంగా కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. ఆరోపణ: మూలనపడ్డ పరికరాలు వాస్తవం : ప్రతి అంబులెన్స్లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను ఏర్పాటు చేసింది. 295 పశువైద్యులతోపాటు 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. ప్రతి వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా ప్రతి వాహనంలో మైక్రో స్కోప్తో సహా 33 రకాల పరికరాలతో చిన్నపాటి లేబరేటరీని ఏర్పాటు చేశారు. కనీసం వెయ్యి కిలోల బరువున్న పశువులను సమీప వైద్యశాలకు తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్ లిఫ్ట్లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే మరమ్మతులు చేçస్తున్నారు. ఒకవేళ మరమ్మతు ఆలస్యం అయితే సమీప మండల వాహనాలను వినియోగిస్తున్నారు. ఆరోపణ: అరకొరగా వైద్య సేవలు.. జ్వరం మందులు లేవు వాస్తవం : టోల్ ఫ్రీ నంబర్కు ప్రతి రోజూ వెయ్యికి పైగా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ చేసిన అరగంటలోపే ఆయా గ్రామాలకు చేరుకొని ఉచితంగా సేవలందిస్తున్నారు. అవసరమైన చోట సమీప పశువైద్యశాలలకు తరలించి నాణ్యమైన, మెరుగైన సేవలు అందించి పైసా ఖర్చు లేకుండా వైద్యసేవలనంతరం తిరిగి రైతు ఇంటి వద్దకే తీసుకొచ్చి పశువులను అప్పగిస్తున్నారు. ప్రతి వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఏడాదిన్నరలో 6,97,116 పశువులకు ఉచిత చికిత్స అందించారు. 5,14,740 మంది పశుపోషకులు లబ్ధి పొందారు. ఆరోపణ: సమ్మె బాట పట్టిన సిబ్బంది వాస్తవం : సంచార పశువైద్య సేవ వాహనాల నిర్వహణ, వీటిలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి సంబంధించిన జీత భత్యాలు చెల్లింపు బాధ్యత జీవీకే సంస్థకు అప్పగించారు. ఈ వాహనాల్లోని సిబ్బందికి ఆ సంస్థ సకాలంలో జీతభత్యాలు అందిస్తోంది. ఇప్పటివరకు ఏ ఒక్కరూ తమకు జీతభత్యాలు అందడం లేదంటూ సమ్మె నోటీసు ఇవ్వలేదు. అయినా నోటీసు ఇచ్చినట్టుగా ఈనాడు తన కథనంలో తప్పుడు ఆరోపణ చేసింది. మరోవైపు ఏపీ స్ఫూర్తితో ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే సంచార పశువైద్యం చాపచుట్టేస్తున్నారంటూ ఈనాడు విషపు రాతలు రాయడం పాడి రైతులను విస్మయానికి గురిచేస్తోంది. -
ఆర్టీసీ ఉద్యోగులపై అవాస్తవాలేల!
సాక్షి, అమరావతి: పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావుకు ఒకటే ఎజెండా.. నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై ఏదో ఒక రూపేణా విషం చిమ్మడమే. ఇందులో భాగంగానే ‘ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం’ అంటూ అవాస్తవాలతో ఒక కథనాన్ని మంగళవారం ఈనాడులో వండివార్చారు. వాస్తవానికి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సాహసించలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇదంత సులువైన పని కాదని అక్కడ చేతులెత్తేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా సులువుగా 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు. తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగులకు లభించినట్టే అన్ని ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తింపజేశారు. ఆర్టీసీ ఉద్యోగులు తమకు అనారోగ్యం కలిగితే ఈహెచ్ఎస్ కింద రాష్ట్రంలో మెరుగైన వైద్యం పొందుతున్నారు. అయినా ఇదంతా కళ్లుండి కూడా చూడలేని కబోధి రామోజీరావు యథేచ్ఛగా విషం కక్కారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కింద వైద్యం దక్కడం లేదంటూ అవాస్తవాలను అచ్చేశారు. అసలు వాస్తవాలేవో వివరిస్తూ ఈ ఫ్యాక్ట్ చెక్.. ♦ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వైద్యం అందిస్తున్న అన్ని రిఫరల్ ఆస్పత్రుల్లో ఆర్టీసీ ఉద్యోగులు కూడా నాణ్యమైన వైద్య సేవలు పొందుతున్నారు. ఎంతోమంది ఉద్యోగులు ఆ సేవలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ♦ఈహెచ్ఎస్ రిఫరల్ ఆస్పత్రుల్లోనే కాకుండా 21 ఆర్టీసీ ఆస్పత్రుల్లో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఓపీ, చికిత్స విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ప్రతి జిల్లాకు ఒక సమన్వయ అధికారిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందితే.. ఆ మేరకు బిల్లులను ఈహెచ్ఎస్ పోర్టల్లో సమర్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ♦ఆర్టీసీ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కార్డియాక్ కేర్ ట్రై–ఓఆర్జీ మెషిన్ల ద్వారా గుండెపోటు సమస్యను ముందుగానే గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటివరకు 149 మందికి గుండెపోటు నివారణ చికిత్స అందించారు. ♦ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే మౌలిక వసతులను ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంది. 5 రకాల వైద్య సేవలు అందించే వైఎస్సార్ ఆర్టీసీ ఏరియా ఆస్పత్రిని కడపలో 2021లోనే నెలకొల్పింది. అనంతపురం, రాజమండ్రిలో ఆర్టీసీ డిస్పెన్సరీలు ఏర్పాటు చేశారు. తిరుపతి, నరసరావుపేట, మచిలీపట్నంలలో కొత్తగా ఆర్టీసీ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టారు. -
దశాబ్దాల నిర్లక్ష్యానికి చికిత్స 'ప్రజారోగ్య విప్లవం'
పల్నాడు జిల్లా యండ్రాయి, ధరణికోట గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్: ఈ ఫొటోలోని షేక్ రిహానాకు ఏడేళ్లు. పల్నాడు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామం. తండ్రి జానీ చిరు వ్యాపారి, తల్లి ఫాతిమా గృహిణి. రిహానాకు పుట్టుకతో గుండె సమస్య ఉంది. దీనికి తోడు రెండేళ్ల వయస్సు వచ్చినా మాటలు రాలేదు. గుండె సమస్య కారణంగా మాటలు రావడం లేదని తొలుత తల్లిదండ్రులు భావించారు. కొద్ది రోజులకు గుంటూరు ఆస్పత్రిలో చూపించగా, పుట్టుకతో వినికిడి లోపం సమస్య కూడా ఉందని తేలింది. పాపకు మూడేళ్లు వచ్చాక గుండెకు సర్జరీ చేయించారు. వినికిడి లోపం సమస్యకు చికిత్స చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుందోనని భయపడి ఆగిపోయారు. డబ్బు సమకూర్చుకున్నాక వైద్యం చేయిద్దామనుకున్నారు. ఇలా రోజులు గడుస్తూ పాపకు ఏడేళ్లు వచ్చాయి. అందరు పిల్లలు గలగలా మాట్లాడుతుంటే రీహానా మాత్రం మౌనంగా ఉండటం చూసి తల్లిదండ్రులు ఆవేదనకు గురవ్వని రోజంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం వీరికి కలిసొచ్చింది. గత నెల 6వ తేదీన గ్రామంలో సురక్ష క్యాంప్ నిర్వహించారు. తల్లి ఫాతిమా.. రిహానాను ఆ క్యాంప్నకు తీసుకెళ్లింది. వైద్యులు పరీశీలించి గుంటూరు జీజీహెచ్కు రెఫర్ చేశారు. అక్కడ పలు పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. అవి వాడాక వాస్తే మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఫలితాల ఆధారంగా స్పీచ్ థెరఫీ ఇవ్వడం లేదంటే కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ నిర్వహించడమో చేస్తామని తెలిపారు. ‘నా బిడ్డ మాట్లాడలేని స్థితిలో ఉండటం చూసి ఏడుపు వస్తోంది. సురక్ష క్యాంప్లో వైద్యులు చెప్పారని జీజీహెచ్కు వెళ్లొచ్చాను. పాపకు చికిత్స చేసి మాటలొచ్చేలా చేస్తామన్నారు. నా బిడ్డకు మాటలొస్తే చాలు అంతకు మించి ఏమీ వద్దు’ అని ఫాతిమా అంటోంది. ‘మీరు అధైర్యపడొద్దు. వైద్య పరీక్షలకు వెళ్లండి. ఆశా వర్కర్ను మీకు తోడుగా పంపుతాను. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రభుత్వమే ఉచితంగా పాపకు మాటలు వచ్చేలా చికిత్స చేయిస్తుంది. ఆరోగ్యశ్రీ కింద రూ.12 లక్షల ఖరీదైన రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీని ప్రభుత్వం ఉచితంగా చేయిస్తోంది’ అని అత్తలూరు పీహెచ్సీ డాక్టర్ రవిబాబు ఫాతిమాకు ధైర్యం చెప్పారు. ఇలా రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్యానికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొండంత అండగా నిలుస్తోంది. సీఎం జగన్ సర్కార్ ఆరోగ్య భరోసా అనారోగ్య సమస్యలున్నప్పటికీ సుదూర ప్రాంతంలో ఉండే ఆస్పత్రులకు వెళ్లి చూపించుకోలేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఈ నేపథ్యంలో ప్రాణం విలువ తెలిసిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్య సాయం అందక ఇబ్బంది పడటానికి వీల్లేకుండా ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారు. అయినప్పటికీ ఇంకా ఎవరైనా ప్రజలు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారేమోనని మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి ఉచిత చికిత్సలు చేపట్టి, వైద్య పరంగా చేయి పట్టి నడిపించడం కోసం ఆరోగ్య సురక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉన్న ఊళ్లోనే 59.30 లక్షల మందికి వైద్యం ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో) నేతృత్వంలోని వైద్య బృందాలు 1.44 కోట్లకు పైగా గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్ చేపట్టాయి. బీపీ, షుగర్, హెచ్బీ, మలేరియా, డెంగ్యూ వంటి ఏడు రకాల పరీక్షలను 6.50 కోట్ల మేర నిర్వహించారు. తద్వారా వివిధ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారిని గుర్తించి సురక్ష శిబిరాలకు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాటికి గ్రామాల్లో 9,982, పట్టణాల్లో 2,258 సురక్ష శిబిరాలను ప్రభుత్వం నిర్వహించింది. ఒక్కో శిబిరంలో సగటున 485 చొప్పున 59,30,972 మందికి సొంత ఊళ్లలోనే వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్ వంటి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రతి శిబిరం వద్ద ర్యాపిడ్ టెస్ట్లతో పాటు, ఈసీజీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహణతోపాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ఖరీదైన వైద్యం పూర్తిగా ఉచితం సురక్ష క్యాంప్లకు వచ్చిన వివిధ అనారోగ్య బాధితుల్లో మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ఇలా 86,108 మందిని ఇప్పటి వరకు రెఫర్ చేయగా వీరందరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేపడుతోంది. గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత జబ్బులు, క్యాన్సర్, ఇతర వ్యాధులకు ఖరీదైన చికిత్సలను పూర్తి ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆఖరికి వీరు ఆస్పత్రులకు పోయి, రావడానికి అయ్యే ప్రయాణ చార్జీలు కూడా ప్రభుత్వమే అందిస్తోంది. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తోంది. ప్రతి రెఫరల్ కేసును స్థానిక పీహెచ్సీ వైద్యుడు, ఏఎన్ఎం, సీహెచ్వోల ద్వారా పర్యవేక్షిస్తూ వైద్యం అందించేలా చూస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 19,934 మంది ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు వెళ్లగా, 1,634 మందికి అడ్మిషన్ అవసరం ఉందని వైద్యులు నిర్ధారించారు. మిగిలిన వారికి మెడికేషన్ అందించారు. అడ్మిషన్ అవసరం ఉన్న వారిలో 1,060 మందికి సర్జరీలు, చికిత్సలు పూర్తయ్యాయి. చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి ఆరోగ్యంపై వైద్య శాఖ నిరంతరం వాకబు చేస్తోంది. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు అవసరమైన మందులు, వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఈ ఫోటోలో వైద్యుడు రవిబాబు పరిశీలిస్తున్న ఉషారాణిది యండ్రాయి గ్రామమే. చిన్నపాటి పాడి రైతు. కొద్ది నెలల క్రితం కాలికి సర్జరీ చేయించుకుంది. అనంతరం కాలు వాపు రావడంతో పాటు, గాయాలు మొదలయ్యాయి. సర్జరీ కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని గుంటూరులోని పలు ఆస్పత్రుల్లో చూపించుకుంది. మందులు వాడినా సమస్య తగ్గలేదు. ఆరోగ్య సురక్షలో భాగంగా వైద్య సిబ్బంది ఇటింటి సర్వే నిర్వహించినప్పుడు ఆమె తన సమస్య వివరించింది. ఈ క్రమంలో సురక్ష శిబిరానికి హాజరవ్వమని సిబ్బంది సూచించారు. గత నెల 6వ తేదీన శిబిరానికి హాజరైంది. స్పెషలిస్ట్ వైద్యులు ఆమెను పరిశీలించి బోద వ్యాధి లక్షణాలున్నాయని, అమరావతి సీహెచ్సీకి రెఫర్ చేశారు. వైద్య సిబ్బంది సహాయంతో ఆమె అక్కడికి వెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తెనాలిలోని ప్రభుత్వ ఫైలేరియా సెంటర్కు రెఫర్ చేశారు. అక్కడ బోద వ్యాధిగా నిర్ధారించారు. ఉచితంగా మందులు అందించారు. ఈ క్రమంలో ఉషారాణి మాట్లాడుతూ.. ‘ఊళ్లో ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టి ప్రభుత్వం నాకు ఎంతో మేలు చేసింది. లేకుంటే నా సమస్యను ఇంకా నిర్లక్ష్యం చేసేదాన్ని. నేను ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే వరకు వైద్య సిబ్బంది రోజు ఫాలోఅప్ చేశారు’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది.1250 మంది జనాభా ఉన్న యండ్రాయి గ్రామంలో నిర్వహించిన సురక్ష క్యాంప్నకు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న 350 మంది హాజరయ్యారు. వీరిలో 88 మంది కంటి సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మిగిలిన వారు గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. కంటి సమస్యలున్న వారిలో 74 మందికి ఆప్తమాలజిస్ట్ సూచన మేరకు కళ్లద్దాల పంపిణీ చేపడుతున్నారు. ఇక రిహాన, ఉషారాణి తరహాలో పలు తీవ్రమైన సమస్యలున్న నలుగురిని ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేశారు. స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం ఈ గ్రామస్తులు 25 కి.మీ దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్కు వెళ్తుంటారు. దీంతో ఒకసారి గుంటూరుకు పోయి రావాలంటే కనీసం రూ.500 చొప్పున రవాణా, ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక రోజంతా పని మానుకోవాల్సి రావడంతో కూలి డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఖర్చులకు భయపడి ఇదే గ్రామానికి చెందిన దస్తగిరి కొంత కాలంగా మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. సురక్ష క్యాంప్లో స్పెషలిస్ట్ వైద్య సేవలుంటాయని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో హాజరయ్యాడు. తన సమస్యకు వైద్య సేవలు పొందాడు. క్యాంప్లోనే ఉచితంగా మందులు ఇచ్చారు. ఆ మందులు వాడినా సమస్య నయం అవ్వకపోతే తదుపరి వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు 72 ఏళ్లు. రక్తపోటు, మధుమేహం సమస్యతో కొన్నేళ్లుగా బాధ పడుతున్నాను. గతంలో ప్రతి నెలా గుంటూరుకు మెడికల్ చెకప్ కోసం వెళ్లేవాడిని. ఒకసారి గుంటూరుకు పోయి, రావడానికి రూ.వెయ్యికి పైనే ఖర్చు అయ్యేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. ప్రతి నెలా మా గ్రామానికే డాక్టర్ వస్తున్నారు. దీంతో గుంటూరుకు వెళ్లడం మానేశాను. మందులు బాగా పని చేస్తున్నాయి. దీనికి తోడు ఈ మధ్య ఆరోగ్య సురక్ష క్యాంప్ పెట్టారు. గతంలో మేం వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా వద్దకే వచ్చి వైద్యం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కె. పౌలేశు, యండ్రాయి, పల్నాడు జిల్లా కిడ్నీ సమస్యను గుర్తించి చికిత్స కొద్ది నెలలుగా నడుము భాగంలో నొప్పి వస్తుండేది. గుంటూరు వరకు పోయి చూపించుకోలేక ఏవో మందులు తెప్పించుకుని నొప్పి నుంచి విముక్తి పొందేదాన్ని. గ్రామంలో క్యాంప్ పెట్టడంతో వెళ్లాను. వైద్యులకు నా సమస్య వివరించాను. కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. క్యాంప్లోనే పలు మందులు ఇచ్చారు. జీజీహెచ్కు వెళ్లమని చీటీ ఇచ్చారు. ఆ మందులు వాడాక నొప్పి తగ్గుముఖం పట్టింది. జీజీహెచ్ కూడా వెళ్లొచ్చాను. క్యాంప్లో ఇచ్చిన మందులన్నీ వాడాక రమ్మన్నారు. – మొగల్ సబీరా, యండ్రాయి, పల్నాడు జిల్లా ఇంత శ్రద్ధ ఏ ప్రభుత్వం చూపలేదు ఎనిమిదేళ్ల క్రితం నా గుండెకు స్టెంట్ వేశారు. రోజూ మందులు వాడటంతో పాటు, రెండు, మూడేళ్లకు ఓసారి పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. మందులు అయితే వాడుతున్నా కానీ పరీక్షలు చేయించుకోలేదు. మా ఊళ్లో పెద్ద డాక్టర్లతో క్యాంప్ పెడుతున్నారని చెబితే వెళ్లి చూపించుకున్నాను. వాళ్లు ఈసీజీ తీశారు. ఎందుకైనా మంచిదని గుంటూరు జీజీహెచ్కు వెళ్లండని చెప్పారు. వెళ్లాను.. పరీక్షలు చేశారు. అంతా బాగుందని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక మా గ్రామంలోనే బీపీ, రక్తం పలుచబడే బిళ్లలు ఇస్తున్నారు. నెలనెలా డాక్టర్ వస్తున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి ఆపరేషన్ చేశారు. ఇన్ని విధాలుగా గతంలో ఏ ప్రభుత్వం మా ఆరోగ్యాలపై శ్రద్ధ చూపలేదు. – ఎస్.ఆదం, ధరణికోట, పల్నాడు జిల్లా పెద్ద ఊరట కల్పించారు వయోభారం రీత్యా కాళ్లు, నడుము నొప్పులతో కొన్నాళ్లుగా బాధపడుతున్నాను. పట్టణంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుండాలి. దీనికి తోడు రానుపోను చార్జీలు, ఇతర ఖర్చులు పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా పట్టణానికి పోయినప్పుడు తెచ్చి ఇచ్చే మాత్రలు వేసుకుంటూ కాలం వెల్లదీస్తుండేదాన్ని. ఈ పరిస్థితుల్లో గ్రామంలో క్యాంప్ పెట్టారని వలంటీర్ చెప్పడంతో వెళ్లాను. నాకున్న సమస్యలు చెప్పాను. మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే నొప్పులు తగ్గాయి. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టి చాలా పెద్ద ఊరట కల్పించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు నెలనెలా ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నట్టే, వైద్య సేవలను చేరువ చేసి పుణ్యం కట్టుకున్నారు. – కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం, శ్రీకాకుళం జిల్లా. ప్రతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ పీహెచ్సీ పరిధిలోని సురక్ష శిబిరాల్లో సుమారు ఏడు వేల మంది వైద్య సేవలు అందుకున్నారు. 168 మందిని ఆస్పత్రులకు రెఫర్ చేశారు. ప్రతి రెఫరల్ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రెఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, అక్కడ వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నాం. అవసరం మేరకు ఆశ వర్కర్ను తోడు పంపి మరీ వైద్య సేవలు అందిస్తున్నాం. చికిత్స అనంతరం డిశ్చార్జి అయిన రోగుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నాం. – డాక్టర్ రవిబాబు, మెడికల్ ఆఫీసర్, అత్తలూరు పీహెచ్సీ, పల్నాడు జిల్లా నెలలో మండలంలో నాలుగు చోట్ల నిరంతరాయంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. జనవరి నుంచి ప్రతి మండలంలో నెలలో నాలుగు చోట్ల సురక్ష శిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇక ఇప్పటికే శిబిరాల నుంచి వచ్చిన రెఫరల్ కేసులన్నింటికీ వంద శాతం మెరుగైన, నాణ్యమైన చికిత్సలు అందించడానికి చర్యలు వేగవంతంగా చేపడుతున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
పేదల పాలిట అపూర్వ పథకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలలో ఈనెల 5వ తేదీ వరకు 85 వేలమంది పేషెంట్లను మెరుగైన చికిత్స కోసం నెట్వర్క్ ఆస్పత్రి, టీచింగ్ ఆస్ప త్రులకు వైద్యులు రిఫర్ చేశారు. పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో, పట్టణాలలో మాత్రమే లభ్యమయ్యే వైద్య సేవలు, ఈ శిబిరాలనిర్వహణ వల్ల పేద, మధ్యతరగతి గ్రామీణులకు కూడా అందుబాటులోకి రావడం ముదావహం. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిస్సహాయ స్థితిలో వున్న వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష‘ కింద నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావు. పేషెంట్ల జబ్బు నయం అయ్యేదాకా పూర్తిస్థాయిలో చేయూత నివ్వడమే వీటి లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన ఆరోగ్య సంబంధిత పథకాల్లో ఈ సురక్ష పథకం ఒకటి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98 శాతం, వార్డు సచివాలయాల్లో 77 శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యింది. బృహత్తరమైన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ వెళ్లి కుంటుంబ సభ్యులు అందరికీ పరీక్షలు నిర్వహించటం మొదటి అడుగు. పట్టణ ప్రాంతాల్లో 91 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 94 శాతం స్క్రీనింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. మరో వారంలో నూరు శాతం పూర్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలియ చేస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకు స్క్రీనింగ్ జరిగిన 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించటం కని విని ఎరుగని విషయం. ఇలా స్క్రీనింగ్ చేసిన వారిని మొబైల్ యాప్ ద్వారా ట్రాక్చేసి, వారిని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేస్తారు. ఆ తర్వాత విలేజ్ క్లినిక్కు, ఫ్యామిలీ డాక్టర్కు, గ్రామ సచివా లయంలోని వైద్య ఆరోగ్య సిబ్బందితో అనుసంధానం చేయించి, వారి ద్వారా రోగులకు నయం అయ్యేంతవరకూ తగిన విధంగా సహాయ చర్యలు తీసుకొంటారు. ఇప్పటికే వేలాది మందిని మెరుగైన వైద్యం కోసం రిఫరల్ ఆస్పత్రులకు పంపిన ప్రభుత్వం మిగిలిన వారిని కూడా ఆస్పత్రులకు పంపించడానికి తగిన చర్యలు తీసుకొంటోంది. వారికి కావాల్సిన మందులు ఉచితంగా ఇవ్వటంతోపాటు ఆరోగ్యం బాగయ్యే వరకూ తగిన విధంగా వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోంది. పేదలపాలిట ‘సంజీవని’గా ఉన్న ఈ పథకం ఇప్పటికే అందరి మన్ననలూ పొందుతోంది. కొన్ని నెట్వర్క్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో జరుగు తున్న మెడికల్ మాఫియా అక్రమాలు అరికట్టేందుకు మెడికల్ టాస్క్ఫోర్స్ బృందాలను ప్రభుత్వం నియమించింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న ఆస్పత్రులకు చెక్ పెట్టడం సాధ్యమ య్యింది. ఈ విధంగా జగన్ ప్రభుత్వం సాధారణ ప్రజానీకం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో వైద్యాన్ని అందించడంతో ‘ఆరోగ్యాంధ్రపదేశ్’ సాకారానికి దారి ఏర్పడింది. ప్రజలు వైద్యానికి అయ్యే ఖర్చులు మిగుల్చుకొని పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవడానికి ఆ డబ్బును ఉపయోగించుకొనే అవకాశం ఏర్పడింది. అందుకే జనం జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకొంటున్నారు. చలాది పూర్ణచంద్ర రావు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ మొబైల్ : 94915 45699 -
నిరంతరం ‘ఆరోగ్య సురక్ష’
‘‘సోమవారం నాటికి.. ‘ఆరోగ్య సురక్ష’లో దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి’’. సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు ఉంటాయని.. ప్రతి వారం మండలంలో ఈ క్యాంపు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇలా నెలలో ఆ మండలంలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని.. ఆరు నెలల్లో ప్రతి మండలం.. ప్రతి గ్రామంలో క్యాంపు జరుగుతుందన్నారు. తద్వారా సంతృప్త స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు. ఇదొక నిరంతర ప్రక్రియని ఆయన తెలిపారు. అలాగే, జగనన్న ఆరోగ్య సురక్ష, డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రివెంటివ్ కేర్ అత్యంత కీలకంగా వ్యవహరించనున్నాయని సీఎం చెప్పారు. ఏదైనా జబ్బు వచ్చాక వైద్యం అందించడం కన్నా.. అవి రాకుండా వాటిని నియంత్రించడమే ముఖ్యమని ఇందుకు ఈ వ్యవస్థలన్నీ ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ప్రజారోగ్య రంగంలో పెనుమార్పులు తీసుకొచ్చే అత్యంత ముఖ్యమైన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష అని.. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ఆరోగ్య సమస్యల బాధితులకు చేయూత అందించాలని జిల్లాల కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వర్చువల్గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. జగనన్న ఆరోగ్య సురక్షపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత కీలకం ఐదో దశ.. ఐదు దశల్లో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదో దశ కార్యక్రమం మొత్తంలో అత్యంత కీలకమైంది. ప్రస్తుతం మనం నిర్వహించే వైద్య శిబిరాలు మామూలు శిబిరాలు మాత్రం కావు. సాధారణంగా నిర్వహించే వైద్య శిబిరాలు అప్పటికప్పుడు నిర్వహించి వైద్యంచేసి మందులిస్తే అక్కడితో అంతా అయిపోతుంది. అయితే, మన కార్యక్రమంలో శిబిరాల నిర్వహణ అనంతరం అసలు పనిమొదలవుతుంది. శిబిరాలు నిర్వహించిన అనంతరం వివిధ ఆరోగ్య సమస్యల బాధితులను మనం వైద్యపరంగా చేయిపట్టి నడిపిస్తాం. ఇదే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశ్యం. ఆరోగ్య సురక్షలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ సురక్షలో భాగంగా పట్టణాల్లో 91 శాతం, గ్రామాల్లో 94.94 శాతం మంది జనాభా స్క్రీనింగ్ పూర్తయ్యింది. 1.44 కోట్ల గృహాలను ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ)లు జల్లెడపట్టి 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఇంట్లో సగటున నాలుగు పరీక్షలు చేస్తూ జల్లెడ పట్టాం. గ్రామాల్లో 10,032 శిబిరాలకుగాను 98 శాతం అంటే 9,869 శిబిరాలు.. పట్టణాల్లో 2,390 శిబిరాలకు గాను 1,841 శిబిరాలు అంటే 77శాతం నిర్వహణ పూర్తయింది. ఇక గ్రామాల్లో ఈనెల 22న, పట్టణాల్లో 29 నాటికి శిబిరాల నిర్వహణ ముగుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు మనం ఐదో దశలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి అసలు ప్రక్రియ మొదలవుతుంది. ప్రత్యేక యాప్ ద్వారా శిబిరాలకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేస్తున్నాం. ఎవరెవరికి తదుపరి వైద్యసేవలు అవసరం ఉంది? ఎవరెవరిని ఆస్పత్రులకు రిఫర్ చేశాం? ఎవరెవరు ఏఏ సమస్యలతో బాధపడుతున్నారన్న సమగ్ర సమాచారం మన దగ్గర ఉంది. ఈ సమాచారం ఆధారంగా మనం మూడు రకాల కార్యక్రమాలు ఈ దశలో చేపట్టాలి. కార్యక్రమం–1 జబ్బులు నయమయ్యే వరకూ చేయిపట్టి నడిపించాలి.. ఇక సోమవారం నాటికి.. దాదాపు 85వేల మంది రోగులను తదుపరి చికిత్సల నిమిత్తం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్, బోధనాస్పత్రులకు రిఫర్ చేశారు. వీరందరినీ మొబైల్ యాప్ ద్వారా ట్రాక్చేసి, ఆస్పత్రులకు మ్యాప్ చేయాలి. ఆ తర్వాత వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, గ్రామ సచివాలయంలోని వైద్య, ఆరోగ్య సిబ్బందితో అనుసంధానించాలి. సిబ్బంది ద్వారా సంబంధిత రోగులకు జబ్బులు నయమయ్యే వరకూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. రిఫరల్ కేసుల్లో సంబంధిత వ్యక్తులకు ఆస్పత్రులకు వెళ్లేందుకు రవాణా ఖర్చుల కింద రూ.500 చొప్పున ఇవ్వాలి. 85వేల కేసుల్లో 13,850 మందికి ఇప్పటివరకూ చేయూతనిచ్చి తదుపరి చికిత్సల కోసం నెట్వర్క్/జిల్లా ఆస్పత్రులకు పంపించాం. మిగిలిన వారిని కూడా రాబోయే రోజుల్లో నెట్వర్క్ ఆస్పత్రులకు పంపించి వారికి మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. వీరందరికీ చేయూతనందిస్తూ వైద్యపరంగా చేయిపట్టి నడిపించాలి. ఈ కార్యక్రమంపై మీ అందరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇలా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి, గుర్తించిన మొత్తం రిఫరల్ కేసులన్నింటికీ కూడా తదుపరి చికిత్సలు అందించే కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. చికిత్సానంతరం ఇంటికి వచ్చాక వారికి తోడుగా ఉంటూ, నిరంతరం ఆరోగ్య స్థితిపై వాకబు చేస్తుండాలి. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ను 3,300కు పెంచాం. అయినప్పటికీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని.. ఎక్కడైనా ఆరుదైన ఆరోగ్య సమస్యలు, జబ్బులు బయటపడిన సందర్భాల్లో ఫ్యామిలీ డాక్టర్ రిఫరెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి, బోధనాసుపత్రులకు పంపించి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలి. అలాంటి రోగాలకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ అధికారులకు కూడా ఆదేశాలు జారీచేస్తున్నా. కార్యక్రమం–2 వైద్య సేవలపై ఆరా తీయాలి.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించుకున్న రోగులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఇందులో భాగంగా.. ► డిశ్చార్జ్ అయి వచ్చిన రోగి ఇంటికి విలేజ్ క్లినిక్ సిబ్బంది వారం రోజుల్లో వెళ్లాలి. ► ఆస్పత్రుల్లో వైద్యసేవలపై ఆరా తీయాలి. ఎలాంటి లంచాలకు తావు లేకుండా పూర్తి ఉచితంగా చికిత్సలు అందాయో లేదో తెలుసుకోవాలి. ► మందులు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలించాలి. ► వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిందో లేదో నిర్ధారించుకోవాలి. ► రోగితో ఫొటో తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ► ఆరోగ్యశ్రీ సేవలందుకున్న రోగులకు ఏడాదిపాటు ఉచితంగా మందులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమం తప్పకుండా రోగులు తిరిగి ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. ► కానీ, సరైన అవగాహనలేక, కొందరు తెలీక.. ఇతర కారణాలతో మరికొందరు ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. ► ఇలా చికిత్సానంతరం మూడు నెలల తర్వాత కేవలం 33 శాతం పేషెంట్లు మాత్రమే మందులు తీసుకుంటున్నారు. ► ఆరు నెలల తర్వాత 22 శాతం, ఏడాది తర్వాత చూస్తే కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. ► ఇలాంటి పరిస్థితులు ఇకపై ఉండకూడదు. నిర్ణీత సమయానికి రోగులు ఠంఛన్గా వెళ్లి మందులు తీసుకునేలా చూడాలి. ► ఈ మేరకు మొబైల్ యాప్లో తగిన విధంగా ఫీచర్లు తీసుకొచ్చాం. ► రోగులు నిర్ణీత కాలానికి ఆస్పత్రులకు వెళ్లేలా చూడాల్సిన బాధ్యత విలేజ్ క్లినిక్స్కు, ఫ్యామిలీ డాక్టర్కు ఉంది. కార్యక్రమం–3 మందులు ఎంత ఖరీదైనా సరే అందించాలి.. కిడ్నీ, లివర్ రోగులతో పాటు, మస్క్యులర్ డిస్ట్రోపీ బాధితులు ఖరీదైన మందులు వాడాల్సి ఉంటుంది. అంత ఖరీదైన మందులను పేద, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేరు. అలాంటి వారికి మందులు అందిస్తూ చేయూతనివ్వాలి. మందులు ఎంత ఖరీదైనా సరే వెనకడుగు వేయకుండా మనం అందించాలి. ఈ మేరకు అధికారులందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలిచ్చాను. గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ క్లినిక్స్ ఆధారంగా మ్యాపింగ్ చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో అనుసంధానం చేయాలి. వైద్యం కోసం ప్రజలు ఖర్చుపెట్టకుండా చూడాలి.. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందడం గురించి తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలి. మంచి ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని ఇదివరకే ఆదేశాలిచ్చాను. ఈ కార్డుల పంపిణీ కూడా అదేరోజు నుంచి ప్రారంభించాలి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. 1.24 కోట్ల మంది మహిళలు దిశ యాప్ను తమ ఫోన్లలో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ ఉండాలి. ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యశ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై పూర్తి వివరాలు ఈ యాప్లో ఉంటాయి. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదు. యాప్లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుంది. లేకపోతే విలేజ్ క్లినిక్లో సంప్రదించినా, 104కు ఫోన్చేసినా గైడ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై బుక్లెట్ కూడా ప్రతి కుటుంబానికీ అందిస్తారు. ఆరోగ్యశ్రీని వినియోగించుకోవడంపై సీహెచ్ఓ, ఏఎన్ఎలు, ఆశా వర్కర్లు అవగాహన కలిగించాలి. ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 950 నెట్వర్క్ ఆసుపత్రులుంటే, ప్రస్తుతం 2,295 ఆస్పత్రుల్లో సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రులను ఆరోగ్యశ్రీలో ఎంప్యానెల్ చేశాం. అయినా వైద్యం కోసం ప్రజలు ఎందుకు తమ జేబుల్లో నుంచి డబ్బులు ఖర్చుచేసుకోవాలి? అలాంటి పరిస్థితులు ఇకపై లేకుండా చూడటం మనందరి బాధ్యత. 8.72 లక్షల మందికి కంటి పరీక్షలు.. ఇక ఆరోగ్య సురక్షలో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 8.72 లక్షల మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5.22 లక్షల మందికి కంటి అద్దాలు ఇవ్వాలని డాక్టర్లు సిఫారసు చేశారు. వీరికి వెంటనే వాటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే, 73,474 మందికి కంటి సర్జరీలు చేయాలని గుర్తించారు. వీరికీ సర్జరీలు చేయించాలి. డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తికావాలి. మరోవైపు.. రక్తపోటు కేసులు 2,48,638గా.. మధుమేహం 1,49,879 కేసులను గుర్తించారు. వీరిందరికీ నిర్ధారణ పరీక్షలు చేసి మందులివ్వాలి. ఆ తర్వాత వారి ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ప్రివెంటివ్ కేర్లో ఇది చాలా కీలకమైన అంశం. పౌష్టికాహారం లోపం, రక్తహీనత సమస్యలను పూర్తిగా నివారించాలి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారం, మందులు అందుతున్నాయో లేదో విలేజ్ క్లినిక్స్ ద్వారా పరిశీలించాలి. రక్తహీనత బాధితుల మీద మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారులు దృష్టిపెట్టాలి. మందులు, సంపూర్ణ పోషణం ప్లస్ ద్వారా తగిన ఆహారం కూడా ఇప్పించాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థలు లేవు.. దేశంలో ఏ రాష్ట్రంలోని కలెక్టర్లకు లేని యంత్రాంగం, మన రాష్ట్రంలో కలెక్టర్లకు ఉంది. అలాగే, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, గ్రామ సచివాలయంలాంటి వ్యవస్థలు లేవు. ఇవన్నీ సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో మనల్ని అన్ని రాష్ట్రాలకన్నా ముందు ఉంచేందుకు ఉపయోగపడతాయి. కలెక్టర్లకు మంచి అభిరుచి ఉంటే కచ్చితంగా లక్ష్యాలు సాధిస్తాం. ప్రతి కలెక్టర్ దీన్ని సవాల్గా తీసుకుని, జీరో ఎనీమిక్ కేసులు దిశగా ప్రయత్నించాలి. అలాగే, 9,969 లెప్రసీ అనుమానాస్పద కేసులున్నాయి. వీరందరికీ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేపట్టాలి. 442 మందికి టీబీ ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది. వీరికి సక్రమంగా మందులు అందించాలి. 1,239 మంది చిన్నారులు 4–డి (డెఫీషియన్సీస్, డిఫెక్టŠస్ ఎట్ బర్త్, డిసీజెస్, డెవలప్మెంటల్ డిలేస్) సమస్యలతో బాధపడుతున్నట్లుగా తేలింది. సాధ్యమైనంత త్వరగా వీరికి అవసరమైన చికిత్సలు అందించడంపై దృష్టిపెట్టాలి. కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందిస్తే పిల్లలు ఈ సమస్యల నుంచి బయటపడతారు. సేవలు మరింత విస్తరిస్తాం.. టెరిషరీ కేర్ వైద్యసేవలను రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తున్నాం. ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో అత్యాధునిక సేవలు అందించే బోధనాసుపత్రి అందుబాటులో ఉంటుంది. ఒకవైపు పాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అభివృద్ధిపరుస్తూనే ఇవన్నీ చేపడుతున్నాం. ఇక నియామకాల పాలసీ మీద కలెక్టర్లు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ప్రతి జిల్లాలో స్పెషలిస్టు, ఎంబీబీఎస్ డాక్టర్లు, ఇతర సిబ్బంది కొరత లేకుండా సంబంధిత జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలి. ఇప్పటికే కేవలం ఆరోగ్య రంగంలో 53 వేల ఖాళీలను మనం భర్తీచేశాం. ఈ నేపథ్యంలో.. ఎక్కడ ఖాళీలున్నా, వెంటనే భర్తీచేసేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాం కాబట్టే, రాష్ట్రంలో తొలిసారిగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డును çసృష్టించాం. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అజయ్జైన్, కార్యదర్శులు గుల్జార్, డాక్టర్ మంజుల, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ గిరిజాశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ హరేంధిరప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీ మురళీధర్రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
చిన్నారుల ఆరోగ్యానికి రక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్నారుల ఆరోగ్యానికి మరింత భరోసానిచ్చేలా సీఎం జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడ, విశాఖపట్నంలో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) ప్రభుత్వానికి పంపింది. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో పిల్లల కోసం నిలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఆ ఆస్పత్రి సేవలను కోల్పోయింది. దీంతో పిల్లలకు ఏదైనా జబ్బు చేస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన దుస్థితి. అయితే గత టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ పిల్లలకు ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీటీడీ సహకారంతో తిరుపతిలో చిన్న పిల్లల హృదయాలయాన్ని ప్రారంభించింది. ఈ ఆస్పత్రి ప్రస్తుతం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. అంతేకాకుండా అలిపిరి వద్ద రూ.450 కోట్లతో పీడియాట్రిక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని టీటీడీ సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరహాలోనే విశాఖ, విజయవాడల్లోనూ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 500 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి ఏర్పాటుకు డీఎంఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒక్కో చోట ఆస్పత్రి భవనాల నిర్మాణం, ఇతర సివిల్ పనుల కోసం రూ.180 కోట్ల మేర ఖర్చు అవనున్నట్టు ఏపీఎంఎస్ఐడీసీ అంచనా వేసింది. అధునాతన వైద్య పరికరాల కోసం ఇంకా అదనంగా ఖర్చు పెట్టనున్నారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలెయ సంబంధిత జబ్బులతో పాటు, చిన్న పిల్లల్లో క్యాన్సర్కు, ఇతర అన్ని రకాల వైద్య సేవలు అందించేలా 17 స్పెషాలిటీలు, సూపర్ స్పెషాలిటీలతో ఈ రెండు ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ రంగంలోనే చిన్న పిల్లలకు పూర్తి స్థాయిలో వైద్య చికిత్సలు అందుబాటులోకి తేవాలన్నది సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో విశాఖ, విజయవాడల్లో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటి ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రజలకు మేలు చేకూరుతుంది. చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట అందుబాటులోకి తెచ్చేలా ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాం. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
Andhra Pradesh: సర్కారు ఆస్పత్రులు సరికొత్తగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టింది. అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక వసతులను సైతం కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు ఆస్పత్రుల్లోని వైద్యులు రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా సకల సౌకర్యాలతో రోగులకు సేవలందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులతోపాటు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. పూర్తిస్థాయిలో వైద్యు లు, సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వం ఆయా విభాగాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో వైద్యులు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. 2019కు ముందు కేవలం ఒక సీటీ స్కాన్, ఒక ఎక్సరే పరికరాలు ఉండేవి. అవి కూడా సక్రమంగా పనిచేసేవి కావు. దీంతో జీజీహెచ్కు వచ్చిన రోగులు సీటీ స్కాన్, ఎక్సరేల కోసం బయట సెంటర్లకు వెళ్లేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన సీటీ స్కాన్, ఎక్సరే, ఎంఆర్ఐ పరికరాలను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల సంఖ్యను పెంచారు. ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. 20 ఫ్రీజర్లను ప్రభుత్వం అందజేసింది. రూ.10 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను 175కు పెంచారు. అలాగే పిడియాట్రిక్, అనస్తీషియా, పల్మనాలజీ విభాగాల్లో పీజీ సీట్లను తీసుకొచ్చారు. యూపీహెచ్సీలకు అధునాతన హంగులు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా, దాదాపు 9 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. 2019 వరకు కార్పొరేషన్ పరిధిలో కేవలం 8 ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. వాటి నిర్వహణ తూతూమంత్రంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 13 నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను (యూపీహెచ్సీలను)అధునాతన హంగులతో నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.1.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, మందులు గది, ల్యాబ్, ప్రత్యేక వార్డు, డెలివరీ గదిని ప్రత్యేకంగా నిర్మించింది. పాత ఆరోగ్య కేంద్రాలకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనాలోనూ ఉత్తమ వైద్యసేవలు కోవిడ్–19 సమయంలో జీజీహెచ్లోని వైద్యులు, సిబ్బంది, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో రోగులకు ఉత్తమ సేవలు అందించారు. కోవిడ్ బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైదసేవలు అందించారు. ఇతని పేరు పెంచలనాయుడు. ఇతనిది పొదలకూరు. ఇటీవల ఇంట్లో కాలు జారి కింద పడ్డాడు. చెయ్యి విరగడంతో జీజీహెచ్కు వెళ్లాడు. అక్కడ ఆర్థో విభాగం వైద్యులు పరీక్షించి చెయ్యి విరిగిన చోట ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగుంది. దాదాపు పది రోజులుగా జీజీహెచ్లో ఉన్నాడు. డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందించడమే కాకుండా ప్రతి పూట భోజనం పెట్టారు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.4,720 వరకు ఆర్థికసాయం అందింది. ఇతని పేరు నాగరాజు. ఇతనిది నెల్లూరు నగరం. గత కొంతకాలంగా పైల్స్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే వైద్యానికి రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరులోని జీజీహెచ్కు వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించారు. తక్షణమే చికిత్స చేసేందుకు ముందుకువచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. రోగులకు అన్ని సౌకర్యాలు నాడు–నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హాస్పిటల్కు వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. 10 లిఫ్ట్ లు పనిచేస్తున్నాయి. అధునాతన పరికరాలతో సేవలు అందిస్తున్నాం. – సిద్ధానాయక్, జీజీహెచ్, సూపరింటెండెంట్ సేవ చేయడానికి ముందున్నాం జీజీహెచ్కు వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాను. హాస్పిటల్లో ఎన్నో క్లిష్టమైన డెలివరీలు చేశాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి సహాయ, సహకారాలతో పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాం. – లక్ష్మీ సునంద, జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ -
93 శాతం శిబిరాలు పూర్తి
సాక్షి, అమరావతి: వైద్యాన్ని పేదలకు చేరువలోకి తీసుకువచ్చి, ప్రజలందరి ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ విజయవంతంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 30వ తేదీన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది మొదలు ప్రజలు పెద్దఎత్తున శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 12,422 ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణ లక్ష్యం కాగా, 93.07 శాతం.. అంటే 11,562 శిబిరాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. వైఎస్సార్, ప్రకాశం, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా జిల్లాల్లో వంద శాతం కార్యక్రమం పూర్తి అయింది. మిగిలిన జిల్లాల్లో 860 గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో ఈనెల 15వ తేదీ లోగా పూర్తి చేసేలా వైద్య శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం ఆరోగ్య సురక్ష శిబిరాల్లో స్పెషలిస్ట్ వైద్యుల పరిశీలన అనంతరం మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ సుమారు 80 వేల మందికి పైగా రోగులను రిఫర్ చేశారు. వారిని స్థానిక ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్వో)లకు అనుసంధానించి తదుపరి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ నాటికి 520 మందికి నెట్వర్క్ ఆస్పత్రుల్లో సర్జరీ/వైద్యం చేశారు. వీరిలో 451 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు కూడా వెళ్లారు. ఇదే తరహాలో మిగిలిన రోగులందరికీ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం, పరీక్షలు, మందులు, అవసరం ఉన్న వారికి సర్జరీ సేవలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన అనంతరం కూడా వీరి ఆరోగ్యంపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది ద్వారా నిరంతరం వాకబు చేస్తున్నారు. దీర్ఘకాలిక జబ్బుల బాధితులకు భరోసా.. కొత్తగా మధుమేహం, రక్తపోటు, క్షయ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారిని ఆరోగ్య సురక్షలో ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిరంతరం వైద్య పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటినీ జల్లెడ పట్టి స్క్రీనింగ్ చేయగా.. గతంలో ఉన్న బీపీ, షుగర్ బాధితులు కాకుండా కొత్తగా 2,25,451 మంది బీపీ, 1,40,218 మంది షుగర్తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. మరోవైపు నమూనాలు సేకరించి 417 మందిలో క్షయ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. అలాగే కుష్టు వ్యాధి నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్యం అందించడంతో పాటు.. ఉచితంగా మందులిస్తున్నారు. -
Israel-Hamas war: గాజాలో కన్నీటి చుక్కలు
రఫా/టెల్ అవీవ్: ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో దద్దరిల్లుతున్న గాజా స్ట్రిప్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయి. ప్రధానంగా ఇంధన కొరత వల్ల సహాయక చర్యలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో వాహనాలు మూలనపడ్డాయి. క్షిపణుల దాడుల్లో ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగించే అవకాశం లేకుండాపోయింది. వాటికింద చిక్కుకుపోయిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మరోవైపు ఇంధనం కొరతవల్ల ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయడం లేదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు ఆపేస్తున్నారు. క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు కూడా అందడం లేదు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలు ఆసుపత్రుల నుంచి శ్మశానాలకు చేరుతున్నాయి. ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాజాకు ఇంధన సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని బుధవారం ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేసింది. ఇంధనం సరఫరా చేయకపోతే గాజాలో సహాయక చర్యలు అతిత్వరలో పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్ గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరిలో 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 6 లక్షల మంది ఐక్యరాజ్యసమితి సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈజిప్టు సరిహద్దు నుంచి ఆహారం, నిత్యావసరాలను గాజాకు చేరవేసేందుకు ఇజ్రాయెల్ ఇటీవల అనుమతి ఇచి్చంది. దాంతో కొన్ని వాహనాలు గాజాకు చేరుకున్నాయి. పరిమితంగా అందుబాటులోకి వచి్చన ఆహారం, నిత్యావసర సామగ్రిని రేషనింగ్ విధానంలో పాలస్తీనియన్లకు సరఫరా చేస్తున్నారు. ఇంధన కొరత మాత్రం తీరడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ను గాజాలోకి అనుమతించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ సైన్యం తెగేసి చెబుతోంది. చేతులేత్తేయడమే మిగిలింది ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ ప్రస్తుతం గాజాలో సహాయక చర్యల్లో నిమగ్నమైంది. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తోంది. విద్యుత్ లేక, పెట్రోల్, డీజిల్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇకపై క్షతగాత్రులకు సేవలందించే పరిస్థితి లేదని చెబుతోంది. ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి కూడా వాహనాలకు ఇంధనం లేదని పేర్కొంటోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పూర్తిగా చేతులెత్తేయడం తప్ప చేసేదేమీ లేదని ‘యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్’ అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలోని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మూడింట రెండొంతులు ఇప్పటికే మూతపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. సిరియాలో 8 మంది జవాన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం మధ్యప్రాచ్యంలో అగ్గి రాజేస్తోంది. హమాస్కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచేవారిని వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హమాస్కు సిరియా ప్రభుత్వం మద్దతు పలుకుతుండడంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం బుధవారం దక్షిణ సిరియాలోని సైనిక శిబిరాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 8 మంది సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సిరియా నుంచి తమపై రాకెట్ దాడులు జరుగుతుండడంతో తిప్పికొట్టామని, వైమానిక దాడులు చేసి సిరియా సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఒక్కతాటిపైకి మిలిటెంట్ సంస్థలు! ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచిన నేపథ్యంలో లెబనాన్కు చెందిన హెజ్బొల్లా ముఖ్య నేత హసన్ నస్రల్లా బుధవారం హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ అగ్రనాయకులతో సమావేశమయ్యారు. తాజా పరిణామాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్, హెజ్బొల్లా, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంస్థలు కలిసి పోరాడే సూచనలు కనిపిస్తున్నాయి. గాజాపై భూతల దాడులకు దిగితే తగిన మీకు గుణపాఠం నేర్పుతామంటూ ఇజ్రాయెల్ను హెజ్బొల్లా హెచ్చరించింది. హమాస్కు ఇరాన్ సాయం అందిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ చెప్పారు. ఇరాన్లోని మిలిటెంట్ సంస్థలు ఇరాక్, యెమెన్, లెబనాన్ భూభాగల నంచి ఇజ్రాయెల్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బందీల విడుదలకు ఖతార్ యత్నాలు హమాస్ చెర నుంచి బందీలు విడుదలయ్యే విషయంలో మరిన్ని సానుకూల పరిణామాలు చూడొచ్చని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహా్మన్ అల్–థానీ చెప్పారు. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే నలుగురు బందీలు విడుదలైన సంగతి తెలిసిందే. మిగిలినవారిని సైతం విడుదల చేసేలా హమాస్తో సంప్రదింపులు జరుగుతున్నాయని ఖతార్ ప్రధానమంత్రి తెలిపారు. బందీల విడుదలకు చొరవ చూపుతున్న ఖతార్ ప్రభుత్వానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి అధినేత టాగీ హనెగ్బీ కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యప్రాచ్యం నుంచి అమెరికన్ల తరలింపు! ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణ మధ్యప్రాచ్యంలో ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తే, అక్కడున్న తమ పౌరులను స్వదేశానికి తరలించాలని యోచిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ నుంచి అమెరికా పౌరుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైంది. చాలామంది అమెరికన్లు ఇజ్రాయెల్ వదిలి వెళ్లిపోయారు. మధ్యప్రాచ్య దేశాల్లో పెద్ద సంఖ్యలో అమెరికన్లు ఉన్నారు. యుద్ధం గనుక విస్తరిస్తే వారి భద్రతకు భరోసా ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పరిస్థితి అదుపు తప్పకముందే వారిని క్షేమంగా స్వదేశానికి రప్పించాలని నిర్ణయానికొచి్చనట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా సౌరే అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఘర్షణను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు రోజుల్లో 750 మంది మృతి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడుల తీవ్రత పెంచింది. బుధవారం కొన్ని టార్గెట్లపై క్షిపణులు ప్రయోగించింది. హమాస్ స్థావరాలను, సొరంగాలను, ఆయుధాగారాలను, సమాచార వ్యవస్థను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మంగళవారం, బుధవారం జరిగిన దాడుల్లో గాజాలో 750 మందికిపైగా జనం మృతిచెందారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 5,791 మందికిపైగా మరణించారని, 16,297 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. గాజాలోని మృతుల్లో 2,300 మంది మైనర్లు ఉన్నారని వెల్లడించింది. వెస్ట్బ్యాంక్లో ఇజ్రాయెల్ దాడుల్లో 96 మంది పాలస్తీనియన్లు బలయ్యారు. 1,650 మంది క్షతగాత్రులుగా మారారు. 10 మంది యూదులను చంపేశా! ఇజ్రాయెల్లో 10 మంది యూదులను చంపేశానంటూ హమాస్ మిలిటెంట్ ఒకరు తన తల్లిదండ్రులతో మొబైల్ ఫోన్లో చెప్పిన ఆడియో రికార్డు ఒకటి వెలుగులోకి వచి్చంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ దీన్ని విడుదల చేసింది. గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ భూభాగంలోని కిబుట్జ్లో తానున్నానని, తాను ఒక్కడినే 10 మంది యూదులను మట్టుబెట్టానని సదరు మిలిటెంట్ గాజాలోని ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి గర్వం తొణికిసలాడే స్వరంతో ఆనందంగా చెప్పాడు. దాంతో వారు అతడిని శభాష్ అంటూ అభినందించారు. మిలిటెంట్ ఉపయోగించిన ఫోన్ అతడి చేతిలో చనిపోయిన ఇజ్రాయెల్ పౌరుడిదే కావడం గమనార్హం. అయితే, ఈ ఆడియో రికార్డు నిజమైందో కాదో ఇంకా నిర్ధారణ కాలేదని ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. -
పైసా ఖర్చు లేకుండా.. కార్పొరేట్ ఫిజియోథెరపీ
విమ్స్ పేరు వినగానే రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు గుర్తుకొస్తాయి. ప్రశాంత వాతావరణం, కార్పొరేట్ స్థాయి పడకలు, ఐసీయూ గదులు, వసతులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడి రోగుల సేవలకు అందుబాటులో ఉన్నాయి. అన్ని విభాగాల వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. అతి తక్కువ ధరలకు సీటీ స్కానింగ్, ఎక్స్రే, రక్త రీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు ఉచిత ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆరిలోవ: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కార్పొరేట్ స్థాయి ఆధునిక పరికరాలతో ఉచిత ఫిజియోథెరపీ సేవలను రోగులకు అందిస్తున్నారు. ఇటీవల స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వైద్యాధికారులు ఇందులో ఉన్న ఆధునిక పరికరాలను ఉపయోగించి అవసరమైనవారికి ఫిజియోథెరపీ సేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు ఇక్కడ స్పీచ్ థెరపీ, ఆడియో థెరపీ అందుబాటులో ఉంది. కోమా, పక్షవాతంతో బాధపడిన అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. పక్షవాత రోగులకు ప్రత్యేక ఐసీయూ పక్షవాతంతో బాధపడుతున్నవారికి ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేశారు. ఇందులో ఆధునిక పడకలు అమర్చి ఇన్పేషెంట్ సేవలు అందిస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ సేవల్ని పొందాలంటే నెలకు కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. విమ్స్లో మాత్రం ఈ సేవలు పూర్తిగా ఉచితమేనని వైద్యులు చెప్తున్నారు. వీటితో పాటు లేజర్ థెరపీ, కంటిన్యూయస్ పాసివ్ మోషన్(సీపీఎం) థెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రో థెరపీ, సస్పెన్షన్ థెరపీ, మొబిలిటీ థెరపీ, ఇన్ఫ్రారెడ్(ఐఆర్ఆర్), ఆల్ట్రాసౌండ్, మజల్ స్టిమ్యులర్స్, ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ(ఐఎఫ్టీ), రోబోటిక్ గ్లౌజ్, టెన్స్, షార్ట్వేవ్ థెరపీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న యంత్రాలు కార్పొరేట్ ఆస్పత్రులకు మించి, విమ్స్లో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ట్రాక్షన్ మిషన్, సీపీ వాకర్, ఫింగర్ లేడర్, ఆల్ట్రా సౌండ్, ట్రెడ్ మిల్, స్పైన్ డీ ట్రాక్, మొబిలిటీ ట్రైనర్, స్టిమ్యులేటర్, ర్యాంప్ వాకర్, పేర్లాక్ బార్, స్టాటిక్ సైకిల్స్, షోల్డర్ వీల్, స్వెల్ బాల్, పెగ్ బోర్డు, బ్యాలన్స్ బోర్డు, డంబెల్స్, వోబుల్ బోర్డు, థ్రెడ్ బ్యాండ్ తదితర యంత్రాలు వినియోగిస్తున్నారు. వీటిని విజయవాడ, హైదరాబాద్, ముంబయ్ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి, ఇక్కడ ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక రోగులకు వరం ఈ కేంద్రంలో ఆరుగురు ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉన్నారు. వారితో పాటు మరికొందరు సహాయక సిబ్బంది ఉన్నారు. దీర్ఘకాలంగా ఎముకల వ్యాధులతో బాధపడుతున్నవారు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పులు, వెన్నుపూస నొప్పులు, ఆర్థ్రరైటిస్ సమస్యలు, టెండాన్ సమస్య తదితర వాటితో బాధపడుతున్నవారికి అందుబాటులో ఉన్న ఆధునిక యంత్రాలను ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు ప్రమాదాలకు గురై, ఆపరేషన్ తర్వాత కాళ్లు, చేతులు కోల్పోయినవారికి రీహేబిలిటేషన్ కింద కృత్రిమ అవయవాలు అందిస్తున్నారు. పక్షవాత రోగులకు ప్రత్యేక థెరపీ ఇస్తున్నారు. ఉచిత సేవలను వినియోగించుకోండి విమ్స్లో ఈ మధ్యనే స్పైనల్ అండ్ న్యూరో రీహేబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, ఉచిత సేవలు అందిస్తున్నాం. ఆధునిక పరికరాలు అందుబాటులో ఉంచాం. ఇక్కడ ఉచితంగా అందించే థెరపీని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పొందాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. పక్షవాతంతో నడవలేని స్థితిలో ఉన్నవారి కోసం ప్రత్యేక ఐసీయూ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. చెవిటి, మూగ బాధితులకు స్పీచ్, ఆడియో థెరపీ, కాక్లియర్ ఇంప్లాంటేషన్ జరిగినవారికి ప్రత్యేక స్పీచ్ థెరపీ అందిస్తున్నాం. ఆరుగురు ఫిజియోథెరపీ వైద్యులతోపాటు సహాయక సిబ్బందితో సేవలు అందిస్తున్నాం. – డాక్టర్ కె.రాంబాబు, డైరెక్టర్, విమ్స్ -
పేదల కళ్లల్లో కాంతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఇందుకోసం వైద్య రంగంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టారు. వైద్యాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. గ్రామాల్లోనే వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల్లో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారి కోసం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టారు. మూడు విడతల్లో కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు ఇచ్చారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి ఇప్పుడు నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ వైద్య శిబిరాల్లో కంటి పరీక్షలు చేస్తున్నారు. గత నెల 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో మంగళవారం వరకు 35 లక్షల మందికిపైగా వైద్య సేవలు పొందారు. వీరిలో 5,26,045 మంది వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వీరిలో 1,57,614 మందికి మందులతో నయమయ్యే సమస్యలేనని తేల్చారు. వారందరికీ అవసరమైన మందులు ఇచ్చారు. మరో 3,12,478 మందికి కళ్లద్దాలను సూచించారు. వీరందరికీ కళ్లద్దాలను వైద్య శాఖ అందిస్తోంది. 55,953 మందిని తదుపరి వైద్యం కోసం ఆస్పత్రులకు పంపించారు. 48,507మందికి కాటరాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. తదుపరి వైద్యం, కాటరాక్ట్ సర్జరీలు అవసరమున్న వారిని స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్,సీహెచ్వో, ఏఎన్ఎంలకు మ్యాప్ చేశారు. వీరందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరంతా కంటి సమస్యలు తొలగి పూర్తిస్థాయి చూపుతో తిరిగి ఇళ్లకు చేరుకోనున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం బెలుం గ్రామానికి చెందిన బాలసంటి వయసు 90 ఏళ్లు పైనే. చూపు మందగించడంతో గతంలో కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నాడు. మళ్లీ కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనిపించక ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల గ్రామంలోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లాడు. వైద్యులకు తన సమస్య వివరించాడు. కంటి పరీక్షలు చేసిన వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇప్పుడు బాలసంటి ఉల్లాసంగా ఉన్నాడు. బాలసంటిలానే కంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల వరకూ వెళ్లలేని వారికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఓ వరంగా మారింది. ఈ కార్యక్రమంలో తాము ఉంటున్న ఊరిలోనే కంటితో పాటు, ఇతర వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వైద్యుల సేవలు కూడా... రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 800 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కంటి వైద్యులు అవసరం. మన రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వైద్యులను పిలిపించాం. కంటి సమస్యల బాధితులకు అవసరమైన మందులను శిబిరాల్లోనే అందిస్తున్నాం. అద్దాలు అవసరమైన వారికి స్థానిక విక్రేతల ద్వారా అందజేస్తున్నాం. క్యాటరాక్టర్ సర్జరీలు అవసరమున్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్జీవో ఆస్పత్రులకు తరలించి ఉచితంగా సర్జరీలు చేయిస్తున్నాం. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
ఆరోగ్య సురక్ష విస్తరణ
సాక్షి, అమరావతి: అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. గ్రామాల్లోనే ప్రజలందరూ ఉచితంగా స్పెషలిస్ట్ వైద్యసేవలు, మందులు పొందడం.. అలాగే, పట్టణ, నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకూ ప్రజలు పోటెత్తుతుండడంతో వీటిని ప్రతి వార్డుకూ విస్తరించాలని వైద్యశాఖ సంకల్పించింది. ఇప్పటివరకు 8,985 శిబిరాల నిర్వహణ.. గత నెల 30 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 పనిదినాల్లో 8,985 క్యాంపులు నిర్వహించారు. వీటిల్లో 35,11,552 మంది ఉచిత స్పెషలిస్ట్ వైద్యసేవలు పొందారు. వీరిలో 61,971 మందిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేశారు. అలాగే, గ్రామాల్లోని 10,032 విలేజ్ క్లినిక్ల పరిధిలో చేయాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 6,500కు పైగా క్యాంపులు పూర్తయ్యాయి. ఇప్పుడు వీటికి అదనంగా పట్టణాల్లో వార్డుల వారీగా విస్తరించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, నగరాల్లో 542 వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 1,626 శిబిరాలు నిర్వహించాలన్నది ప్రణాళిక. దీంతో ఒక్కో కేంద్రం పరిధిలో ప్రస్తుతం మూడుచొప్పున ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఒక్కో శిబిరం వద్దకు వెయ్యి మందికి పైగా జనాభా హాజరవుతున్నారు. ఇలా ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో వైద్యం పొందడంలో ఆలస్యం, ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీలుగా వార్డు సచివాలయాల వారీగా సోమవారం నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఇప్పుడు ఈ క్యాంపులు మరింతగా పెరగనున్నాయి. 3,842 వార్డు సచివాలయాల పరిధిలో.. పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే శిబిరాలు పూర్తయినవి మినహాయించి మిగిలిన ప్రతి సచివాలయం పరిధిలో శిబిరాలు నిర్వహించేలా ప్రణాళిక రచించారు. ► సచివాలయం పరిధిలో శిబిరం నిర్వహించడానికి ముందే ప్రతి ఇంటిని వలంటీర్లు, గృహ సారథులు సందర్శిస్తున్నారు. ► ఆ తర్వాత.. వలంటీర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ► బీపీ, సుగర్ పరీక్షలతో పాటు, అవసరం మేరకు డెంగీ, మలేరియా, వంటి ఇతర ఏడు పరీక్షలు చేపడుతున్నారు. ► ఈ స్క్రీనింగ్లో గుర్తించిన వివిధ సమస్యల ఆధారంగా బాధితులు శిబిరాలకు హాజరవ్వడానికి టోకెన్లు ఇస్తున్నారు. ► టోకెన్లతో సంబంధం లేకుండా ప్రజలు నేరుగా శిబిరాలకు హాజరయ్యే వెసులుబాటు కూడా అధికారులు కల్పించారు. ► ఇక ప్రతి క్యాంపులో ఇద్దరు ఎంబీబీఎస్, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, సరిపడా మందులను సమకూరుస్తున్నారు. ఇబ్బందులకు తావు లేకుండా.. పట్టణాల్లోని ప్రతి వార్డు సచివాలయంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరాల నిర్వహణ ప్రారంభించాం. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు రిఫర్ చేసిన వారికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. స్థానిక మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలకు ఆ బాధత్యలు అప్పగించాం. - ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, సీఈఓ, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష
తుని రూరల్: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హెచ్.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేష్ ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకువెళ్లాలి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని తెలుసుకున్న లోకేష్ బంధువులు వెంటనే అక్కడికి తీసుకువెళ్లారు. వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేష్ కళ్లు తెరిచాడు. వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్ సెక్షన్స్లో సీపీఆర్ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచి్చందని వైద్యులు చెప్పారు. -
కేన్సర్ రోగుల కష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: కేన్సర్ రోగుల కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు కేన్సర్ రోగులు చికిత్స కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు. ఇకపై వారికి రాష్ట్రంలోనే ఆధునిక చికిత్సను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 21 నుంచి రాష్ట్రంలోని 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవలు ప్రారంభిస్తోంది. రోగులు ఈ ఆస్పత్రుల్లో హబ్ అండ్ స్పోక్ విధానంలో కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు పొందవచ్చు. తిరుపతిలోని స్విమ్స్తో పాటు మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పాత 10 బోధనాస్పత్రులు హబ్స్గా వ్యవహరిస్తాయి. వీటికి సమీపంలోని జిల్లా ఆస్పత్రులను మ్యాపింగ్ చేశారు. రోగులకు తొలుత హబ్స్లో చికిత్స అందిస్తారు. ఆ తర్వాత కేన్సర్ వైద్య నిపుణుల సూచనలతో జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లా ఆస్పత్రిలో నాలుగు పడకలతో ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలందించడానికి ప్రతి యూనిట్లో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్ను నియమించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. మందులు, ఇంట్రావీనస్, ఇంట్రాపెరిటోనియల్, ఇంట్రాథేకల్ ఇలా వివిధ కేన్సర్ వ్యాధులకు కీమోథెరపీ చేస్తారు. సాధారణంగా బ్రెస్ట్, తల, గొంతు కేన్సర్ రోగులకు వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితి ఆధారంగా ఆరు అంతకంటే ఎక్కువ సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర కేన్సర్ కేర్ ప్రత్యేకాధికారి డాక్టర్ రమేశ్ తెలిపారు. గర్భాశయ కేన్సర్తో బాధపడేవారికి ఐదు సైకిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు తొలుత రెండు సైకిల్స్ కీమోథెరపీని బోధనాస్పత్రుల్లో (హబ్స్లో) ఇస్తారు. అనంతరం రోగి ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని జిల్లా ఆస్పత్రికి మ్యాప్ చేస్తారు. ఇలా మ్యాప్ చేసిన రోగికి హబ్లోని అంకాలజీ నిపుణుడి సూచనల మేరకు మిగిలిన అన్ని సైకిల్స్ కీమోథెరపీ జిల్లా ఆస్పత్రుల్లోనే చేస్తారు. భరించలేని నొప్పితో బాధపడుతున్న రోగులకు నొప్పి నుంచి నివారణ కల్పించేలా పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. కేన్సర్ రోగుల వైద్యానికి ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చు కేన్సర్ రోగులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని అన్ని రకాల కేన్సర్ రోగులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 2019–20 నుంచి ఇప్పటివరకు 2.70 లక్షల మందికిపైగా రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన కేన్సర్ వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో కేన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించడానికి గుంటూరు బోధనాస్పత్రిని లెవెల్–1, కర్నూలు, విశాఖ ఆస్పత్రులను లెవెల్–2 సెంటర్స్గా అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ 21 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్కు అవసరమైన మందులు, ఇతర సదుపాయాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. ఇక మీదట కేన్సర్ రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే వారు చికిత్స పొందవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే @ 5.28 కోట్లు
సాక్షి, అమరావతి : జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్రంలో పౌరులకు రికార్డు స్థాయిలో ఉచితంగా వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11వరకు మొత్తం 5,28,33,324(ఏడు రకాల) వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 16వ తేదీ నుంచి ఏఎన్ఎంలు, కమ్యునిటీ హెల్త్ ఆఫీ సర్లు ఇంటింటికీ వెళ్లి ఆ ఇంట్లో వారికి ఆరోగ్య పరీక్షలు చేయడం ప్రారంభించారు. మరోవైపు, గత నెల 30వ తేదీ నుంచి ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. శిబిరాలకు భారీగా జనం వచ్చి అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందులు తీసుకుంటున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వేలో మొత్తం ఏడు రకాల పరీక్షలు చేస్తున్నారు. బీపీ, షుగర్, మూత్ర (యూరిన్), హిమోగ్లోబిన్, మలేరియా, డెంగీ, కఫం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య శిబిరాలకు రాక ముందే పౌరుల ప్రొఫైల్తో కూడిన కేస్ షీట్ను ప్రింట్ చేసి ఇస్తున్నారు. అలాగే ఇంటింటి సర్వే రోగులకూ ఆరోగ్య శిబిరాల్లో కేస్ షీట్ ఇస్తున్నారు. వీరందరికీ ఆరోగ్య శిబిరాల్లో స్పెష లిస్ట్ సేవలందిస్తున్నారు. మహిళా రోగుల కో సం ప్రత్యేకంగా మహిళా వైద్యులు సేవలందిస్తు న్నారు. 172 రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంచి.. అవస రాన్ని బట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎల్ ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, సీరమ్ వంటి 53 రకాల తదుపరి పరీక్షల కోసం పీహెచ్సీలకు అను సంధానం చేయ డంతో పాటు ఏఎన్ఎం ద్వారా పరీ క్షల ఫలితాలను తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఫాలోఅప్ చేయిస్తున్నారు. పెద్ద చికిత్సలు అవసరమైన వారిని నెట్వర్క్ ఆస్ప త్రులకు రిఫర్ చేస్తున్నారు. పోషకాహార ప్రదర్శనలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయాలనే దానిపైనా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఆరోగ్య శిబిరాల్లో టీబీ, కుష్టు పరీక్షలు చేసిన ప్పుడు పాజిటివ్ అని తేలితే ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. శిబిరాల్లోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఆరోగ్య శ్రీ కార్డుల్లేని అర్హులైనవారికి ఆరోగ్య శిబిరాల్లోనే కార్డులు మంజూరుచేస్తున్నారు. తీవ్రమైన పోష కాహార లోపం కేసులను గుర్తించడంతో పాటు, పోష కాహార పునరావాస కేంద్రాలకు సిఫారుసు చేస్తు న్నారు. పిల్లల్లో పుట్టకతో వచ్చే లోపాలను గుర్తించి అవసరమైన చికిత్సలు సూచిస్తున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల్లో చికిత్సలకు వచ్చే వారి కోసం కుర్చీలు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఆ రోగ్య శిబిరాల నిర్వహణకు ఒక్కో విలేజ్ క్లినిక్కు రూ.20 వేల చొప్పున, పట్టణ పీహెచ్లకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసింది. ఆరోగ్య శిబిరాలను సజావుగా నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో పీహెచ్సీ పరిధిలో నలుగురు, పట్టణాల్లో 4–5 పీహెచ్సీల పరిధిలో ఒకరిని పర్యవేక్షణ కోసం నియమించారు. -
‘క్యాన్సర్ మానిటరింగ్’లో 353 పోస్టుల సృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన, నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో విశాఖలో కేజీహెచ్, గుంటూరు జీజీహెచ్, కడప జీజీహెచ్లలో క్యాన్సర్ సెంటర్లతో పాటు, డీఎంఈ కార్యాలయంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కోసం ప్రభుత్వం 353 పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి.హోస్మని ఉత్తర్వులిచ్చారు. 6 ప్రొఫెసర్, 5 అసోసియేట్, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్, 90 స్టాఫ్ నర్స్, 90 జనరల్ డ్యూటీ అటెండెంట్ చొప్పున, మిగిలిన వాటిలో ఇతర పోస్టులను కేటాయించారు. 50 కి.మీ దూరంలో క్యాన్సర్ వైద్యసేవలనుఅందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. లెవల్–1 క్యాన్సర్ సెంటర్గా గుంటూరును, లెవల్–2 సెంటర్లుగా కర్నూలు, విశాఖ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. -
10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రతి గడపకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,574 చోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కిల్లోగూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ శిబిరాలకు వస్తున్న ప్రతి వ్యక్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచడంతోపాటు ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దాస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పైసా ఖర్చు లేకుండానే ఉన్నత వైద్యం అందిస్తామన్నారు. మూడు రోజుల్లోనే ఈ శిబిరాల ద్వారా 3.35 లక్షల మందికి వైద్యపరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. వీటిలో 11,780 కేసులను ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉన్నత వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 297 ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు 250 మంది వైద్య నిపుణులను కేటాయించామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారని వెల్లడించారు. గిరిజనులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గిరిజనులంటే సీఎం జగన్కు అపారమైన ప్రేమ అని మంత్రి రజిని తెలిపారు. రూ.600 కోట్లతో మన్యం జిల్లా పార్వతీపురంలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని చెప్పారు. అలాగే పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని, వచ్చే ఏడాది ఇది ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీంతోపాటు 600 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో మన్యం ప్రజలు కేజీహెచ్కు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో బర్త్ వెయిటింగ్ సేవలను గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 40.. 104, 108 వాహనాలను కేటాయించామన్నారు. 20 లక్షల మంది గిరిజనులకు సికిల్సెల్ ఎనీమియా నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నామన్నారు. రోగులకు నెలకు రూ.10 వేల పింఛన్ కూడా అందిస్తున్నామని చెప్పారు. అనంతరం వైద్య శిబిరానికి వచి్చన గిరిజనులకు మందుల కిట్లు పంపిణీ చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చే గిరిజనులకు ఉచితంగా ఆహారం, తాగునీరు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. దత్తత గ్రామానికి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా? టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బాౖMð్సట్ తవ్వకాలతో మన్యాన్ని దోచుకోవాలని ప్రయత్నాలు చేశారని మంత్రి విడదల రజిని విమర్శించారు. పెదలబుడును చంద్రబాబు దత్తత తీసుకుని ఒక మంచి పని అయిన చేశారా అని నిలదీశారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉన్న జీవోను రద్దు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ నివాస్, ఐటీడీఏ పీవో వి.అభిõÙక్, ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
పేదల వైద్యుడు.. ఆదర్శనీయుడు ఈసీ గంగిరెడ్డి
పులివెందుల: దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల వైద్యుడిగా పేరు పొంది, ఎందరికో ఆదర్శనీయుడిగా నిలిచారు. ఆయన పులివెందులతోపాటు జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20న ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో జన్మించారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్సీఎం స్కూలు, 6 నుంచి 8 వరకు పులివెందుల జెడ్పీ హైస్కూలు, 9 నుంచి 10వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలులో చదివారు. 10వ తరగతిలో జిల్లా టాపర్గా నిలిచారు. ఎంబీబీఎస్, పీడీ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. పులివెందులలోని శ్రీనివాస హాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా, ప్రతిఫలం ఆశించని డాక్టర్గా ఆయన గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. ఈ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా వచ్చి వైద్య సేవలు పొందారు. మారుతున్న కాలాన్ని బట్టి భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి) స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతలను కనబరిచేవారు. ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు. రాజకీయ ప్రస్థానం డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. నేడు ప్రత్యేక ప్రార్థనలు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు మంగళవారం పులివెందులలో ఘనంగా జరగనున్నాయి. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద మంగళవారం ఈసీ గంగిరెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. -
Fact Check: ‘ఆరోగ్య సురక్ష’పైనా అక్కసే..
పద్నాలుగేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన రామోజీ ఆత్మబంధువు చంద్రబాబుకు ఏనాడు వైఎస్ జగన్ మాదిరిగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కూడా రాలేదు. పైగా.. ఈ చేతగానితనాన్ని సమర్థించుకుంటూ ఈనాడు ఒక్కోరోజు ఒక్కో రకంగా అడ్డగోలు వాదన చేస్తోంది. తాజాగా ఆ వాదన దేనిమీదో తెలుసా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై.. గత టీడీపీ ప్రభుత్వంలో సంచార వైద్య సేవల కార్యక్రమమే ఇదని సిగ్గూఎగ్గూ లేకుండా రాసిపారేస్తోంది. నిజానికి.. ఈ రెండు కార్యక్రమాలను పోల్చిచూస్తే నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యానికి ఏ ఒక్కరూ దూరం కావడానికి వీల్లేకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి తాజాగా శనివారం శ్రీకారం చుట్టింది. 1.67 కోట్ల గృహాలకు వైద్య సిబ్బందిని పంపి ప్రజల సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమంపై రామోజీరావు ఎక్కడలేని అక్కసు వెళ్లగక్కారు. ఈనాడులో ఆదివారం ‘వైకాపా వారి వైద్య శిబిరాలు’ అంటూ విషపు రాతలు రాసుకొచ్చారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రారంభించిన తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా 620 వైద్య శిబిరాలను నిర్వహించి సొంత ఊళ్లలోనే 1.54 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలు అందించింది. అయితే, ఈ విషయాన్ని ఎక్కడా తన కథనంలో ప్రస్తావించని రామోజీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వంపై విషం కక్కింది. రూపాయి ఖర్చులేకుండా.. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ అనారోగ్య సమస్యలున్న ప్రజలు స్పెషలిస్ట్ వైద్య సేవలు పొందాలంటే వ్యయ, ప్రయాసలకోర్చి ఆస్పత్రులకు వెళ్లాలి. ఈ ఇబ్బందులకు తావులేకుండా సొంత ఊరిలోనే పూర్తి ఉచితంగా స్పెషలిస్ట్ వైద్య సేవల కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలుచేస్తోంది. వైద్య శిబిరాల్లో 14 రకాల వైద్య పరీక్షలు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచడంతో పాటు, వృద్ధులకు కంటి పరీక్షలు, కళ్లద్దాలు, హెల్త్ ప్రొఫైల్ మ్యాపింగ్ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన వైద్య శిబిరాలనే ఆరోగ్య సురక్ష శిబిరాలుగా నిర్వహిస్తున్నారని రామోజీరావు వింత వాదన చేస్తున్నారు. ప్రజలకు గతంలో ఎన్నడూలేని విధంగా మేలు చేస్తుంటే కడుపు మంటతో వాస్తవ దూరమైన రాతలు రాస్తుండటం రామోజీరావు దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉంటోందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. రామోజీరావు డూప్ రాతలు.. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన గత టీడీపీ పాలనలోని కార్యక్రమాలతో ప్రస్తుత ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను పోల్చి రామోజీరావు డూప్ రాతలు రాయడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వంలోని సంచార వైద్య సేవల కార్యక్రమాన్నే ఫ్యామిలీ డాక్టర్గా అమలుచేస్తున్నారని ఆయన ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. కేవలం 292 డొక్కు 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ)తో మొక్కుబడిగా సంచార వైద్య సేవలను అప్పట్లో అమలుచేసేవారు. మందులు, వైద్య పరీక్షలు సరిగా అందుబాటులో ఉండేవి కాదు. కానీ, ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు నెలలో రెండుసార్లు ప్రభుత్వ వైద్యులు వెళ్తున్నారు. మంచానికి పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వైద్యం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 936 ఎంఎంయూ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంతేకాక.. 105 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు సొంత గ్రామంలో అందిస్తోంది. ఈ లెక్కన పరిశీలిస్తే.. టీడీపీ ప్రభుత్వంలో అమలుచేసిన సంచార వైద్య సేవలు, ప్రస్తుత ఫ్యామిలీ డాక్టర్ విధానానికి మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. దీన్ని కప్పిపుచ్చి ప్రభుత్వం చేస్తున్న మంచి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా రామోజీరావు దురుద్దేశ్యంతో రోత రాతలు రాసుకొచ్చారు. -
AP: ప్రభుత్వ వైద్య సేవల్లో కొత్త అధ్యాయం
చానా సంతోషం నాయనా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బాలసంటి. వయసు 90 ఏళ్ల పైనే. బాలసంటి గ్రామం పేరు బెలుం. ఇది కొలిమిగుండ్ల మండలం నంద్యాల జిల్లాలో ఉంటుంది. ఇతనికి ఏ వైద్య అవసరం కావాలన్నా ఇంతకు ముందు 70 కిలోమీటర్ల దూరంలోని ప్రొద్దుటూరుకు వెళ్లాల్సిందే. ఇప్పుడతనికి గ్రామంలోనే వైద్య సేవలు అందుతున్నాయి. శనివారం జగనన్న సురక్ష క్యాంపునకు వచ్చిన అతను మాట్లాడుతూ.. ‘‘గతంలో ప్రొద్దుటూరు వెళ్లి కంటి పరీక్ష చేయించుకుని అద్దాలు కొనుక్కున్నా. ఇప్పుడు మళ్లీ కండ్లు సరిగా కనిపిస్తలేవు. బయటకు వెళ్లలేకున్నా, నడిచేందుకు కూడా కష్టంగా ఉంది. గ్రామంలోనే వైద్య శిబిరం పెట్టినారని తెలిసినోళ్లు ఇక్కడికి తీసుకొచ్చినారు. అప్పటికప్పుడు అన్ని పరీక్షలు చేసినారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఎక్కడెక్కడో తిరిగే బాధ కూడా తప్పింది. చానా సంతోషం నాయనా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడాడు. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. 26 జిల్లాల్లో 620 ఆరోగ్య సురక్ష క్యాంప్లు నిర్వహించారు. ఒక్కో క్యాంప్లో ఇద్దరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు.. మొత్తం నలుగురు వైద్యులు అందుబాటు లో ఉండి సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్యం చేశారు. 1,45,611 మంది స్వగ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు. అంటే.. ప్రతి క్యాంప్లో సగటున 235 ఓపీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శనివారం(సెపె్టంబర్ 30) నుంచి నవంబర్ 15వ తేదీ వరకు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని శుక్ర వారం సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. శనివారం జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు క్యాంప్లను ప్రారంభించారు. మహిళలే అధికం తొలి రోజు ఆరోగ్య సురక్ష క్యాంప్లలో వైద్య సేవలు పొందిన వారిలో మహిళలే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 లక్షల మంది సేవలు పొందగా వీరిలో 63,257 మంది పురుషులు, 82,354 మంది మహిళలు ఉ న్నారు. మొత్తం వైద్య సేవలు పొందిన వారిలో మెరుగైన వైద్యం అవసరమున్న 5,809 మందిని స్థానికంగా ఉన్న పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యసేవలు పొందేలా స్థానిక పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. దీంతో పెద్ద ఆస్పత్రుల్లోను వీరందరికీ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్య సేవలు అందేలా చూస్తారు. రూపాయి ఖర్చు లేకుండా క్యాంప్లకు వచ్చిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు, మందులను అందించింది. ప్రతి క్యాంప్ లో 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 172 రకాల మందులను అందుబాటులో ఉంచారు. అవసరం మేరకు కంటి పరీక్షలు, ఈసీజీ, రక్తపరీక్షలు, ఫుడ్ సప్లిమెంటేషన్ మ్యాపింగ్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామం/పట్టణంలో ఆరోగ్య సు రక్ష క్యాంప్పై ప్రజలకు వైద్య సిబ్బంది, వలంటీర్లు అవగాహన కల్పించారు. సుదూర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు వెళ్లే పనిలేకుండా జనరల్ మెడిసిన్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వంటి ఇతర స్పెషలిస్ట్ వైద్యులే గ్రామంలో సేవలు అందిస్తున్నారని తెలిసి ప్రజలు శిబిరాలకు తరలి వచ్చారు. క్యాంప్ల్లో వైద్య సేవలు పొందిన వారికి వ్యక్తిగత కేస్ షీట్స్ను ప్రభు త్వం అందించింది. కేస్ షీట్లో వ్యక్తి పేరు, చిరునామా, వయసు వంటి వివరాలతో పాటు, వైద్యుడు పరిశీలనాంశాలు, సూచించిన మందుల ప్రిస్క్రిప్షన్ నమోదు చేశారు. కేస్ షీట్ ఫోల్డర్, వైద్యుడు సూచించిన మందులతో జగనన్న ఆరోగ్య కిట్ను వైద్య శాఖ పంపిణీ చేసింది. వీరిపై ఫ్యామిలీ డాక్టర్ నేతృత్వంలోని వైద్య సిబ్బంది పర్యవేక్షణ ఉంచనున్నారు. ఐదు దశల్లో.. ప్రభుత్వం 5 దశల్లో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. తొలి దశలో వలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు హెల్త్ క్యాంప్ నిర్వహించే 15 రోజుల ముందు ఇళ్లన్నింటినీ సందర్శిస్తున్నారు. ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారు. రెండో దశలో సీహెచ్వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ప్రజలకు ఇంటి వద్దే బీపీ, షుగర్, హెచ్బీ, డెంగీ, మలేరియా సహా ఏడు రకాల పరీక్షలు అవసరం మేరకు నిర్వహించి ఫలితాలను యాప్లో నమోదు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తున్నారు. ఇక మూడో దశలో క్యాంప్ నిర్వహణకు మూడు రోజుల ముందు వలంటీర్, ప్రజాప్రతినిధులు ఇంటింటిని సందర్శించి హెల్త్ క్యాంప్ జరిగే ప్రదేశం, సమయం ఇతర వివరాలను తెలియజేస్తున్నారు. నాలుగో దశలో క్యాంప్లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఐదో దశలో హెల్త్ క్యాంప్లో వైద్య సేవలు పొందిన వారికి, రిఫరెన్స్ మేరకు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి తదుపరి వైద్య అవసరాల విషయంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లు చేయిపట్టి నడిపిస్తారు. వృద్ధులకు మేలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వృద్ధులకు ఎంతో ఉపయోగకరం. ఇంటింటికి వచ్చి వలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ పలకరిస్తున్నారు. గుమ్మం వద్దే వైద్య పరీక్షలు చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చి ఊళ్లోనే వైద్యం చేయిస్తున్నారు. మందులు ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఇలాంటి సేవలో మాకు అందేవి కావు. – శివలింగరెడ్డి, చిటిపిరాళ్ల గ్రామం, పూతలపట్టు మండలం, చిత్తూరు జిల్లా పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణులతో పేదల కోసం ఇలాంటి వైద్య శిబిరాలు గతంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. నేను గతకొద్ది కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాను. ఆసుపత్రికి వెళితే ఎంత ఖర్చు అవుతుందో అన్న భయంతో వెళ్లలేదు. ఈ రోజు వైద్య శిబిరంలో ఈసీజీ తీసి పరీక్షించారు. – కొల్లు అప్పారావు, మర్రిమొక్కవీధి, జగ్గంపేట, కాకినాడ జిల్లా అన్ని పరీక్షలు చేశారు నాకు గత కొంతకాలంగా నడుం నొప్పి వస్తోంది. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవడం నాకు సాధ్యం కాదు. మా ప్రాంతానికి 104 వాహనం రావడం, మందులు ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం లభించింది. ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వచ్చిన పెద్ద డాక్టర్లు అన్ని పరీక్షలు చేశారు. మందులు ఇచ్చి కొన్ని సూచనలు చేశారు. –పాలిక లక్ష్మి, శెట్టిబలిజపేట, జగ్గంపేట, కాకినాడ జిల్లా పడిపోయి.. నడవలేక.. ప్రమాదవశాత్తూ కాలుజారి పడిపోయాను. కాలికి గాయమైంది. నడవలేక ఇబ్బంది పడుతున్నాను. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి వెళ్లాను. అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. కాలుని పట్టిపట్టి చూశారు. పెద్దగా భయపడాల్సిన పనిలేదన్నారు. మందులిచ్చి వేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పీహెచ్సీకి రమ్మని చెప్పారు. – అప్పలనాయుడు, జమాదులపాలెం, కశింకోట మండలం, అనకాపల్లి జిల్లా -
ఆరోగ్యశ్రీ సేవలు చాలా బాగున్నాయి
కష్టకాలంలో ఆదుకున్నారు గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు. నా భర్త ఆటో డ్రైవర్. రోజువారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. బైపాస్ సర్జరీ అంటే బయట అప్పులు చేయాలని భయపడ్డాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయిస్తుందని చెప్పారు. ఫిబ్రవరిలో ఆపరేషన్ చేశారు. అనంతరం విశ్రాంత సమయానికి రూ. 9,500 భృతిని ఆరోగ్య ఆసరా కింద ఇచ్చారు. చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ పూర్తి అయింది. పేదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు నాలాంటి ఎంతోమంది ప్రాణాలను నిలుపుకుని సంతోషంగా ఉంటున్నారు. కష్టకాలంలో సీఎం జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంది. – అల్లంశెట్టి రాజ్యలక్ష్మి, ఒంగోలు, ప్రకాశం జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలకు సంజీవని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆయా కుటుంబాల వారికి ఏదైనా అనారోగ్యం వస్తే రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ పథకం అమలుపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెడుతూ వస్తోంది. సంతృప్తకర స్థాయిలో ప్రజలకు సేవలు అందించేలా విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పథకం కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. చికిత్స పొందిన రోగుల్లో సుమారు వంద శాతం సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది మంది మాత్రమే సేవల్లో సమస్యలను ప్రస్తావించారు. ఈ స్వల్ప సమస్యలను కూడా సరిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. 99.71 శాతం మంది సంతృప్తి ఆరోగ్యశ్రీ సేవల్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సర్దుబాటు చేసి ప్రజలకు వంద శాతం సంతృప్తికరంగా సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా గతేడాది ఆగస్టు 16 నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన రోగుల నుంచి అభిప్రాయ సేకరణను ప్రారంభించారు. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి ఇంటికి వెళ్లిన వారం నుంచి 10 రోజుల్లో ఏఎన్ఎం సంబంధిత రోగి ఇంటికి వెళ్లి రోగి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేస్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ సేవలపైనా అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. ఇప్పటి వరకూ పథకం కింద చికిత్స పొందిన 15,43,831 మంది నుంచి అభిప్రాయాలు తీసుకోగా.. 15,39,506 మంది అంటే 99.71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 0.29 శాతం మంది మాత్రమే సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురైనట్టు చెప్పారు. ఈ సమస్యలను క్రమశిక్షణ కమిటీల ద్వారా విచారించి, కారణాలను అన్వేషించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. డబ్బు వసూళ్లకు పాల్పడ్డారా? నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని డిశ్చార్జయిన రోగి చిరునామా ఆధారంగా సంబంధిత ఏఎన్ఎంకు యాప్ ద్వారా వివరాలు వెళతాయి. చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిపై ఏఎన్ఎం ఆరా తీసి.. యాప్లో రూపొందించిన పలు ప్రశ్నలపై సమాధానాలు రాబడతారు. చికిత్స కోసం నెట్వర్క్ ఆస్పత్రికి వెళ్లినప్పుడు డబ్బు డిమాండ్ చేశారా? వైద్య సేవలు, సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యమిత్ర సహకారం ఎలా ఉంది? మందులు ఉచితంగా ఇచ్చారా? లేదా? తదితర ప్రశ్నలకు సమాధానం రాబడతారు. ఇలా సేకరించిన అభిప్రాయాన్ని యాప్లో నమోదు చేస్తారు. రోగులు ఎవరైనా సమస్యలు తెలియజేసినట్లయితే.. సంబంధిత జిల్లా కో–ఆర్డినేటర్ల లాగిన్కు వెళతాయి. కో–ఆర్డినేటర్ విచారణ చేపట్టి కారణాలను అన్వేషించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడిన సందర్భాల్లో రూ. 20 వేలలోపు డబ్బు వసూళ్ల ఆరోపణల్లో జిల్లా స్థాయిలో, ఆపైన వసూళ్ల కేసులను రాష్ట్ర స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజల ఆరోగ్యాలకు సీఎం జగన్ ప్రభుత్వం భరోసాగా ఉంటోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1,059 ప్రొసీజర్లు ఈ పథకంలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 3,257కు పెంచారు. 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు నాటికి 46.12 లక్షల మందికి ఉచితంగా వైద్యం అందించారు. ఏకంగా రూ. 9,193.61 కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమం కింద ఆర్థికంగా చేయూత ఇస్తున్నారు. ఇలా రూ. వెయ్యి కోట్లకుపైగా ప్రభుత్వం రోగులకు సాయం చేసింది. 104కు ఫిర్యాదు చేయవచ్చు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు ఈ పథకం కింద పూర్తి ఉచితంగా అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు చర్యలు చేపడుతున్నాం. రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టి అవకతవకలకు పాల్పడిన ఆస్పత్రులపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రజలు 104కు ఫిర్యాదు చేయవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జవాబుదారీతనం పెరుగుతుంది చికిత్స అనంతరం రోగుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుంటుంది. ఇది మంచి పరిణామం. ఈ తరహా విధానాలతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రోగులకు ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, ఏపీ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు -
ప్రజలందరికీ ఆరోగ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించాలన్న సత్సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం శాసన సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ.. తొలి రెండు దశల్లో 1.60 కోట్ల కుటుంబాలకు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. బ్రోచర్ల ద్వారా వైద్యసేవలు పొందే విధానాన్ని వివరిస్తామన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అందించే వైద్య సేవలను వివరించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారన్నారు. బాధితులను గుర్తించిన అనంతరం ఇంటి వద్దే స్పెషలిస్టు వైద్యులతో చికిత్స అందించనున్నట్లు తెలిపారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద రూ.9 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారన్నారు. ఒకప్పుడు 919 ఉండే నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,283కు పెంచారని తెలిపారు. ఇందులో 204 ఆస్పత్రులతో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోనూ అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. క్యాన్సర్ వైద్యంలో 638 ప్రొసీజర్స్ను చేర్చడంతో పాటు రూ.600 కోట్లు ఖర్చు చేశామన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో రోగులను ఇబ్బంది పెట్టినా, డబ్బులు వసూలు చేసినా 104కు ఫిర్యాదు చేస్తే ఆ హాస్పిటల్స్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు: ప్రభుత్వ విప్ కొరముట్ల అనంతరం ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. అందుకే పీహెచ్సీలు, వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 300కు పైగా ఓపీలు నమోదవడంతో పాటు గుండె, క్యాన్సర్ వంటి వ్యాధులకు వైద్యం ఉచితంగా అందుతోందని, ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. బద్వేల్ సీహెచ్సీలో ఆర్థోపెడిక్ సర్జన్ పోస్టు మంజూరు చేయాలని, ఎక్సరే యూనిట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సుధ కోరారు. సీఎస్ఆర్ కింద పూర్తయిన డయాలసిస్ యూనిట్ భవనాన్ని ప్రభుత్వం తీసుకుని వెంటనే వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో బలోపేతం చేసిందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి తెలిపారు. ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాన్ని చేరువ చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 1059 ప్రొసీజర్లు ఉంటే ఈ ప్రభుత్వం 3,257కు పెంచిందన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే జగన్మోహనరావు నెట్వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ప్రొసీజర్స్కు ఆరోగ్యశ్రీపై వైద్యం చేయట్లేదని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ కింద దరఖాస్తు చేసుకుంటే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో ఉండటంతో సహాయ నిధిని విడుదల చేయట్లేదని తెలిపారు. ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రుల్లో సదుపాయాలపై తనిఖీలు చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో నెట్వర్క్ ఆస్పత్రుల వివరాలు, అక్కడ లభించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన కల్పించేలా దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే తిప్పేస్వామి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా, డిశ్చార్జి తర్వాత ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చి, స్థానిక ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. అయితే, కొన్ని నెట్వర్క్ ఆస్పత్రులు రోగుల దగ్గర, ఆరోగ్యశ్రీలోనూ రెండు రకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. 108లను కర్ణాటకకూ నడపండి: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రజలు వైద్యం కోసం 150 కిలోమీటర్ల దూరంలోని అనంతపురానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమీపంలోనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలోనూ నెట్వర్క్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరారు. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర సమయాల్లో 108 అంబులెన్సులు కర్నాటకకు తీసుకెళ్లడంలేదని, ఇకపై 108లను కర్ణాటకకు కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిని వేగంగా పూర్తి చేయాలని కోరారు. -
పల్లెల్లోనూ స్పెషలిస్ట్ డాక్టర్ల సేవలు
ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో వినూత్న విధానాలతో ముందడుగు వేస్తున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లోని ‘ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, వైద్య సేవలు’ అన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని అత్యంత పత్రిష్ఠాత్మకంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ దిశగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగించి వారి ఆరోగ్య అవసరాలను గుర్తించి పరిష్కరించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఆరోగ్య శిబిరం సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధి బాధితులు, గర్భిణులు, బాలింతలు, నియో నేటల్, శిశువులు. బాలలు వంటి వారికి ఈ కార్యక్రమంలో వైద్య సేవలందిస్తారు. ప్రభుత్వం ‘ఫ్యామిలీ డాక్టర్’ వంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికీ వైద్య సేవలందిస్తున్నది. ఇప్పుడు ప్రత్యేక వైద్య శిబిరాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందు బాటులోకి తెచ్చి గ్రామీణ పేదలకు మరింత చేరువయ్యేందుకు ఈ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను వారి ముంగిట్లోనే గుర్తించటం మాత్రమే కాక వారికి సరైన వైద్య సలహాలు, చికిత్స అందే విధంగా చర్యలు తీసుకోవటం, అవసరమైన కేసులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేయటం వంటి చర్యలు తీసుకుంటారు. ఈ బాధ్యతలను ఫ్యామిలీ డాక్టర్ విధులు నిర్వహించే వైద్య నిపుణులతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ), ఏఎన్ఎంలకు అప్పగించారు. వారు పేషెంట్లకు తగిన కన్సల్టెన్సీ సేవల ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందిస్తారు. అలాగే వారి అవసరాలకు తగిన మందులను కూడా అందచేస్తారు. మొత్తం 162 రకాల మందులు. 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతున్నారు. స్పెషలిస్టు డాక్టర్ల సూచనల మేరకు ఇతర మందుల్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. సెప్టెంబర్ 30న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు 45 రోజుల పాటు కొనసాగి నవంబర్ 15 నాటికి ముగుస్తాయి. శిబిరాలలో ఏడు రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన టెస్ట్ కిట్లు, అవసరమైన పరిమాణంలో ఔషధాలు అందుబాటులో ఉంటాయి. ఈ వైద్య శిబిరాలలో సేవలందించేందుకు ఆసక్తి కలిగిన డాక్టర్ల అసోసియేషన్లు, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో ఏఎన్ఎం/సీహెచ్ఏలు క్షేత్రస్థాయి సంద ర్శనలు ప్రారంభించారు. ఇంటింటి సర్వేలో ఇప్పటి వరకూ దాదాపు 38 లక్షల ఇళ్లలో వ్యక్తుల ఆరోగ్య వివరాలను సేకరించారు. ఈ నెల 19వ తేదీ వరకూ వివిధరకాల వ్యాధుల నిర్ధారణ కోసం దాదాపు 29 లక్షల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన మందుల్ని కూడా ఉచితంగా ఇవ్వడంతో పాటు తర్వాత వారు పూర్తిగా నయమయ్యే వరకూ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లతో అనుసంధానం చేస్తామని సీఎం ప్రకటించారు. – కల్లి వెంకట రమణమూర్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ -
మందులకు భారీగా వ్యయం
సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది. విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రూపంలో మినీసైజ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్ మేరకు విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. -
ఏపీలో వైద్య సేవలు అమోఘం
తాడేపల్లిరూరల్: ఏపీలోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని నేషనల్ హెల్త్ రీసోర్స్ సెంటర్ నుంచి వచ్చిన బృంద సభ్యులు డాక్టర్ ఎస్.వినోద్కుమార్, మొహమ్మద్ షేక్లు కితాబిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్ డ్రైవర్ కాలనీలో బుధవారం డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ను వారు సందర్శించారు. వైద్యశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను వివరించేందుకు ఒక స్టాల్ను ఏర్పాటు చేశారు. ముందుగా గర్భిణులకు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని, పోషక విలువలను అడిగి తెలుసుకుని.. చాలా అమోఘంగా ఉందని ప్రశంసించారు. అనంతరం వైద్యశాలలో కుష్టు వ్యాధికి, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు అందిస్తున్న చికిత్సతో పాటు, రోగులకు ఇస్తున్న కౌన్సెలింగ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు చాలా బాగున్నాయన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అన్ని వసతులను ఏర్పాటు చేశారని కొనియాడారు. ప్రతి ఆస్పత్రిలో ఇన్పేషెంట్ సౌకర్యం కూడా కల్పించారని, అన్ని రకాల రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఉప ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మన్మోహన్, తాడేపల్లి ప్రభుత్వ వైద్యులు డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యుడు డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ఆస్పత్రులను ఆధునీకరించి, వైద్య సేవలను మెరుగు పరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో వైద్య సేవలను ప్రజల ముంగిటకే చేర్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి వాకబు చేసి, ముందస్తుగానే వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య క్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి ప్రభుత్వ సిబ్బంది వాకబు చేస్తారు. ఆ తర్వాత వైద్య శిబిరాల్లో పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తారు. దీని ద్వారా అరోగ్య సమస్యలు మరింత పెద్దవై, చికిత్సకు లొంగని దశకు చేరకుండా ముందుగానే గుర్తించి, వైద్యం అందించి, ఆరోగ్యవంతులుగా చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఈ కార్యక్రమం లక్ష్యం. 5 దశల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి క్యాంపెయిన్ మొదలవుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం తరహాలోనే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమంలో కూడా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రజల ఆరోగ్య సమస్యలు, అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారు. తొలుత వాలంటీర్లు, గృహ సారథులు, ప్రజాప్రతినిధులు వారి పరిధిలోని ఇళ్లను సందర్శించి, ప్రజలందరీకి ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పిస్తారు. తొలి దశ వైద్య శిబిరాలు నిర్వహించే పట్టణాలు/గ్రామాల్లో ముందుగా ఈ క్యాంపెయిన్ మొదలవుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం సేవలను కూడా వివరిస్తారు. అవసరమైన వారు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలను ఏ విధంగా పొందాలో తెలియజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.60 కోట్లకు పైగా గృహాల్లో ఆరోగ్యశ్రీ సేవలను వివరిస్తూ ప్రత్యేక బ్రోచర్ను వాలంటీర్లు అందజేస్తారు. పథకం కింద ఎన్ని రకాల జబ్బులకు చికిత్స అందిస్తారు, వైద్యం అందించే ఆస్పత్రులు, వాటి చిరునామాలు, ఇతర వివరాలు ఉంటాయి. అదే విధంగా స్మార్ట్ ఫోన్లలో ఆరోగ్యశ్రీ సిటిజెన్ యాప్ను డౌన్లోడ్ చేయించి దాని వినియోగంపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో), ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఇంటింటికీ వచ్చి ఆరోగ్యపరమైన అంశాలపై వాకబు చేస్తారు. ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంప్ నిర్వహించే రోజు, ప్రాంతం తెలిపి, ఆరోజున అందుబాటులో ఉండాలని ప్రజలకు చెబుతారు. ఈ నెల 30 నుంచి మొదటి దశ వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్లు) ప్రతి మండలంలో ఏదో ఒక పట్టణం/గ్రామంలో నిర్వహిస్తారు. ఇందులో వైద్యులు, ఇతర సిబ్బంది ప్రజలకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అవసరమైన వారిని సమీపంలోని పెద్ద ఆస్పత్రులకు పంపించి, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తారు. ఆరోగ్య ఏపీ సాధనే లక్ష్యం ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ కార్యక్రమం అమలుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఐదు దశల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. తొలి దశలో క్యాంపెయిన్, రెండో దశలో ప్రజల ఆరోగ్యంపై వాకబు, ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. మూడో దశలో మరో మారు హెల్త్ క్యాంప్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నాలుగో దశలో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఐదో దశలో కాలానుగుణంగా ఫాలోఅప్ సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో గ్రామ, వార్డు సచివాలయాలు, మహిళా, శిశు సంక్షేమ, విద్య, మున్సిపల్, గిరిజన శాఖల బాధ్యతలను ఉత్తర్వుల్లో తెలియజేశారు. -
సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య బీమా భరోసా
దేశీయంగా వయస్సు పైబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పీఆర్బీ గణాంకాల ప్రకారం 2050 నాటికి 14.4 కోట్ల మంది పైచిలుకు సీనియర్ సిటిజన్స్ ఉంటారని అంచనా. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్యానికి, సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబాల్లో కూడా పెద్దవారికి నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ఆరోగ్య బీమా అవసరం ఎంతైనా ఉంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు వారి అవసరాలను దృష్టిలోఉంచుకోవాలి. ఇందుకోసం అయిదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ► వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉండాలి: ఆరోగ్యబీమా పాలసీ కవరేజీ సమగ్రంగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ వెయిటింగ్ పీరియడ్, అలాగే ఎలాంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు కూడా కవరేజీ లభించేలా చూసుకోవాలి. ఉదాహరణకు, మణిపాల్ సిగ్నా అందించే ప్రైమ్ సీనియర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సీనియర్ల విభిన్న ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినది. ఎటువంటి మెడికల్ చెకప్లు అవసరం లేకుండా 91వ రోజు నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ అనారోగ్య పరిస్థితులకు కవరేజీని అందిస్తుంది. ► కో–పే, ఉప–పరిమితులు ఉండొద్దు: కో–పే, ఉప–పరిమితులు ఉండని హెల్త్ ప్లాన్ ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే సబ్–లిమిట్ ఉన్న ప్లాన్ వల్ల మళ్లీ మన జేబుపై భారం పడుతుంది. పాలసీ పరిధిలోకి రాని కొన్ని ఖర్చులను మనమే భరించాల్సి వస్తుంది. ► అపరిమితంగా సమ్ ఇన్సూర్డ్ పునరుద్ధరణ: ఆరోగ్య బీమాలో పరిగణనలోకి తీసుకోతగిన మరో పెద్ద అంశం ఏమిటంటే, సమ్ ఇన్సూర్డ్ను అపరిమితంగా రీస్టోర్ చేసే అవకాశం. ఉదాహరణకు మీరు ఏదైనా నిర్దిష్ట అనారోగ్యానికి సంబంధించిన, లేక దానికి సంబంధించని మరోదాని కోసమైనా కొత్తగా క్లెయిమ్ చేసినప్పుడు, మీ హెల్త్ ప్లాన్ తప్పకుండా సమ్ ఇన్సూర్డ్ 100 శాతం పునరుద్ధరించేటువంటిదై ఉండాలి. ► క్యుములేటివ్ బోనస్: క్లెయిమ్స్ గానీ దాఖలు చేయని పక్షంలో కొన్ని ఆరోగ్య బీమా పాలసీల్లో సమ్ ఇన్సూర్డ్కి ఏటా 10 శాతం మేర క్యుములేటివ్ బోనస్ జతవుతుంటుంది. సమ్ ఇన్సూర్డ్కి 100 శాతం స్థాయికి చేరే వరకు ఈ బోనస్ ఏటా జతవుతూనే ఉంటుంది. ఫలితంగా పదేళ్లలో ఎలాంటి అదనపు ఫీజు లేకుండానే కవరేజీ రెట్టింపవుతుంది. ► ప్రివెంటివ్ చెకప్: తీవ్రమైన అనారోగ్యాలు ఉన్న వయో వృద్ధులు తరచుగా వైద్యులను సంప్రదించాల్సి వస్తుంటుంది. అపాయింట్మెంట్లు లభించడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి బీమా సంస్థల నెట్వర్క్ పరిధిలోని డాక్టర్లు, స్పెషలిస్టులతో అపరిమిత టెలీకన్సల్టేషన్స్ (ఫోన్ లేదా చాట్ ద్వారా) సదుపాయం ఇచ్చే ప్లాన్ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఏటా నగదురహిత హెల్త్ చెకప్ అందించేదిగా కూడా పాలసీ ఉండాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. వివిధ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు, వాటి ఫీచర్లు, వ్యయాలను జాగ్రత్తగా పోల్చి చూసుకోవాలి. సీనియర్ సిటిజన్స్కు శారీరకంగాను, ఆర్థికంగాను ప్రయోజనకరంగా ఉండే సమగ్రమైన ఆరోగ్య బీమా కవరేజీని అందించే పాలసీని ఎంచుకోవాలి. – ప్రియా గిల్భిలే, సీవోవో, మణిపాల్సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ -
ప్రజలందరికీ.. ‘ఆరోగ్య సురక్ష’
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం, ప్రాథమిక పరీక్షలతో ఆరోగ్య సమస్యలను గుర్తించడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్పెషలిస్ట్ డాక్టర్లు, పీహెచ్సీ డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ద్వారా చికిత్సలు, మందులను ఉచితంగా అందించబోతోంది. ఎవరైనా రోగులకు అవసరమైతే ప్రభుత్వాస్పత్రులు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి వైద్య చికిత్సలు చేయించనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆరోగ్య సమస్యలకు ‘స్పెషల్’ చికిత్స.. ప్రజల ఆరోగ్య సమస్యలకు స్థానికంగానే స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా చికిత్స అందించడమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమ ధ్యేయమని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ఈనెల 15 నుంచి గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తారు. ఆరోగ్యశ్రీ కరపత్రాన్ని పంపిణీ చేసి.. సేవలను వివరిస్తారు. ఈనెల 16 నుంచి వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, వైఎస్సార్ అర్బన్ క్లీనిక్ల పరిధిలోని గృహాలను ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓలు) సందర్శిస్తారు. ప్రజలకు ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. ఆ ఫలితాలను డాక్టర్లకు అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారు వైద్య శిబిరాలకు హాజరయ్యేందుకు వీలుగా ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు టోకెన్ నంబర్లు ఇస్తారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది. ప్రతిరోజూ.. ప్రతి మండలంలోనూ ఏదో ఒక వైఎస్సార్ విలేజ్ క్లీనిక్తో పాటు ప్రతి పట్టణంలోనూ ఏదో ఒక వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. నెల రోజుల పాటు ఈ శిబిరాల నిర్వహణ కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద రిఫర్ చేస్తారు. విజయవంతం చేద్దాం: సీఎస్ జవహర్రెడ్డి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణ, ప్రచార సామగ్రి, టెస్టింగ్ కిట్లు, మందులు తదితరాలను అందజేయాలని సూచించారు. ఇంటింటి సర్వే సమయంలో సాధారణ, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, క్షయ, కుష్టు, సంక్రమించని, సంక్రమించే వ్యాధులు, గిరిజన ప్రాంతాల్లో సికిల్సెల్, మలేరియా, డెంగీ తదితరాలతో బాధపడుతున్నవారిపై దృష్టి పెట్టాలన్నారు. శిశువులు, పిల్లలు, గర్భిణులు, బాలింతలు రక్తహీనతకు గురికాకుండా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందజేయాలని సూచించారు. సమావేశంలో ఉన్నతాధికారులు కృష్ణబాబు, ప్రవీణ్ ప్రకాశ్, జయలక్ష్మి, కోటేశ్వరరావు, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ సేవలు: మంత్రి రజిని రాష్ట్ర ప్రజలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం రక్షగా నిలవబోతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఇప్పటికే విప్లవాత్మక సంస్కరణలతో ప్రజారోగ్యానికి అండగా నిలిచిన సీఎం జగన్ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. గురువారం మంగళగిరిలోని వైద్య శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు రాష్ట్రమంతా వైద్య శిబిరాలు నిర్వహించి.. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందిస్తామని తెలిపారు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యమందిస్తామన్నారు. ఈ వైద్య శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.120 కోట్ల మేర ఖర్చు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తహశీల్దార్, ఎంపీడీవో, పీహెచ్సీ వైద్యాధికారులు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి, యూపీహెచ్సీ వైద్యాధికారులు ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు. సమీక్షలో ఉన్నతాధికారులు ఎం.టి.కృష్ణబాబు, నివాస్, మురళీధర్రెడ్డి, హరేంధిరప్రసాద్, డాక్టర్ వెంకటేశ్వర్, డాక్టర్ రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలకలూరిపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ గురించి ఆమె దిశానిర్దేశం చేశారు. -
వైద్యానికి శాశ్వత బలం
-
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
ఆరోగ్య దాత..అభయ ప్రదాత
సాక్షి, అమరావతి: రోడ్లపై కుయ్.. కుయ్మని సౌండ్ చేస్తూ తిరిగే 108 అంబులెన్సు.. ఆరోగ్యశ్రీ పేరు విన్న వెంటనే గుర్తొచ్చేది.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి. 2004కి ముందు బడుగు, బలహీనవర్గాలు, పేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఏవైనా పెద్ద జబ్బుల బారినపడితే ఆస్తులను అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. పెద్ద జబ్బులు వస్తే ప్రాణాలపైన ఆశలు వదులుకోవాల్సిందే. వైద్యం కోసం ఆస్తులు అమ్ముకుని.. అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయి దైన్యంతో నిండిపోయిన కుటుంబాలే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ ఆరోగ్య దాతగా.. అభయ ప్రదాతగా నిలిచారు. పేదలకు సంజీవనిలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రవేశపెట్టి ఎంతోమంది రోగులకు ఆయుష్షు పోశారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే నాణ్యమైన ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో లక్షలాది కుటుంబాలకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దైన్యం.. అప్పుల సుడిగుండంలో చిక్కుకోవాల్సిన బాధలు తప్పాయి. ఆపద్బంధు 108 ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా ప్రమాదాల్లో గాయపడిన వారిని, అనారోగ్యంతో ఉన్నవారిని తక్షణమే ఆస్పత్రికి తరలించేలా 108 వాహనాలను వైఎస్సార్ ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి ఒక 108 అంబులెన్సును కేటాయించారు. అవసరమున్నవారు ఎవరైనా 108కి ఫోన్ చేస్తే నిమిషాల్లోనే వారి వద్దకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడానికి 104 సర్వీసులను ప్రారంభించారు. వైఎస్సార్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని దేశంలో 18 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వివిధ పేర్లతో అమలు చేస్తుండటం విశేషం. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చేపట్టింది. అదే విధంగా 108, 104 సేవలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. కొత్త ఊపిరిలూదిన సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు హయాంలో పడకేసిన ఆరోగ్యశ్రీ సేవలకు కొత్త ఊపిరిలూదారు. 108, 104 పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెట్టడంతోపాటు వీటి సంఖ్యను మరింత పెంచారు. తెల్లరేషన్ కార్డుదారులతో పాటు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ప్రొసీజర్లను 1,059 నుంచి ఏకంగా 3,257కు పెంచారు. అంతేకాకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద శస్త్ర చికిత్సల అనంతరం విశ్రాంత సమయానికి రోగులకు నెలకు రూ.5 వేల వరకు భృతిని కూడా అందిస్తున్నారు. వైద్య విద్య బలోపేతానికి కృషి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య విద్య బలోపేతానికి వైఎస్సార్ చేసిన కృషి అమోఘం. ఆయన సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో కడప, ఒంగోలు, శ్రీకాకుళం, ఆదిలాబాద్ల్లో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లను ఏర్పాటు చేశారు. అలాగే కడపలో దంత వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలోపేతమైంది.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాకే. ఈ క్రమంలో సీఎం జగన్ ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే ఐదు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఐదు వచ్చే ఏడాది, మిగిలిన ఏడు 2025–26 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రానున్నాయి. -
‘ఫ్యామిలీ డాక్టర్’తో పల్లెకు రక్ష
(పమిడివారిపాలెం, పెదపాలెం, కాకుమాను గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్): ‘ఏం తాత.. ఆరోగ్యం ఎలా ఉంది? మందు బిళ్లలు సమయానికి వేసుకుంటున్నావా?’ అని డాక్టర్ అడిగితే.. ‘ఆరోగ్యం బాగానే ఉంది’ అనేలా రెండు చేతులు కదిలిస్తూ సైగల ద్వారా ఆరి నాగేశ్వరరావు సమాధానం ఇచ్చారు. ఇంతలో పక్కనే ఉన్న నాగేశ్వరరావు భార్య విమల మాట్లాడుతూ.. ‘మీరు చెప్పినట్టే మాత్రలు సమయానికి వేస్తున్నాం. రోజులో 3 సార్లు పడుకునే స్థితి (పొజిషన్)లో మార్పులు చేస్తున్నాం’ అని వివరించింది. గుంటూరు జిల్లా కాకుమానుకు చెందిన వృద్ధుడు నాగేశ్వరరావు రెండేళ్లుగా ఆర్థో, న్యూరో సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నాడు. వీటికి తోడు బీపీ సమస్య కూడా ఉంది. వయోభారం, అనారోగ్య సమస్యల రీత్యా మంచానికి పరిమితం అయ్యాడు. దీంతో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకోవడం కోసం వైద్యుడి వద్దకు నాగేశ్వరరావు వెళ్లాలంటే ఈ కుటుంబానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇంటికి కిలోమీటర్కు పైగానే దూరంలో ఉన్న పీహెచ్సీకి వెళ్లడానికి ప్రత్యేకంగా ఓ ఆటో మాట్లాడుకోవాలి. రాను పోను సుమారు రూ.300 అవుతుంది. కదల్లేని స్థితిలో ఉన్న నాగేశ్వరరావును ఆటో ఎక్కించి, ఆస్పత్రిలో చూపించుకునిగి మళ్లీ ఇంటికి చేర్చాలంటే ఇద్దరు వ్యక్తులు కచ్చితంగా తోడుండాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంలో ఈ వ్యయ ప్రయాసలు ఏమీ లేకుండా కాకుమాను పీహెచ్సీ డాక్టర్.. వృద్ధుడైన నాగేశ్వరావు ఇంటికి క్రమం తప్పకుండా వస్తున్నాడు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొలె్రస్టాల్, రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించే మాత్రలు ఇస్తున్నారు. ఈ క్రమంలో నాగేశ్వరావు భార్య విమల మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఆయన్ని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్లం. ఆ రోజు మా పిల్లలు పనులు వదులుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బందులు లేవు. డాక్టరే మా ఇంటికి వస్తున్నారు. మా ఆయన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటోంది. నెల నెలా వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ కూడా ఇచ్చి వెళుతున్నారు. గతంలో ఆయన కిందపడి కాలు విరిగినప్పుడు ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స చేయించి ఆదుకుంది’ అని సంతోషం వ్యక్తం చేసింది. ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానంపై ‘సాక్షి’ గుంటూరు జిల్లాలోని పొన్నూరు, పెదకాకాని, పెదనందిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించగా ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమైంది. గుంటూరుకు వెళ్లే బాధ తప్పింది.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామానికి చెందిన కావూరి శేషగిరిరావుకు 90 ఏళ్లు. ఆయన సతీమణి వెంకాయమ్మకు 70 ఏళ్లుపైనే ఉంటాయి. పిల్లలందరూ వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. వృద్ధులు ఇద్దరే ఉంటారు. వయో భారానికి తోడు శేషగిరిరావుకు బీపీ, షుగర్ ఉన్నాయి. వెంకాయమ్మ గుండెకు కొన్నేళ్ల క్రితం స్టెంట్ వేశారు. దీంతో వీరిద్దరూ క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకుని మందులు వాడాల్సిన పరిస్థితి. ప్రతి నెలా గుంటూరులోని మిలటరీ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ను అందుబాటులోకి తేవడంతో పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని వీరి ఇంటికి వైద్యుడు వచ్చి మందులు ఇచ్చారు. ఈ మందులను తీసుకెళ్లి గుంటూరు మిలటరీ ఆస్పత్రిలో చూపిస్తే తామిచ్చే మందులు కూడా అవే అన్నారు. దీంతో వెంకాయమ్మ దంపతులు గుంటూరుకు వెళ్లడం మానేశారు. క్రమం తప్పకుండా ఫ్యామిలీ డాక్టర్ వీరి ఇంటికి వెళుతున్నారు. వైద్య సేవలు అందిస్తున్నారు. ‘ఒకప్పుడు గుంటూరు మిలటరీ ఆస్పత్రికి పోయి రావడానికి రోజంతా సరిపోయేది. బాగా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంటి దగ్గరకే డాక్టర్ వస్తుండటం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. మాలాంటి ఎందరికో చాలా మంచి చేస్తోంది’ అని వెంకాయమ్మ అభిప్రాయపడింది. ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం వల్ల వృద్ధులు, వ్యాధిగ్రస్తులున్న ఊరు, ఇంటి వద్దకే వెద్యులు వచ్చి సేవలు అందిస్తూ, ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుండటం పట్ల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం జగన్ పుణ్యమా అని ఆస్పత్రుల చుట్టూ తిరిగే అవస్థలు తప్పాయని మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉంటారు. వీరిలో 170 మందికి పైగా బీపీ, షుగర్తో బాధ పడుతున్నారు. వీరితో పాటు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 కి.మీ దూరంలో ఉండే పెదనందిపాడు పీహెచ్సీ, 20 కి.మీకు పైగా దూరంలో ఉండే ప్రత్తిపాడు సీహెచ్సీ, పొన్నూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. ఇంట్లో మోటార్ సైకిల్ ఉంటే పర్వాలేదు. లేదంటే ప్రత్యేకంగా ఆటో మాట్లాడుకుని వెళ్లాల్సిందే. ఒకసారి ఆటోలో ఆస్పత్రికి పోయి రావాలంటే రూ.500 పైనే ఖర్చవుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఈ వ్యయ, ప్రయాసలకు ఫుల్స్టాప్ పడింది. ఈ విధానంలో పెదనందిపాడు పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా క్రమం తప్పకుండా నాలుగో శుక్రవారం గ్రామానికి వస్తున్నారు. రోజంతా గ్రామంలో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితం అయిన వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. మరోవైపు పక్కనే మూడు కి.మీ దూరంలో ఉన్న పుసులూరు గ్రామంలో ప్రభుత్వం వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. తొలగిన ఆర్థిక భారం.. ఇబ్బందులు.. ఫ్యామిలీ డాక్టర్తో రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రజలు ప్రాథమిక వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి రావడానికి అయ్యే రవాణా వ్యయం రూ.కోట్లలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఆరి్థక భారం, ఇతర ఇబ్బందులకు విముక్తి లభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్ క్లినిక్ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 105 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తోంది. పీహెచ్సీ డాక్టర్ ప్రతి నెలా గ్రామాలకే వెళుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవుట్ పేషెంట్(ఓపీ) క్లినిక్ నిర్వహించి, ఆ తర్వాత మంచానికి పరిమితం అయిన వారికి వైద్య సేవలు అందించడానికి గృహాలు సందర్శిస్తున్నారు అదే విధంగా అంగన్వాడీలు, పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.04 కోట్ల మందికి వైద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్రన్ గత ఏడాది అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఏప్రిల్లో అందుబాటులోకి వచ్చింది. కాగా గత ఏడాది అక్టోబర్ 21 నుంచి ఇప్పటి వరకు పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్ పరిధిలో 1,82,459 సార్లు సందర్శించారు. 2,10,75,065 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధ పడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ ► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ఇవీ 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్ ► హిమోగ్లోబిన్ టెస్ట్ ► ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (షుగర్) ► మలేరియా టెస్ట్ ► హెచ్ఐవీ నిర్ధారణ ► డెంగ్యూ టెస్ట్ ► మలీ్టపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్) ► అయోడిన్ టెస్ట్ ► వాటర్ టెస్టింగ్ ► హెపటైటిస్ బి నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ ► సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్ ► విజువల్ ఇన్స్పెక్షన్ ► స్పుటమ్ (ఏఎఫ్బీ) ‘ఫ్యామిలీ డాక్టర్’ కోసం ప్రభుత్వ చర్యలు ఇలా.. ► మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1,142 పీహెచ్సీలకు అదనంగా 88 కొత్త పీహెచ్సీల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ప్రతి పీహెచ్సీలో తప్పనిసరిగా ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన భవనాలు నిర్మాణంలో ఉంటుండగానే కార్యక్రమం అమలు కోసం వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. ► మరోవైపు మండలంలో ఒక పీహెచ్సీ, సీహెచ్సీ ఉన్న చోట 63 చోట్ల వైద్యులను నియమించి వారిని సీహెచ్సీలో కో లొకేట్ చేసి సేవలు అందిస్తున్నారు. ఎవరైనా వైద్యులు సెలవు పెడితే కార్యక్రమానికి ఇబ్బంది రాకుండా పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు. ► 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)తో పాటు వైద్యులు గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలలో రెండుసార్లు సందర్శించడానికి వీలుగా అప్పటికే ఉన్న 676 ఎంఎంయూ వాహనాలకు అదనంగా 260 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ► అన్ని విలేజ్ క్లినిక్స్లో 105 రకాల మందులను అందుబాటులో ఉంచారు. ► ఎన్సీడీ సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేపట్టింది. వీరిలో గుర్తించిన బీపీ, షుగర్, ఇతర సమస్యల బాధితులను ఫ్యామిలీ డాక్టర్తో అనుసంధానించారు. వారికి నిరంతర ఫాలో అప్ సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద సమస్య అయితే తప్ప ఊరు దాటం 15 ఏళ్లుగా బీపీ, షుగర్ సమస్యలున్నాయి. గతంలో రెగ్యులర్ చెకప్ కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేవాడిని. ప్రతి నెలా వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండేది. కొన్ని సందర్భాల్లో చెకప్కు వెళ్లడం మానేసి మందులు మాత్రం వాడేవాన్ని. అలా నిర్లక్ష్యం చేయడంతో కొన్నిసార్లు ఇబ్బంది అయింది. ప్రభుత్వం కొద్ది నెలల నుంచి డాక్టర్ను గ్రామానికే పంపుతోంది. దీంతో గ్రామంలోనే వైద్యం అందుతోంది. డాక్టర్ గ్రామానికి వచ్చే ముందు రోజు మైక్లో ప్రకటిస్తారు. ఇప్పుడు చాలా పెద్ద సమస్య అయితేనే మా ఊరి వాళ్లు పొన్నూరు, గుంటూరు వెళుతున్నారు. – పారి జలందర్, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా చాలా ఆనందంగా ఉంది రెండేళ్లుగా బీపీ సమస్య ఉంది. దీంతో మందులు వాడుతూ, క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు. మా ఊళ్లోనే ప్రభుత్వం విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఇక్కడే పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. పొన్నూరు నుంచి ప్రభుత్వ డాక్టర్ కూడా క్లినిక్కు వస్తారు. ముందు రోజు ఆశ, ఏఎన్ఎం సమాచారం ఇస్తారు. బీపీ స్థాయిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తున్నారు. మందులు బాగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ వ్యవస్థను తేకపోయినట్లైతే పొన్నూరుకు పోవాల్సి వచ్చేది. దీంతో రాను, పోను ఆటో చార్జీల రూపంలో అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి ఉండేది. ఇప్పుడా సమస్య లేదు. – రత్నకుమారి, పెదపాలెం, గుంటూరు జిల్లా చాలా మంచి పని చేశారు రెండేళ్ల నుంచి బీపీ, షుగర్తో బాధ పడుతున్నాను. నెలనెలా చెకప్లు చేయించుకోవాలి. రోజూ మందులు వేసుకోవాలి. వైద్యం కోసం పొన్నూరు, గుంటూరుకు వెళ్లేదాన్ని. నన్ను చెకప్కు తీసుకుని వెళ్లడానికి మా ఇంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఊర్లోనే మందులు ఇస్తున్నారు. టెస్ట్లు చేస్తున్నారు. డాక్టర్ కూడా మా ఊరికే వస్తున్నారు. ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. ఈ విధానం లేకుంటే మా ఇబ్బందులు వర్ణాతీతం. – ముప్పలనేని సుబ్బాయమ్మ, పమిడివారిపాలెం, గుంటూరు జిల్లా మంచి కార్యక్రమం మన దేశంలో ఇప్పటి వరకు గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఏఎన్ఎం, ఆశ, ఎంఎల్హెచ్పీ వ్యవస్థ మాత్రమే ఉంది. గ్రామ స్థాయిలోనే వైద్యులు నేరుగా ప్రజలకు సంరక్షణ అందించే వ్యవస్థ లేదు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా డాక్టర్లను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లి ప్రజలకు సేవలు అందించడం మంచి నిర్ణయం. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రాథమిక వైద్య సేవలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. వివిధ జబ్బులు, అనారోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, ఆ దశలోనే రోగికి సరైన వైద్య సేవలు అందించడం కీలకం. ఈ నేపథ్యంలో వైద్యులు క్రమం తప్పకుండా గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మమేకం అవ్వడంతో చాలా వరకు జబ్బులు, సమస్యలు ప్రారంభ దశలోనే బయటపడతాయి. దీనికి తోడు బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసిజెస్తో బాధపడే వారికి నిరంతర ఫాలోఅప్ సేవలు అందుతాయి. తద్వారా భవిష్యత్లో వారు గుండె, కిడ్నీ, మెదడు సంబంధిత పెద్ద జబ్బులు ఎదుర్కోకుండా కాపాడటానికి వీలుంటుంది. ప్రజలపై ఆరి్థక భారం పడదు. – డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటున్నాం ఫ్యామిలీ డాక్టర్ సేవల పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలను తెలుసుకుంటున్నాం. ఇందుకోసం బోధనాస్పత్రుల్లోని ఎస్పీఎం విభాగాన్ని కార్యక్రమంలో భాగస్వామిని చేశాం. ప్రతి జిల్లాలో ర్యాండమ్గా ఒకటి రెండు గ్రామాలను ఎంపిక చేసి ఫ్యామిలీ డాక్టర్ సేవలు పొందిన వారి నుంచి వైద్య విద్యార్థులు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సేవలు పొందిన వారిలో అత్యధికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్కు కారణాలు అన్వేషించి, పరిష్కరిస్తున్నాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ -
ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలు.. డాక్టర్ ‘ఏపీ’!..
సాక్షి, అమరావతి: తమ పిల్లలను డాక్టర్లుగా చూడాలని కోరుకుంటున్న వారి కలలు సాకారం కావడంతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కావడంతో పేదలకు ఆరోగ్య భరోసా చేకూరుతోంది. వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో ఈ ఏడాది నుంచి ఒకేసారి 5 కొత్త వైద్య కళాశాలలను సీఎం జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తోంది. దీంతో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రావడంతో మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం కొత్త మెడికల్ కాలేజీల్లో 2023–24 ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లన్నీ భర్తీ అయ్యాయి. రెండు మూడు రోజుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కేటాయింపు కూడా పూర్తి కానుంది. రిజర్వేషన్ వర్గాలకు భారీ మేలు కొత్తగా ప్రారంభిస్తున్న వైద్య కళాశాలల్లో ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లలో 50 శాతం కన్వీనర్ కోటాకు కేటాయించారు. గతేడాది వరకూ ప్రభుత్వ రంగంలోని 12, 18 మైనారిటీ, ప్రైవేట్ కళాశాలల్లో 3,360 కన్వీనర్ కోటా సీట్లు ఉండేవి. ఈ ఏడాది ఐదు కొత్త కళాశాలల ఏర్పాటుతో ఒక్కో చోట 64 చొప్పున 320 సీట్లు కన్వీనర్ కోటాలో అదనంగా వచ్చి చేరాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మెరిట్ విద్యార్థులకు భారీ మేలు చేకూరింది. వలసలకు తెర వైద్య విద్య డిమాండ్కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో కజకిస్తాన్, ఉక్రెయిన్, చైనా, రష్యా తదితర దేశాలకు మన విద్యార్థులు వలస వెళుతున్నారు. వీటిని అరికట్టడంతోపాటు ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు సీఎం జగన్ రూ.8,480 కోట్ల వ్యయంతో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలు నెలకొల్పుతున్నారు. ఈ ఏడాది ఐదు కొత్త వైద్య కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. వచ్చే విద్యా సంవత్సరం మరో ఐదు, ఆ తర్వాత ఏడాది మిగిలిన ఏడు వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. మొత్తం 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా ఏకంగా 2,550 సీట్లు అదనంగా పెరగనున్నాయి. వైద్య విద్య సీట్ల పెరుగుదలతో మన దగ్గర డాక్టర్ చదువులకు అవకాశాలు విస్తృతమై వలసలకు తెర పడనుంది. అన్ని వసతులతో తొలి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థుల అకడమిక్ కార్యకలాపాల కోసం కొత్త ఆస్పత్రుల్లో అన్ని వసతులను కల్పించారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రి, కళాశాలలను అభివృద్ధి చేశారు. ఐదు చోట్ల ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసిన ప్రభుత్వం వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాలను పూర్తి స్థాయిలో సమకూర్చింది. కళాశాలల్లో హైఎండ్ ఏవీ సదుపాయంతో లెక్చర్ గ్యాలరీలు, 3 వేల పుస్తకాలు, ఆన్లైన్, ఆఫ్లైన్ మెడికల్ జర్నల్స్ సేకరణతో సెంట్రల్ లైబ్రరీ, రీడింగ్ ఏరియా, అత్యాధునిక పరికరాలతో ల్యా»ొరేటరీలు, టీచింగ్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. హ్యూమన్ అనాటమీ, క్లినికల్ ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ/హెమటాలజీ, సెంట్రల్ ల్యాబొరేటరీ, స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ ల్యాబ్లలో అన్ని వనరులు సమకూర్చారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు హాస్టళ్లు సిద్ధం చేశారు. భవిష్యత్ తరాలకు బలమైన పునాదులు ఏ దేశం, రాష్ట్రం అభివృద్ధికైనా విద్య, వైద్య రంగాలు గట్టి పునాదులు. యూరప్తోపాటు చైనా, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, క్యూబా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు అనేక రంగాల్లో ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం ఈ రెండు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడమే. దూరదృష్టితో సీఎం జగన్ రేపటి తరాల భవిత కోసం విద్య, వైద్య రంగాలను బలోపేతం వేస్తున్నారు. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నో ప్రయోజనాలు.. ఇన్నాళ్లూ ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు వచ్చినా ఫీజుల భారాన్ని భరించలేక ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. అక్కడ కోర్సు పూర్తి చేయడానికి ఐదేళ్లు పడుతోంది. ఇక ఎన్ఎంసీ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులై హౌస్ సర్జన్ పూర్తి చేసే క్రమంలో రెండు మూడేళ్లు వృథా అవుతోంది. అంతేకాకుండా అక్కడ చదివితే పీజీ ప్రవేశాల్లో నాన్–లోకల్గా పరిగణిస్తున్నారు. ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మన విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వ రంగంలోనే కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు కావడం శుభ పరిణామం. ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో పలు ప్రయోజనాలుంటాయి. బోధనాస్పత్రుల్లో అపారమైన క్లినికల్ మెటీరియల్, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉంటారు. – డాక్టర్ బాబ్జీ, వైస్ చాన్సలర్, డా. వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్లినికల్ స్కిల్స్ పెరుగుతాయి.. ప్రైవేట్ కళాశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా కొత్త వైద్య కళాశాలల్లో ఎంతో మెరుగైన సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. 25 ఏళ్లకుపైగా అనుభవం కలిగిన ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కళాశాలలు, ఆస్పత్రుల్లో నియమించారు. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వనరులున్నాయి. దశాబ్దాలుగా సేవలందిస్తున్న జిల్లా ఆస్పత్రులనే బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశాం. దీంతో ఐపీ, ఓపీ, ఇతర సేవలు మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఈ తరహా ఆస్పత్రులకు అనుసంధానమైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదవడం విద్యార్థులకు ఎంతో మంచిది. విద్యార్థుల్లో క్లినికల్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. ఇది వారి భవిష్యత్కు ఎంతో మేలు చేస్తుంది. – డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, చైర్మన్, ఏపీఎంఎస్ఐడీసీ త్వరలో తరగతులు ప్రారంభం ప్రస్తుతం కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో తరగతులు ప్రారంభిస్తాం. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త వైద్య కళాశాలలను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. – డాక్టర్ నరసింహం, డీఎంఈ -
ఓర్వలేకే అనారోగ్యపు రాతలు!
సాక్షి, అమరావతి: పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని సామెత. అలాంటి పరిస్థితే ఈనాడు అధిపతి రామోజీరావుకు దాపురించింది. ఒకప్పుడు అస్థవ్యస్థంగా ఉన్న ప్రజారోగ్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో కుదుటపడుతుంటే.. ఈ కామెర్ల రోగి కుంటి సాకులు వెతుకుతున్నారు. దేశ వ్యాప్తంగా ఏపీ 108 సౌండ్ గురించి చర్చిస్తుంటే.. రాజగురువుకు భయమేస్తున్నట్లుంది. అందుకే ‘వైద్య సేవల మెరుగు ఉత్తదే’ అంటూ ఉత్తుత్తి కథనం అచ్చేశారు. రాష్ట్రంలో 108 వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్ క్లినిక్స్ 104లు 936, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ కింద 500 వాహనాలు సేవలందిస్తున్నాయి. మొత్తం 2,204 వాహనాల ద్వారా ప్రజల ప్రాణాలను అత్యంత వేగంగా కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇదే రామోజీ కడుపుమంటకు అసలు కారణం. ఇప్పుడు మండలానికి ఒక అంబులెన్సు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి 108 అంబులెన్సుల సంఖ్య 531. అవి కూడా నిర్వహణ సక్రమంగా లేక మూలనపడి మూలుగుతున్నాయి. 336 వాహనాలు అరకొరగా రోడ్లపై కనిపించేవి. అంటే అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని దుస్థితి. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం జగన్ 2020 జూలై1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందు కోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చు చేశారు. కరోనా సమయంలో ఈ వాహనాలు ప్రజల ప్రాణాలు కాపాడాయి. 2022 అక్టోబర్లో అదనంగా మరో 20 108 అంబులెన్సులను గిరిజన ప్రాంతాల్లో చేర్చారు. వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. 2.5 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రభుత్వం ఈ ఏడాది కొనుగోలు చేసింది. దీని కోసం రూ.34.79 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి నెలా 108 అంబులెన్సుల నిర్వహణ కోసం రూ.14.39 కోట్లు వెచ్చిస్తోంది. అంటే ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు ఖర్చు చేస్తోంది. కానీ కళ్లకు గంతలు, చెవుల్లో దూది పెట్టుకున్నరామోజీకి ఇవేవీ కనిపించడం లేదు. వినిపించడం లేదు. 108లు నాడు–నేడు.. గతంతో పోలిస్తే అంబులెన్సులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చే సమయం బాగా తగ్గింది. వీటికి తోడు ఇపుడు నియోనాటల్ అంబులెన్సులు పెట్టడంతో నవజాత శిశు మరణాల రేటు తగ్గింది. అప్పట్లో 86 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఉంటే వాటి సంఖ్య ఇప్పుడు 216కు పెరిగింది. గతంలో కొన్ని కేసులకు మాత్రమే ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ) సూచించేవారు. ఇప్పుడు ప్రత్యేక ఫిజీషియన్ ద్వారా ఈఆర్సీ కేసులు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. అన్ని అంబులెన్స్లలోనూ అడ్వాన్స్డ్ వెహికల్ లొకేషన్ సిస్టమ్స్ను పెట్టారు. గతంలో మొబైల్ డేటా టెర్మినల్ లేదు. ఇçప్పుడు అన్ని అంబులెన్స్ల్లో అమర్చారు. సగటున 108 అంబులెన్సులు రోజుకు 3,809 కేసుల్లో సేవలందిస్తున్నాయి. 2020 జూలై నుంచి 2023 జూన్ వరకు 33,35,670 మందికి అత్యవసర సేవలు అందించాయి. పట్టణ ప్రాంతాల్లో అంబులెన్సుకు ఫోన్ చేస్తే చేరే నిర్దేశిత సమయం 15 నిమిషాలుగా ఉంది. ఈ జూలై నాటికి అది 14.17 నిమిషాలకు తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 20 నిమిషాలు నిర్దేశిత సమయం కాగా ఇపుడు 17 నిమిషాల్లోనే చేరుకుంటున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గతంలో 30 నిమిషాలుగా ఉంటే ఇపుడు అది 17–23 నిమిషాలకు తగ్గింది. తల్లీబిడ్డలు క్షేమంగా! గతంలో కేవలం 279 తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్లు ఉంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పేరిట గతంలో ఓమ్ని వాహనాలను వినియోగించేవారు. ఒకే వాహనంలో ఒకరికంటే ఎక్కువమంది గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం విశాలమైన ఎకో మోడల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఒక వాహనంలో ఒక గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. 2022 ఏప్రిల్ నెల నుండి ఈ ఏడాది జూన్ చివరి నాటికి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలలో మొత్తం 3,47,245 ప్రసవాలు జరగగా, అందులో 2,89,307 మంది బాలింతలను (83.3శాతం) ప్రసవానంతరం సురక్షితంగా వారి ఇళ్ళకు తరలించారు. ఇందుకు ఒక్కో మహిళకు రూ.895 చొప్పున మొత్తం రూ.24,32,35,045లను ప్రభుత్వం ఖర్చు చేసింది. మారిన 104ల స్వరూపం ప్రస్తుత ప్రభుత్వంలో 104 సర్వీసులు పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 వాహనాలను (104లను) సీఎం జగన్ ప్రారంభించారు. తర్వాత మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవలకోసం కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయడానికి వీలుగా అదనంగా 260 వాహనాలను (104లను) ప్రవేశపెట్టారు. మొత్తంగా 910 మొబైల్ క్లినిక్ యూనిట్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా జూలై 2022 నుంచి మే 2023 వరకూ 2,84,81,484 మంది రోగులు సేవలందుకున్నారు. ప్రతి రోజూ ఒక వాహనం ద్వారా గత ఏడాది 42 మంది సగటున సేవలు అందుకుంటే.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం వల్ల ఆ సంఖ్య 75 మందికి పెరిగింది. ప్రభుత్వ వైద్యులు 15,50,783 కుటుంబాల దగ్గరకు వెళ్లి ఈ మొబైల్ యూనిట్ల ద్వారా సేవలందించారు. 12,39, 984 మంది గిరిజనులు ఈ మొబైల్ క్లినిక్స్ ద్వారా ఆరోగ్య సేవలు అందుకున్నారు. ఏడాదికి 108, 104 నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.334.72 కోట్లు వెచ్చిస్తోంది. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం ► వైద్యారోగ్య రంగంలో రాష్ట్రప్రభుత్వం దాదాపు 50వేల పోస్టులను భర్తీ చేసింది. ► నాడు – నేడు ద్వారా సుమారు రూ. 16,800 కోట్లు ఖర్చు చేస్తోంది. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్యకళాశాలల్లో సమూల మార్పులు తీసుకువచ్చింది. ► కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, మూడు క్యాన్సర్, ఒక కిడ్నీ ఆస్పత్రి, ఐటీడీఏ పరిధిలో 5 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు నిర్మిస్తోంది. ► ప్రతి సచివాలయంలో విలేజ్ అర్బన్ క్లినిక్ ను పెట్టింది. ► మంచి ప్రమాణాలున్న మందులనే అందిస్తోంది. ► 2019 నాటికి ఆరోగ్యశ్రీలో చికిత్సలు వేయి ఉంటే వాటిని 3,255కి పెంచింది. ► చికిత్స తర్వాత రోగి కోలుకునేంత వరకూ అండగా నిలుస్తూ వైఎస్సార్ ఆరోగ్య ఆసరా అందిస్తోంది. దేశంలో అగ్రస్థానంలో ఏపీ 25 కోట్లకుపైగా జనం ఉన్న ఉత్తరప్రదేశ్లో 988 అంబులెన్సులు సేవలందిస్తుండగా అంతకంటే ఐదు రెట్లు తక్కువ జనాభా కలిగిన ఏపీలో 768 అంబులెన్సులు సేవల్లో ఉన్నాయి. ఏపీ కంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో చాలా తక్కువ సంఖ్యలో అంబులెన్సులు ఉండటం గమనార్హం. ఏపీలో సగటున 64,306 మందికి ఒక అంబులెన్సు ఉంది. తెలంగాణలో 75, 524 మందికి, కర్ణాటకలో 85,929 మందికి, యూపీలో 2,00,200 మందికి, గుజరాత్లో 1,15,000 మందికి, అస్సాంలో 1,15,000 మందికి తమిళనాడులో 1,18,000 మందికి ఒక అంబులెన్సు మాత్రమే ఉండటం గమనార్హం.