అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత | ​Rape victim disowned by her family | Sakshi
Sakshi News home page

అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత

Published Sun, Jan 18 2015 4:56 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత - Sakshi

అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత

 తుమకూరు : అత్యాచారానికి గురైన ఓ బాలికను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన మంజునాథ (25), సునీల్ (26), మరో మైనర్ బాలుడు కొద్ది రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. ప్రస్తుతం ఆ బాలిక మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలభవన్‌లో ఆశ్రయం పొందుతోంది. కాగా, ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులకు సహకరించిన సుజాతను విచారిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement