Family members
-
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్ట్లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్లో జగన్పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు. -
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
సునీతా విలియమ్స్కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్తో పాటు అక్క దీనా ఆనంద్ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు.నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె.విలియమ్స్ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్లోని హ్యూస్టన్ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్ మద్దతు ఇస్తాడు. తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.బాల్యం నుంచి ధైర్యం ఎక్కువసునీతా విలియమ్స్ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్ రావత్.సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్ రావత్.మా తరానికి స్ఫూర్తిప్రదాతనేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్ ఆప్షన్స్గా ఎంచుకునే యంగ్ జనరేషన్ తయారైంది. మా తరం అలా తయారైనదే.సైంటిస్ట్గా సునీతా విలియమ్స్ ఒక రోల్మోడల్. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్ ఫీల్డ్లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. – శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ -
ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి!
లాలాపేట (హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులకు నలుగురు సభ్యుల కుటుంబం బలైన విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు, అంతకుముందు తమ ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మోకురాలకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (40), కవితారెడ్డి (35) దంపతులు హబ్సిగూడ మహేశ్వర్నగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీతరెడ్డి (13), ఐదవ తరగతి చదువుతున్న విశ్వంత్రెడ్డి (10) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రశేఖర్రెడ్డి గతంలో నారాయణ కళాశాలలో లెక్చరర్గా పని చేశాడు. గత ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.సోమవారం రాత్రి సమీపంలో ఉండే బంధువులు ఫోన్ చేస్తే దంపతులు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా చంద్రశేఖర్రెడ్డి, కవితారెడ్డి చెరొక గదిలో సీలింగ్ ఫ్యాన్లకు చున్నీతో ఉరి వేసుకుని కన్పించారు. ఓ గదిలో మంచంపై పిల్లలిద్దరూ చనిపోయి కన్పించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఓయూ పోలీసులు, నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీత అబిడ్స్లోని ఫిట్జీ స్కూల్లో, విశ్వంత్ హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నట్లు తెలిసింది. -
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం
-
గృహ హింస కేసుల్లోకి కుటుంబ సభ్యులను లాగొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గృహ హింస కేసులను అత్యంత సున్నితంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు (Supreme Court) అభిప్రాయపడింది. ఈ కేసుల్లో నిర్దిష్ట నేరారో పణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులను లాగడం తగదని పేర్కొంది.వివాహ సంబంధ కేసుల్లో భావోద్వేగాల పాలు ఎక్కువ. ఇలాంటి సమయాల్లో ఫిర్యాదుదారుని పక్షాన నిలబడని, మౌన సాక్షులుగా ఉండే కుటుంబసభ్యులను ఇరికించే ధోరణు లుంటాయని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం పేర్కొంది.నిందితుడి కుటుంబస భ్యులపై విచారణను నిలిపివేస్తూ తీర్పు వెలు వరించింది. గృహ హింస కేసులో ఒక మహిళ తన అత్తింటి వారిపై చేసిన ఆరోప ణలను కొ ట్టివేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వారు సుప్రీంను ఆశ్రయించారు. ఇదీ చదవండి: గౌనును బట్టి గౌరవం లభించదు -
Mahakumbh 2025: కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయంతో..
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది. ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు. ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు -
భార్య బిడ్డలను హత్తుకొని బన్నీ ఎమోషనల్
-
వైఎస్ జగన్ను కలిసిన ప్రేమ్కుమార్ కుటుంబ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, పిల్లలు అభిసాత్విక, అభినయ్ కలిశారు. ప్రేమ్కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్సీపీ లీగల్ టీమ్కు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్కుమార్ను తీసుకువెళ్లిన తీరును వైఎస్ జగన్కు కుటుంబ సభ్యులు వివరించారు. వారికి ధైర్యాన్నిచ్చి, అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రేమ్కుమార్ కుటుంబసభ్యుల వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు.ఇదీ చదవండి: పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ? -
పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయ్
ఖిలా వరంగల్: ‘ నెలల తరబడి డ్యూటీలోనేనా.. వారానికి ఒక్కసారి ఇంటికి పంపరా.. పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయి’ అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డు జంక్షన్లో చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ‘కొత్తగా తీసుకొచ్చే లీవ్ మాన్యువల్తో నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరమై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి ఇచ్చే నాలుగు రోజుల పర్మిషన్ లీవ్ పాత పద్ధతినే కొనసాగించాలి’ అని ఈ సందర్భంగా పల్లవి, నవ్యశ్రీ, అంజలి తదితరులు కోరారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్లో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొస్తున్న లీవ్ మాన్యువల్పై పోలీసు కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా గమనించిన పోలీసులు ఆర్టీఏ జంక్షన్, బెటాలియన్ ప్రధాన గేటు వద్ద భారీగా మోహరించారు. పోలీసుల అంచనాలకు అందకుండా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ కుటుంబాలు వివిధ మార్గాల్లో రంగశాయిపేట జంక్షన్కు చేరుకొని రోడ్డుపై బైఠాయించాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్జోన్ డీసీపీ రవీందర్, టీజీ ఎస్పీ కమాండెంట్ రాంప్రకాశ్, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, సీఐలు వెంకటరత్నం, రమేష్లు మహిళా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పినా పోలీసు కుటుంబాలు ససేమిరా అనడంతో వారిని వ్యానులో ఎక్కించి బెటాలియన్కు తరలించారు. వినతిపత్రం స్వీకరించి సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు కుటుంబాలు పాల్గొన్నాయి. బెటాలియన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని ఉదయాన్నే స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆఫీసులకే పరిమితం చేశారు. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్ను ఎండోమెంట్ లేదా హోల్లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్లో, కన్వర్టబుల్, హోల్లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్పోర్ట్లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
అచ్యుతాపురం ప్రమాదంపై బాధితులు కన్నీటి పర్యంతం
-
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
Hyderabad: సనత్నగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్నగర్లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరు విద్యుత్ షాక్గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్కుమార్ తెలిపారు. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పింఛనుకు సంతానాన్నీ నామినేట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి కిరాతక ఘటనకు పాల్పడ్డాడు. తన తాత, అవ్వ, మామలను ఒకేసారి తుపాకీతో కాల్చి హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓం బ్రహ్మభట్ (23) అనే యువకుడు దిలీప్కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యశ్కుమార్ బ్రహ్మభట్ (38)లను కాల్చి చంపాడు. గుజరాత్ నుంచి వలస వచ్చిన నిందితుడు బంధువులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బంధువులతో అతనికి వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన బ్రహ్మభట్.. వారిని తుపాకీతో కాల్చాడు. దీంతో బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడని వెల్లడించారు. ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు
ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్స్ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్ 20 నుంచి సెపె్టంబర్ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్ కన్సల్టెంట్స్ ఈ వివరాలు విడుదల చేసింది. బీఎఫ్ఎస్ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు. ► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు. ► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు. ► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు. -
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్లోని ఉదయ్పూర్తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్సమంద్, చిత్తోడ్గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్పూర్ జిల్లాలోని వల్లభ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్గఢ్ జిల్లాలోని ప్రతాప్గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్పోర్టు వరకు పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, వరంగల్: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబం స్పష్టం చేసింది. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక అన్న ప్రణయ్ అన్నారు. తమ చెల్లి హాస్టల్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ఫ్రెండ్స్ ఫోన్లతో పాటు వేరే ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేసి ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లి సూసైడ్ చేసుకుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. శివరామ్ను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు. కాగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా.. -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్కాల్కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల కీలక భేటీ
-
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్ను ముందుకు పోనిచ్చారు. -
ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కారుణ్య నియామకం వర్తించదు
సాక్షి, హైదరాబాద్: సర్వీ సులో ఉన్న ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఆయా కేసుల్లో మానిటరీ బెనిఫిట్ కింద కుటుంబ సభ్యులకు నగదు మాత్రమే అందిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగి సర్విసులో ఉండగా సహజ మరణం పొందితేనే కారుణ్య నియామకం (బ్రెడ్ విన్నర్ స్కీం) కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 2008లో జారీ చేసిన సర్క్యులర్ను ఉటంకిస్తూ కొత్త సర్క్యులర్ను జారీ చేసింది. అలాగే స్టాఫ్ బెనెవలెంట్ ట్రస్ట్ (ఎస్బీటీ) పథకం కింద చనిపోయిన ఉద్యోగుల కు అందించే ఎక్స్గ్రేషియాను సైతం సర్విసులో ఉండగా ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు అందించడం సాధ్యం కాదని ఆ సర్క్యులర్లో ఆర్టీసీ పునరుద్ఘాటించింది. ఇవి మినహా ఎస్ఆర్బీఎస్, ఈడీఎల్ఐఎఫ్, ఇతర బెనిఫిట్స్ను సెటిల్మెంట్ రూపంలో అందించనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తున్న తరుణంలో పాత సర్క్యులర్లను కోట్ చేస్తూ ఆర్టీసీ కొత్తగా సర్క్యులర్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాడు అనుమతించి... సాధారణంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో కారుణ్య నియామకానికి వెసులుబాటు ఉంది. ఆర్టీసీలో కూడా అది అమలులో ఉంది. కొన్నేళ్లుగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవటంతోపాటు ఖాళీలు లేవన్న సాకుతో కారుణ్య నియామకాలను సంస్థ పెండింగ్లో పెట్టింది. కానీ ఆ వెసులుబాటు మాత్రం అమలులోనే ఉంది. 2019లో దీర్ఘకాలం ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో కొందరు ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబ సభ్యులకు అప్పట్లో కారుణ్య నియామకాలకు సంస్థ అనుమతించింది. కానీ ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేస్తూ ఆర్టీసీ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం. ఎస్బీటీ పథకం ఉన్నా... ఆర్టీసీ ఉద్యోగులు ఎస్బీటీ పథకం కింద ప్రతినెలా వేతనంలో రూ.100 చొప్పున ఆ పథకం ట్రస్టుకు జమ చేస్తారు. ట్రస్టును ఆర్టీసీనే నిర్వహిస్తుంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందినప్పుడు వారు నెలనెలా చెల్లిస్తూ పోగు చేసిన మొత్తాన్ని వడ్డీతో కలిపి సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసు పూర్తి కాకుండానే మరణిస్తే ఆ మొత్తంతోపాటు రూ. లక్షన్నర ఎక్స్గ్రేషియా కూడా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడం సాధ్యం కాదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇందుకు 1983లో జారీ చేసిన సర్క్యులర్ను కోట్ చేసింది. -
మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
-
గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు గానూ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలను ఈడీ గుర్తించింది. గత ఏడాది నవంబర్లో శ్వేతా ఏజెన్సీస్లో సోదాలు నిర్వహించింది కూడా. ఇక.. చైనాకు గ్రానైట్స్ మెటీరియల్ ఎగుమతి చేయటంలో అక్రమాలు జరిగినట్టు తేల్చింది. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ను అక్రమంగా తరలించినట్లు నిర్ధారించింది. అంతేకాదు.. గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులో సుమారు రూ. 50 కోట్ల వరకు పెండింగ్లో ఉండగా.. కేవలం రూ. 3కోట్లు మాత్రమే చెల్లించింది శ్వేతా ఏజెన్సీస్. మరోవైపు హవాలా మార్గంలో డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. -
కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం... తోలుబొమ్మలం
‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్చరణ్. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు ఆలిఫ్. కోల్కతాకు చెందిన వ్లోగర్ ఆలిఫ్ బొమ్మలు తయారుచేసే కార్మికుల వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. లిక్విడ్ ప్లాస్టిక్ను వివిధ రకాల బొమ్మల మూసలలో పోయడం నుంచి బొమ్మల తలలకు ప్లాస్టిక్ వెంట్రుకలు అతికించడం వరకు రకరకాల దశలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘లైఫ్ ఇన్ ప్లాస్టిక్ నాట్ ఫంటాస్టిక్’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. ‘అందమైన బొమ్మల వెనుక ఇంత కష్టం ఉంటుందా!’ అని చెప్పేలా ఉన్న ఈ వీడియో వైరల్ అయింది. -
సీఎం మమత కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వం ఉద్యోగం!
కోల్కత్తా: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనలో దాదాపు 275 మంది ప్రయాణీకులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఒడిషా రైలు ప్రమాదంలో బెంగాల్కు చెందిన ప్రయాణీకులు ఎక్కువ సంఖ్యలో మరణించడంతో పాటుగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం మమత సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుతం బెంగాల్కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారు. వీరంతా ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక, బాధితుల్లో 33 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారంతా కటక్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే, రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం భువనేశ్వర్, కటక్ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు మమత స్పష్టం చేశారు. ఈ సందర్బంగా సీఎం మమతతో పాటుగా మంత్రులు, సీనియర్ ఉన్నతాధికారులు తనతో పాటుగా వస్తున్నారని తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాలను కలిసి ఎక్స్గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే రైలు ప్రమాదం గురించి మరోసారి స్పందించారు. ఈ ప్రమాదం గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదన్నారు. అలాగే, గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను మమత గుర్తు చేశారు. వీటిపై ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదన్నారు. రైల్వే సేఫ్టీ కమిషన్ సత్వరమే అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, రైలు ప్రమాద ఘటనపై కేంద్రం సీబీఐ విచారణ చేపట్టినట్ట విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఆ దుర్ఘటనలో కీలకంగా మారనున్న లోకోపైలట్ చివరి మాటలు.. -
పావురాల కోసమే తన్నుకున్నారు!
అనంతపురం: పావురాల కోసం బుధవారం రాత్రి బంధువుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు...కొత్తూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ అదే గ్రామానికి చెందిన శివప్ప, హేమంత్, భూపతి బంధువులు. ఇరు కుటుంబాలలో పావురాలు పెంచుకుంటున్నారు. ఇటీవల పావురాలు తారుమారు కావడంతో రోజూ అడ్డపేర్లు పెట్టుకుని తిట్టుకునేవారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని కొట్టుకున్నారు. దీంతో ఓ వర్గంలోని బోయ వెంకటేశులు, గోవిందు, రామకృష్ణ, మరో వర్గంలోని భూపతికి గాయాలయ్యాయి. ఇరువురూ కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సీఎం జగన్ను కలిసిన ‘సిరివెన్నెల’ కుటుంబ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని దిగ్గజ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సతీమణి పద్మావతి, కుమారులు యోగేశ్వరశర్మ, రాజా, కుమార్తె శ్రీలలితాదేవి, సిరివెన్నెల సోదరుడు సీఎస్ శాస్త్రిలు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ను కలిసి సిరివెన్నెల అనారోగ్య సమయంలో చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకోవడం, తమ కుటుంబానికి విశాఖలో ఇంటి స్థలం మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్తో సిరివెన్నెలకు ఉన్న అనుబంధాన్ని సీఎంతో పంచుకున్నారు. సిరివెన్నెల కుటుంబానికి అవసరమైన సాయం చేసేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం జగన్ మరోమారు భరోసానిచ్చారు. చదవండి: తెలుగు నేలపై విరిసిన పద్మాలు -
దారుణం..ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు భీమా నదిలో శవమై కనిపించారు. మృతులు మోహన్ పవార్(45), అతని భార్య సంగీతా మోహన్(40), అతని కుమార్తె రాణి ఫుల్వేర్(24), అల్లుడు శ్యామ్ ఫుల్వేర్(28) వారి ముగ్గురు పిల్లలు(సుమారు 3 నుంచి 7 ఏళ్ల మధ్య)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన జనవరి 18 నుంచి 24 మధ్య పూణేలో దువాండ్ తహసిల్లోని పర్గావ్ వంతెన వద్ద జరిగిందని చెబుతున్నారు. దీంతో పోలీసులు మృతుడు మోహాన వార్ బంధువులైన అశోక్ కళ్యాణ్ పవార్, శ్యామ్ కల్యాణ్ పవార్, శంకర్ కల్యాణ్ పవార్, ప్రకాశ్ కల్యాణ్ పవార్, కాంతాబాయి సర్జేరావ్ జాదవ్ అనే ఐదుగురిని నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో మృతులంతా హత్యకు గురైనట్లు తేలిందిని చెప్పారు పోలీసులు. ఐతే సదరు నిందితుడు అశోక్ పవార్ కుమారుడు ధనుంజయ్ పవార్ కొన్న నెలలు క్రితం ప్రమాదంలో చనిపోయినట్లు పేర్కొన్నారు. దానికి సంబంధించిన కేసు పుణె నగరంలో నమోదైనట్లు చెప్పారు. ఐతే ధనుంజయ్ మరణానికి మోహన్ కారణమని దర్యాప్తులో తేలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశ్యంతో వారందర్నీ కడతేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. పోస్ట్మార్టంలో మృతులంతా నీట మునిగి చనిపోయినట్లు నివేదిక పేర్కొందని చెప్పారు. మృతులంతా ఉస్మానాబాద్ జిల్లాలోని మరఠ్వాడాలోని బీడ్ ప్రాంతానికి చెందిన వారని, వారంతా కూలీ పనులు చేసుకునేవారని తెలిపారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయడమే గాక కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. (చదవండి: లక్నో భవనం కూలిన ఘటన: సమాజ్వాద్ పార్టీ నేత భార్య, తల్లి దుర్మరణం) -
భారతీయులకు కెనడా శుభవార్త
టొరంటో: కెనడాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ వృత్తినిపుణుల కుటుంబసభ్యులకు తీపి కబురు! ఓపెన్ వర్క్ పర్మిట్ (ఓడబ్ల్యూపీ) కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబసభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చు. వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల మంత్రి సీన్ ఫ్రాసర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. వర్క్ పర్మిట్లున్న వారి జీవిత భాగస్వామి, పిల్లలు వచ్చే ఏడాది నుంచి ఉద్యోగాలు చేసుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో సమస్యగా మారిన ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. దీంతో 2,00,000 మందికిపైగా ఉన్న విదేశీ ఉద్యోగులకు తోడు వారి కుటుంబసభ్యులకు కెనడాలో కొలువుకు అవకాశం దక్కుతుంది. గతంలో ఓపెన్ వర్క్ పర్మిట్ ఉన్న ఉద్యోగి హై–స్కిల్డ్ ఉద్యోగం చేస్తేనే జీవితభా గస్వామికి వర్క్ పర్మిషన్ ఇచ్చేవాళ్లం. నిబంధనలను సడలించడంతో వర్క్ పర్మిట్ ఉద్యోగు లు కుటుంబంతో కలిసుంటారు. వారి శారీరక ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది’ అని ఫ్రాసర్ అభిప్రాయపడ్డారు. దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. -
సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం!
సూపర్స్టార్ కృష్ణ విషయంలో కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన గుర్తుగా ఓ మెమెరియల్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. మెమోరియల్ను సందర్శించే ప్రజలు కాసేపు అక్కడే గడిపి.. సూపర్ స్టార్ కృష్ణ గురించి పూర్తిగా తెలుసుకునే విధంగా ఉండనుందని అంటున్నారు. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: కీలక ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ -
వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే..
పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది. మీడియాతో.. సోనాలి సోదరి రమణ్ ‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు. 2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్హౌజ్లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం -
రియల్ ఎస్టేట్ గొడవలకు కుటుంబం బలి
ఖలీల్వాడి (నిజామాబాద్అర్బన్)/ఆదిలాబాద్ టౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాముల వేధింపుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొత్తకొండ సూర్యప్రకాశ్ కుటుంబం ఏడెనిమిదేళ్లనుంచి నుంచి హైదరాబాద్లో నివాసం ఉంటోంది. సూర్యప్రకాశ్ కొంతమంది పార్ట్నర్స్తో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వెంచర్ నిర్వహణలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తాయి. వ్యాపార నిర్వహణకు ఇంకా పెట్టుబడి పెట్టాలని భాగస్వాములు అతనిపై ఒత్తిడి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో సూర్యప్రకాశ్ నివాసానికి పార్ట్నర్స్ వెళ్లి గొడవపడినట్లు తెలిసింది. సూర్యప్రకాశ్ను అతని భార్య, కూతురు, కుమారుడిని కొట్టి, బెదిరింపులకు పాల్పడ్డారు. వీరి వేధింపులు తాళలేక సూర్యప్రకాశ్ కుటుంబం ఈ నెల 4న నిజామాబాద్లోని ఓ హోటల్లో దిగింది. అప్పటినుంచి హోటల్లోని రూం నంబర్ 101 లోనే ఉంటున్నారు. కాగా, ఆదివారం ఉదయం హోటల్ సిబ్బంది గదిని శుభ్రం చేయడానికి తలుపు తట్టగా ఎంత సేపటికీ తెరుచుకోకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాలుగో టౌన్ పోలీసులు గదిని తెరిచారు. లోపల కొత్తకొండ సూర్య ప్రకా శ్ (37) ఉరి వేసుకుని చనిపోగా భార్య అక్షయ (36), కూతురు ప్ర త్యూష (13) కొడుకు అద్వైత్ (10) విష ప్రభావంతో మృతి చెందారు. కేక్లో విషం కలిపి ముందుగా భార్య, కూతురు, కుమారుడికి తినిపించి వారు మృతి చెందారని నిర్ధారించుకున్న తర్వాత సూర్యప్రకాశ్ చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావి స్తున్నారు. హోటల్ గదిలో సూర్యప్రకాశ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సూసైడ్ నోట్లో కొందరు రియల్ ఎస్టేట్ పార్ట్నర్స్ వేధిస్తున్నట్లు పేర్కొంటూ, వారి పేర్లు రాశారని తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆదిలాబాద్కు వలస వెళ్లి సూర్యప్రకాశ్ తల్లిదండ్రులు నిజామాబాద్ జిల్లాకు చెందిన కొత్తకొండ అనుసూయ, కృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబం నలభై ఏళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వలస వెళ్లింది. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో హార్డ్వేర్ షాప్ ఏర్పాటు చేశారు. చిన్న కుమారుడైన సూర్యప్రకాశ్ ఆది లాబాద్లోనే పుట్టి పెరిగారు. వీరి కుటుంబం హార్డ్వేర్ షాప్ తో పాటు పట్టణంలో పెట్రోల్బంక్ను కూడా ఏర్పాటు చేసింది. ఆర్థికంగా వృద్ధి చెందడంతో సూర్యప్రకాశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారంకోసం ఏడెనిమిదేళ్ల క్రితం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు మకాం మా ర్చారు. సూర్యప్రకాశ్ భార్య అక్షయది ఆదిలాబాద్ జిల్లా జైన థ్ మండలం దీపాయిగూడ గ్రామం. కాగా హైదరాబాద్లో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. లాక్డౌన్ సమ యంలో శంకరంపేట సమీపంలో భాగస్వాములతో కలసి వెంచర్ ఏర్పాటు చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. వ్యాపా రంలో నష్టం రావడంతో అప్పుల కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. దానికితోడు బిజినెస్ పార్ట్నర్లు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈనెల 4న హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు వచ్చి ఓ హోటల్లో దిగారు. రెండు, మూడు రోజుల క్రితం నిజామాబాద్లోని వారి బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతంలో సైతం కుటుంబ సమేతంగా పాల్గొన్నారని తెలిసింది. -
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబసభ్యులకు ఏపీ గవర్నర్ ఘన సత్కారం
సాక్షి, విజయవాడ: సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు’లో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబసభ్యులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సన్మానించారు. భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనుమరాలు సుశీల, స్వాతంత్ర సమరయోధులు కోపల్లె హనుమంతరావు మనుమడు హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనుమడు కాకాని విజయ్ కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనుమడు ఇవటూరి కృష్ణకుమార్.. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతుల కుమారుడు చింతకాయల చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పెనుమత్స సుబ్బన్న భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. పింగళి వెంకయ్య.. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రులో జన్మించారు. 1947లో స్వాతంత్ర్యం సాధించడానికి ముందు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవారంతా వివిధ జాతీయ జెండాలను ఉపయోగించేవారు.. కృష్ణాజిల్లాకు చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండా రూపొందించి మహాత్మా గాంధీ విజయవాడ పర్యటనలో వారికి అందించారు. "పింగళి వెంకయ్య వ్యవసాయవేత్త, మచిలీపట్నంలోనూ విద్యాసంస్థను స్థాపించిన విద్యావేత్త. 1963లో పేదరికంతో మరణించారు. 2009 లో పింగళి స్మారకార్థం ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసారు. రాష్ట్రంలో 75 వారాల పాటు జరిగే "ఆజాదీ కా అమృత్ మహోత్సవం" ప్రారంభోత్సవం సందర్భంగా గంటూరు జిల్లా మాచర్లలో నివసిస్తున్న దివంగత వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సీఎం జగన్మోహన్ రెడ్డి సన్మానించారు. వారి మనుమరాలు సుశీలను గవర్నర్ నేడు ఘనంగా సత్కరించారు. కోపల్లె హనుమంతరావు కోపల్లె హనుమంతరావుగారు 1879, ఏప్రిల్ 12 న మచిలీపట్నం లోని సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. వీరు చల్లపల్లి సంస్థానంలో దివానుగా ఉన్న కృష్ణారావు జేష్ఠ పుత్రులు. ఈయన తండ్రి న్యాయవాదిగా బందరులో పనిచేసారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. హనుమంతరావు చెన్నపట్నంలో ఎఫ్.ఏ, ఎం.ఏ, లా డిగ్రీ చదివి ఊటీలో కొన్నాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసారు. బిపిన్ చంద్రపాల్ మచిలీపట్నంలో చేసిన ప్రసంగంతో ఉత్తేజితుడై, తన లా డిగ్రీని చింపి బ్రిటీషు ప్రభుత్వంపై నిరసన ప్రకటించారు. 1910లో ఆంధ్ర జాతీయ కాంగ్రెస్ పిలుపుతో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించి, ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రం స్థాపించారు. దానికి అనుబంధంగా స్థాపించిన ఆంధ్ర జాతీయ కళాశాల, ఆంధ్ర జాతీయ బి. ఎడ్. కళాశాల ఇప్పటీకీ నడుస్తున్నాయి. వీరు కళాశాల కోసం పదిహేనేళ్ళు ఎడతెగక ప్రయత్నించి అప్పట్లోనే లక్షలాది రూపాయల ధనంతో ముప్పై ఎకరాల పొలం సేకరించి, ఆ విద్యా సంస్థను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఈ కళాశాల 2010లో నూరేళ్ళ పండగ జరుపుకున్నది. వీరి మనుమడు హనుమంతరావుగారు ప్రస్తుతం ఈ సభా ప్రాంగణం ఉన్న ప్రాంతానికే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు.. వారిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. కాకాని వెంకటరత్నం ప్రముఖ స్వాతంత్ర్య పోరాట సమరయోధుడు కాకాని వెంకటరత్నంగారు ఉక్కు కాకాణిగా పేరుగాంచారు.. 1900 సంవత్సరం ఆగస్టు 3న తేదీన కృష్ణా జిల్లా ఆకునూరు గ్రామంలో జన్మించారు, మహాత్మాగాంధీ ఉపదేశాలకు స్ఫూర్తి చెంది 1924లో కాంగ్రెస్ లో పనిచేశారు, 1930 ఉప్పుసత్యాగ్రహం లో పాల్గొని రెండు సంవత్సరాలు జైలుజీవితం గడిపారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1955 లో శాసనభ్యులుగా తొలి అడుగులువేసి మంత్రిగా పనిచేసారు. 1972 లో జైఆంధ్రా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.. ఆ ఉద్యమంలో విద్యార్థుల పై పోలీసులు కాల్పుల్లో మరణించారు అన్న వార్త విని డిసెంబర్ 25 న గుండెపోటు తో మరణించారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. వారి మనుమడు కాకాని విజయ్ కుమార్ను గవర్నర్ ఘనంగా సత్కరించారు. అయ్యదేవర కాళేశ్వరరావు అయ్యదేవర కాళేశ్వరరావుగారు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకర్.. భారత స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడిన మలితరం మహా నాయకులలో డా.పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, బులుసు సాంబమూర్తి మొదలైనవారున్నారు. కాళేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసి. 1881 జనవరి 22వ తేదీన జన్మించిన కాళేశ్వరరావు బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో విశేష కృషి చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోను, హోంరూలు ఉద్యమంలోను పనిచేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు. 1962 ఫిబ్రవరి 26వ తేదీన విజయవాడలో పరమపదించారు. వారి మనుమడు ఇవటూరి క్రిష్ణకుమార్ గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు చింతకాయల బుల్లమ్మ, సత్యనారాయణ దంపతులు విజయవాడవాసులు.. మొదటినుండి జాతీయ భావాలు కలిగిన వీరు జాతీయ ఉద్యమంలో ఈ ప్రాంతంనుండి ప్రాతినిధ్యం వహించారు. అయ్యదేవర కాళేశ్వరరావుతో కలిసి స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసారు. అనేకమార్లు అరెస్ట్ కాబడి బ్రిటిష్ పోలీసులచేత దెబ్బలు తిన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నవారికి ఆరోజుల్లో వారిచేతులతోనే భోజనాలు వండి పెట్టేవారు. వీరి కుమారులు చింతకాయల చిట్టిబాబు గౌరవనీయులు గవర్నర్ చేతులమీదుగా సత్కారం చేశారు. పసల కృష్ణమూర్తి అంజలక్ష్మి వీరు ఆంగ్లేయులపై అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిలకు జైలు శిక్ష పడగా వారికి కారాగారంలో పసల కృష్ణభారతి జన్మించారు. 1921లో గాంధీ సమక్షంలో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు వీరిని 1931లో ఆంగ్లేయ సర్కారు జైలుకు పంపించింది. నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను ఒడిలో పట్టుకొనే జైలుజీవితం గడిపారు. పదినెలల గర్భంతోనే జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. ఇటీవల భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పసల కృష్ణభారతి గారి పాదాలకు నమస్కరించి ఆమెను సన్మానించారు. పసల కృష్ణమూర్తి అంజ లక్ష్మి మనవరాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మిని గవర్నర్ ఘనంగా సత్కరించారు. పెనుమత్స సుబ్బన్న సుబ్బన్న గారు.. ప్రముఖ స్వతంత్ర పోరాట సమరయోధుడు స్వాతంత్రం కోసం జైలుజీవితం గడిపిన వ్యక్తి.. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బన్న గాంధీజీ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా దేశమంతా ప్రజల తిరుగుబాటుతో ఆంగ్ల ప్రభుత్వ పరిపాలనను స్తంభించే విధంగా పనిచేశారు. ఆంగ్లేయులు ఆయనను ఏలూరు, బళ్లారి జైళ్లల్లో పలుసార్లు బంధించారు. ఆ జైలలో పొట్టి శ్రీరాములు వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహా నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. 2007 సెప్టెంబర్ 22న అనారోగ్యంతో మరణించారు. పెనుమత్స సుబ్బన్నగారి భార్య శ్యామలను గవర్నర్ ఘనంగా సత్కరించారు. -
సండే ఫ్లాష్..: బ్యాక్సినిమాకెళ్తాం నాన్నా!
షూటింగ్లు ఆగిపోతాయట.. సినిమా టికెట్లు తగ్గించాలట. కలెక్షన్లు లేవట.. థియేటర్లు ఖాళీ అట. ఇవీ ఇవాళ్టి వార్తలు. కాని థియేటర్లో రిలీజయ్యే సినిమాయే ఏకైక వినోదంగా ఉన్న 1980–90లలో సినిమాకు వెళ్లాలంటే ఎంత తతంగం. ఎంత ప్రిపరేషను. ఎన్ని పర్మిషన్లు. ఎంత హడావిడి. ఎంత సంబరం. జ్ఞాపకం ఉన్నాయా ఆ రోజులు. జ్ఞాపకం చేయమంటారా? నేల డెబ్బయి అయిదు పైసలు. బెంచి రూపాయి. కుర్చీ రూపాయిన్నర. బాల్కనీ రెండు రూపాయలు. ఆ డబ్బులు ఉండేవి కాదు. సినిమాకంటూ కొంత డబ్బు మిగలాలంటే ఇంటి బడ్జెట్లో చాలా కుదరాలి. ఎవరికో హటాత్తుగా జ్వరం రాకూడదు. ఏ ఇంటనో పెళ్లి జరక్కూడదు. ఏదో ఒక బంధువుల ఇంటికి ప్రయాణం పడకూడదు. చుట్టాలు ఊడి పడకూడదు. నోటు పుస్తకాలని, టెక్ట్స్ పుస్తకాలని పిల్లలు డబ్బులు అడక్కూడదు. అన్నీ కుదిరి ఇంట్లో ఐదు రూపాయల వరకూ ఉంటే ఫ్యామిలీ అంతా సినిమాకు పోవచ్చు. సినిమా మారితే గోడ మీద పోస్టర్ పడుతుంది. దానిమీద నీలి సిరాతో థియేటర్ పేరు... ఎన్ని ఆటలో రాసి ఉంటుంది. బండి వీధుల్లో తిరుగుతూ మైక్లో ‘మీ అభిమాన థియేటర్ శ్రీ వేంకటేశ్వరలో... రేపటి నుండి’... అని అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. అది ఫ్యామిలీ సినిమా అయితే అమ్మ మనసు లాగుతుంది. ఫైటింగ్ సినిమా అయితే పిల్లలకు తబ్బిబ్బవుతుంది. నాన్నకు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన ఉదయం వెళ్లి రాత్రివరకూ పని చేస్తూనో ఉద్యోగం చేస్తూనో షాపు నడుపుతూనో బిజీ. సినిమా మారినట్టే తెలియదు. చూద్దామనే ఆసక్తీ ఉండదు. కాని పర్మిషన్ ఇవ్వాల్సిందీ డబ్బు చేతిలో పెట్టాల్సిందీ ఆయనే. కొందరు నాన్నలు ఎప్పుడూ ధుమధుమలాడుతూ ఉంటారు. వారిని సినిమాకు పర్మిషన్ అడగాలంటే భయం. కాని ఆ నాన్నలే పిల్లల మాట వింటారు. ‘రేయ్... సినిమాకెళ్తామని మీ నాన్నని అడగండిరా’ అని తల్లులు పిల్లల్ని రాయబారానికి పంపుతారు. కొందరు నాన్నలు చుట్టాలు ఇంటికి రాగానే పొంగిపోతారు. ‘అందరు కలిసి సినిమాకు పోండి’ అని డబ్బులిచ్చి పంపుతారు. కొందరు నాన్నలు చాలా వింత. వాళ్లకై వాళ్లు ఏ మ్యాట్నీయో చూసేసి ఏమెరగనట్టు ఉంటారుగాని ఇంట్లోవాళ్లు సినిమాకు వెళతామంటే మాత్రం ఒప్పుకోరు. కొందరు నాన్నలు అందరూ కలిసి వెళ్లేలా టికెట్లు ముందే తెచ్చి తీసుకువెళతారు. వీళ్లు మాత్రం చాలా మంచి నాన్నలు. ఈ రోజు ఫస్ట్ షోకు వెళ్లాలంటే పొద్దున్నుంచే హడావిడి. ఇరుగమ్మకు పొరుగమ్మకు అవసరం ఉన్నా లేకపోయినా ‘ఇవాళ మేము సినిమాకు వెళుతున్నాం’ అని చెప్తుంది అమ్మ. మంచి చీరా జాకెట్టు వెతుక్కోవడం, వంట తొందరగా ముగించడం, నాన్నకోసం తాళం పక్కింట్లో ఇవ్వడం.... పిల్లలు స్కూల్లో ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు పోతారు– సినిమాకు వెళుతున్నామని. ఇంట్లో నానమ్మ ఉంటే ఆమె మెల్లగా నడుస్తుంది కనుక చాలా ముందే బయలుదేరాలి. ఆమె వేలు పట్టుకుని నడిపించడానికి మనవడు తెగ తొందర పడుతుంటాడు. ట్రైల్పార్ట్ ఉంటుందని కొందరు ఆరాంగా బయలుదేరుతారు. మరికొందరు ‘డింగ్డింగ్ డింగ్డింగ్’ అని మ్యూజిక్ వచ్చి కుచ్చుల తెర పైకి లేచేప్పటి నుంచి చూడాలని ముందే వచ్చేస్తారు. చివరి నిమిషంలో టికెట్లు అయిపోయాయని వెనక్కు వెళ్లేవాళ్లు కొందరైతే... సినిమాకు గంట ముందే వచ్చి ముందు జాగ్రత్తగా ఖాళీ క్యూలో నిల్చునేవారు కొందరు. ఇంటర్వెల్లో ఏం తినాలి? దాని బడ్జెట్ ఎంత? అనేదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. పిల్లలకు పావలా ఇవ్వడం పెద్ద విషయం. కొందరు తల్లులు ఏ జామకాయనో, బొరుగులనో జేబుల్లో పోసి ఇవి తిను అంటారు. ఉప్పుజల్లిన రేక్కాయలు పది పైసలకు కూడా దొరుకుతాయి హాలు బయట. లోపలకు తీసుకెళ్లి తినడమే. వడలు, బజ్జీలు తింటే అదో తృప్తి. పెద్ద కుటుంబాల వారు ఇంటర్వెల్లో గోల్డ్స్పాట్ కొనుక్కుని మెల్లమెల్లగా తాగుతూ చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం స్టిల్స్ డబ్బా ముందు నిలబడి ఎన్ని స్టిల్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయో ఎన్ని స్టిల్స్ సెకండ్ హాఫ్లో రానున్నాయో చూసుకోవడం. రాబోయే సినిమాల పోస్టర్లను నోరు వెళ్లబెట్టి చూడటం. తెలిసిన ఏ ఒక్కరు కనిపించినా ‘ఏవోయ్... సినిమాకు వచ్చావా?’ అని అడగడం. సినిమాహాల్లో కనిపించినవాడు సినిమాకు రాక టిఫిన్ తినడానికి వస్తాడా? సినిమాలో మనం కట్టుకోలేని బట్టలు హీరో హీరోయిన్లు కట్టుకుంటారు. మనం చేయలేని సాహసాలు హీరోలు చేస్తారు. మనం చూడని ప్రదేశాలు అందంగా చూపిస్తారు. మనం నవ్వే ఏడ్చే సందర్భాలను రక్తి కట్టిస్తారు. అద్దె ఇళ్లు, రేషన్ సరుకు, చాలీ చాలని ఆదాయం, స్లిప్పర్లు కూడా లేని జీవితం, బయట టీ తాగడానికి కూడా ఆలోచించే బతుకు... వీటిమధ్య మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. ఇవాళ? చేతిలో కంప్యూటర్లో టీవీలో ఎన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎటువంటి సినిమాలు కావాలంటే అటువంటివి ఉంటే... అంతా అతి అయిపోతే కొద్దిపాటి రుచిలోని మాధుర్యం పోయింది. ఎంతో గొప్ప వంటకం తెర కోసం తయారైందని తెలిస్తే తప్ప హాలు వైపు నడవడం లేదు ఎవరూ. కొత్తొక రోత. పాతొక వింత. మూడు గంటలసేపు ఒక పెద్ద రిలీఫ్ సినిమా. అది చాలా మందిని బతికించింది. చాలామందిని చేదు వాస్తవాల నుంచి కలల్లోకి పంపింది. చాలామందికి ఆత్మబంధువుగా ఒక హీరోను ఇచ్చింది. తక్కువ తక్కువగా ఉన్నది ఏదైనా రుచిగా ఉంటుంది. అపురూపంగా ఉంటుంది. -
ఆ దుర్మార్గులు ఎంత పని చేశారు.. ఒకే కుటుంబంలో తొమ్మిది మందిని..
ముంబై: మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ కేసుకి సంబంధించిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇది ఆత్మహత్య కాదని హత్యగా గుర్తించారు. వారిది ఆత్మహత్య కాదు హత్య.. సాంగ్లీ జిల్లాలోని మైసల్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబాలతో కలిసి జీవిస్తున్నారు. వారి కుటుంబాల్లో మొత్తం తొమ్మిది మంది ఉండేవారు. ఈ నెల 20న కుటుంబంలోని 9 మంది ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మొదటగా.. అన్నదమ్ములకు అప్పులు ఎక్కువ ఉండడంతో, వాటిని తీర్చడం కష్టంగా భావించి వేరే దారి లేక కుటుంబంతో సహా వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని తేలింది. కానీ ఈ వ్యవహారంపై పోలీసులకు ఎక్కడో అనుమానం రావడంతో ఈ కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే షాకింగ్ విషయాలు వెలువడ్డాయి! ఆ కుటుంబ సభ్యులకు ఆత్మహత్య కాదని, విషం ఇచ్చి వారిని చంపేశారని గుర్తించారు. గుప్త నిధుల కోసం ధీరజ్ చంద్రకాంత్, అబ్బాస్ మహ్మద్ అలీ అనే ఇద్దరు మాంత్రికులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్తాప్తులో తేలింది. కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరేదైన కోణం కూడా దాగుందా అని పోలీసులు భావిస్తున్నారు. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!
రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్జీఆర్పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి. భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్ మరుసటి రోజు వైజాగ్ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. -
ఏడేళ్లుగా ప్రేమ.. పెళ్లి చేసుకుందామన్న యువతి.. సెల్కు ఫోన్ చేస్తే..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): నిశ్చితార్థం జరిగి ఏడాదిన్నర అయినా పెళ్లి గురించి మాట్లాడకుండా దాటవేస్తుండటమే కాక పెళ్లెప్పుడు చేసుకుందామని యువతి అడిగినందుకు యువకుడి కుటుంబసభ్యులు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం పాయకాపురం సుందరయ్య నగర్కు చెందిన మునపర్తి రమ్యదుర్గ, ఆమె సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రమ్య, భాస్కర్ కుటుంబ సభ్యులు 2020 నవంబర్ 25వ తేదీన ఇద్దరికీ నిశ్చితార్ధం చేశారు. చదవండి: ట్యూషన్కు వచ్చిన విద్యార్థినిపై లైంగిక దాడి.. వీడియోలు తీసి.. అయితే భాస్కర్ అక్కకు వివాహం చేయాల్సి ఉందని చెప్పి ఏడాది గడువు అడిగారు. దీనికి రమ్య కుటుంబ సభ్యులు అంగీకరించారు. అది జరిగి ఏడాదిన్నర అయినా భాస్కర్ అక్కకు పెళ్లి చేయలేదు. విసిగి వేసారిన రమ్యదుర్గ ఈ నెల 24వ తేదీన పెళ్లి ఎప్పుడు చేసుకుందామని భాస్కర్కు మెసేజ్ పెట్టింది. అప్పటి నుంచి భాస్కర్ కనిపించకుండా పోయాడు. సెల్కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని వస్తోంది. ఈ నేపథ్యంలో భాస్కర్ తల్లిదండ్రులు, మరికొంత మంది కలసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో రమ్య ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. రమ్యదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘పెళ్లి కార్డులు ఇవ్వాలి.. తలుపు తీయండి’... అలా తెరిచారో లేదో.. !
రాయగడ(భువనేశ్వర్): ‘పెళ్లి కార్డులు ఇవ్వడానికి వచ్చాం.. తలుపు తీయండి’ అని పిలవడంతో బయటకు వచ్చిన వారిని దుండగులు బంధించి, దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానిక బుదరావలసలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. బుదరావలసలో నివాసముంటున్న జగన్నాథ మహంతి అనే వ్యక్తి ఇంటికి ఐదుగురు వెళ్లి తలుపులు తట్టారు. మీ దుకాణానికి వెళ్తే.. మూసివేసి ఉందని, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని పిలవడంతో జగన్నాథ భార్య జ్యోతి తలుపులు తెరిచారు. అంతా లోపలికి వచ్చి, ఎండతో వచ్చాం.. తాగేందుకు నీళ్లు ఇవ్వండని అనడంతో ఆమె వంటగది వైపు వెళ్లగా ఆమె వెనకాల వెళ్లిన దుండగులు.. కత్తితో బెదిరించారు. అదే సమయంలో ఆమె కొడుకు ప్రీతమ్(15) తన తల్లిపై దాడి చేయండం గమనించి అవరడంతో అతడిని కొటి,్ట బాత్రూంలో బంధించారు. దీంతో వేరే గదిలో ఉన్న ఆమె కూతురు చాందిని(17) కేకలు వేయగా ఇరుగు–పొరుగు వారు రావడంతో దుండగులు బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న 15 వవార్డు కౌన్సిలర్ సంతోష్ కుమార్ దొళాయి పోలీసులకు సమాచారం అందించారు. సైంటిఫిక్ బృందం ఆధారాలు సేకరించిందని ఐఐసీ రస్మీరంజన్ ప్రదాన్ తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: రాత్రికి ఇంటికి వెళ్లాడు.. ఉదయం లేచి చూస్తే.. -
ఇక అత్తారింటి కుటుంబంలో పేరు నమోదు సులువే
సాక్షి, అమరావతి: కొత్తగా పెళ్లయ్యి అత్తారింటికి వెళ్లిన వారికి.. ఆ కుటుంబంలో సభ్యురాలిగా పేరు నమోదు చేసుకునేందుకు గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ పేరు నమోదు సమయంలో సంబంధిత వ్యక్తి వేలిముద్రలు కూడా నమోదు చేసుకుంటారు. సచివాలయాల్లో నమోదయ్యే ఈ వివరాలను ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయా వ్యక్తులు సంబంధిత కుటుంబంలో సభ్యులుగా నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. వ లంటీర్లు ఆయా కుటుంబసభ్యులుగా పేరు నమోదు చేసిన అనంతరం రేషన్కార్డులో కొత్తగా పేరు నమోదు చేయించుకోవడంతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందడానికి వీలు కలుగుతుందని అధికారులు వెల్లడించారు. 2019లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ, వలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత గ్రామాల్లో ప్రతి 50 కుటుంబాలను ఒక క్లస్టర్గా, పట్టణాల్లో 70–100 కుటుంబాలను ఒక క్లస్టర్గా వర్గీకరించి, ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కొక్కరి చొప్పున వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో కలిపి 1.65 కోట్ల కుటుంబాల్లో 4.67 కోట్ల మంది తమ పేర్లు నమోదుచేసుకోగా, ఆయా కుటుంబాల ను 2.65 లక్షల వలంటీరు క్లస్టర్లుగా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఈ వివరాల ప్రకారమే అర్హులను గుర్తిస్తోంది. -
సీఐ, ఎస్ఐకి రూ.15 లక్షల లంచం?
బనశంకరి: గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 2021 జూలై 17 గోకాక్లోని మహంతేశ్ నగర లేఔట్లో మంజునాథ మురకిబావి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సిద్దప్ప బబలి పిల్లలైన కృష్ణ, అర్జున్ అనే ఇద్దరిని అరెస్ట్చేశారు. నిందితుల అక్క కుమార్తెను మంజునాథ ప్రేమించేవాడని, అదే హత్యకు కారణమని ఎవరో చెప్పడంతో తమవారిని సీఐ అరెస్టు చేశాడని నిందితుల బంధువులు ఆరోపించారు. అంతేగాక భారీగా డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై కూడా కేసు పెడతామని బెదిరింపులకు దిగారని, ఇలా అప్పటి గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకున్నారని సిద్దప్పబబలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భూమి కుదవపెట్టి డబ్బు ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని వారు ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఏఎస్పీని ఎస్పీ లక్ష్మణ నింబరగి ఆదేశించారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
అధిష్టానం ‘అలయ్ బలయ్’!
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధిష్టానం అల్లంత దూరమనే భావన తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు దూరమవుతోందా? తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారా? గత మూడు రోజులుగా ఢిల్లీ వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తెలంగాణ నేతలు సోమవారం నుంచి ఢిల్లీలో ప్రత్యేకంగా మకాం వేసి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తుండడం, వీహెచ్, జగ్గారెడ్డి తదితర నాయకులకు ఢిల్లీ అగ్రనేతలు వరుసగా అపాయింట్మెంట్లు ఇస్తుండడం, త్వరలో రాష్ట్రానికి రానున్న రాహుల్గాంధీ పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలిసేందుకు ఏర్పాట్లు జరుగుతుండడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వరుస భేటీలు తెలంగాణలో పార్టీని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 మంది రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్గాంధీ సమావేశం కావడంతో భేటీల పరంపర మొదలయింది. అంతకుముందే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సమావేశమయ్యారు. రాహుల్తో సమావేశం ముగిసిన మరుసటి రోజే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డిలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ను జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. ఈలోపే రాహుల్గాంధీ కూడా జగ్గారెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు. జగ్గారెడ్డితో పాటు టీపీసీసీ మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను కూడా కలిసేందుకు అంగీకరించారు. కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు జగ్గారెడ్డి.. తన భార్య, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కుమారుడు భరత్సాయిరెడ్డి, కుమార్తె జయారెడ్డిలతో కలిసి వెళ్లి రాహుల్ను కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇక మహేశ్కుమార్గౌడ్ తన కుమారుడు, లా విద్యార్థి ప్రణవ్గౌడ్ను వెంటబెట్టుకుని రాహుల్ను కలిశారు. ఇద్దరు నేతలు రాహుల్ను కలిసినప్పుడు కూడా రాజకీయ అంశాల కంటే పిల్లల చదువులు, కుటుంబ అంశాలపైనే రాహుల్ మాట్లాడినట్టు సమాచారం. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి కూడా రాహుల్తో భేటీ అయ్యారు. రాహుల్తో భేటీ తర్వాత జగ్గారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తన నియోజకవర్గ నేతలను కూడా ఢిల్లీకి తీసుకువచ్చి రాహుల్ను కలిసి ఫొటోలు దిగేలా ప్రయత్నం చేస్తానని చెప్పడం గమనార్హం. గతానికి భిన్నంగా.. కాంగ్రెస్ పెద్దలను ఢిల్లీ వెళ్లి కలవడం ఎంత కష్టమో.. రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అంతే కష్టమనే భావన రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో ఉంది. రాహుల్ లేదా సోనియా లేదా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఎవరు వచ్చినా కీలక నాయకులు మినహా ఎవరికీ వారిని కలిసే అవకాశముండేది కాదు. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవడం ఓ టాస్క్లాగానే ఉండేది. అయితే ఈసారి అందుకు భిన్నంగా రాహుల్గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈనెలాఖరులో రాష్ట్రానికి రానున్న రాహుల్ రెండ్రోజులు ఇక్కడే ఉంటారని, ఒకరోజు బహిరంగ సభకు హాజరు కానుండగా, మరోరోజు రాష్ట్రానికి చెందిన అన్ని స్థాయిల్లోని పార్టీ నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నేతలందరినీ కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక సంస్థలకు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులు, సభ్యత్వ నమోదులో కీలకపాత్ర పోషించిన వారితో కూడా రాహుల్తో కలిపించాలనే భావనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందని ద్రాక్షలు కాదు..! ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అందని ద్రాక్షలేమీ కాదని, అందరితో కలివిడిగా ఉంటారనే భావనను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లాలనేది రేవంత్రెడ్డి యోచనగా కనిపిస్తోంది. ఆ భావన కలిగించడం ద్వారా జరగబోయే ఎన్నికల్లో మరింత క్రియాశీలంగా కేడర్ పనిచేస్తుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. -
మైనర్పై ఐదేళ్లుగా కుటుంబ సభ్యుల లైంగిక వేధింపులు.. తండ్రితో సహా..
సాక్షి, ముంబై: దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మృగాలు వావివరుసలు మరచి చిన్నారులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న కూతురిపైనే తండ్రి, ఇంటి సభ్యులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు(11) కుటుంబం బీహార్ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వలస వచ్చింది. సదరు మైనర్ తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమంలో తన గోడును వెల్లడించింది. తాను ఐదేళ్లుగా కన్న తండ్రి, ఇంటి సభ్యులతో లైంగికంగా వేధించబడుతున్నట్టు తెలిపింది. 2017 నుంచి తండ్రి లైంగిక వేధింపులకు గురిచేస్తుండగా.. తండ్రి, సోదరుడు వేరు వేరు సందర్భాల్లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. 2020లో ఆమె సోదరుడు బాధితురాలిపై లైంగిక దాడి చేయగా.. తాత, మామ కూడా మైనర్ను లైంగికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇది సామూహిక లైంగిక దాడి కాదని, మైనర్పై లైంగిక దాడులన్నీ వేర్వేరు సందర్బాల్లో జరిగాయని ఎస్సై అశ్విని సాత్పుతె పేర్కొన్నారు. ఈ క్రమంలో మైనర్ కుటుంబ సభ్యులపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
గౌతమ్రెడ్డి మృతిపై అసత్య ప్రచారం.. ఖండించిన కుటుంబ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.15 నిమిషాలకు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే గౌతమ్రెడ్డి మృతి చెందినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలపై ఆయన కుటుంబం స్పదించింది. గౌతమ్ రెడ్డి వ్యాయామం చేస్తూ ఇబ్బందిపడ్డారన్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. గౌతమ్రెడ్డి కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం... ► ఆదివారం రాత్రి జరిగిన ఓ ఫంక్షన్లో యథావిధిగా సంతోషంగా గడిపి రాత్రి 9.45 కల్లా మంత్రి మేకపాటి ఇంటికి చేరారు. ► 06.00 గంటలకు రోజూలాగే ఉదయాన్నే ఆయన మేల్కొన్నారు. ► 06:30 గంటల వరకూ మంత్రిగారు ఫోన్లతో కాలక్షేపం చేశారు. ► 07.00 గంటలకు నివాసంలోని రెండో అంతస్తు సోఫాలో మంత్రి కూర్చుని ఉన్నారు. ► 07:12 గంటలకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే డ్రైవర్ నాగేశ్వరరావును పిలవమని వంట మనిషికి చెప్పారు. ► 07:15గంటలకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో సోఫా నుంచి ఆయన మెల్లిగా కిందకి ఒరిగారు. ► 7:16 గంటలకు మంత్రి మేకపాటి సతీమణి శ్రీకీర్తి కంగారు పడి గట్టిగా అరిచారు. ► 07:18 గంటలకు పరుగుపరుగున వచ్చి గుండె నొప్పితో ఇబ్బందిపడుతున్న మంత్రి ఛాతి మీద చేయితో నొక్కి డ్రైవర్ నాగేశ్వరరావు స్వల్ప ఉపశమనం కలిగించారు. ► 07:20 గంటలకు మంత్రి మేకపాటి పక్కనే ఉన్న భార్య శ్రీకీర్తి అప్రమత్తమయ్యారు. ► 07:20 గంటలకు మంచినీరు కావాలని అడిగిన మంత్రి మేకపాటి, ఇచ్చినా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన భార్య శ్రీకీర్తి.. వెంటనే మంత్రి వ్యక్తిగత సిబ్బందిని పిలిచారు. ► 07:22 ‘నొప్పి పెడుతుంది కీర్తి’ అంటున్న మంత్రి మాటలకు స్పందించి.. అక్కడి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి వెళదామని బయలుదేరారు. ► 07:27 మంత్రి ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపోలో ఆస్పత్రికి, అత్యంత వేగంగా కేవలం 5 నిమిషాల్లో ఆస్పత్రిలోని అత్యవసర చికిత్స విభాగానికి మంత్రి మేకపాటి డ్రైవర్, సిబ్బంది చేర్చారు. ► 08:15 గంటలకు పల్స్ బాగానే ఉంది, ప్రయత్నిస్తున్నామని అపోలో వైద్యులు తెలిపారు. ► 09:13 గంటలకు మంత్రి మేకపాటి ఇక లేరని అపోలో ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ► 09:15 గంటలకు మంత్రి మేకపాటి మృతిచెందినట్లు అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటించారు. -
మంత్రాల నెపంతో దంపతులపై దాడి
అల్లాదుర్గం(మెదక్): మంత్రాలు(చేతబడి) చేస్తున్నారనే నెపంతో దంపతులను కరెంటు స్తంభానికి కట్టేసి దాడి చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. అల్లాదుర్గం గ్రామానికి చెందిన బోయిని కిష్టయ్య అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. తమ పాలివారైన రమేశ్ కుటుంబం చేతబడే... కిష్టయ్య అనారోగ్యానికి కారణమని ఆరోపిస్తూ ఆయన కుటుంబీకులు ఆదివారంరాత్రి గొడవపడ్డారు. సోమవారం ఉదయం మళ్లీ గొడవకు దిగి రమేశ్ను, ఆయన భార్య రజితను ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి నడిరోడ్డుపై స్తంభానికి వైర్లతో కట్టేశారు. కట్టెలతో కొట్టారు. పోలీసులు వచ్చి రమేశ్ దంపతులను ఆసుపత్రికి తరలించారు. రమేశ్ ఫిర్యాదు మేరకు కిష్టయ్య కొడుకులు కుమార్, నగేశ్, భేతయ్య, భార్య ఆశమ్మ, కూతురు అంబమ్మపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి జోగిపేట కోర్టుకు రిమాండ్కు తరలించారు. -
ఆ ఇంట్లో అందరూ దొంగలే
కర్ణాటక(యశవంతపుర): ఆ ఇంట్లో అందరూ దొంగలే. తల్లి, ఆమె తనయుడు, తనయ మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి చోరీలబాట పట్టారు. ఎట్టకేలకు ముఠాకు చెందిన 8 మంది పోలీసులకు పట్టుబడ్డారు. ఉత్తర విభాగం డీసీపీ వినాయక పాటిల్ వివరాలు వెల్లడించారు. బెంగళూరులోని మాదనాయకనహళ్లి దొమ్మరహళ్లి నివాసి మంజునాథ్ అలియాస్ కోళిమంజ(31), అతని తల్లి ప్రేమ(50), అయన చెల్లెలు అన్నపూర్ణ అలియాస్ అను(28), లగ్గేరి నివాసి దీపక్ అలియాస్ దీపు(31), గంగానగరకు చెందిన మను అలియాస్ మహేంద్ర(21), దయానంద్ అలియాస్ దయా(25), మునిస్వామి అలియాస్ స్వామి(34), సతీశ్(24)లను ఉత్తర విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.45 లక్షల విలువైన 332 గ్రాములు బంగారం, రూ.59 వేల నగదు, 23 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఓ ఉపాధ్యాయురాలు జనవరి 10న బీఎంటీసీ బస్ దిగి కాలినడకన వెళ్తుండగా బైకుపై వచ్చిన దుండగులు ఆమె మెడలోని 50 గ్రాములు బంగారు మాంగల్య చైన్ లాక్కొని ఉడాయించారు. ఈ చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. నిందితులు అనేక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. -
అమ్మ, అమ్మమ్మ కలిసి.. అమ్మాయిని అమ్మబోయి..
పహాడీషరీఫ్: పేదరికమో, మరో కారణమో.. డబ్బుల కోసం 14 ఏళ్ల అమ్మాయిని ఓ కుటుంబం బేరానికి పెట్టింది.. భార్యకు విడాకులిచ్చి ‘మరో తోడు’ కోసం చూస్తున్న 61 ఏళ్ల వృద్ధుడికి ఆమెను అమ్మేందుకు సిద్ధమైంది. అమ్మ, అమ్మమ్మ కలిసి.. మరో ఐదుగురు మహిళలు మధ్యవర్తులుగా నిలిచి.. చేయబోయిన ఈ దారుణాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం రాత్రి దాడులు చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్లోని బండ్లగూడ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన సయ్యద్ అల్తాఫ్ అలీ (61) ఆరేళ్ల క్రితం తన భార్యకు విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకు మరో తోడు అవసరమని భావించాడు. ఇందుకోసం హైదరాబాద్లోని క్యూబా కాలనీలో నివాసం ఉండే అఖిల్ అహ్మద్ (37)ను సంప్రదించాడు. ఇద్దరూ కలిసి షాహీన్నగర్, చాంద్రాయణగుట్ట పరిసరాలకు చెందిన మహిళలను అక్రమంగా రవాణా చేసే జరీనా బేగం (25), షబానా బేగం (38), షమీం సుల్తానా (45), నస్రీన్ బేగం (40), జాహెద్బీ (72)లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారు. ఈ మధ్యవర్తులు బండ్లగూడ నూరీ నగర్కు చెందిన అష్రియా బేగం కుమార్తె (14 ఏళ్లు)ను అల్తాఫ్ అలీకి రూ.5 లక్షలకు విక్రయించేందుకు ఆమె అమ్మమ్మ చాంద్ సుల్తానా (65) సమక్షంలో మూడు నెలల కింద ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ అల్తాఫ్ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేయడంతో ఒప్పందం రద్దయింది. అయితే కొద్దిరోజుల కింద బాలిక మేనమామకు ప్రమాదం జరిగి, డబ్బులు అవసరం పడ్డాయి. దీనితో అష్రియా బేగం తన బిడ్డను విక్రయించేందుకు సిద్ధమై మధ్యవర్తులను ఆశ్రయించింది. వారు వెంటనే ముంబైకి చెందిన అల్తాఫ్ అలీకి సమాచారమిచ్చారు. డబ్బు అత్యవసరం కావడంతో ఈసారి రూ.3 లక్షలకే బాలికను కొనేందుకు బేరం కుదుర్చుకొన్నారు. డబ్బు చెల్లించి బాలికను తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో.. బాలాపూర్ ఎస్సై శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం ఆదివారం రాత్రి దామని ఎర్రకుంటలో దాడులు చేసింది. తొమ్మిది మందిని అరెస్ట్ చేసి బాలికను రక్షించింది. పోలీసులు నిందితులపై పోక్సో, మహిళల అక్రమ రవాణా చట్టాల కింద కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్కు తరలించారు. -
మొత్తం నాలుగు రోజుల సెలవులు! అక్కడి ఉద్యోగులకు సర్కార్ బంపరాఫర్
సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?.. అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి. To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave. I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB — Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022 టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చదవండి: టెస్లాలో మనోడు.. తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర -
ఏం జరిగిందో ఏమో.. 20 రోజుల్లో నలుగురి కన్నుమూత
పిఠాపురం: తక్కువ కాల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వరుస మరణాలతో తేరుకోలేకపోతోంది. కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్ నిర్వాసిత కాలనీలోని కొల్లావారిపాకలులో కొల్ల సింహాచలం కుటుంబం నివసిస్తోంది. ఈమెకు ఒక కొడుకు, నలుగురు కుమార్తెలు. ఉద్యోగ రీత్యా కొడుకు శ్రీను హైదరాబాద్లో ఉంటున్నాడు. గత నెల 26న స్వగ్రామంలో బంధువుల ఇంట వివాహానికి వచ్చాడు. ఆ సమయంలో అతడి మేనల్లుడు కామేశ్వరరావు పచ్చ కామెర్ల బారిన పడి, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మేనల్లుడి పెద్దకార్యం అయ్యాక వెళదామని శ్రీను ఉండిపోయాడు. ఈలోగా మనవడు కామేశ్వరరావు చనిపోయాడన్న దిగులుతో శ్రీను తల్లి సింహాచలం మంచం పట్టింది. మృతులు సింహాచలం, కొల్ల శ్రీను (ఫైల్) ఈ నెల 11న వాంతులు విరేచనాలు అవడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడింది. మేనల్లుడు, తల్లి మృత్యువాత పడడం తట్టుకోలేక శ్రీను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అతడు కూడా వాంతులు, విరేచనాలతో అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ నెల 12న కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ప్రాణం విడిచాడు. వరుస మరణాలతో కుంగిపోయిన కామేశ్వరరావు భార్య లోవకుమారి కూడా అనారోగ్యం బారిన పడింది. ఆమెకు కూడా వాంతులు, విరోచనాలు కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 14న చనిపోయింది. 20 రోజుల వ్యవధిలోనే నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. అమ్మ, నాన్న కావాలంటూ దీనంగా చూస్తున్న మనోజ్ ఏం జరిగిందో.. నలుగురిలో ముగ్గురు వాంతులు, విరేచనాల లక్షణాలతోనే చనిపోయారు. అసలేం జరుగుతోందో.. ఎందుకిలా వరుస మరణాలు సంభవించాయో తెలియక ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నలుగురు చనిపోయినా గ్రామంలో స్థానిక అధికారులెవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, వైద్య, ఆరోగ్య సిబ్బంది కానీ వచ్చి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటున్నారు. చనిపోయిన వారికి ఏవ్యాధి సోకిందనేది చర్చనీయాంశమైంది.వారి ఆలనాపాలన మాటేంటి..! కామేశ్వరరావు దంపతులు కన్నుమూయడంతో మనోజ్ ఒంటరి అయ్యాడు. అమ్మా నాన్న తప్ప మరో లోకం తెలియని రెండేళ్ల ఈ పసివాడిని చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మృతురాలు సింహాచలానికి నలుగురు కుమార్తెలు. ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది. మరో ఇద్దరు కుమార్తెలు రామలక్ష్మి, సూరీడు దివ్యాంగులు. వీరిది లేచి నడవలేని స్థితి. ఇన్నాళ్లూ తల్లి సింహాచలమే అన్నీ తానై సేవలు చేస్తూ పోషించింది. తల్లి సింహాచలం మృతి చెందడంతో అనాథలుగా మిగిలిపోయారు. -
ప్రముఖ సింగర్ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారందరి మొబైల్స్ కూడా స్విచ్చాఫ్లో ఉన్నాయి. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఏకే రావు మృతిపై బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సుజనా ఫౌండేషన్ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీతో నివాసముంటున్నారు. చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట! ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు చివరిసారిగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. 23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు. మృతుడి శరీరంపై కత్తిగాట్లు ఉండటంతో హత్య కోణంలో బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఏకేరావును హతమార్చి మృతదేహాన్ని ట్రాక్పై పడేసి ఉండొచ్చిని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిణి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హరిణి ఓ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాళయాలం, హిందీ సినిమాల్లో చాలా పాటలు పాడారు. -
నెల్లూరులో విషాదం: గ్యాస్ లీక్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
సాక్షి, నెల్లూరు:నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. మల్లం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు భారీగా వ్యాపించడంతో దంపతులు అబ్బాస్, నౌషాద్కు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే మృతి చెందగా, కుమార్తె అయేషాను చికిత్సకోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయేషా కూడా మృతి చెందింది. వివరాల ప్రకారం.. అబ్బాస్ కుటుంబం మల్లంలో టిఫిన్ అంగడి నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున యధావిధిగా గ్యాస్ వెలిగించడంతో అప్పటికే గ్యాస్ లీక్ అయిన క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో బాధితులు అహకారాలు చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే ఇంట్లో ఉంటున్న ముగ్గురు తీవ్రగాయాలపాలై మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో.. -
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
అనంతపురం క్రైం: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్కు చెందిన సంగమేష్, సాయిమౌనిక దంపతులు. 2011లో వివాహమైన వీరికి లిఖిత శరణ్య, లిఖిత కార్తికేయన్, మణికృష్ణ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంగమేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చదవండి: పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు! సోమవారం ఉదయం పిల్లలను పాఠశాల వద్దకు వదిలి వస్తానని చెప్పి వెళ్లిన భార్య సాయి మౌనిక తిరిగి రాలేదు. దీంతో పిల్లలు చదువుతున్న పాఠశాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో సంగమేష్ గాలించాడు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ -
50 రకాల వంటకాలతో పునీత్కు పాలశాస్త్రం పూజలు
బెంగళూరు: పునీత్ రాజ్కుమార్ సమాధికి కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాలశాస్త్రం పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు ఆయన ఇష్టపడే ఇడ్లి, రాగిముద్ద, నాటుకోడి సాంబారుతో పాటు 50 రకాల వంటకాలను సమాధిపై పెట్టి పూజలు చేశారు. భార్య అశ్విని, కూతుర్లు ధృతి, వందితా, అన్నలు శివరాజ్కుమార్, రాఘవేంద్ర రాజ్కుమార్ కుటుంబ సభ్యులు, మంత్రి గోపాలయ్య పాల్గొన్నారు. తమిళ నటుడు పరామర్శ: తమిళ నటుడు శివ కార్తికేయన్ మంగళవారం బెంగళూరు నాగవారలోని శివరాజ్కుమార్ నివాసానికి వెళ్లారు. భార్య, కూతుర్లను పరామర్శించి, కంఠీవర స్టూడియోకు వెళ్లి సమాధికి పూజలు చేశారు. నేటి నుంచి పునీత్ సమాధి దర్శనాలు బనశంకరి: బుధవారం నుంచి పునీత్ రాజ్కుమార్ సమాధి దర్శనానికి అవకాశం కల్పిస్తారు. మంగళవారం పునీత్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు పాల పూజల అనంతరం పునీత్ అన్న శివరాజ్కుమార్ మాట్లాడుతూ... అప్పు సమాధి దర్శనానికి బుధవారం నుంచి అభిమానులను అనుమతి ఇస్తామని తెలిపారు. చదవండి: (పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన హీరో నాగార్జున) -
కుటుంబ పరువు తీసిందని.. కుటుంబీకులే అంతమొందించారు..
సాక్షి, హాలహర్వి (కర్నూలు): పలు మార్లు తమను అవమానించి కుటుంబ పరువు తీసిందని ఇంటి పెద్ద కోడలిని కుటుంబీకులే అంతమొందించారు. చింతకుంట గ్రామంలో గత నెల 15వ తేదీన జరిగిన మహిళ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలూరు సీఐ ఈశ్వరయ్య, హాలహర్వి ఎస్ఐ వెంకట సురేష్ సోమవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గ్రామానికి చెందిన ఎర్రిస్వామికి నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు వన్నప్పకు పదేళ్ల క్రితం అర్ధగేరి గ్రామానికి చెందిన సువర్ణమ్మ(30)తో వివాహమైంది. వీరికి సంతానం కాలేదు. కుటుంబ కలహాలతో సువర్ణమ్మ పలు మార్లు మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నతో ఘర్షణ పడి చెప్పుతో కొట్టడం, వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ పరువు తీసిందని భావించి సువర్ణమ్మను మట్టుబెట్టాలని కుట్ర పన్నారు. నిందితుల అరెస్ట్ చూపుతున్న సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ వెంకట సురేష్ అక్టోబర్ 15వ తేదీన దసరా పండుగ రోజు వన్నప్ప బన్ని ఉత్సవానికి దేవరగట్టుకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ ఎర్రిస్వామి, మరుదులు సుంకన్న, బ్రహ్మయ్య, హనమంతు అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సువర్ణను గొడ్డలితో నరికి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లి కర్ణాటకలోని మోకా వద్ద వీరాపురం రైల్వే ట్రాక్పై పడేశారు. మరుసటి రోజు సువర్ణమ్మ కనిపించడం లేదని భర్త వన్నప్ప, ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మూడు రోజుల తర్వాత రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని శవం వెలుగులోకి రావడంతో హత్య చేసి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వన్నప్ప కూడా తన తండ్రి, తమ్ముళ్లపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు) -
13 నుంచి మళ్లీ ములాఖత్లు!
సాక్షి, హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను, నిందితులను కలవడానికి కుటుంబ సభ్యులు, బంధువులకు తిరిగి అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ కారణంగా ఆగిన ములాఖత్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి ఈ ములాఖత్లు ప్రారంభం అవుతాయని ఉన్నతస్థాయి వర్గాల సమాచారం. అయితే కోవిడ్ ఉధృతి పూర్తిగా తగ్గనందున.. కరోనా టీకా రెండు డోసులు వేసుకున్న వారినే జైళ్లలో ఉన్న వారిని కలవడానికి అనుమతించాలన్న నిబంధన విధించారు. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గత సంవత్సరం మార్చి 23 నుంచి ఈ ములాఖత్లను నిలిపివేశారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జైళ్లలో ఉన్న తమవారిని కలిసేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ క్రమంలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిమాండ్, శిక్షపడ్డ ఖైదీల ములాఖత్కు సంబంధించి తొమ్మిది అంశాలతో కూడిన నిబంధనలు విధించింది. కోవిడ్ సమయం కావడంతో ములాఖత్కు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించాలని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ►రిమాండ్లో ఉన్న ముద్దాయికి వారానికి ఒకసారి ములాఖత్. ►శిక్ష పడ్డ నిందితునికి 15 రోజుల్లో ఒకసారి. ►కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, భార్య/ భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు మాత్రమే అనుమతి. ►ములాఖత్ల సమయంలో సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరి. ►టీకా రెండు డోసులు తీసుకున్నట్లు ధ్రువీకర ణ పత్రం..తినుబండారాలకు అనుమతి లేదు. ►ముద్దాయికి ఒక జత బట్టలకు అనుమతి. -
పొలం వివాదం: సెల్ఫీ వీడియోలపై స్పందించిన సీఎంవో
సాక్షి, వైఎస్సార్ జిల్లా: దువ్వూరు మండలం ఎర్రబల్లి వద్ద పొలం వివాదం ఘటనలో అక్బర్ బాషా కుటుంబ సభ్యుల సెల్ఫీ వీడియోలపై సీఎంవో స్పందించింది. అక్బర్ బాషా ఆవేదనపై సీఎం కార్యాలయం స్పందిస్తూ.. అక్బర్ బాషా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టాలని ఎస్పీని ఆదేశించింది. అక్బర్ బాషా కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ: ఎస్పీ అన్బురాజన్ అక్బర్ బాషా కుటుంబం.. ఎస్పీ అన్బురాజన్ను కలిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్బర్ బాషా ఆత్మహత్యాయత్నం వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించామన్నారు. చాగలమర్రి దువ్వూరు పోలీసుల సహకారంత కాపాడగలిగామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని.. అదనపు ఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో విచారణ చేపట్టామని ఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు. విచారణ జరిగే వరకు సీఐ కొండారెడ్డిని విధుల నుంచి తప్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీఐ, ఇతర పోలీసుల తప్పు ఉంటే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. అక్బర్ బాషా కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇవీ చదవండి: ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం: 19 మందిపై ఎఫ్ఐఆర్ ఢిల్లీలో భారీ వర్షం.. 18 ఏళ్ల తర్వాత తొలిసారి -
కాళ్లు మొక్కినా కనికరించలే..! వరుసబెట్టి ముగ్గురిని..!
సాక్షి, వరంగల్: డబ్బుల కోసం విచక్షణ కోల్పోయిన ఓ తమ్ముడు.. సొంత అన్న కుటుంబాన్ని మట్టుబెట్టాడు. ‘మా వాళ్లను చంపకండి బాబాయ్... మీకెన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం. వదిలేయండి ప్లీజ్’అంటూ అన్న కూతురు కాళ్ల మీద పడి వేడుకున్నా వినలేదు. నిమిషాల వ్యవధిలో అన్న చాంద్పాషా(50), వదిన సాబీరా(42), బావమరిది ఖలీల్ (40)ని అంతమొందించాడు. ఈ దారుణ ఘటన వరంగల్లో కలకలం రేపింది. స్థానికులు, కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్లోని ఎల్బీనగర్కు చెందిన చాంద్పాషాకు షఫీతోపాటు మరో సోదరుడు ఉన్నాడు. చాంద్పాషా, షఫీలు పరకాల కేంద్రంగా 20 ఏళ్లుగా పశువులు, గొడ్డు మాంసం వ్యాపారం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం వ్యాపారంలో లెక్కలు చూసుకుంటే రూ.1.20 కోట్ల వరకు అప్పు తేలింది. ఈ లెక్కల వ్యవహారాలు షఫీ చూస్తున్నందున వచ్చిన నష్టంలో రూ.80 లక్షలు షఫీ, రూ.40 లక్షలు చాంద్పాషా భరించాలని నిర్ణయించుకున్నారు. తనకు పెద్ద మొత్తంలో కావాలనే అప్పుగా ఇచ్చారని, కట్టలేనని షఫీ మొండికేయడంతో వ్యాపారం చేసేందుకు చాంద్పాషా ఒప్పుకోలేదు. దీంతో షఫీ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్బీనగర్లో రూ.కోటికి పైగా వ్యయంతో చాంద్పాషా ఏడాది క్రితం నూతన గృహాన్ని నిర్మించాడు. తనకు అప్పులు వేసి, అన్న డబ్బులు దాచుకొని కొత్త ఇల్లు కట్టుకున్నాడని షఫీ పలుమార్లు స్నేహితులు, బంధువుల వద్ద వాపోయాడు. అప్పులతో ఇబ్బంది పడుతున్నానని, ఆదుకోవాలని అన్నా వదినలను బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో కుటుంబాన్ని మట్టుబెట్టాడు. స్నేహితుల సాయంతో.. పథకం ప్రకారం షఫీ స్నేహితులతో కలసి అర్ధరాత్రి వర కు మద్యం సేవించాడు. ఇంటి తలుపులను కోసేందుకు ఎలక్ట్రిక్ రంపంతోపాటు వారిని నరికేందుకు పదునైన వేట కొడవళ్లు, కత్తులను తీసుకొని ఆటోలో బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో అన్న ఇంటికి చేరుకున్నాడు. రంపంతో తలుపులను సగం వరకు కోశాడు. ముగ్గురు ఇంటి బయట పరిసరాలను గమనిస్తుండగా.. షఫీతోపాటు మిగిలినవాళ్లు లోపలికి వెళ్లారు. అలికిడికి నిద్ర లేచిన చాంద్పాషా ఎవరు, ఎవరు అంటూ రాగా.. అంతలోనే షఫీ రంపంతో చాతిభాగంలో కోశాడు. ఆ తరువాత పదునైన కత్తితో తలపై నరకడంతోపాటు శరీరంపై పలుమార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. అడ్డుకోబోయిన చాంద్పాషా బావమరిది ఖలీల్ను కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి చంపేశాడు. తర్వాత వదిన సాబీరానూ విచక్షణారహితంగా పొడిచి హతమార్చాడు. వేరే గదిలో ఉన్న చాంద్పాషా కుమార్తె రూబీనా(23) బయటకు వచ్చి బాబాయ్.. అమ్మా, నాన్నలను ఏం చేయొద్దని వేడుకున్నా కనికరించలేదు. అడ్డువచ్చిన చాంద్పాషా కుమారులు ఫహాద్ (28), సమద్ (21)లను కొడవలితో పొడవడంతో వారు రక్తస్రావమై కిందపడిపోయారు. తర్వాత 2.35 గంటల ప్రాంతం లో స్నేహితులతో కలిసి షఫీ ఆటోలో తిరిగి వెళ్లిపోయాడు. పైన అద్దెకున్నవారు కిందకు వచ్చే ప్రయత్నం చేయగా... అడ్డొస్తే చంపుతానని బెదిరించారు. కాళ్లు మొక్కినా కనికరించలేదు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో చప్పుడు వచ్చింది. అంతలోనే మా నాన్న ఎవరు.. ఎవరు అంటుండగానే బాబాయ్ రంపం, కత్తులతో నాన్నపై దాడి చేశాడు. తర్వాత మామ ఖలీల్ను నరికేశాడు. ఇది గమనించిన మా అమ్మ సాబీరా రెండేళ్ల నా బిడ్డను పట్టుకుని బాత్రూమ్లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేయగా ఆమెనూ వదల్లేదు. నా పాపను నా చేతిలో పెట్టి మా తల్లిని సైతం కిరాతంగా హతమార్చాడు. బాబాయ్ డబ్బులు మొత్తం నాన్నతో ఇప్పిస్తా వదిలేయ్ బాబాయ్ అని కాళ్లు మొక్కినా వినలేదు. వాడిని చంపేయండి వదిలిపెట్టొద్దు. – మృతుడి కుమార్తె రూబీనా వర్షం రాకుంటే..ఇంటికి వచ్చేటోడు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చాంద్పాషా బావమరిది సయ్యద్ ఖలీల్ వర్షం రాకపోతే ప్రాణాలతో బయటపడేవాడు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామానికి చెందిన ఖలీల్ హన్మకొండలోని ఓ మొబైల్షాపులో సర్వీస్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రోజూ ఇంటినుంచి హన్మకొండకు బైక్పై వెళ్లి వస్తుంటాడు. ఆలస్యమైనప్పుడు వరంగల్లోని తన అక్క ఇంటికి వెళ్లేవాడు. కేసముద్రంలో నూతనంగా మొబైల్షాపు పెట్టాలని నిర్ణయించుకున్న ఖలీల్ ఆగస్టు 31న తన జాబ్కు రాజీనామా చేశాడు. వర్షం వస్తుండటంతో అక్క ఇంటికెళ్లాడు. బావను చంపేందుకు వచ్చిన షఫీని అడ్డుకోబోయిన ఖలీల్ కూడా హత్యకు గురయ్యాడు. వర్షం రావడంతో ఖలీల్ అక్క ఇంటికెళ్లాడని, లేకుంటే ఇంటికి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి... షఫీ వెళ్లిపోగానే ఆ ఇంట్లో అద్దెకున్న అజీమ్ కిందకు వచ్చి కార్పొరేటర్ పుర్కాన్కు సమాచారమివ్వగా ఆయన అక్కడికొచ్చారు. 3.40 గంటల ప్రాంతంలో డయల్ 100కు కాల్ చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న సమద్, ఫహాద్లను అంబులెన్స్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 4.05 గంటల ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్లో ఉన్న మట్టెవాడ ఇన్స్పెక్టర్ గణేష్ ఘటనాస్థలికి రాగా, తర్వాత వరంగల్ ఏసీపీ కె.గిరిధర్, పోలీసు కమిషనర్ తరుణ్ జోషి వచ్చారు. నిందితులు ఇంటిబయట ఓ సంచిలో వదిలిపెట్టిన కత్తులను, రంపాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల సహాయంతోపాటు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా షఫీతోపాటు మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. రూబీనా ఫిర్యాదుమేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదుచేశారు. కాగా, షఫీపై 2010లో మట్టెవాడ ఠాణాలో అక్రమ ఆయుధాల సరఫరా కేసు నమోదైంది. దాడి ఘటనలో వరంగల్, పరకాల, నర్సంపేట ప్రాంతాలకు చెందిన షఫీ దగ్గరి మిత్రులు పాలుపంచుకున్నట్లు సమాచారం. -
చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు
సాక్షి, తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. సంబంధన్ పేటకు చెందిన పళణి (43), సోదరుడు కందన్ (40), అదే గ్రామానికి చెందిన కరుప్పన్న స్వామి (32), అశోక్ (26) కుటుంబ సభ్యులు కలెక్టరేట్ ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. విచారణలో పళని తమ్ముడు ముత్తు (38) భార్య ప్రియ (30) మధ్య విభేదాలు వచ్చినట్లు.. కలిసి ఉండాలని గ్రామ పెద్దలు చెప్పినా ముత్తు నిరాకరించాడని.. దీంతో పంచాయితీ పెట్టి రూ.16 లక్షలు ప్రియకు చెల్లించాలని తీర్పు చెప్పినట్లు తెలిసింది. ముత్తు అదృశ్యం కావడంతో తమ కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
లైంగికంగా వేధించిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన మహిళా కుటుంబసభ్యులు
-
కర్నూల్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
దారుణం: నిద్ర మాత్రలిచ్చి కుటుంబ సభ్యులనే కిరాతకంగా..
కోల్కతా: అడిగిన డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులను ఓ ఇంటర్ విద్యార్థి కిరాతకంగా కడతేర్చాడు. ఈ ఘటన జరిగి సుమారు నాలుగు నెలలు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణం పశ్చిమ బెంగాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆసిఫ్ మొహమ్మద్ తన కుటుంబానికి కాలయముడిగా మారాడు. నాలుగు నెలల క్రితం ఆసిఫ్ తన తల్లి, తండ్రి, సోదరితో పాటు 62 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేశాడు. కాగా ఈ సంఘటన నుంచి నిందితుడి సోదరుడు ఆరిఫ్ మొహమ్మద్ తప్పించుకున్నాడు.. అయితే ఆసిఫ్ అకృత్యాన్ని ఎట్టకేలకు బయటపెట్టాలని నిర్ణయించుకున్న అతని సోదరుడు.. కాలియాచోక్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించటంతో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 28 న, ఆసిఫ్ కుటుంబ సభ్యులందరికీ నిద్ర మాత్రలు కలిపిన శీతల పానీయాలను అందించాడు. వారు అపస్మారక స్థితిలో చేరడంతో, అతి కిరాతకంగా హత్య చేసి ఆ ఇంటి ఆవరణలోనే పూడ్చి పెట్టాడు. దీంతో పోలీసులు ఆసిఫ్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఆసిఫ్ నిత్యం తన తండ్రి డబ్బులకోసం డిమాండ్ చేసేవాడని స్థానికులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: దొంగతనం కేసులో ‘క్రైమ్ పెట్రోల్’ సీరియల్ యాక్టర్స్ అరెస్టు -
Covid-19: ఉద్యోగుల కుటుంబాలకు గుడ్న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా నియంత్రణకు జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా పరిశ్రమల్లో, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగి కుటుంబ సభ్యులు, డిపెండెంట్లకు వారితో పాటే వ్యాక్సిన్లు వేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్ షీల్ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు శనివారం లేఖ రాశారు. పరిశ్రమల్లో, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారితోపాటు కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ వేయాలని వచ్చిన విజ్ఞప్తులపై సమీక్ష జరిపి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే వారి కోసం ఆయా సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేట్ ఆసుపత్రులే వ్యాక్సిన్లను సేకరించాలని తెలిపారు. ఈ మేరకు శనివారం కేంద్రం ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొంది. ప్రభుత్వ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ అవసరమైన వాళ్లలో 45 సంవత్సరాలు పైబడిన వారి కోసం కేంద్రం రాష్ట్రాలకు అందించే కోటా నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. అదే క్రమంలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రం వ్యాక్సిన్ తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన కోటా నుంచి ఇవ్వాల్సిందిగా మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: కరోనా థర్డ్ వేవ్, సెంట్రల్ యాక్షన్ ప్లాన్ -
క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. ఏకంగా పది మందికి
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రోజువారి రికార్డు స్థాయి కేసులతో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా భారత్ ఆఫ్ స్పిన్నర్, ఆల్ రౌండర్ అశ్విన్ కుటుంబంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఏకంగా ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకింది. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అశ్విన్ కుటుంబ సభ్యులు ఈ శుక్రవారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ప్రీతి ట్వీట్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో ఉన్న అశ్విన్ గతవారం సీజన్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రీతి తమ అనుభవాలను అటు ట్విటర్, ఇటు ఇన్స్టాలో షేర్ చేశారు. గతవారంమంతా ఒక పీడకలలా గడిచింది ‘‘మా ఇంట్లో ఉన్న పది మందికి కరోనా వైరస్ సోకింది. అందులో 6గురు పెద్దలు, 4 పిల్లలు ఉన్నారు. పిల్లల కారణంగా అందరికీ ఈ మహమ్మారి వ్యాపించింది. ప్రస్తుతం కుటుంబంలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, ఆసుపత్రుల్లో చేరడంతో గతవారం మా కుటుంబానికి ఓ పీడకలలా గడిచింది. 5-8 రోజులు చాలా కష్టంగా గడిచాయి. సాయం చేయడానికి అందరూ ఉన్నా.. చేయలేని పరిస్థితి. ఇదో మాయదారి వైరస్. మానసిక ఆరోగ్యం కంటే శారీరక ఆరోగ్యం ద్వారానే వేగంగా కోలుకోగలమని భావిస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోండి, టీకాతోనే మనం ,మన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారితో పోరాడగలం‘‘ అంటూ ప్రీతి ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ ఐపీఎల్ సీజన్కు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు గత ఆదివారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ నుంచి తప్పుకున్న తొలి భారతీయ క్రికెటర్ అశ్విన్. కరోనా సోకి కష్టకాలంలో ఉన్న తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ( చదవండి: తండ్రికి కరోనా పాజిటివ్.. ఐపీఎల్ వదిలి వెళ్లిన మాజీ ఆటగాడు ) Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home. — Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021 -
నంద్యాల: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
-
విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
సాక్షి, కర్నూలు: నంద్యాల మాల్దార్పేటలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్, కళావతి, అంజలి(16), అఖిల(14)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతోనే వారు ఆత్మహత్య చేసుకోవచ్చని స్థానికులు చెబుతున్నారు. చదవండి: కరోనా: బెడ్డు దొరక్క కాబోయే వరుడు మృతి -
ఇంట్లో ఎవరికైనా ఒకరికి కరోనా పాజిటివ్ వస్తే, మిగతా కుటుంబ సభ్యులు కూడా మందులు వాడాలా?
వాడాలి. మిగతా కుటుంబసభ్యులు టెస్ట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా, టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ నెగెటివ్ వచ్చినా, లక్షణాలు ఉన్నా, లేకున్నా.. డాక్టర్ సూచన మేరకు మందులు వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఇన్ఫెక్షన్కు గురైనా లక్షణాలు ఉండకపోవచ్చు. ఇబ్బందిపడకపోవచ్చు. అలాగే లక్షణాలు బయటపడడానికి సమయం పట్టొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా యాంటీ బయోటిక్స్, ఇతరత్రా మందులు వాడితే సీరియస్ కాకుండా బయటపడొచ్చు. కుటుంబంలో ఎందరుంటే అందరూ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే లక్షణాలుండి నెగెటివ్ ఉన్నా తర్వాత రేపో మాపో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాస్తవానికి లక్షణాలు లేకుండా కరోనా ఉండదు కానీ, చాలామంది వాటిని గుర్తించలేరు. ఉదాహరణకు కొందరికి తలనొప్పి వస్తుంది. దాన్ని సర్వసాధారణమని అనుకుంటారు. ఎండలో తిరగడం వల్ల, విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అని అనుకుంటారు. కానీ ఇలాంటివి కూడా లక్షణాలే. తరచుగా కరోనా టెస్టులు చేయించుకోం కాబట్టి మందులు వాడితే మేలు. ఒకవేళ అది కరోనా కాకుండా ఇతరత్రా టైఫాయిడ్ వంటివి ఏమైనా అయినా కూడా ఈ మందులు వాడటం వల్ల ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. ఏవైనా యాంటీ బయోటిక్స్తో సెట్ అవుతాయి. ఏ మందులైనా డాక్టర్ల సూచన మేరకు వాడాలి. - డాక్టర్ హెఫ్సిబా ప్రభుత్వ వైద్య అధికారి, హైదరాబాద్ కరోనా సంబంధిత ప్రశ్నలు కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? కరోనా: ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది? కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా? -
ప్రేమించినోడే వేధించడంతో..
సాక్షి, ఎమ్మిగనూరు: కౌతాళం మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుజాత(22) ఎల్ఎల్సీలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దతుంబళం గ్రామానికి చెందిన హనుమంతప్ప, సువార్తమ్మ కుమారుడు సుంకప్ప అదే ప్రాంతానికి చెందిన రామదాసు, పద్మ కూతురు సుజాత(22) ఐదేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెద్దతుంబళం పోలీస్స్టేషన్లో పెళ్లి చేసుకున్నారు. సుంకప్ప గ్యాంగ్మెన్గా తుంగభద్ర రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి సైనా(4), యువాంక(2), ఈరన్న (9నెలలు) పిల్లలున్నారు. కాగా పెళ్లయిన రెండేళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చదువుకోలేదని నిత్యం వేధించేవాడు. భర్తతో పాటు అత్త, మామ, బావలు ఆనంద్, దేవయ్య, ఆగ్రిఫ్ సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈక్రమంలో వారం క్రితం పుట్టినింటికి వెళ్లగా తల్లి సర్దిచెప్పి పంపింది. సోమవారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన భర్త.. మరోసారి గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురై పిల్లలను వదలి ఇంట్లో నుంచి రాత్రి 7గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఈ విషయమై సుంకప్ప వెంటనే అత్తకు ఫోన్లో చెప్పడంతో ఇరు కుటుంబాల సభ్యులు కలసి గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్స్టేషన్లో అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. కాగా ఉదయం ఎమ్మిగనూరు అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఎల్ఎల్సీలో మృతదేహం బయటపడింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన వారు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్, టౌన్, రూరల్ సీఐలు ప్రభాకర్రెడ్డి, బీఏ మంజునాథ్, రూరల్ ఎస్ఐ రామసుబ్బయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ‘నా కూతురిని హత్య చేశారు’ భర్త, అత్త, మామ వారి కుటుంబ సభ్యులే తమ కూతురిని హత్య చేసి కాలువలో పడేశారని మృతురాలు తల్లి పద్మ బోరున విలపించింది. నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్ఐ చంద్ర తెలిపారు. -
బిగ్ సర్ప్రైజ్: హౌస్లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీస్!
బిగ్బాస్ నాల్గో సీజన్ పదకొండో వారంలోకి అడుగు పెట్టింది. బరువెక్కిన హృదయాలతో మెహబూబ్కు వీడ్కోలు చెప్పిన కంటెస్టెంట్లు సోమవారం మాత్రం ఆగ్రహంతో మాటల తూటాలు పేల్చుతూ రగిలిపోయారు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరిని ఒకరు దిగజార్చుకు ప్రయత్నం చేశారు. గత వారం అందరూ అరియానాను నామినేట్ చేయగా ఈసారి ఎక్కువ మంది అభిజిత్ను టార్గెట్ చేశారు. కానీ ఏం చేసినా, ఎంత ఎగిరెగిరి పడ్డా వాళ్లకే నష్టం కానీ అభికి మాత్రం పోయేదేమీ లేదు. పైగా తన అభిమాన గణం అభి ఏం చేసినా వెనకేసుకురావడానికి, అనుక్షణం సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండనే ఉంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే బిగ్బాస్ షో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మజిలీలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కంటెస్టెంట్లకు ఇంటినుంచి లేఖలు అందాయి. కానీ ఇప్పటికీ వారిని చూసుకునే భాగ్యం కలగలేదు. కొందరికైతే ఆ లెటర్స్ కూడా దక్కలేదు. (చదవండి: బిగ్బాస్ నుంచి మెహబూబ్ అవుట్!) షో ముగియడానికి మరికొద్ది రోజులే ఉన్న తరుణంలో కంటెస్టెంట్ల కుటుంబీకులను ఇంట్లోకి పంపిస్తారా? లేదా? అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ రోజు రానే వచ్చినట్లు తెలుస్తోంది. ఫిజికల్ టాస్కులో కష్టపడి అలిసిపోతున్న ఇంటిసభ్యులకు ఈ రెండు రోజుల్లో స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోతుందట. బాధతో బరువెక్కిన కంటెస్టెంట్ల హృదయాలను లాలించేందుకు వారి ఆప్తులు హౌస్లోకి అడుగు పెట్టనున్నారట. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే కనక నిజమైతే ఇంటిసభ్యుల కన్నీటి వరదతో ఎపిసోడ్ ఎమోషనల్గా మారనుంది. అసలే సూటిపోటి మాటలతో వైరాలు పెంచుకుని అగాధాలు సృష్టించుకుని కోపతాపాల్లో కూరుకుపోయిన ఇంటిసభ్యులకు ఈ అవకాశం మంచి బూస్ట్ ఇచ్చినట్లవుతుంది. మరి నిజంగా నేటి ఎపిసోడ్లో ఫ్యామిలీ మెంబర్స్ వస్తారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: లాస్యకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన బిగ్బాస్) -
కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో క్రికెటర్ల వెంట వారి కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం తెలిపింది. రెండున్నర నెలల పాటు సాగనున్న ఈ పర్యటనలో కుటుం బ సభ్యుల్ని కూడా అనుమతించాలని సీనియర్ క్రికెటర్లు కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో తొలుత బీసీసీఐ ఈ అంశాన్ని వ్యతిరేకించింది. ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న భారత క్రికెటర్లు ఫైనల్ ముగియగానే నేరుగా ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. ఇప్పటికే నెలకు పైగా కుటుంబాలకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా లాంటి కొందరు సీనియర్ క్రికెటర్లు... ఆసీస్ పర్యటన ముగించుకొని తిరిగి భారత్ వచ్చేసరికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనుంది. దీంతో బీసీసీఐ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిపింది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఆస్ట్రేలియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్లో భారత్ 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు ఆడనుంది. -
ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం
హాథ్రస్: భద్రతా కారణాల రీత్యా తాము ఢిల్లీ వెళ్లి, అక్కడి నుంచే న్యాయ పోరాటం చేస్తామని హాథ్రస్ బాధిత కుటుంబం చెప్పింది. హాథ్రస్ ఘటనలో మరణించిన దళిత యువతి సోదరుడు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి న్యాయ సాయం అందిస్తున్న సీమా కుష్వాహ కూడా స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ ఎదుట ఆమె శనివారం హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబం ఈ కేసును ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ తరలించి విచారణ జరిపించాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి భద్రత కల్పిస్తున్న ఎస్డీఎం అంజలి గంగ్వార్ కుటుంబ సభ్యులను కలిసి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. రేషన్ను అందిస్తామని చెప్పారు. పొలంలోకి వెళ్లేందుకు భద్రత కావాలని కుటుంబ పెద్ద అడిగారని, అందుకు అంగీకరించామని అంజలి తెలిపారు. -
‘హాథ్రస్ కుటుంబాని’కి మూడంచెల భద్రత
న్యూఢిల్లీ: హాథ్రస్ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలియజేసింది. హాథ్రస్ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు.. 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కాపలాగా ఉన్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో జోక్యం చేసుకో రాదని పోలీసులకు ఆదేశాలిచ్చామని, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
కోర్టులో హాజరైన హాథ్రస్ బాధిత కుటుంబీకులు
లక్నో: యూపీలోని హాథ్రస్లో నలుగురు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన దళిత యువతి కుటుంబ సభ్యులు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ ఎదుట హాజరయ్యారు. కేసును కోర్టు విచారించి తదుపరి విచారణను నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. బాధితురాలి తల్లి, తండ్రి, ఆమె ముగ్గురు సోదరులు కోర్టుకొచ్చారు. బాధిత యువతి శవాన్ని దహనం చేయడంలో, పై అధికారుల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు లేవని, శాంతి భద్రతలను పరిగణనలోనికి తీసుకొని, రాత్రే దహనసంస్కారాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ కోర్టుకి తెలిపారు. కేసు విచారణ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో తెలియజేయాలంటూ కోర్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబర్ 14న అత్యాచారానికి గురైన యువతి ఢిల్లీ ఆసుపత్రిలో మరణించింది. ఆ తరువాత హడావిడిగా యువతి భౌతిక కాయాన్ని దహనం చేశారంటూ జిల్లా అధికార యంత్రాంగం ఆరోపణలెదుర్కొంటోంది. -
నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం
లక్నో/హాథ్రస్: ఉత్తరప్రదేశ్లోని హాథ్రస్ జిల్లాలో కామాంధుల రాక్షసత్వానికి ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి కుటుంబ స భ్యులు సోమవారం అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ముందు హాజరు కానున్నారు. పటిష్టమైన భద్రత మధ్య వారిని న్యాయస్థానానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. యువతిపై అత్యాచారం, హత్య కేసు లో బాధిత కుటుంబ సభ్యుల వాదనను కోర్టు నమోదు చేయనుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రంజన్ రాయ్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సోమవారం విచారించనుంది. ధర్మాసనం ముందు హాజరు కావాలని యూపీ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం), డీజీపీ, జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం హైకోర్టు ఆదేశించింది. ప్రభు త్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ వీకే సాహిని హాజరుకానున్నారు. రంగంలోకి దిగిన సీబీఐ.. హాథ్రస్ ఘటనను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. ఆదివారం ఉదయం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సామూహిక అత్యాచారం, హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. సీబీఐ ఘజియాబాద్కు చెందిన ప్రత్యేక టీమ్ ఈ కేసును విచారిస్తుందని అధికారులు తెలిపారు. -
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం
సాక్షి, చెన్నై : తమిళనాడులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం జిల్లా కురుంగచావడి గ్రామానికి చెందిన అన్బళగన్ కుటుంబంలో ఐదుగురు మరణించడంతో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. మొత్తం 11 మంది ఉన్న ఆ కుటుంబంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం కాగా మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఎ. రామన్ ఆదేశించారు. (ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...) -
ఇకపై కుటుంబ సభ్యులు పాల్గొంటే క్రిమినల్ కేసులు
సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో పాల్గొనేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం సీట్లు వారికి కేటాయించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధి మహిళే అయినా పెత్తనం మాత్రం పతులే చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. కొన్ని చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను నామమాత్రం చేస్తూ వీరు పెత్తనం కొనసాగిస్తున్నారు. ఉల్లంఘిస్తే చర్యలు... అధికారిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీరాజ్ చట్టం –2018 సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వారిని అధికారిక సమావేశానికి అనుమతిస్తే పంచాయతీ కార్యాదర్శి, మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. పాలనలో పారదర్శకత... పట్టణాలు, గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలి. కానీ కొన్ని చోట్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా గ్రామాలు, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా, నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళలు పాలనపై పట్టు సాధిస్తారని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పలు ఘటనలు స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ప్రతినెలా మండల సర్వసభ్య సమావేశాలు కొనసాగుతుంటాయి. అయితే మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైన ఘటనలు పలు మండలాల్లో చేసుకుంటున్నాయి. అందోలు మండలంలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశానికి భర్తలు హాజరుకావడమే కాకుండా అధికారులపై ప్రశ్నల వర్షం, నీలదీసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి భర్త అని తెలిసినా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై తోటిప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు ఎన్నికైన మహిళా ప్రతినిధులే సమావేశాలకు హజరు కావాలని సూచించిన సందర్భాలున్నాయి. మహిళా ప్రతినిధుల్లో మార్పు రావడం ఖాయం భార్యకు బదులుగా భర్తలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వుతో మహిళా ప్రతినిధులల్లో మార్పు వస్తుంది. జిల్లా పరిషత్లో ఉన్న 13 మంది మహిళా జెడ్పీటీసీలు మాత్రం సొంతంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లల్లో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాం. గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్లు ఉన్న చోట భర్తల పెత్తనం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలా జరగకుండా మహిళా సర్పంచ్లే స్వేచ్ఛగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో మరో నాలుగేళ్ల పాటు మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. –మంజుశ్రీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, సంగారెడ్డి పకడ్బందీగా అమలు చేస్తాం భార్యలకు బదులుగా భర్తలను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కూడా భర్తలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించం. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మహిళా ప్రతినిధులు సైతం మున్సిపల్ చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి, పరిపాలనలో అభివృద్ధిలో వారినే పూర్తిగా భాగస్వాములను చేస్తాం. –కేశురాం, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ -
సర్పంచ్ ఒకరు.. అనుమతులిచ్చేది మరొకరు
సాక్షి, కాటారం: సర్పంచ్ల అమాయకత్వాన్ని వారి కుటుంబ సభ్యులు ఆసరగా చేసుకుంటున్నారు. ప్రజల ఓట్లతో గెలిచింది ఒకరైతే.. పాలన మాత్రం వారి కుటుంబ సభ్యుల చేతుల్లోనే కొనసాగుతున్నదని అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధి పలు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ల కంటే వారి పతులు, కూమారులదే పెత్తనం కొనసాగుతోంది. గ్రామపంచాయతీ పాలనా పరమైన.. అలాగే ఎలాంటి అనుమతులైనా వారి నుంచి రావాల్సిదే. మండలంలోని ఓ గ్రామపంచాయతీ నుంచి మరో ప్రాంతానికి దుక్కిటెద్దులు తీసుకెళ్లడానికి ఆ జీపీ సర్పంచ్ కుమారుడు ఇచ్చిన అనుమతి పత్రం వివాదాస్పదంగా మారింది. దుక్కిటెద్దులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ కార్యదర్శికి మాత్రమే అనుమతి ఇచ్చే అధికారం ఉంటుంది. కానీ సదరు సర్పంచ్ కుమారుడు నిబంధనలను తుంగలో తొక్కి సర్పంచ్, గ్రామపంచాయతీ పేరిట ఉండే లెటర్ ప్యాడ్పై అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా సర్పంచ్కు బదులుగా సర్పంచ్ కుమారుడే తన సంతకం చేయడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇలా సర్పంచ్లను పక్కన పెట్టి కుటుంబ సభ్యులు పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మండల పంచాయతీ అధికారి మల్లికార్జున్రెడ్డిని “సాక్షి’ వివరణ కోరగా అనుమతి ఇచ్చే అధికారం సర్పంచ్కు ఉండదన్నారు. గ్రామపంచాయతీకి లెటర్ ప్యాడ్ లాంటివి ఉండవని, సర్పంచ్ పేరితో ఇచ్చిన అనుమతి లేఖతో జీపీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పూర్తి వివరాలు సేకరిస్తామని తెలిపారు. -
కుటుంబంలో అందరికీ సోకదు
అహ్మదాబాద్: కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్ సోకుతుం దని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని గుజరాత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్పష్టమైంది. ‘వైరస్ సోకిన వ్యక్తిని కలిసిన అందరికీ అది సోకుతుందని చెప్పలేం. అదే నిజమైతే, కోవిడ్–19 నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ ఆ వైరస్ సోకాలి కదా?. కానీ అలా జరగడం లేదు. కోవిడ్–19తో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఆ వైరస్ అంటుకోని ఉదాహరణలున్నాయి’అని ఆ సంస్థ డైరెక్టర్ దిలీప్ మవలాంకర్ వివరించారు. కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశాలపై అం తర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. అహ్మదాబాద్లో కేసు ల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడమే కావ చ్చని వివరించారు. యూనివర్సిటీ కా లేజ్ ఆఫ్ లండన్ న్యూరో సైంటిస్ట్ కార్ల్ ఫ్రిస్టన్ ప్రతిపాదిం చిన ‘ఇమ్యూనలాజికల్ బ్లాక్ హోల్’సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్ సోకదని వివరించారు. ఇమ్యూనిటీ, ఇళ్లకే పరిమితమవడం.. మొదలైనవి అందుకు కారణాలన్నారు. 17 లక్షలు దాటిన కేసులు దేశంలో కోవిడ్ కేసులు 16 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 17 లక్షల మార్కును దాటాయి. ఆదివారం కొత్తగా 54,735 కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకుంది. గత 24 గంటల్లో 853 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 11,45,629కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,67,730గా ఉంది. గత నాలుగు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 65.44 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.13 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 32.43 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల్లో 51,225 మంది కోలుకున్నట్లు పేర్కొంది. -
రాజమౌళి ఫ్యామిలీకి కరోనా
దర్శకులు యస్.యస్. రాజమౌళి మరియు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా ప్రకటించారు రాజమౌళి. ‘‘కొన్ని రోజుల క్రితం నాకు, మా కుటుంబ సభ్యులకు కొద్దిగా జ్వరం వచ్చింది. దానంతట అదే తగ్గిపోయింది కూడా. కానీ ఎందుకైనా మంచిది అని కరోనా టెస్ట్ చేయించుకున్నాం. ఈ రోజు (బుధవారం) రిజల్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు అందరం ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటున్నాం.. ఏ లక్షణాలు లేకుండా మేమందరం బాగానే ఉన్నాం. అన్ని సూచనలు పాటిస్తున్నాం. కరోనాలో నుంచి బయటపడి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాజమౌళి అన్నారు. -
వీవీని కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి
ముంబై : భీమా కొరేగావ్ కేసులో నిర్భంధంలో ఉన్న విప్లవ రచయిత వరవరరావును(వీవీ) కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. ప్రస్తుతం కరోనాతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను కలిసేందుకు బాంబే హైకోర్టు వారికి అనుమతిచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలకు, ఆస్పత్రి ప్రొటోకాల్కు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి వైద్యులను ఆదేశించింది. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) కాగా, భీమా కొరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న వీవీ ఏడాదిన్నరగా తలోజా జైలులో ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వీవీని కలిసేందుకు తమకు అనుమతించాలని.. ఆయన తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా సంఘాలు కూడా ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఇంట్లోనే వైరస్ ముప్పు
సియోల్: ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకడం అధికంగా జరుగుతోందని దక్షిణ కొరియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వైరస్ సోకిన ప్రతీ 10 మందిలో ఒకరికి కుటుంబ సభ్యుల నుంచి సోకినట్టు ఆ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం ఫలితాలను అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రచురించింది. కరోనా పాజిటివ్ వచ్చిన 5,706 మంది రోగులపై అధ్యయనం చేస్తే వారి ద్వారా 59 వేల మందికి వైరస్ సోకినట్టు తేలింది. ప్రతీ 100 మంది కోవిడ్ రోగుల్లో ఇద్దరికి వేరే కారణాల ద్వారా వైరస్ సోకినట్టు ఆ సర్వే వెల్లడించింది. కుటుంబ సభ్యుల ద్వారా వైరస్ సోకిన వారిలో అత్యధికులు టీనేజ్లో ఉన్నవారు లేదంటే 60–70 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారని తేలింది. ఇక తొమ్మిదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి వైరస్ సోకడం అత్యంత అరుదుగా జరిగిందని ఈ అ«ధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్లలో ఒకరైన డాక్టర్ చో యంగ్జూన్ తెలిపారు. దక్షిణ కొరియాలో వైరస్ ఉధృతి అత్యధికంగా ఉన్న జనవరి 20, మార్చి 27 మధ్య సర్వేని నిర్వహించారు. -
అమ్మను రోడ్డున పడేశారు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
బాలయ్య బర్త్డే సెలబ్రేషన్స్ చూశారా!
సాక్షి, హైదరాబాద్: నటసింహం నందమూరి బాలకృష్ణ బర్త్డే వేడుకలు ఆయన స్వగృహంలో నిరాడంబరంగా జరిగాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన 60వ పుట్టినరోజు వేడుకలను అభిమానుల సమక్షంలో కాకుండా కుటుంబసభ్యుల మధ్య జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు బాలయ్య చేత కేక్ కట్ చేయించి బర్త్డే విషెస్ తెలిపారు. ఈ వేడుకలో బాలకృష్ణ కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకు, మనవళ్లు స్పెషల్ డ్రెస్ కోడ్ను పాటించారు. ‘విన్టేజ్ ఎన్బీకే 1960’ థీమ్ గల నీలం రంగు టీషర్ట్స్ ధరించడం, బాలయ్య సూపర్హిట్ చిత్రాల్లోని పాత్రలతో రూపొందించిన బ్యానర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. (బాలయ్యకు షష్టిపూర్తి; చిరు ట్వీట్) అంతకుముందు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో బాలకృష్ణ తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. వారితో కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం బాలయ్య బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (బాలయ్య బర్త్డే గిఫ్ట్: సాంగ్ విన్నారా?) -
ఒకే నగరంలో ఉన్నా...
బెంగళూరు: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ అనుకోని విరామ సమయంలో సాధారణ ప్రజలే ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటే.. నిరంతరం ప్రయాణాలు, రోజంతా ప్రాక్టీస్, మ్యాచ్లు అంటూ బిజీగా గడిపే క్రీడాకారుల సంగతి చెప్పక్కర్లేదు. కుటుంబంతో సరదాగా గడిపే సమయం దొరికితే ఆటగాళ్లు ప్రపంచాన్ని, వారి ప్రాణమైన ఆటనే మర్చిపోతారు. కానీ భారత హాకీ ప్లేయర్ ఎస్వీ సునీల్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన భార్య, గారాల కూతురు తనకు సమీపంలోనే నివసిస్తున్నా కుటుంబానికి దూరంగా జట్టుతో ఉంటున్నాడు. ప్రస్తుతం సునీల్ బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తుండగా... అతని భార్య నిషా, ఏడాదిన్నర వయస్సున్న కూతురు శాన్విత ‘సాయ్’ సెంటర్కు కేవలం 20 కి.మీ దూరంలోనే ఉంటున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో కుటుంబం క్షేమం కోసమే తాను దూరంగా ఉంటున్నానని సునీల్ పేర్కొన్నాడు. తన భార్య నిషా కూడా అతని నిర్ణయంతో ఏకీభవించిందని చెప్పాడు. ‘నేను నా భార్య, బిడ్డను చాలా మిస్ అవుతున్నా. కానీ మనం ఈ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇందులోని సానుకూల కోణాన్నే మనం చూడాలి’ అని సునీల్ పేర్కొన్నాడు. -
ఆప్ విజయంపై కేజ్రీవాల్ కుటుంబం హర్షం
-
తెలుసుకుంటే.. బాధితులకు భరోసా.!
మరణం సహజం.. అది ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణానంతరం ఏమవుతుందో గానీ ఒక్కో సారి తమపై ఆధారపడి బతికే కుటుంబ సభ్యులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులైతే ఎప్పుడు ఏమి జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. విధి నిర్వహణలో మృతి చెందవచ్చు. సహజ మరణం కావచ్చు. సంఘ విద్రోహ శక్తుల చేతిలో హత్యకు గురికావచ్చు. అవకాశం ఉన్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్మెంట్స్ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించాయి. ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వచ్చే రాయితీలేంటి? అవి ఏరకంగా ఉంటాయి..? వాటి గురించి సవిరంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి..? అనే అంశాలపై ప్రత్యేక కథనం. –పెదవాల్తేరు(విశాఖతూర్పు) ఓ ఉద్యోగి సర్వీసులో ఉన్నంత కాలం బతికుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. పదవీ విరమణ చెందిన తర్వాత సర్వీస్ విషయాలను తేలిగ్గానే పరిష్కరించుకోవచ్చు. అనుకోకుండా మరణిస్తే మాత్రం కుటుంబానికి సెటిల్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఉద్యోగులకు ఇలాంటి వాటిపై ముందస్తు అవగాహన ఉంటుంది. కానీ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆ స్థాయిలో అవగాహన ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులకు ఆ విషయాలు చెప్పకపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భంలో సరీ్వసు సెటిల్మెంట్స్కు సంబంధించిన విషయాల్లో ఉద్యోగుల కుటుంబ సభ్యులకు గందరగోళం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే ప్రక్రియ గురించి కూడా తెలియక సతమతమవుతుంటారు. ఉద్యోగి కుటుంబ సభ్యులు ఇలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగి మృతి చెందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకు మరణించిన ఉద్యోగికి సంబంధించిన సెటిల్మెంట్స్ ద్వారా కుటుంబ సభ్యులు లబ్ధి పొందేలా మార్గదర్శకాలు రూపొందించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా ఎప్పటికప్పుడు మారుతున్న కాలం పరిస్థితుల ప్రాతిపదికన సర్వీసు విషయాలను సెటిల్మెంట్ చేసే విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి కుటుంబానికి చెల్లింపులు, రాయితీలను ప్రభుత్వం అందజేస్తుంది. వీటికి సంబంధించి గత ప్రభుత్వాలు అనేక జీవోలను జారీ చేశాయి. అసలు అవేంటో ..? వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో..? తెలుసుకుందాం. సస్పెన్షన్లో ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్న కాలంలో మరణిస్తే సస్పెన్షన్ విధించిన తేదీ నుంచి మృతిచెందిన కాలం వరకు మానవతా దృక్పథంతో విధుల్లో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. పూర్తిస్థాయి చెల్లింపులు ఉంటాయి. సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో మరణిస్తే... విధుల్లో ఉండగా అనుకోని సంఘటన వల్ల మరణించినా, తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందినా తక్షణమే ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లిస్తారు. ప్రమాద ఎక్స్గ్రేషియా.. విధి నిర్వహణలో ఉంటూ ఉద్యోగులు ప్రమాదానికి గురై మృతి చెందితే ప్రభుత్వం రూ. లక్ష ఎక్స్గ్రేషియా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న జీవో నం. 317ను జారీ చేశారు. అంత్యక్రియలకు సాయం ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల అవసరాలకు ప్రభుత్వం రూ.15 వేలు సాయంగా చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2010 ఏప్రిల్æ 24న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 192 ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంత్యక్రియ ఖర్చులకు.. ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతి చెంది ఉంటే ఆ మొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు అవుతాయి. సరీ్వసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్ 9న జారీ చేసిన జీవో నంబర్ 55 ద్వారా పూర్తి వివరాలు పొందవచ్చు. రవాణా చార్జీల కింద... ఉద్యోగి విధి నిర్వహణలో కానీ, మరేదైనా ప్రదేశంలో కానీ మృతి చెందితే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించడానికి అయ్యే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటన స్థలం నుంచి వారి ఇంటికి తరలింంచేందుకు వీలుగా రూ.50–300 వరకు రవాణా ఛార్జీలను ఇస్తుంది. ఈ అంశంంలో మరిన్ని వివరాలు 1985 సెపె్టంబర్ 15న జారీ చేసిన జీవో 1669 ద్వారా తెలుసుకోవచ్చు. కారుణ్య నియామకం, కరువుభత్యం ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉపాధి కలి్పస్తారు. అర్హత ప్రాతిపదికన వివిధ స్థాయిలో ఉద్యోగంలోకి తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను కుటుంబ పెన్షన్ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్గా చెల్లిస్తారు. ఈ వివరాలకు 1998 మే 25న జారీ చేసిన జీవో 89 ద్వారా తెలుసుకోవచ్చు. అవగాహన తప్పనిసరి ప్రభుత్వ జారీ చేసిన జీవోలపై ఉద్యోగుల కుటుంబీలకు అవగాహన అవసరం. ప్రభు త్వం అందజేసే సౌలభ్యాలను వినియోగింంచుకోవాలంటే వాటి గురించి తెలిసి ఉండాలి. ఉద్యోగుల కోసం ప్రభుత్వం పలు రకాల జీవోలను విడుదల చేసింది. వీటి గురించి తెలిస్తే త్వరితగతిన ప్రభుత్వం నుంచి సాయాన్ని పొందవచ్చు. – టి.శివరామప్రసాద్, ఉపసంచాలకుడు, జిల్లా ఖజానాశాఖ, విశాఖపట్నం -
బాగుంటుంది
‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్! మాధవ్ శింగరాజు కొత్త రోజులోకి.. కొత్త సంవత్సరంలోకి.. కొత్త దశాబ్దంలోకి వచ్చేశాం! చివరి రెండంకెల్లోని ఒకటీ తొమ్మిది వెళ్లిపోయి, రెండూ సున్నా వచ్చాయి కనుక కొత్త దశాబ్దమే. విడిగా విలువ లేకపోయినా, పక్కవాటికి విలువ తెస్తుంది కనుక సున్నా కూడా అంకె కిందికే వస్తుంది. కాలం ముందు మనిషి కూడా సున్నానే. గుండు సున్నా. ఐనా ఆ సున్నా లేకపోతే కాలానికి విలువ లేదు. కాలం నిలువ లేదు. ఊపిరులు లేకపోతే వాయువనేది ఒకటుందని తెలుస్తుందా? కాలమూ అంతే. పక్కన మనిషి లేకుండా కాలాన్నీ చూడలేం, కొలవలేం. ఆ మనిషి కూడా ఊరికే కూర్చొని ఉంటేనో, ఊరికే నిలుచుని ఉంటేనో, ఊరికే పడుకుని ఉంటేనో కాలానికి కౌంట్ ఉండదు. గోడ మీది గడియారం ఆగిపోయినట్లు ఆగిపోతుంది. మనిషి పని చేస్తుండాలి. పరుగులు తీస్తుండాలి. అప్పుడే ఉత్సాహం. ఆరోగ్యం. మనిషికీ, కాలానికీ. ఈరోజు సాయంత్రానికి ఇవాళ మన రోజెలా గడిచిందో తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఏడాదంతా ఎలా గడిచిందో పడమటి గది తలుపులు తెరిచి ఉదయిస్తున్న మసక చీకటిలో చూసుకునే ఉంటాం. పది ఏడాదులు ఉండిపోయిన దశాబ్దాన్నీ.. ఈ కొత్త దశాబ్దపు తొలి రోజున.. జ్ఞాపకాల వత్తిని కాస్త పెద్దది చేసి కాలాల నీడల్ని ఒకసారి తడుముదాం.‘నిర్భయ’తో మొదలై, ‘దిశ’తో ముగిసింది ఈ దశాబ్దం! అమానుష ఘటన నుంచి.. అభయమిచ్చే చట్టం వరకు. మధ్యలో మిగతావన్నీ కాలానుగతంగానో, కాలంలో భాగంగానో జరిగినవే. వాటిని బట్టి చూస్తే.. ఉల్లిపాయల కరువుతో మొదలై ఉల్లిపాయల కరువుతో ఈ దశాబ్దం ముగిసినట్లు! 2010 డిసెంబర్లో ఉల్లిపాయల కోసం దేశం తల్లడిల్లడం ఆ ఏడాది ప్రధాన విశేషం. ఉత్తరప్రదేశ్లో ఒకే నెలలో ఆరు రైలు ప్రమాదాలు జరగడం, పదిహేనవ జనాభా లెక్కల సేకరణ, బాలలకు నిర్బంధ ఉచిత విద్య.. మిగతావి. ‘నిర్భయ’ ఘటన 2012 డిసెంబరులో జరిగింది. ఆ ముందువరకు.. అజ్మల్ కసబ్ ఉరితీత, ‘అండర్ అచీవర్’ అని ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి ‘టైమ్’ పత్రిక రాయడం, ఇండియా పార్లమెంటు 60వ వార్షికోత్సవం.. ప్రధానంగా గుర్తుండే విషయాలు. స్వామీ వివేకానంద 150 వ జయంతి, పబ్లిక్ టెలిగ్రామ్ సర్వీస్ నిలిచిపోవడం, ఇస్రో ‘మార్స్’ ప్రయోగం, స్వచ్ఛభారత్, జీఎస్టీ, ఇరోమ్ షర్మిల పదహారేళ్ల నిరశన దీక్ష విరమణ, పెద్ద నోట్ల రద్దు, ఆర్టికల్ 370 ఎత్తివేత, కర్తార్పూర్ కారిడార్, అయోధ్య తీర్పు, పౌరసత్వ సవరణ చట్టం.. ఇవన్నీ నిర్భయ ఘటన తర్వాత ఈ పదేళ్ల పరిణామాలు. ఒక దశాబ్దంలో ఇన్ని జరిగినా నిర్భయతో మొదలైన దశాబ్దంగానే 2010–2019 మిగిలిపోవడానికి కారణం.. నిర్భయ చట్టం వచ్చాక కూడా దేశంలో అఘాయిత్యం జరగని రోజు, జరగని ప్రాంతం లేకపోవడం. ఒక దశాబ్దంలో ఎన్ని చట్టాలు వచ్చినా ‘దిశ’ యాక్ట్తోనే ఈ దశాబ్దం నిలిచిపోవడానికి కారణం.. శిక్షకు ‘డెడ్ లైన్’ పెట్టడం. నిర్భయ యాక్ట్ ఆ పని చేయలేకపోయింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ (ఇదే నిర్భయ యాక్ట్), వర్క్ప్లేస్ హెరాస్మెంట్ యాక్ట్.. రెండూ ఈ దశాబ్దంలో(2013) వచ్చినవే. పురుషుల్ని సవరించే చట్టాలివి. ఈ సవరణ లాభం లేదని తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ‘చక్కదిద్దే’ దిశ యాక్ట్ ఒక్కటే ఇప్పుడు భరోసా. ఈ కొత్త దశాబ్దపు ఆరంభం నుంచే భరోసాలు ప్రసాదించే మరికొన్ని మార్పులు కూడా సంభవిస్తే బాగుంటుంది. పేషెంట్లను ఎదురుగా పెట్టుకుని వాట్సాప్ చూస్తుండే డాక్టర్లు మారాలి. క్లాస్రూమ్లో పిల్లల్ని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేసి ఫేస్బుక్లోకి వెళ్లిపోయే టీచర్లు మారాలి. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినవాళ్లను ‘ఆ.. ఏంటి?’ అని ఒక మాట అడిగేసి, ఫోన్లో మీమ్స్ని చూస్తూ నవ్వుకుంటుండే పోలీసులు మారాలి. ఇంకా.. సమస్త వృత్తుల సకల జనులు తమ చేతిలోని ఫోన్కి తమ ఉద్యోగ బాధ్యతల్ని, పౌర విధుల్ని బలి చేయడం మారాలి. ‘‘కనీసం భోజన సమయంలోనైనా ఫోన్లను పక్కన పెట్టండి’’ అని ఈ ఏడాది పోప్ ఫ్రాన్సిస్ సందేశం! సందేశంగా ఇవ్వలేదు. అడిగారు. పోప్ అంతటివారే అడిగితే టైమ్ ఇవ్వలేమా?! కుటుంబ సభ్యులతో కూర్చుని భోంచేసే ఆ కొద్ది టైమ్! ∙ -
కొల్లేరు పక్షుల అందాలు భేష్: నీలం సాహ్ని
ఆటపాక(కైకలూరు): కొల్లేరు పక్షుల కేరింతలు ఎంతగానో ఆకట్టుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కితాబిచ్చారు. కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని ఆదివారం కుటుంబసభ్యులతో కలసి ఆమె సందర్శించారు. బోటు షికారు చేస్తూ పెలికాన్, పెయింటెడ్ స్ట్రాక్ పక్షుల అందాలను తిలకించారు. అనంతరం పక్షినమూనా కేంద్రాన్ని సందర్శించారు. కొల్లేరు నైసర్గిక స్వరూపం, పక్షుల జీవిత విశేషాలు, వాతావరణ పరిస్థితులు, ప్రజల జీవన విధానాన్ని సీఎస్కు అటవీశాఖ రేంజర్ బి.విజయ వివరించారు. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు రద్దు చేయడంపై మీడియా ప్రశి్నంచగా.. ఆ విషయమై అటవీ శాఖ పీసీసీఎఫ్ వైల్డ్లైఫ్ అధికారితో మాట్లాడానని చెప్పారు. -
ఆ రేప్ కేసులో తండ్రీకొడుకులు నిర్దోషులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నాలుగేళ్ల క్రితం జరిగిన ఒక అత్యాచారం కేసులో ఓ తండ్రి, కొడుకులను నిర్దోషులుగా ప్రకటించిన సంఘటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాధితురాలు నిందితుల కూతురు, సోదరి కావడం గమనార్హం. వివరాలు.. ఇలా ఉన్నాయి. సుమారు 10 మంది కుటుంబ సభ్యులతో ఒకే గది ఉన్న ఇంట్లో బాధితురాలు నివాసం ఉంటోంది. ఇందులోనే ఓ చిన్న కిరాణా కొట్టు కూడా నడుపుతున్నారు. 2015 ప్రాంతంలో తనకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన తండ్రి, సోదరుడు కొన్ని నెలలపాటు అత్యాచారం చేశారని, విషయం ఇతరులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఈ కేసులో విచారణ చేపట్టిన ఢిల్లీ అదనపు సెషన్స్ కోర్టు మూడు కారణాలను చూపి ఫిర్యాదు చేసిన యువతి తండ్రి, సోదరుడిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. ఎఫ్ఐఆర్ ఆలస్యంగా దాఖలు కావడం ఒక కారణమైతే, కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యాచారం జరగడం అసంభవమని కోర్టు అంచనాకు రెండో కారణం. విచారణ సమయంలో బాధితురాలు వేర్వేరు తేదీలు, నెలల పేర్లు చెప్పిందని, పైగా ఇతర కుటుంబ సభ్యులెవరూ బాధితురాలి పక్షాన విచారణలో పాల్గొనకపోవడాన్ని బట్టి కూడా ఆ యువతి చెప్పేది నిజం కాకపోవచ్చునని కోర్టు భావించింది. ఆ యువతి అప్పుడప్పుడూ కిరాణా కొట్లో వ్యాపారం చేసేదని, తనను బయట ఎక్కడకూ పంపేవారు కాదన్న బాధితురాలి వాంగ్మూలానికి ఇది భిన్నమని కోర్టు చెప్పింది. కొనుగోళ్ల కోసం వచ్చిన వాళ్ల (ఎక్కువగా ఇరుగుపొరుగు కావచ్చు)కు చెప్పుకున్నా ఎవరో ఒకరు సాయపడి ఉండేవారని కోర్టు పేర్కొంది. -
దిశ ఆత్మకు శాంతి
సాక్షి, శంషాబాద్ : దిశపై దారుణానికి ఒడిగట్టిన నిందితులు ఎన్కౌంటర్లో మృతిచెందారన్న వార్త ఆమె కుటుంబంలో సంతోషాన్ని నింపింది. దిశ తిరిగి రాదన్న బాధలో ఉన్న తమకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగిందని ఆమె కుటుంబ సభ్యులన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు జరగకుండా ఇదో ఉదాహరణలా మారాలన్నారు. మీడియాతో దిశ తల్లిదండ్రులతో పాటు సోదరి తమ అభిప్రాయాలను వెల్లడించారు. తగిన శిక్ష పడింది.. మాకు మనశ్శాంతి కలిగింది.. మా బిడ్డ తిరిగి రాదు.. మేము అనుభవిస్తున్న బాధ మళ్లీ ఎవరికీ రాకూడదు. నాకు వాళ్లను (హంతకులను) చూడాలనిపిస్తోంది.. మా అమ్మాయి ఏం తప్పు చేసింది.. ఎంత నరకం అనుభవించిందో.. ఎప్పుడూ అంద రి మంచిని మాత్రమే ఆలోచించేంది. మీ సోదరిలాంటి దానిని అని చెప్పినా వినకుండా దారుణానికి ఒడిగట్టారు.. వారికి తగిన శిక్ష పడింది. –విజయమ్మ, దిశ తల్లి పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఎన్కౌంటర్ను అందరూ ప్రశంసిస్తున్నారు.. ప్రజలంతా మాకు అండగా నిలబడ్డారు. మా బిడ్డ అయితే తిరిగి రాదు.. ఇది కొంతవరకు ఉపశమనం మాత్రమే.. కేసు కోర్టుకు వెళ్తుందని, న్యాయం జరగడానికి ఎంత కాలం పడుతుందోనని అనుకున్నా. ఇంత త్వరగా వారికి శిక్ష పడుతుందని అనుకోలేదు. ప్రతి ఒక్కరూ దిశకు జరిగిన అన్యాయాన్ని వారి బిడ్డకు జరిగిన ఘోరంగానే భావించారు. దేశ విదేశాల నుంచి ఫోన్లు చేసి పరామర్శించారు. వారికి సరైన శిక్ష పడిందనే అనుకుంటా.. పోలీసులు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సమాజంలో జరుగుతున్న దారుణాలపై మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.. –శ్రీధర్రెడ్డి, దిశ తండ్రి దీనిని ఉదాహరణగా తీసుకోవాలి ఈ ఘటనను ఉదాహరణగా తీసుకోవాలి.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవని అనుకుంటున్నా.. పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకున్నారు. వారికి ఉరిశిక్ష పడుతుందని భావించాను. పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్కౌంటర్ చేశారని టీవీలో చూశాను. ఎన్కౌంటర్ వార్త నాకు సంతోషంగానే ఉంది. పోలీసులకు, ప్రభుత్వానికి, మీడియాకు కృతజ్ఞతలు.. సంఘటన జరిగిన రోజు నుంచి అందరూ మాకు అండగా ఉన్నారు. –భవ్య, దిశ సోదరి -
గొల్లపూడి వారింట శక్తి స్వరూపిణులు
కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ, రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ.. ఈ పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు ఈ ఏడాది శరన్నవరాత్రులకు గొల్లపూడి వారింట్లో కొలువు తీరారు దసరా నవరాత్రులు వచ్చాయంటే చెన్నైలోని ఓ తెలుగు సంప్రదాయ నివాసంలోకి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదెవరిదో కాదు.. ప్రఖ్యాత రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు ఇల్లు. చెన్నై టీనగర్ లోని శారదాంబాళ్ వీధిలో ఉన్న శివానీ నిలయంలో ఏటా కొలువుదీరే బొమ్మల కొలువు గత పందొమ్మిదేళ్లుగా వివిధ రకాల థీమ్లతో చెన్నైలోని తెలుగువారే కాకుండా, తమిళులు సైతం ఆసక్తితో తిలకించేలా ఉంటోంది. గొల్లపూడివారి కోడళ్లయిన కుమారి, సునీతలు పెట్టే ఆ బొమ్మల కొలువు మన సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలు అలవాట్లకు ప్రతీకగా నిలుస్తోంది. 2001లో మొదటిసారిగా ‘తిరుమల తిరుపతి ఏడు కొండల మహత్యం’ అనే అంశంతో మొదలైన వీరి బొమ్మల కొలువు థీమ్లు ఆ తర్వాత రామాయణం, కృష్ణలీలలు, నవరసాలు, మన పండుగలు, శ్రీనివాస కల్యాణం, నవ దుర్గలు, షిర్డీసాయి జీవిత చరిత్ర, గణాధిపత్యం తదితర విశేషాంశాలతో కొలువు తీరుతూ వస్తున్నాయి. ఈ ఏడాది ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రల ఆధారంగా మహిళా శక్తులుగా ఆదర్శంగా నిలిచిన స్త్రీ మూర్తులను బొమ్మల కొలువులో ఉంచారు. ప్రత్యేకంగా భారతం, భాగవతం, రామాయణంలోని పద్దెనిమిది మంది శక్తి స్వరూపిణులు సందర్శకులకు స్ఫూర్తి నింపుతున్నారు. ఈ పద్దెనిమిది మందీ.. కన్నగి (తమిళం), కాళీమాత, సత్యభామ, ఝాన్సీ, అంబ, మోహిని, రంభ, రాధ, గాంధారి, ఊర్మిళ, ద్రౌపది, మండొదరి, శూర్పణఖ, అరుంధతి, సీత, సావిత్రి, అహల్య, గంగ! గంగ దివి నుండి భువికి దిగివచ్చిన, సీత భూమాత ఒడిలోకి వెళ్లిన, రామాయణ యుద్ధానికి శూర్పణఖ కారణమైన, అవమానం పగగా మారి ద్రౌపది ప్రతీకారంతో మహాభారత యుద్ధ జరిగిన ఎన్నో ఇతిహాస ఘట్టాలలో మహిళలు శక్తులుగా నిలిచిన తీరు ఇక్కడి బొమ్మల కొలువులో కనిపిస్తుంది.ఈ ఏడాది కొలువును తీర్చిదిద్దేందుకు దాదాపు ఐదు సంవత్సరాలుగా ఒక్కో బొమ్మను కూడబెట్టడం జరిగిందని కుమారి, సునీత తెలిపారు. ఒక్కోసారి బొమ్మల సేకరణకు రోజులు పడుతుండగా కొన్ని సమయాల్లో థీమ్స్కు తగ్గట్టు బొమ్మలు దొరక్క పోవటంతో వారే స్వయంగా బొమ్మలను తయారు చేసుకుని కొలువులో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులూ లలితా సహస్రనామం చదువుతూ.. రెండు పూటలా తొమ్మిది నైవేద్యాలు పెడుతూ ముత్తయిదువులను పిలిచి తాంబూలాలను అందిస్తున్నారు. ఆఖరి రోజున చందనపు బొమ్మలకు హారతి ఇచ్చి నిద్రపుచ్చి మరో ఏడాది వరకు అందరికీ సంతోషాలను ఇవ్వమని అమ్మవారికి దిష్టితీసి బొమ్మల కొలువుకు ముగింపు పలుకుతారు. ఏటా బొమ్మల కొలువు తీర్చినప్పటి నుండి చెన్నై నగరం నలుమూలల నుండి గొల్లపూడి నివాసానికి తెలుగువాళ్లు మహిళలు బారులు తీరుతారు. ఇక ఈ బొమ్మల కొలువుకు నగరంలోని అన్ని సాంస్కృతిక పోటీలలో ప్రధమ స్థానమే. నవరాత్రి కొలువుల్లో తెలుగు వారికే కాదు.. తమిళులకు కూడా స్పూర్తిదాయక సాంప్రదాయాలకు ఆచారాలకు గొల్లపూడి కోడళ్లు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధి సాక్షి టీవీ, చెన్నై ఆమెరికాలో పిల్లల కొలువు ఖండాలు దాటినా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మర్చిపోకుండా పాశ్చాత్య జీవితంలోనూ అచ్చ తెలుగు కాపాడుకుంటూ వస్తున్నారు గొల్లపూడివారు. గత పదేళ్లుగా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దసరా బొమ్మల కొలువుకు వేదికగా నిలుస్తోంది అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఉంటున్న గొల్లపూడి మారుతీరావు సోదరుడైన గౌరి శంకర్ కుమార్తె అపర్ణ కుటుంబం. వారి పిల్లలిద్దరూ ఏటా దసరా నవరాత్రులను పురస్కరించుకుని వివిధ ఆంశాలతో కూడిన థీమ్స్తో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తున్నారు. సమీపంలోని తెలుగువారందరీ ఏకం చేసేలా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తమ నివాసంలో ప్రత్యేకంగా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. క్రికెట్ స్టేడియం, ప్లేయర్స్, గ్యాలరీ, కాంపౌండ్ ఒక థీమ్ గా; రెండోదిగా విలేజ్ థీమ్లో సాయిబాబా ఆలయం, వివిధ రకాల మనుషులు; మూడో థీమ్లో నాలుగు ఋతువులను వివరించే విధంగా ఒకే చోట బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. అంతేకాదు నిత్యం భజనలు, హారతులతో పూజలు నిర్వహిస్తున్నారు. కొలువుకు బొమ్మలు దొరకకపోయినా ఇండియా నుండి తమ బంధువులు, స్నేహితులతో తెప్పించుకుని శ్రమకోర్చి నవరాత్రుల సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ‘ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి భారతిని’ అంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. -
నీరవ్ మోదీకి సింగపూర్ హైకోర్టు షాక్..!
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త నీరవ్ మోదీ కుటుంబసభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలంటూ సింగపూర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం నీరవ్ మోదీ సోదరి పుర్వి మోదీ, బావ మయాంక్ మెహతాల ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ అకౌంట్స్లో సుమారు 6.122 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 44.41 కోట్లు) ఉన్నట్లు పేర్కొంది. బ్యాంకులను మోసం చేయడం ద్వారా వచ్చిన సొత్తులో ఇది కూడా భాగమేనని, దీన్ని నిందితులు విత్డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడంతో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే నీరవ్ మోదీకి స్విస్ బ్యాంకుల్లో ఉన్న నాలుగు ఖాతాలను అక్కడి బ్యాంకులు స్తంభింపచేశాయి. వీటిలో దాదాపు రూ. 283 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. పీఎన్బీని నీరవ్ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసి, విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఈడీ, సీబీఐ తదితర ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. -
కుటుంబ కథా చిత్రం!
పట్నా: ఒక కుటుంబం నుంచి ఒకరు ఎంపీ కావడమే గొప్ప. అలాంటిది ఏకంగా నలుగురు ఒకేసారి పార్లమెంట్కు ఎన్నిక కావడమంటే విశేషమే. బిహార్లోని లోక్జన్ శక్తి పార్టీ (ఎల్జీపీ) నేత రాంవిలాస్ పాశ్వాన్(73) ఈ ఘనత సాధించనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బిహార్లో ఎన్డీయే పొత్తుల్లో భాగంగా ఎల్జేపీకి ఆరు సీట్లు దక్కాయి. వాటిలో మూడు చోట్ల.. పాశ్వాన్ కుమారుడు చిరాగ్, సోదరులు పశుపతి, రామచంద్రలు పోటీ చేసి నెగ్గారు. ఈ ఎన్నికల్లో పాశ్వాన్ పోటీ చేయలేదు. అయితే, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. ఎన్డీయేలో ముందుగా కుదిరిన అవగాహన ప్రకారం ఆయన రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. దీంతో పాశ్వాన్తో కలిపి ఆయన కుటుంబంలో నలుగురు ఒకేసారి ఎంపీలుగా ఉన్నట్లవుతుంది. ఇలా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఏకకాలంలో ఎంపీలు కానుండటం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ కెక్కడం సహా పాశ్వాన్ రాజకీయంగా ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన లోక్సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు నెగ్గారు. 1977 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. -
ఇంకిన కళ్లతో ఎడారి వంక
ఉప్పు సముద్రం ఆవల ఉన్న సౌదీ దేశం.. చాలామందికి భూతల స్వర్గం.రూకల కోసం ఉరుకెత్తీ పరుగులెత్తేవారికి ఉసురూ, ఊపిరీ నిలిపే ఓ ఆశల స్వర్గం.రియాళ్లు రూపాయల రూపుతొడిగితే...దీనార్లతో దీనత్వం, దిక్కులేనితనం పోతుందనే ఆశ! ఆ ఎడార్ల ఎండమావులే ఒయాసిస్సుల్లా భ్రమింపజేస్తుంటే... వీచికలనుకొని ఆ మరీచికల మరుభూములకు పరుగెత్తి మరణించిన వారిలో చౌక రమేశ్ కూడా ఒకరు. భర్త భౌతికకాయం, ‘మైల’ సాకుతో సమాజం.. ఆమెకు మైళ్ల దూరంలో ఉన్నాయి... ఉంచుతున్నాయి. దురదృష్టాన్నీ, దురదవస్థలనూ కళ్లలో ఒత్తులుగా వేసుకొని, భర్త శవం కోసం రెండునెలలుగా నిరీక్షిస్తూనే ఉంది లావణ్య. హలో.. బాగున్నవా?ఆ.. బాగున్న... నువ్వు, పిల్లలు, అమ్మ .. మంచిగనే ఉన్నరు కదా? అంత బాగే కదా!ఆ.. అందరం మంచిగనే ఉన్నం..సరే... మరి.. మల్లా చేస్తా... బయటకు పోతున్నా... అని చెప్పి ఫోన్ కట్ చేశాడు చౌక రమేశ్. సౌదీలో ఉంటాడు. డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ. అతను ఫోన్లో మాట్లాడింది భార్యతో. ఆమె పేరు లావణ్య. నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, మారంపల్లి గ్రామంలో ఉంటుంది. ఇద్దరు పిల్లలు.. శివాని.. పదకొండేళ్లు. పావని.. ఎనిమిదేళ్లు. పెళ్లికి ముందు నుంచే గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నాడు చౌక రమేశ్. ముందు దుబాయ్లో ఉండేవాడు. నాలుగేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. నిజానికి రెండేళ్ల కిందటే.. తనకు ఉద్యోగం ఇచ్చిన సేఠ్ ఇక తను రమేశ్ను హైర్ చేయలేనని.. ఇండియా వెళ్లిపొమ్మనీ చెప్పేశాడు.అర్థంతరంగా ఆ మాట వినేసరికి రమేశ్ ఖంగు తిన్నాడు. అప్పటికప్పుడు ఇండియాకు వచ్చేసే పరిస్థితి కాదు అతనిది. సౌదీలో ఉద్యోగాన్ని నమ్ముకొని సొంత ఊళ్లో చిన్న జాగా కొనుక్కొని.. అంతే చిన్నగా రేకుల ఇల్లు ఒకటి కట్టుకున్నాడు.. అన్నతో కలిసి. దానికి బోలెడు అప్పు అయింది. ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లను చదివించాలి. భార్య బీడీలు చుడుతూ ఇల్లు గడవడానికి సాయం చేస్తుంటే.. తను ఇల్లు, పిల్లల చదువు, వాళ్ల భవిష్యత్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. అప్పటికప్పుడు ఇండియా వెళ్లిపోయి అక్కడ తనేం చేయగలడు? పిల్లల భవిష్యత్ పక్కన పెట్టినా... ఇంటి కోసం చేసిన అప్పయితే తీరాలి కదా? గుండె గుభేల్ మన్నది రమేశ్కి. అతని పరిస్థితి తెలిసిన సౌదీలోనే ఉండే రమేశ్ వాళ్ల ఊరు వ్యక్తి, స్నేహితుడు.. తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు డ్రైవర్గానే. అందులో చేరి దాదాపు రెండేళ్లయింది. ఇదీ రమేశ్ నేపథ్యం క్లుప్తంగా! ఫోన్ విషయంలోకి వస్తే.. మళ్లీ ఫోన్ చేస్తానని భార్యతో చెప్పిన రమేశ్ తర్వాత రెండు రోజులైనా చేయలేదు. పనిలో బిజీగా ఉన్నడేమో అనుకొని రెండు రోజులు వేచిచూసింది. అతని క్షేమసమాచారాలు కాంక్షిస్తూ.. తన ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నట్టు మెస్సేజెస్ చేసింది. అయినా అతణ్ణించి రిప్లయ్ రాలేదు. ఆమె మనసు కీడు శంకించింది. తమ ఊరి నుంచి సౌదీకి వెళ్లిన వాళ్లందరి ఫోన్ నంబర్లు సేకరించి మరిదికి ఇచ్చింది ఫోన్ చేసి వాకబు చేయమని. చేస్తే తెలిసింది.. రమేశ్కి యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో ఉన్నాడని. ఏం జరిగింది? భార్యతో మాట్లాడిన రోజు రాత్రి... రూమ్లో ఉన్న రమేశ్కి ఓ ఫోన్ వచ్చింది. మాట్లాడి వెంటనే బయటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ రూమ్లో ఉన్న స్నేహితులకు ఫోన్ వచ్చింది.. రమేశ్కి యాక్సిడెంట్ అయింది.. అని. ఆ విషయమే చెప్పారు లావణ్య వాళ్లకు. ఆ రోజు రాత్రి సేఠే పనిమీద పిలిచాడు అని కొందరు... లేదు ఎవరో ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వస్తుంటే యాక్సిడెంట్ అయి ఆసుపత్రి పాలయ్యాడని కొందరు చెప్పారు. రమేశ్కి ఉద్యోగం ఇచ్చిన సేఠ్ని అడిగితే... నాకు తెలియదు.. నేను పిలవలేదు అని చెప్పాడట. ఈ తర్జనభర్జనలు ఎందుకంటే... యాక్సిడెంట్ అయి తీవ్రంగా గాయపడ్డ రమేశ్ కొన్నాళ్లు పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. మాట్లాడలేని స్థితిలో. లావణ్య వాళ్ల బాధ చూడలేక రమేశ్ స్నేహితులు.. ఆసుపత్రి వాళ్లని రిక్వెస్ట్ చేసి వీడియో కాల్ మాట్లాడించారు. లావణ్య అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పే స్థితిలో లేడు రమేశ్. వినడం.. చూడ్డం తప్ప నోరు విప్పలేని ఆరోగ్య దుస్థితి ఆయనది. చివరకు ఆమె.. ‘నేను, పిల్లలు అందరం బాగున్నాం.. నువ్వేం ఫికర్వెట్టుకోకు... తొందరగనే మంచిగయితవ్..’ అన్న మాటకు కన్నీటితో స్పందించాడు అంతే. అదే లావణ్య తన భర్తను చూసుకున్న చివరిచూపు.. మాట్లాడిన చివర మాట కూడా. తర్వాత కోమాలోకి వెళ్లిపోయాడు. దాదాపు రెండు నెలల కింద ఈ లోకంలోంచే వెళ్లిపోయాడు. భర్త చనిపోయిన ఇరవై రోజులకు లావణ్యకు తెలిసింది.గత రెండు నెలలుగా రమేశ్ భౌతిక కాయాన్ని ఇండియాకు తీసుకురావడానికి పోరాడుతోంది లావణ్య కుటుంబం. ఆ రోజు రాత్రి సేఠ్ పనిమీదే గనక రమేశ్ బయటకు వెళ్లి ఉంటే... ఆ బాధ్యత ఆ సేఠే తీసుకుని రమేశ్ భౌతిక కాయాన్ని ఆయన పూచీకత్తు మీదకు ఇండియాకు వచ్చేది. సేఠ్ నాకు సంబంధం లేదు అంటున్నాడు. రమేశ్ తన సొంత పనిమీద గనుక బయటకు వెళితే... పూచీకత్తు తీసుకునే వాళ్లు కావాలి. గల్ప్లోని మిగిలిన దేశాల చట్టాలు వేరు... ప్రత్యేకించి సౌదీ చట్టాలు వేరు. పైకం చెల్లించాల్సి ఉంటే.. అది మొత్తం చెల్లిస్తే కాని శవాన్ని స్వదేశానికి పంపదు ఆ దేశం. మనిషి చనిపోయాడు కదా అని కనికరమేమీ చూపించదు. చట్టం చట్టమే. మనిషి ప్రాణాలతో ఉన్నా, లేకపోయినా.. కఠినంగానే వ్యవహరిస్తుంది సౌదీ అరేబియా అంటారు.. గల్ఫ్ మైగ్రెంట్స్ హక్కులు, వాళ్ల గురించి న్యాయపోరాటం చేస్తున్న న్యాయవాది అబ్దుల్ ఖాదర్. కాబట్టి.. రమేశ్ యాక్సిడెంట్ అయిన తీరు, అంటే అతను సొంత పనిమీద వెళ్లాడా? ఉద్యోగధర్మంలో వెళ్లాడా అన్నది తేలాలి. అలాగే అతను అక్కడ ఏమైనా డబ్బు బాకీ పడ్డాడా అన్నది కూడా తేలాలి. పోరాటం..! గల్ఫ్లోని ఏ దేశం నుంచైనా మన కార్మికుల భౌతిక కాయాలు జన్మభూమికి రావడం.. పెద్ద ప్రహసనమే. కొన్ని నెలలు.. కొంతమంది విషయంలో అయితే యేడాది పైనే పట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు లావణ్య కూడా తన భర్త భౌతిక కాయం కోసం ఇంచుమించు పోరాటమే చేస్తోంది అడ్వకేట్ అబ్దుల్ ఖాదర్ సహాయంతో. సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నారు. మే 23, గురువారం నాడు హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్లోనూ వినతిపత్రం సమర్పించుకున్నారు. త్వరగా వచ్చేట్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాయి రెండు కార్యాలయాలు కూడా. మరింత విషాదం మంచిచెడులు ఫోన్లోనే పంచుకుంటూ ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్నాడు లావణ్య భర్త రమేశ్... వలస కార్మికులు అందరిలాగే. కనీసం కడసారి మాటకు.. చూపుకీ నోచుకోలేక పోయామే అనే వేదనను అనుభవిస్తోంది లావణ్య, ఆమె అత్తింటి కుటుంబం. ఇది ఒక బాధ అయితే... శవం వచ్చి దహన సంస్కారాలు జరిగే వరకు ఆ కుటుంబానికున్న ‘మైల’ కంటిన్యూ కావడం మరో విషాదం. కళ్ల ముందు భౌతిక కాయం లేదు. సముద్రాల ఆవల ఉంది. చనిపోయిన విషయం తెలిసి.. ఏడ్చి ఏడ్చి కంటి నీకు ఉప్పుచారికలైపోయాయి. సాధారణంగా అయితే పదిరోజుల్లో అంతా అయిపోయి.. నెల రోజుల్లో సామాన్య జీవితంలో పడాల్సిందే. లావణ్య వాళ్ల విషయంలో అది లేదు. రమేశ్ భౌతిక కాయం వచ్చేవరకు ఆ కుటుంబానికున్న మైలను ఊరివాళ్లు, బంధువులు నిర్ధారించడంతో.. వాళ్లు ఇంట్లోంచి బయటకురాలేని పరిస్థితి. లావణ్య బీడీలు చుడితే కాని కుటుంబం గడవదు. మైలలో ఆమె ఆ పని చేసే వీలు లేదు. రెండు నెలలు పనిచేయకుండా ఉంటే పిల్లలకు తిండి ఎట్లా? బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎన్ని రోజులని సాయం చేస్తారు? ఇంట్లో సరుకులు నిండుకుంటే కిరాణా షాప్కి కూడా వెళ్లలేని దుస్థితి. అంటుకోకూడదు.. ముట్టుకోకూడదు. ఊళ్లో ఏ శుభకార్యం జరిగినా ఈ కుటుంబం దూరమే. మనిషి పోయిన బాధతో ఎలాగూ వెళ్లలేరు... నిత్యావసరాలకూ నలుగురితో కలవలేని పరిస్థితి. లావణ్యతోపాటు ఆమె అత్తింటి కుటుంబానికంతటికీ ఇదే బాధ. పెళ్లిళ్లు, పేరంటాలు, గ్రామదేవతల పూజలు వంటి శుభకార్యాలకే కాదు.. ఊళ్లో ఎవరికైనా.. ఏదైనా సమస్య వచ్చినా.. వీళ్లు వెళ్లి పలకరించడానికి లేదు.. వాళ్లతో కలిసి బాధను పంచుకోవడానికి లేదు. లావణ్యకు ఇద్దరూ చిన్న పిల్లలే అని ఈ మధ్యే వాళ్లు షాప్కి వెళ్లినా.. పిల్లలతో కలిసి ఆడుకున్నా.. ఊళ్లో వాళ్లు అనుమతిస్తున్నారు. బంధువులు, తెలిసిన వాళ్లు వచ్చి సహాయం చేస్తున్నారట. కాని ఉత్తర తెలంగాణలోని చాలా ఊళ్లల్లో ఇలాంటి నియమాలను స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అయినా.. రమేశ్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు వచ్చే ఏర్పాటు చేయాలని లావణ్యతోపాటు గ్రామస్తులు కోరుతున్నారు.ఉప్పు ఊట దాహాన్ని తీర్చదు అని తెలిసినా... ప్రతి యేడు వందల్లో ఆ తీరానికి వెళ్తుంటారు ఆశల మూటతో! కొందరికే గల్ఫ్ జీవితాన్నిస్తుంది.. చాలామందికి ఉప్పుచారికలనే పంచుతుంది.. కన్నీటితోనైనా నోటిని తడుపుకునే వీలు లేకుండా! – సరస్వతి రమ నా భర్తను తెప్పించండి రెండు నెలల నుంచి కంటి మీద కునుకులేదు. నా భర్త శవం (దుఃఖాన్ని దిగమింగుకుంటూ) వచ్చి.. అంతిమ సంస్కారాలు జరిగితే కాని మామూలు జీవితంలోకి రాలేను. పోయిన మనిషి ఎలాగూ పోయాడు. ఉన్న పిల్లలను సాకే బాధ్యత నాదే కదా. నేను పనిచేస్తేనే పిల్లలకు అన్నం. ఇంటి మీదున్న అప్పూ తీర్చుకోవాలి. ఆయనతోనే నా ఆశలు, కలలు అన్నీ పోయాయి. కళ్లముందు కష్టమే కనపడుతోంది. ఈదాలి.. పిల్లల కోసమన్నా.నాకా శక్తి రావాలంటే నా భర్త శవం త్వరగా నా ఇంటికి రావాలి. బతికున్న మనిషి కోసం పడిగాపులు కాస్తాం. మాలాంటి వాళ్లు.. (ఏడుపుతో మాట రాలేదు).. ఈ కష్టం ఎవరికీ రావద్దు. కలోగంజో కలిసే తాగాలి. కలిసే బతకాలి. ప్రభుత్వం దయుంచి మా బాధ విని.. మా సమస్యను పరిష్కరించాలి. నా పిల్లలకు ఓ దారి చూపించాలని చేతులు జోడించి కోరుకుంటున్నా.. ’’ – లావణ్య, చౌక రమేష్ భార్య -
సీఎం కేసీఆర్ ఆలయాల సందర్శన
సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం రామేశ్వరంలోని ప్రసిద్ధ రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారమే రామేశ్వరం వెళ్లిన కేసీఆర్ అక్కడ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి వద్ద అంజలి ఘటించారు. తర్వాత అక్కడే బస చేసిన సీఎం కేసీఆర్ శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలసి రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన వేద పండితులు స్వామివారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబసభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే రామసేతు, పంచముఖ హనుమాన్లను కూడా దర్శించుకున్నారు. అలాగే ధనుష్కోటి బీచ్ను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే రామసేతు నిర్మాణం మొదలుపెట్టాడని చెబుతారు. దీనినే ప్రస్తుతం అడమ్స్ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబసభ్యులు తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు, సిబ్బంది వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ సముదాయంలోని రెండు బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలను, అక్కడి శిల్ప, చిత్రకళను కేసీఆర్ తిలకించారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. -
ఇల్లు పీకి విడాకులేస్తారు
పెంపకం కష్టమే.బ్యాలెన్స్ చాలా అవసరం. మొక్కను నిటారుగా నిలబెట్టడానికి ముళ్ల కర్ర అవసరమే. మొక్క బలంగా ఉండడానికి గారాబమూ అవసరమే. వీటిలో ఏది అదుపు తప్పినా పిల్లలు.. ఇల్లు పీకి విడాకులు వేయొచ్చు! ‘తాతీ’...‘ఏంటి చిన్నా’...‘ఐస్క్రీమ్ కావాలి’‘చలో’‘తాతీ..’‘ఏం కావాలి?’‘బ్యాటరీ కార్’‘చిన్నదేగా’‘కాదు.. మొన్న విశ్వ కొనుక్కున్నాడే. కూచుని నడిపేది’‘పది వేలు ఉంటుంది. ఏం పర్లేదు. పదా’ఇంట్లో తాత ఉన్నాడు. మనవడు ఉన్నాడు. మనవడు అడిగింది తాత ఆఘమేఘాల మీద ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మురిపెం నాన్నమ్మ చూస్తూ ఉంది. ఆ వేడుకకు కొడుకు ముచ్చట పడుతున్నాడు. కాని ఆ ఇంట్లో ఇంకో సభ్యురాలు కూడా ఉంది.ఆ ఇంటి కోడలు... ఆ పిల్లవాడి తల్లి.‘డాక్టర్... నా భార్యకు పిచ్చెక్కింది. నాకు సాధారణంగా కోపం రాదు. డివోర్స్ ఇవ్వాలన్నంత కోపం వస్తోంది’ సుకుమార్ అన్నాడు. రాణి తల వొంచుకుని కూచుని ఉంది. ‘నాకు మంచి ఉద్యోగం ఉంది. సొంత ఇల్లు ఉంది. మా అమ్మా నాన్న కూతురుతో సమానంగా చూసుకుంటారు. నేను కూడా ఒక్క కష్టం పెట్టలేదు. కాని వేరు కాపురం పెట్టాల్సిందే అని పట్టుపడుతోంది. ఏం చేయమంటారు’ అన్నాడు సుకుమార్.‘ఏమంటావు రాణి’ అంది లేడీ సైకియాట్రిస్ట్.‘వేరు కాపురమే డాక్టర్. లేదంటే డివోర్స్ కూడా రెడీయే. నా పిల్లవాణ్ణి నాతో పంపించేయమనండి చాలు’ అంది రాణి.సుకుమార్ నెత్తి కొట్టుకున్నాడు.వారు క్లినిక్లో ఉన్న సమయానికి మనవడితో తాత, నానమ్మ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు.‘తాతీ.. నాకు స్విగ్గీ నుంచి చికెన్ మెజెస్టిక్ తెప్పించు’‘ఏయ్... ఎందుకురా బయటి ఫుడ్డు. సాయంత్రం నేనే చేసి పెడతాను’ అంది రాణి.‘వద్దు. నాకు స్విగ్గీదే కావాలి... ఊ..ఊ... కావాలి’ టీపాయ్ మీదున్న వస్తువు కింద విసిరి కొట్టాడు. పేపర్లు చింపేశాడు. సోఫా మీద గెంతులేస్తున్నాడు. పెద్దగా ఏడుస్తున్నాడు.తాత, నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు.‘మీ అమ్మ అంతేరా చిన్నా... బ్యాడ్ అమ్మ. నేను తెప్పిస్తాను పద’రాణి నిస్సహాయంగా చూస్తూ నిలుచుంది.‘చిన్నా.. ట్యూషన్కు టైమ్ అవుతోంది. త్వరగా స్నానం చెయ్’... సాయంత్రం అయిదవుతుంటే స్కూల్ నుంచి వచ్చి అప్పటికే గంటైపోయిన చిన్నాని ఆదేశించింది రాణి.చిన్నా కదల్లేదు. టీవీలో కార్టూన్ షో చూస్తూ ఉన్నాడు.‘నీకే చెప్పేది’‘నేనివాళ వెళ్లను’‘వెళ్లవా. రెండు పీకుతాను’అంతే. వెంటనే చిన్నా ఏడుపు మొదలెట్టాడు. అల్లరి మొదలెట్టాడు. కింద పడి దొర్లడం మొదలెట్టాడు. తాత, నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు.‘వద్దులే నాన్నా... ట్యూషన్ వద్దులే. మీ అమ్మ అలాగే చెప్తుందిలే. అమ్మని కొడదాం సరేనా’... మనవణ్ణి లేపి తమ గదిలోకి తీసుకెళ్లి అక్కడ టీవీ వేసి కూచోబెట్టారు.ఏదో ఒక నిర్ణయం తీసుకునే సమయం వచ్చినట్టు రాణికి అనిపించింది.‘అది డాక్టర్... జరుగుతున్నది. నేనొక తల్లినని, ఆ పిల్లవాడు నన్ను గౌరవించాలని ఆ ఇంట్లో లేకుండా పోయింది. వాణ్ణి బాగా గారం చేసి చెడగొట్టారు. వాడికి డిజప్పాయింట్మెంట్ అంటేనే తెలియదు. ‘నో’ అనే మాట వింటేనే చాలా అల్లరి చేస్తున్నారు. ఎవరి మాట వినడం లేదు. అసలు వాడు పూర్తిగా ఏదో అయిపోతున్నాడు. ఏడేళ్ల వయసులోనే ఇలా ఉంటే పోను పోను ఏమవుతాడో. ఇంట్లో జరిగే గారాలకు బయట కూడా ఇలాగే బిహేవ్ చేస్తే ఎవరూరుకుంటారు?’ అంది రాణి.లేడీ సైకియాట్రిస్ట్ రాణి అత్త, మామలను పిలిచి మాట్లాడింది.మామగారు అన్నారు–‘డాక్టర్.. నాకు ముగ్గురు అబ్బాయిలు. వాళ్లు పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు నాకు చిన్న ఉద్యోగం. వారి ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేదు. కనీసం వారితో టైమ్ కూడా స్పెండ్ చేయలేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల మంచి పొజిషన్లో ఉన్నాడు. చిన్నా నా మొదటికొడుకు బిడ్డ. మా ఇంట్లో మొదటి మనవడు. అందుకని కొంచెం గారాబం చేస్తున్నాం. ఇందులో ఏదైనా తప్పుందంటారా?’ అన్నాడాయన.సుకుమార్ను అడిగింది సైకియాట్రిస్ట్ ‘వీళ్ల గారాబం వల్ల రాణి ఇబ్బంది పడుతోందని మీరు గమనించారా?’‘పెద్దగా లేదు డాక్టర్. ఇదంతా మామూలే కదా. నా కొడుక్కు మంచి గారాబం దక్కుతోంది కదా అనుకున్నాను. నేను ఇవన్నీ పొందలేదు నా చిన్నప్పుడు’‘చూశారా... చిన్నా విషయంలో మీరూ, మీ నాన్న, మీ అమ్మ ఒకవైపు; మీ భార్య ఒక వైపు ఉన్నారు. పిల్లల్ని ముద్దుగా చూసుకోవాలని, శ్రద్ధగా పెంచుకోకూడదనీ ఎవరూ అనరు. కాని ఆడింది ఆటా పాడింది పాటగా ఎదిగితే రేపు సమాజం నిజ స్వరూపం తెలిసి డిస్ట్రబ్ అవుతారు. చిన్న ఓటమి కూడా భరించలేని పరిస్థితికి వస్తారు. ఫెయిల్యూర్ అంటే ఏమిటో తెలియకుండా పెంచడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యల వరకూ వెళుతున్నారు. మీ చిన్నాకూ ‘ఎస్’తో పాటు ‘నో’ కూడా నేర్పాలి. పాస్తో పాటు ఫెయిల్ కూడా తెలియచేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా వాడు వాళ్ల తాతయ్య, నానమ్మతో ఆడటంతో పాటు తన ఈడు పిల్లలతో ఆడేలా చేయాలి’ అని అర్థమయ్యేలా చెప్పింది సైకియాట్రిస్ట్.ఆ తర్వాత రాణితో అంది–‘చూడమ్మా.. నువ్వు మీ అత్తామామల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే చూస్తున్నావు. ఇవాళ ఎంతమంది పిల్లలకు నానమ్మ, తాతయ్య తోడు దొరుకుతోంది? వాళ్లు నీ కొడుకును చూసుకోవడంలో నీకు సహాయంగా ఉంటున్నారు కదా. నీ కొడుక్కు ఇద్దరు కుటుంబ సభ్యుల కంటే నలుగురు కుటుంబ సభ్యులు ఉండటం పెద్ద బలం అని నువ్వు గ్రహిస్తే ఇటువంటి పొరపాట్లను సరిదిద్దుకుని వేరు కాపురం ఆలోచన మానుకుంటావు’రాణి అర్థమైనట్టుగా తల ఊపింది.అప్పుడు లేడీ సైకియాట్రిస్ట్ అందరితోటి అంది–‘ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులదే ప్రధాన నిర్ణయం కావచ్చు. కాని వారికి తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల తోడు దక్కాల్సిన హక్కును ఎవరూ కాదనలేదు. పెద్దలు గమనించుకుని చర్చించుకుని ముందుకు సాగితే ప్రతి ఇంటి మానవ సంబంధాలు నిలబడతాయి. గట్టి అనుబంధాల మధ్య పెరిగిన పిల్లలు స్థిరమైన వ్యక్తిత్వంతో పెరుగుతారు. కనుక చిన్నా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది’ అని ముగించింది.రాణి వేరు కాపురం పెట్టలేదు. అందరూ అదే ఇంట్లో ఉంటున్నారు. చిన్నా ఏదైనా అడిగితే ‘మీ అమ్మ ఓకే అంటే చేద్దాం’ అని అనడం తాత అలవాటు చేశాడు. కోడలిని పిల్లవాడి ముందు చిన్నబుచ్చడం మానుకున్నారు. చిన్నాకు కూడా మెల్లగా తన ఆటలు సాగవని అర్థమైంది. ట్యూషన్కు వెళ్లనని మారాం చేయకపోయినా ఒక ఐదు నిమిషాలు టీవీ చూసి మరీ ఆలస్యంగా వెళుతున్నాడు.ఇప్పుడా కుటుంబం హ్యాపీ ఫ్యామిలీ. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
నా చెవులకు కళ్లున్నాయ్ నా చేతులు చూస్తున్నాయ్
‘నా చెవులకు కనులున్నాయ్.. నా చేతులు చూస్తున్నాయ్. తెలుసు నాకు వెలుగేదో.. తెలుసు నాకు చీకటేదో..’ అనే కవి మాటలే స్ఫూర్తిగా ఆమె ముందుకు కదిలారు. ఆమె పుట్టుకతోనే లోకం చూడని అంధురాలు. చదువుకుంటానని అంటే కుటుంబ సభ్యులు ‘అయ్యో తల్లీ’ అని ఆవేదన చెందారు. సమాజమైతే.. ‘అసలే ఆడపిల్లవు.. ఆపై అంధురాలవు. నీకెందుకు చదువు’ అంటూ నిరుత్సాహపరిచింది. అయినా పట్టుదల, ఆత్మవిశ్వాసమే నేత్రాలుగా చేసుకుంటూ.. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్లారు. బీఏ, బీఈడీ, ఎం.ఎ., న్యాయశాస్త్రం, ఎంఫిల్, పీహెచ్డీ.. ఇలా డిగ్రీలు పొందుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా జీవితం సాగిస్తున్నారు. అక్కడితో ఆగిపోలేదు. భగవద్గీత మొత్తాన్నీ బ్రెయిలీలో లిఖించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ పరిణామ క్రమంలో తనకు ఎదురైన జీవితానుభావాలను సాక్షి ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారు లక్ష్మీనారాయణమ్మ. ‘నీ ఇష్టం’ అని ఫోన్ పెట్టేశారు ‘‘మాది విశాఖనగరమే అయినా... నాన్నగారు కలకత్తాలో రైల్వే ఉద్యోగి. నేను చదువుతానని చెప్పినప్పుడు ఇంట్లోవాళ్లు అడ్డు చెప్పారు. మా ఇంట్లో ఇద్దరు పిన్నిలు, మామయ్య కూడా అంధులే. వారు మాత్రం నన్ను ప్రోత్సహించారు. చదువుకోకపోవడం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నాం. అందుకే అమ్మాయిని చదువుకోడానికి పంపించండని నాన్నతో చెప్పడంతో హైదరాబాద్లోని అంధుల పాఠశాలలో చేర్పించారు. బాలురు, బాలికలకు కలిపి ఒకే పాఠశాల ఉండేది. రెండవ తరగతిలోనే ఎస్ఎఫ్ఐతో కలిసి బాల బాలికలకు వేర్వేరు పాఠశాలలు కావాలని డిమాండ్ చేస్తూ ధర్నా, నిరాహార దీక్షలో పాల్గొన్నాను. అప్పటి గవర్నర్ శారదాముఖర్జీ స్పందించి అంధ బాలికల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారు. పదో తరగతి వరకూ అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ విశాఖలోని బీవీకే కళాశాలలో పూర్తి చేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడు జరిగే యూత్ ఫెస్టివల్స్లో పాల్గొనేదాన్ని. ఎప్పుడూ అంధుల కోసం నిర్వహించే పోటీల్లో పాల్గొనేదాన్ని కాదు. అందరితో కలిసి పాల్గొనేదాన్ని. ప్రతి పోటీలోనూ విజయం సాధించేదాన్ని. డిగ్రీ తర్వాత బీఈడీ ఎంట్రన్స్ రాస్తే రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ వచ్చింది. అంధుల కోటాలో కోరుకున్న చోట సీట్ అని చెప్పినా.. ఆ కోటాలో వద్దని.. జనరల్ కోటాలో తీసుకున్నాను. డిగ్రీ పూర్తయ్యాక చదువు చాలని ఇంట్లో వాళ్లు హెచ్చరించారు. అయినా వినకపోవడంతో నాతో మాట్లాడటం మానేశారు. బీఈడీ పూర్తయిన తర్వాత ఆసెట్ రాసి ఏయూలో పీజీ చదివాను. సీట్ వచ్చిన తర్వాత ఇంట్లోవాళ్లకు చెప్పాను. వాళ్లేం మాట్లాడలేదు. నీ ఇష్టమని చెప్పి ఫోన్పెట్టేశారు. ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీల్లో ర్యాంకులు వచ్చాయి. హిస్టరీలో చేరి పీజీ పూర్తి చేసిన తర్వాత లా డిగ్రీ సాధించాను. ఆ తర్వాత ఎంఫిల్ చేశాను. పీహెచ్డీ కూడా పూర్తి చేశాను. లా ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నాను. కానీ.. ఉపాధ్యాయ వృత్తి వైపు దారి మళ్లింది. ప్రస్తుతం విశాఖ నగరంలోని మహారాణిపేటలో ఉన్న ఎంవీడీ మున్సిపల్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాను. ‘లోపలికి వెళ్లిపో’ అనేవారు అంధురాలిగా పుట్టినప్పటి నుంచే కష్టాలు కూడా నా వెంటే వచ్చాయి. చదువుకునే సమయంలో ఇంట్లో నుంచి ప్రోత్సాహం లేకపోవడంతో ఒంటరిగా జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదోతరగతి పూర్తి చేసుకున్నాక ఇంటికి వెళ్లాను. ఇంటికి ఎవరైనా వస్తే.. లోపలికి వెళ్లిపో అని అనేవారు. అప్పుడు చాలా బాధపడేదాన్ని. ఎవరైనా వస్తే నేనెందుకు దాక్కోవాలి? అంధురాలిగా జన్మించడం నా తప్పా.? అందుకే.. చదువుకోవాలి, నా కాళ్లపై నేను నిలబడాలని నిశ్చయించుకున్నాను. అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నాను. ప్రతి ప్రాంతం నాకెన్నో పాఠాలు నేర్పించింది. అంధురాల్ని చేసుకున్న నువ్వు గ్రేట్ అని ఎవరైనా నా భర్తను పొగిడితే.. నేను జీర్ణించుకోలేను. అందుకే.. పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను’’ అని ముగించారు లక్ష్మీనారాయణమ్మ. కరుకోల గోపి కిశోర్రాజా, సాక్షి, విశాఖ వెయ్యి గిన్నిస్లు ఎక్కినంత! 1991లో జనవరి 3వ తేదీన బ్రెయిలీలో భగవద్గీత రాయడం ప్రారంభించాను. ఆహారం తీసుకోకుండా, నిద్ర పోకుండా, మంచినీరు తాగకుండా 24 గంటల పాటు నిర్విరామంగా ఐదున్నర అధ్యాయాలు రాశాను. తర్వాత 1991 మార్చి 23న అక్కడినుంచి 11 వ అధ్యాయం వరకూ రాశాను. ఏకబిగిన ఇరవై ఆరున్నర గంటల పాటు రాశాను. ఇక మిగిలిన ఏడు అధ్యాయాల్ని ఒకేరోజున పూర్తి చెయ్యాలని నిర్ణయించుకొని 1992లో 11వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకూ పూర్తి చేసేశాను. ఈసారి ఏకంగా ముప్ఫైమూడున్నర గంటల సేపు రాసి విజయవంతంగా పూర్తి చేశాను. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసం çపంపితే.. ఇది మతపరమైన అంశమని తోసిపుచ్చారు. నాకు చాలా బాధ అనిపించింది. కానీ.. ఇది పూర్తి చేసిన తర్వాత వచ్చిన ప్రశంసలు నాకు వెయ్యి గిన్నిస్ బుక్లు ఎక్కినంత ఆనందాన్నిచ్చాయి. లక్ష్మీనారాయణమ్మ ►బ్రెయిలీలో భగవద్గీత ►మంచినీరు కూడా తీసుకోకుండా నిర్విరామ రచన ►అన్ని రంగాల్లో రాణించగల సత్తా ►అంధ ఉపాధ్యాయురాలు కొల్లూరు లక్ష్మీనారాయణమ్మ -
ధర్మనిరతి అంటే అది!
పూర్వం కాశీరాజ్యంలోని ఒక అడవిలో ధర్మనిరతుడు అనే భిక్షువు ఉండేవాడు. ఆ అడవిలో ఒక పెద్ద కొలను ఉంది. దాన్నిండా తామరపూలు. లేత పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఆ సరోవరం దాపునే ధర్మనిరతుని నివాసం. ఆ సరోవరానికి ఒక కాపలాదారు ఉన్నాడు. ఒకరోజున ఉదయాన్నే ధర్మనిరతుడు లేచి కొలనులో స్నానం చేసి, గాలి వాలుకు పోయి నిలబడ్డాడు. పూలపరిమళాలు పీలుస్తూ తన్మయుడవుతున్నాడు. అంతలో అతన్ని కాపలాదారు ‘‘స్వామీ! దొంగతనం తప్పా? ఒప్పా?’’ అడిగాడు. ‘‘నాయనా! దొంగతనమే కాదు, ఒకరు ఇవ్వకుండా మనది కానిది ఏది తీసుకున్నా తప్పే. అదీ దొంగతనం కిందే లెక్క’’ అన్నాడు చిరునవ్వుతో. ‘‘అయితే... మీరు దొంగే!’’ అన్నాడు కాపలాదారు. ‘‘నేనా? నేనేమీ దొంగిలించలేదే’’ అన్నాడు భిక్షువు. ‘‘ఇదిగో... ఈ పూలపరిమళాలు ఆఘ్రాణించారు కదా! ఇది గంధచౌర్యమే కదా. తమరు నా కొలనులోని సువాసనల్ని దొంగిలించినట్లే కదా’’ అన్నాడు. భిక్షువు అతనితో అలా మాట్లాడుతూ ఉండగానే, కొలను ఆవలిగట్టున ఒక వ్యక్తి వచ్చి కొలనులో దిగి కొన్ని తామరపూలు తెంపుకుని వెళ్లిపోయాడు. అతణ్ణి కాపలాదారు చూశాడు. కానీ, అతణ్ణి ఏమీ అనలేదు. కనీసం కేకవేసి మందలించలేదు. అప్పుడు భిక్షువు– ‘‘బాగుందయ్యా! వాసన చూసిన నన్ను తప్పుపట్టావు. పూలు తెంపుకుపోతున్న వాణ్ణి పన్నెత్తి చూడలేదు’’అని అడిగాడు. ‘‘స్వామీ! అతను లోభి. ధూర్తుడు. అజ్ఞాని. కానీ, తమరు జ్ఞానులు. ప్రబోధకులు. స్వచ్ఛమైన కర్మలు ఆచరించేవారు. దోషం ఎంచలేని దొడ్డవారు. అతను పెద్ద తప్పు చేసినా చిన్నగానే కనిపిస్తుంది. మీలాంటివారు కంట్లో నలుసంత తప్పు చేసినా కారుమేఘమంతగా అందరికీ కనిపిస్తుంది కదా!’’ అన్నాడు. భిక్షువు మౌనం వహించాడు. ధార్మికులు జీవితంలో ఎంత జాగరూకులై ఉండాలో బుద్ధుడు చెప్పిన సందేశాత్మక కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ మీకు తెలుసా ►కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు ‘విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల’ ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. అన్ని పనులలో విజయాలను సాధిస్తారు. ►లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ని నిత్యం పారాయణం చేస్తే మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి. ►సంతానం లేని వారు ప్రతిరోజు ‘గోపాల స్తోత్రం’ ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భిణులు ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, పురోహితులు శాస్త్రాల ఆధారంగా చెబుతున్నారు. ►గరికను నగదు ఉంచే ప్రదేశంలో పెడితే, రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. ►శనీశ్వరుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలిననాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. ►గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే కోరికలు నెరవేరుతాయి. -
పదార్థాల్లేని వంట
పూర్వం ఒకసారి ఒక ప్రాంతంలో తీవ్ర క్షామం ఏర్పడింది. అంటే వర్షాలు పడక పంటలు ఎండిపోయి, గడ్డి కూడా మొలవని పరిస్థితి అన్నమాట. ఒకాయన అక్కడ వర్షాలు పడేంతవరకు ఎలాగూ పనిదొరకదు కాబట్టి ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవాలనుకున్నాడు. కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించారు. పిల్లల్లో చిన్నవాడు ఆకలి అనడంతో ఏదైనా వండుకుని తిని ఆకలి తీరాక ప్రయాణం కొనసాగించాలనుకున్నారు. తల్లి రాళ్లు తెచ్చి పొయ్యి తయారు చేసింది. తండ్రి నీళ్ల కోసం వెళ్లాడు. అబ్బాయి, అమ్మాయి చెట్టు కింద ఉన్న ఎండుపుల్లలు ఏరి నిప్పు రాజేస్తున్నారు. ఈ విధంగా అందరూ తలోపనిలో ఉండటాన్ని చెట్టుపైనుంచి పక్షులు చూస్తున్నాయి. వాటిలో పెద్ద పక్షి మిగిలిన వాటితో ‘‘వీళ్లు చూస్తే ఒట్టి తెలివితక్కువ వాళ్లలా ఉన్నారు. వండుకోవడానికి పదార్థాలేమీ లేకుండానే వంట ప్రయత్నాలు మొదలు పెట్టారు’’ అంటూ నవ్వింది. ఆ మాటలు విన్న పెద్దవాడికి కోపం వచ్చింది. ‘‘ఇప్పటివరకు ఏదైనా దుంపలు తవ్వుకు తీసుకొచ్చి వండుకు తినాలనుకుంటున్నాము. ఇప్పుడు మీరు మమ్మల్ని ఎగతాళి చేశారు కాబట్టి, మిమ్మల్నే పట్టుకుని వండుకుని తింటాం’’ అన్నాడు కోపంగా. ఆ మాటలకు పెద్దపక్షి భయపడింది. ‘‘బాబూ! కుటుంబమంతా కలిసి ఉండటంలోని సంతోషం నీకు తెలుసు కదా. మా పక్షి పరివారాన్ని చంపకండి. అందుకు బదులు మేము మీకు ఒక నిధి చూపిస్తాం వెళ్లి తెచ్చుకోండి. ఈలోగా మీకు ఆకలి తీరేందుకు కొన్ని పళ్లు, దుంపలు చూపిస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి’’ అని బతిమాలింది. అందుకు అందరూ సంతోషంగా అంగీకరించారు. ఆ కష్టకాలంలో వారికి లభించిన నిధితో ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ కథను ఒక గురువు తన శిష్యులకు చెప్పి, ‘‘చూశారా పిల్లలూ! పరిస్థితులను తలచుకుని భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. మన ప్రయత్నం చేయాలి. అప్పుడే అన్నీ అనుకూలిస్తాయి. ఆ కుటుంబం పదార్థాలేమీ దొరక్కుండానే వంట మొదలు పెట్టి అలా ఆశావహ దృక్పథంతో ప్రవర్తించింది కాబట్టే వారికి నిధి దొరికిందని గ్రహించండి’’ అని బోధించారు. పిల్లలు అర్థమైందన్నట్టు తలలు పంకించారు. – డి.వి.ఆర్. -
సాగర్ను సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
నాగార్జునసాగర్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ను సందర్శించారు. తెలంగాణ లాంచీలో హిల్ కాలనీ నుంచి కొండకు వెళ్లారు. అక్కడ అలనాటి నదీలోయ నాగరికతను ప్రతిబింబించే దృశ్యాలు, రాతియుగం, శిలాయుగంలో వాడిన పనిముట్లు గల మ్యూ జియం, గ్యాలరీని తిలకించారు. బుద్ధుడికి సంబం ధించిన విగ్రహాలు, చైత్యాలు, యజ్ఞశాల, ఓడరేవు తదితర ప్రాంతాలను సందర్శించారు. ఆయన వెంట నల్లగొండ జిల్లా జడ్జీలు తిరుమలరావు, ప్రభాకర్, గురజాల, మాచర్ల జడ్జిలు సత్యశ్రీ , అజయ్కుమార్, నిడమనూరు జడ్జి రాధాకృష్ణ, ఎస్పీ రంగనాథ్ తదితరులున్నారు. -
గణపతి బప్పా మోరియా
కొన్ని రోజులుగా సినిమా షూటింగ్స్కి బ్రేక్ తీసుకుంటున్నారు అల్లు అర్జున్. ఈ గ్యాప్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కొత్త సినిమా కథలూ వింటున్నారు. పిల్లలతో ఎక్కువ టైమ్ ఆటలు ఆడుకుంటున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెంట్స్తో గడుపుతున్నారు. వినాయక చవితి సందర్భంగా ఫ్యామిలీ అందరితో కలిసి వినాయకుడి పూజల్లో నిమగ్నమైపోయారు అల్లు అర్జున్. కుటుంబంతో సహా వినాయకుడ్ని దర్శించుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఫొటో అదే. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తర్వాత హడావిడిగా సినిమా సైన్ చేయలేదు అల్లు అర్జున్. కథలు వింటున్నారు. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కే కుమార్తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా ఉండబోతోందని, లేదు లేదు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నెక్ట్స్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. -
న్యాయం కొసం
-
కశ్మీర్ పోలీసులపై ‘హిజ్బుల్’ పంజా
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపడంతో బలగాల కుటుంబసభ్యులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్, అవంతిపొరా జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి రాష్ట్ర పోలీస్ అధికారుల కుటుంబీకులైన 11 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్లు తామే చేసినట్లు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ ప్రకటించింది. ఈసారికి మాత్రం వారిని ప్రాణాలతో వదులుతున్నట్లు స్పష్టం చేసింది. దక్షిణ కశ్మీర్లో గురువారం అర్ధరాత్రి పోలీస్ అధికారుల ఇళ్లపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 11 మంది కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశారు. షోపియాన్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు పోలీస్ అధికారులు చనిపోవడంతో భద్రతాబలగాలు ఉగ్రవాదుల ఇళ్లపై దాడిచేసినట్లు వార్తలు వచ్చాయి. దీనికితోడు హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సలాహుద్దీన్ కొడుకు షకీల్ను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో ఉగ్రవాదులు పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్ చేశారు. ఘటనపై కశ్మీర్ పోలీస్శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు ఏడుగురు కిడ్నాప్ అయ్యారని తెలిపారు. త్వరలోనే మిగతా వివరాలను తెలియజేస్తామన్నారు. మా బాధ తెలియాలనే కిడ్నాప్ చేశాం పోలీస్ అధికారుల కుటుంబీకులు 11 మందిని తామే కిడ్నాప్ చేశామని హిజ్బుల్ ముజాహిదీన్ కశ్మీర్ చీఫ్ రియాజ్ నైకూ ప్రకటించాడు. ‘అమాయకులైన పిల్లలను ఎత్తుకెళ్తే తల్లి పడే బాధ మీకు తెలియడానికే కిడ్నాప్ చేశాం. మేం మిమ్మల్ని(పోలీసులను) చేరుకోగలమని చెప్పేందుకే ఈ పని చేశాం. మీ కస్టడీలోని మా బంధువులను 3 రోజుల్లో విడిచిపెట్టండి. లేదంటే మీ కుటుంబాలు లోయలో ఇక ఎంతమాత్రం సురక్షితంగా ఉండవు. ఈసారి మీ కుటుంబీకుల్ని ప్రాణాలతో సగౌరవంగా విడిచిపెట్టాం’ అని ఆడియోలో హెచ్చరించాడు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ముందువరుసలో కశ్మీరీ పోలీసులు ఉండటంపై నైకూ∙అసహనం వ్యక్తం చేశాడు. నెలరోజుల్లోగా ఉద్యోగాలను విడిచిపెట్టివెళ్లేలా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తామని నైకూ స్పష్టం చేశాడు. -
పగబట్టిన మృత్యువు
ఆ కుటుంబంపై విధి పగబట్టినట్టుంది. నెలరోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త, కుమారుడిని మృత్యువు కబళించింది. దీంతో ఆ కుటుంబ శోక సంద్రంలో మునిగిపోయింది. మాడుగుల రూరల్: ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు ఒక రోజు వ్యవధిలో మృతి చెం దగా, కుటుంబం యజమాని నెల రోజుల క్రితం మరణించాడు. వివరాలు ఇలా లున్నాయి. కె.జె.పురం గ్రామానికి చెందిన పాటోజు నాగభూషణం బంగారం పనిచేసేవాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో ఇద్దరు కుమార్తెలకు, చిన్న కుమారుడికి వివాహం జరిగింది. నెల రోజుల క్రితం నాగభూషణం అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆయన భార్య ఈశ్వరమ్మ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మంచం పట్టింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేసేవారు. నాగభూషణం మృతి చెందిన విషాదం నుంచి ఆ కుటుంబ కోలుకోకముందే ఈశ్వరమ్మ ఈ నెల 11వ తేదీ సాయంత్రం కె.జె.పురంలో మృతి చెందింది. ఆమెకు గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే నాగభూషణం పెద్ద కుమారుడు పాటోజు రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఆయన గతంలో హైదరాబాద్లో సినీ రంగంలో పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో క్యాన్సర్ సోకింది. మిత్రులు సాయం చేసి చికిత్స చేయించారు. అయినా ఫలితం లేకపోయింది. రామకృçష్ణ గురువారం మధ్యాహ్నం సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామంలో తన సోదరి ఇంటి వద్ద మృతి చెందాడు. దీంతో ఆ విషాదఛాయలు అలుముకున్నాయి. రామకృష్ణ మృతదేహాన్ని అక్కడ నుంచి కె.జె.పురం తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్రీవారిని దర్శించుకున్న సీఎం, కుటుంబసభ్యులు
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్ద ఇస్థికాపాల్తో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో మహాద్వార ప్రవేశం ఉన్నప్పటికీ.. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణీ, మనవడు దేవాన్ష్, బావమరిది బాలకృష్ణ కుటుంబంతో కలిసి వైకుఠం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. బుధవారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కావడం వల్లనే స్వామి ఆశ్సీస్సుల కోసం సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు వచ్చినట్లు సమాచారం. -
కుటుంబం ఆత్మహత్యాయత్నం.. కానీ
సాక్షి, చెన్నై: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పురుగుల మందు తాగి అత్మహత్యకు ప్రయత్నించారు. ఇందులో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన చెన్నైలోని కవరపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుమ్మిడిపూండి యూనియన్ కవరపేట సమీపంలోని అయ్యర్ కండ్రిగై గ్రామానికి చెందిన సెల్వం(42). గ్రామ శివారులోని కవరపేట– సత్యవేడు రోడ్డు సమీపంలో హోటల్ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఈయన భార్య జయంతి(35). వీరికి మహాలక్ష్మి(17), మోనిషా(15) అనే కుమార్తెలున్నారు. వీరితో పాటు సెల్వం తల్లి వళ్లియమ్మళ్ (63) కూడా ఉంటుంది. మంగళవారం రాత్రి సెల్వం కవరపేట నుంచి ఇంటికి వస్తు తనతోపాటు పురుగుల మందు తీసుకువచ్చాడు. అందరూ కలిసి భోజనం చేశాక పురుగుల మందును భార్య, కుమార్తెలు, తల్లికి తాగించాడు. అనంతరం అతను తాగి కింద పడిపోయారు. పిల్లలు పెద్దగా కేకలు వేయడంతో విన్న పక్కింటివారు అక్కడికి వచ్చారు. తలుపులు తెరచి చూడగా అందరూ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న కవరపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నై ప్రభుత్వ స్టాన్లీ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెల్వి తల్లి వళ్లియమ్మాళ్ బుధవారం మృతి చెందింది. మిగిలిన నలుగురుకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసును విచారణ చేస్తున్నారు. -
‘ సినిమాలో మాదిరి.. ఒక్క రోజులో సీఎం కాలేరు’
సాక్షి, టీ. నగర్: సినిమాల్లో జరిగినట్లు ఎవరూ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేరని పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. తనపై రూ. 1.12 కోట్లు మోసగించినట్లు ఆరోపణలు రావడం శశికళ కుటుంబీకులు చేసిన కుట్రగా జె. దీప పేర్కొన్నారు. కడలూరులో ఎంజీఆర్ అమ్మ దీప పేరవై తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఎంజీఆర్, జయలలిత బహిరంగ సభ, సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం తేరడి మైదానంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దీప మాట్లాడుతూ.. జయలలిత జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె పుట్టిన రోజు నుంచి రాయడం ప్రారంభించారని తెలిపారు. అన్నాడీఎంకేను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. అంతేకాక ఆమె తనపై వచ్చిన రూ. 1.12 కోట్ల వ్యవహారం ప్రస్తావించారు. దీనిపై మోసం చేసినట్లు ఫిర్యాదులందాయని వాపోయారు. తనపై ఇది వరకే అనేక ఫిర్యాదులు చేయడమే కాకుండా అసత్యాలను వెల్లడిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం రూ. 1.12 కోట్లు మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు శశికళ కుటంబీకులు చేసిన కుట్రగా జె. దీప తెలిపారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట): వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ వరు సకు అన్నాచెల్లెలు అని తెలియడంతో పెద్దలు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు పెట్రోల్ పోసు కొని నిప్పంటించుకున్నారు. ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం శివాపురానికి చెందిన ధరావత్ వెంకటేశ్వర్లు, పున్నిల కుమారుడు సాయి(19) గ్రామంలోని ఓ హోటల్లో వంట మాస్టర్గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఎల్బీ తండకు చెందిన సునీత(18)తో ప్రేమలో పడ్డాడు. తమకు పెళ్లి చేయాలంటూ.. ఇద్దరూ పెద్దల్ని సంప్రదించారు. కానీ వీరిద్దరూ వరుసకు అన్నాచెల్లెలు కావడం, ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే కావటంతో.. పెళ్లికి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో సాయి, సునీత 20 రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పెనుగంచి ప్రోలులో మూడు రోజులపాటు కలిసి ఉన్నారు. ఈ ఘటనపై పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా.. సునీతను ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. సాయి శుక్రవారం ఎల్బీ తండకు వెళ్లి సునీతను తీసుకొచ్చాడు. ఇద్దరూ కలిసి శనివారం పెనుగంచిప్రోలు మండలంలోని లింగగూడెం – గౌరవరం రోడ్లో ఉన్న సుబాబుల్ తోటలోకి వెళ్లారు. తమపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించు కున్నారు. పొలాల్లో ఉన్న రైతులు గమనించి మంటలు ఆర్పివేశారు. మెరుగైన వైద్యం కోసం వీరిని విజయవాడకు తీసుకెళ్లారు. -
ఆ కుటుంబంలో అందరిదీ 111 ఏళ్ళ వయసే!
పెద్దతిప్పసముద్రం: వారి పొరపాటు వీరికి గ్రహపాటుగా మారింది. ఓ కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో కుటుంబ యజమాని, భార్య, కుమారుడికి అందరికీ ఒకేలా 111 ఏళ్ళ వయసు నమోదు అయి ఉంది. ఇది ఎలా నమోదైంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ, పుట్టిన తేదీ ధ్రువపత్రాల కోసం వెళితే రేషన్ కార్డులో పేర్కొన్న వయసు అడ్డొస్తోంది. దీంతో కార్డులో వయసును మార్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుటుంబీకులు సతమతమవుతున్నారు. చిత్తూరుజిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలోని యంపార్లపల్లికి చెందిన గుట్టపాళ్యం వెంకట్రమణ పేరిట డబ్ల్యూఎపి 1004007ఏ0166 నంబర్ గల రేషన్ కార్డు ఉంది. వ్యవసాయ పనులే ఈయన జీవనాధారం. వాస్తవంగా వెంకట్రమణకు 55 ఏళ్లు, భార్య అమరమ్మకు 45ఏళ్లు, కుమారుడు మురళీధర్ రెడ్డికి 18 ఏళ్ళ వయసు. మురళీధర్రెడ్డి పుత్తూరులోని ఓ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం అతనికి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం అవసరం వచ్చింది. కాలేజీ అధికారులు వీరి రేషన్ కార్డు నంబర్ను ఆన్లైన్లో క్లిక్ చేయగా ఇతనికి 111 ఏళ్లు, అలాగే అతని తల్లిదండ్రులకూ 111 ఏళ్ళ వయసు నమోదై ఉండటాన్ని గమనించి అవాక్కయ్యారు. దీంతో కార్డులోని వయసును సవరించాలంటూ ఆ కుటుంబీకులు మీ-సేవ కేంద్రానికి వెళ్లారు. అయితే వయసు మార్పు చేసే ఆప్షన్ ఏదీ లేదని మీ-సేవ నిర్వాహకులు స్పష్టం చేశారని వెంకట్రమణ వాపోయాడు. అధికారుల తప్పిదాల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎక్కడికి వెళ్ళి సవరణ చేయించుకోవాలో పాలుపోవడం లేదని కార్డుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
తెల్లారిన బతుకులు
సాక్షి, యాదాద్రి/జగదేవ్పూర్: విషం కలుపుకుని తిన్నారా? పురుగుల మందు తాగారా? ఫుడ్ పాయిజన్ అయిందా? లేదా కోళ్ల కోసం ఉంచిన కెమికల్ బియ్యమే ప్రాణాలు తీసిందా? అసలు వారివి ఆత్మహత్యలా? హత్యలా? కారణాలేవైతేనేం.. తెల్లారేసరికి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి నిండు జీవితాలు తెల్లారిపోయాయి! రాత్రి భోజనం చేసి పడుకున్న వారంతా తెల్లారేసరికల్లా విగతజీవులుగా కనిపించారు. చనిపోయినవారిలో భార్యాభర్త, వారి ముగ్గురు పిల్లలు, అత్తామామ ఉన్నారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. అసలేం జరిగింది? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడపకు చెందిన దుబ్బాసి బాలరాజు(44), నిర్మల(40) దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె శ్రావణి(14), చింటు(12), బన్ని(8). బాలరాజు అత్తమామ జనగామ జిల్లా చిలుపూరు మండలం లింగంపల్లికి చెందిన బచ్చలి బాల నర్సయ్య(68), బచ్చలి భారతమ్మ(60). రాజాపేటకు చెందిన బెజగం నాగభూషణం కోళ్ల ఫారంలో నెల కిందట బాలరాజు, నిర్మల పనిలో చేరారు. ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున వేతనం మాట్లాడుకున్నారు. యజమాని వారికి కోళ్లఫారం సమీపంలోనే వసతి కల్పించారు. బాలరాజు మామ బాల నర్సయ్య సమీపంలోని పాముకుంట శివారులో సతీశ్కు చెందిన దాబా హోటల్లో పనిచేస్తూ రాత్రి సమయంలో ఇక్కడికే వచ్చి పడుకుంటాడు. కొంతకాలంగా బాలరాజు, నిర్మల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతోపాటు బాలరాజు ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు పెరిగినట్లు తెలుస్తోంది. గొడవల నేపథ్యంలోనే నిర్మల తల్లిదండ్రులైన భారతమ్మ, బాలనర్సయ్య ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. గురువారం బాలరాజు, నిర్మల, బాలనర్సయ్య రాజాపేటకు వెళ్లి అక్కడ కల్లు డిపోలో కల్లు సేవించారు. ఇంటికి వస్తూ మధ్యలో చికెన్ తీసుకున్నారు. రాత్రి చికెన్ వండుకొని తిని అందరూ నిద్రపోయారు. కోళ్లఫారం యజమాని నాగభూషణం రాత్రి 9.30 గంటల సమయంలో వచ్చి వీరిని లేపే ప్రయత్నం చేశారు. ఎంతకీ లేవకపోవడంతో వెళ్లిపోయాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో మళ్లీ వచ్చి లేపే యత్నం చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వీరిని పనిలో పెట్టించిన దాబా హోటల్ యజమాని సతీశ్ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. తర్వాత వారిద్దరు వచ్చి చూశారు. తట్టి లేపే ప్రయత్నం చేసినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు మిస్టరీగా కేసు ఏడుగురు మృతి పోలీసులకు మిస్టరీగా మారింది. పురుగుల మందు తాగారా లేక తినే భోజనంలో కలుపుకుని తిన్నారా లేదా ఫుడ్ పాయిజన్ అయిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని రాచకొండ జాయింట్ సీపీ తరుణ్ జోషి, భువనగిరి డీసీపీ రామచంద్రారెడ్డి పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్టీం, డాగ్స్క్వాడ్తోపాటు పోస్టుమార్టం నివేదిక తర్వాత కారణమేమిటన్న విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. మృతదేహాలకు భువనగిరిలో పోస్టుమార్టం నిర్వహించి.. శుక్రవారం రాత్రి మునిగడపలో అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే గదిలో నిర్జీవంగా పడివున్న బాలరాజు కుటుంబ సభ్యులు కెమికల్ కలిపిన బియ్యం తిన్నారా? ఫారాల్లో కోళ్ల దాణాగా బియ్యం, నూకలు నిల్వ చేస్తారు. అవి ముక్కిపోకుండా, చోరీకి గురికాకుండా ఉండడానికి ఒక రకమైన కెమికల్ కలిపి నిల్వ చేస్తారు. ఫారంలోనే పనిచేస్తున్న బాలరాజు.. అవి కెమికల్ కలిపిన బియ్యం అని తెలియకుండా వాటిని తెచ్చి వండుకుని తినడంతో ఘోరం జరిగి ఉండవచ్చని కూడా పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కారణం ఏమై ఉంటుంది? ఒకే కుటుంబానికి చెందిన ఈ ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారా, తినే ఆహారంలో ఏవైనా విష పదార్థాలు కలిశాయా, లేదా వీరే క్రిమిసంహారక మందులు కలుపుకున్నారా, ఎవరైనా హత్య చేశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలరాజు అనారోగ్యానికి గురి కావడంతో భార్యాభర్త మధ్య గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతోపాటు కుటుంబ పోషణ కోసం వీరు పలుచోట్లకు మారారు. భార్య నిర్మల ప్రవర్తనపై అనుమానం పెంచుకొని బాలరాజే చికెన్లో విషం కలిపి అందరినీ హతమార్చి ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. వీరు స్థానికంగా కల్లు తాగడంతోపాటు కొంత ఇంటికి కూడా తెచ్చుకున్నారు. మృతదేహాల మధ్య ఓ మద్యం బాటిల్తోపాటు మూడు క్రిమిసంహారక మందు డబ్బాలు కూడా పడి ఉన్నాయి. దీంతో వారి మరణానికి పురుగుల మందే కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి..
-
కుటుంబీకులపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
నందిగామ: మతిస్థిమితం లేనివారు ఎప్పుడు ఏమి చేస్తారో వారికో తెలియదు. ఆ కోవలోనే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన కుటుంబీకులపై విచక్షణా రహితంగా దాడి చేయగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వేముల ముత్యాలు అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. ఆ వ్యక్తి తన తండ్రి, భార్య, పెద్దమ్మలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో అనంతమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలుకాగా పరిస్థితి విషమంగా ఉంది. భార్య పార్వతి, తండ్రి గురవయ్యకు కూడా తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతమ్మను విజయవాడకు తరలించారు. -
ఫ్యామిలీ మొత్తం చోరీల బాట.. 61 కేసులు !
సాక్షి, చెన్నై: కుటుంబంలో తండ్రితోపాటు కొడుకు, కూతురు అందరూ దొంగతనానే వృత్తిగా ఎంచుకున్నారు. తూత్తుకుడిలో ఆలయ కుంభాభిషేకం సందర్భంగా నగల దోపిడీకి పాల్పడిన కుటుంబసభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలివి.. చెన్నై నీలాంగరై ఈచ్చంబాక్కం బెత్తేల్ నగరానికి చెందిన సుబ్రమణి(65), అతని కుమారుడు(25), కుమార్తె(29) చోరీలనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని చోరీ: రెండు రోజుల క్రితం తూత్తుకుడి శంకరరామేశ్వరాలయంలో జరిగిన కుంభాభిషేకంలో సందట్లో సడేమియాల్లా వీరు చేతివాటం చూపారు. రద్దీని ఆసరాగా చేసుకుని భక్తుల వద్ద ఉన్న నగలను కొట్టేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు 16 కేసులు నమోదు చేశారు. మొత్తం 67 సవర్ల నగలను దొంగలు ఎత్తుకుపోయారని తేల్చారు. సీసీ ఫుటేజీల ఆధారంగా: దీనిపై పోలీసులు విచారణ చేపట్టి సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ప్రత్యేక పోలీసులు దర్యాప్తు చేపట్టి నిఘా పెట్టి, ముగ్గురినీ బుధవారం అరెస్టు చేశారు. ఒక కారుతోపాటు వారి వద్ద ఉన్న 52 సవర్ల నగలను స్వాధీనం చేసుకున్నారు. తూత్తకుడి జిల్లాలో గత రెండు నెలల్లోనే వీరినై 61 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
రాజకీయాల్లోకి నా భార్యా, బిడ్డలు రారు
సాక్షి, బెంగళూరు: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ మరోసారి టికెట్ ఇస్తే పోటీచేస్తా, అంతేకానీ నేను కాకుండా నా భార్యకానీ, కుమారుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయరు’ అని ఎమ్మెల్యే, శాండల్వుడ్ రెబల్స్టార్ అంబరీష్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో భేటీ అయ్యేందుకు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం కృష్ణాకు అంబరీష్ వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది. టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తాను. లేదంటే లేదు. ప్రజలు కోరుకుంటేనే రాజకీయాల్లో ఉండడం సాధ్యమవుతుంది.’ అని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉండడం లేదు, పార్టీ మారే ఆలోచన ఉందా? ఏ పార్టీ నుంచి అయినా ఆహ్వానం అందిందా? అన్న ప్రశ్నకు అంబరీష్ సమాధానమిస్తూ...‘నాకు జేడీఎస్, బీజేపీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతిరోజూ వారితో కలిసి మాట్లాడుతుంటాను. భోజనం చేస్తుంటాను. ఇందులో రాజకీయాలకు చోటు లేదు’ అని అన్నారు. కాగా, నటి రమ్యా మండ్య నుంచి పోటీ చేస్తానంటే తాను స్వాగతిస్తానని అంబరీష్ పేర్కొన్నారు. ప్రస్తుతం రమ్యా స్టార్ క్యాంపెయినర్ అని, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ను జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారని అన్నారు. రమ్యాకు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇస్తే ఆమె తరఫున ప్రచారం చేయాల్సి ఉంటుందని అంబరీష్ తెలిపారు. -
యువతిపై దారుణం
సాక్షి, ముజఫర్ నగర్ : ఉత్తర్ ప్రదేశ్లో మహిళలపై అరాచాకాలకు, అకృత్యాలకు అంతేలేకుండా పోయింది. ఒక మహిళపై కుటుంబ సభ్యులే నెలల తరబడి అత్యాచారం చేసిన హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్న వరసయ్యే వ్యక్తులు మూడు నెలల పాటు యువతి నీచంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన ముజఫర్నగర్లోని ధనేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత యువతి తండ్రి, సోదరుడు, ఇద్దరు చిన్నాన్నలు మూడు నెలలుగా అత్యాచారం చేశారని ధనేవాడ పోలీస్ అధికారి కుష్పాల్ సింగ్ తెలిపారు. కుటుంబ సభ్యులే అత్యంత రాక్షసకంగా, పాశవికంగా యువతి అత్యాచారం చేస్తున్న సందర్భంలో.. ఆమె ప్రేమించిన వ్యక్తి కాపాడారని ఆయన తెలిపారు. ప్రియుడి సహకారంతొనే ఇంటి నుంచి యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరిపామని..అందులో ఈ దారుణం గురించిన వివరాలు బమటకు వచ్చాని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారణ చేస్తోందని చెప్పారు. తండ్రి, సోదరుడు, చిన్నాన్నలను ఇప్సటికే కస్టడీలోకి తీసుకున్నట్లు కుష్పాల్ సింగ్ తెలిపారు. -
పాపం ఎల్లమ్మ..
♦ అన్నకు రాఖీ కట్టడానికి వచ్చి తప్పిపోయిన 95 ఏళ్ల వృద్ధురాలు ♦ ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు ♦ స్థానికుల సాయంతో కుటుంబ సభ్యుల వద్దకు... హైదరాబాద్: 95 ఏళ్ల పండు ముసలి. అన్నపై ఉన్న మమకారంతో హైదరాబాద్కు వచ్చి రాఖీ కట్టి ప్రేమను పంచింది. ఇంతలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు వచ్చి తప్పిపోయింది. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరకు బుధవారం స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఆమెను క్షేమంగా అప్పగిం చారు. జనగాం సమీపంలోని కంచెన్పల్లికి చెందిన ఎల్లమ్మ.. యాప్రాల్లో ఉండే కొడుకు సంజీవ్ను తీసుకుని, ముషీరాబాద్లోని ఇందిరానగర్లో ఉండే రాములుకు రాఖీ కట్టడానికి ఈ నెల 7న వచ్చింది. రాఖీ కట్టిన అనంతరం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుండి బయటకు వచ్చింది. అయితే తిరిగి ఇంటిని గుర్తు పట్టక ఎటో వెళ్లిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో సంజీవ్ ముషీరా బాద్, చిక్కడపల్లి పోలీస్స్టేషన్లతో పాటు మరో 3 పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశాడు. రెండు రోజులు ఆగండి.. ఆమె దొరుకుతుందని, లేకుంటే అప్పుడు రండి.. అంటూ పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. తప్పిపోయిన ఎల్లమ్మ మంగళవారం రాంనగర్లోని ఎస్బీఐ సమీపంలో ఉండగా, స్థానిక స్కూటర్ రిపేర్ షాపు అతను బీట్ కానిస్టేబుళ్లకు సమాచారం అందించాడు. వారు వచ్చి స్టేషన్కు తీసుకెళ్లకుండా రూ.50 చేతిలో పెట్టి ఆటో ఎక్కించి రైల్వేస్టేషన్కు వెళ్లి రైలు ఎక్కి ఇంటికి వెళ్లాలని సలహా ఇచ్చారు. అయితే రైలు ఎక్కబోతూ కిందపడిన ఆమెను కొందరు గమనించి కాపాడారు. ఆమె మళ్లీ నడుచుకుంటూ రాంనగర్లోని మీ సేవా వద్ద గల ఓ హోటల్ వద్దకు చేరుకుంది. ఆ హోటల్కు వచ్చిన వారు ఆమెను ఆరా తీయగా తప్పిపోయానని చెప్పింది. దీంతో పక్కనే ఉన్న సంఘ సేవకుడు శ్రీనునాయుడు ఆమె ఊరి అడ్రస్ను, ఫోన్ నంబర్ను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అం దించాడు. సంజీవ్ వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు. పాపం వృద్ధురాలు.. రెండు రోజుల పాటు తిండిలేక.. వర్షంలో తడిసి నీరసించి పోయింది. -
జగమంత కుటుంబం
కర్ణాటకలో ఒకేచోట కలిసిన 200 మంది కుటుంబ సభ్యులు శ్రీరామనగర్ (కర్ణాటక): కర్ణాటకలోని కొప్పళ జిల్లా శ్రీరామనగర్లో ఆదివారం ఒకే కుటుం బానికి చెందిన సుమారు 200 మంది ఒకేచోట కలిశారు. పొప్పొప్పుల బుల్లివెంకన్న, సూరమ్మ దంపతులు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని అన్నవరపాడు నుంచి 60 ఏళ్ల క్రితం శ్రీరామనగర్కు వచ్చి వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరికి ఏడుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. వీరి కొడుకులు, కుమార్తెలు, వారి భార్యలు, భర్తలు, పిల్లలు సుమారు 200 మంది ఆదివారం శ్రీరామనగర్ నివాసంలో కలుసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుని పలకరించుకున్నారు. పిండి వంటలు, ఆటపాటలతో సరదాగా గడిపారు. డబ్బు దస్కం కంటే కుటుంబ అనుబంధాలు విలువైనవని తమ కలయిక ద్వారా నేటి తరానికి వీరు చాటిచెప్పారు. -
కుటుంబ సభ్యులతో కేసీఆర్ ఢిల్లీ టూర్
-
గ్యాంగ్స్టర్ నయీమ్ కుటుంబీకులపై కేసు
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఘట్కేసర్ మండల పరిధిలోని అవుశాపూర్కి చెందిన నాగభూషణం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2006లో నాగభూషణంకి చెందిన సర్వే నంబర్ 10, పార్టు 14లోని 36 గుంటల భూమిని నయీమ్ అత్త తాహేరా బేగం పేరు మీద బలవంతంగా అతని అనుచరులు రిజిస్టర్ చేయించుకున్నారు. నాగభూషణం కుటుంబ సభ్యుల పేర ఉన్న భూమిని సైతం నయీమ్ కోడలు పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ విషయాలపై నాగభూషణం గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణ భయం ఉండటంతో ఇన్నిరోజులు ఫిర్యాదు చేయలేదని బాధితుడు తెలిపాడు. -
కృష్ణాజిల్లాలో దారుణం...
విజయవాడ: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తల్లి, భార్య, కుమారుడు కలిసి హతమార్చేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఏడుకొండలు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి బలవంతంగా పురుగుల మందు తాగించి అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఏడుకొండలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు ఎందుకు ఈ దురగాతానికి పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్
-
ఎన్ గ్యాంగ్ ఇదే!
* షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లతో జట్టుకట్టిన నయీమ్ * ముఠాలో మెజారిటీ నల్లగొండ జిల్లా వారే.. కీలకపాత్ర కుటుంబ సభ్యులది * ప్లాన్ వేసేది ఒకరు.. చంపేది మరొకరు.. లొంగిపోయేది ఇంకొకరు సాక్షి, హైదరాబాద్: భూదందాలు.. సెటిల్మెంట్లు.. బెదిరింపులు.. హత్యలు. సామాన్యులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు.. చివరికి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులైనా సరే నయీమ్ గ్యాంగ్ లెక్క చేయదు. ఎవరైనా తమ మాట వినాల్సిందే. బెదిరించడం.. వినకపోతే కొట్టడం.. కాలో, చెయ్యో విరగ్గొట్టడం.. వినకపోతే చంపేందుకూ వెనుకాడకపోవడం గ్యాంగ్ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. ఏదై నా పక్కాగా ఉంటుంది. ఒకరు ప్లాన్ చేస్తారు.. మరొకరు వెళ్లి అమలుపరుస్తారు.. పోలీసు కేసయితే ఇంకొకరు వెళ్లి లొంగిపోతారు. అసలు వారికి నేరారోపణపై జైలుకు వెళ్లే వారికి సంబంధమే ఉండదు. ఈ ముఠాలో షార్ప్ షూటర్లు, కిరాయి హంతకులు, మాస్టర్ ప్లానర్లు ఉంటారు. జెడ్పీటీసీల నుంచి కౌన్సెలర్ల వరకు ప్రజాప్రతినిధులు కూడా ఈ గ్యాంగ్లో ఉన్నట్లు చెబుతున్నారు. నయీమ్ కుటుంబ సభ్యులు కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు. మొత్తంగా నయీమ్ గ్యాంగ్లో ఎక్కువగా నల్లగొండ జిల్లాకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న అరెస్టులు, సోదాల్లో వెలుగు చూస్తున్న అంశాల ఆధారంగా చూస్తే.. నయీమ్ గ్యాంగ్ చాలా పకడ్బందీగా ఉందని వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్-గ్యాం గ్లో కీలక సభ్యులెవరు? వారి నేపథ్యమేమిటి? ఏం చేస్తుంటారనే దానిపై ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వర్గాల ద్వారా తెలుస్తున్న వివరాలివి.. శేషన్న మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి. నయీమ్కు రైట్హ్యాండ్. గ్యాంగ్లో తర్వాతి లీడర్. నయీమ్తో కలసి శేషన్న స్కెచ్ వేశాడంటే తిరుగులేనట్టే. ఎన్కౌంటర్ తర్వాత శేషన్న పరారీలో ఉన్నాడు. సలీమా నయీమ్ దందాల్లో సలీమాది ప్రధాన పాత్ర. భువనగిరికి చెందిన ఆమె నయీమ్కు సోదరి. పలు యాక్షన్లకు స్కెచ్ వేసేది కూడా ఆమేనని సమాచారం. నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే ఆమెను అరెస్టు చేశారు. షకీల్ భువనగిరిలో నయీమ్కు ప్రధాన అనుచరుడు. పలు కిరాయి హత్యల్లో స్వయంగా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లాడు. వ్యాపారులను చంపుతానని బెదిరించడంలో దిట్ట. షకీల్పై పీడీ యాక్టు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి.. రెండు నెలల క్రితం శవమై ఇంటికి చేరాడు. అతడి భార్య జైనబున్నీసాబేగం ప్రస్తుత మున్సిపాలిటీలో కౌన్సెలర్, టీడీపీ నుంచి ఏకగ్రీవంగా గెలిచి ఇటీవలే టీఆర్ఎస్లో చేరారు. పాశం శ్రీను భువనగిరిలో నయీమ్కు మరో ముఖ్య అనుచరుడు పాశం శ్రీనివాస్ అలియాస్ పాశం శ్రీను. రియల్టర్లను, వ్యాపారులను గుర్తించి వారిని నయీమ్ వద్దకు తీసుకెళ్లడం, ఒప్పుకున్న మొత్తాన్ని వసూలు చేయడం ఇతడి పని. టీడీపీ నుంచి గతంలో కౌన్సెలర్గా గెలుపొందాడు. పీడీ యాక్టు నమోదు కావడంతో ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్నాడు. ఎండీ నాసర్ నయీమ్ మరో ప్రధాన అనుచరుడు ఎండీ నాసర్. స్థానికంగా సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. షకీల్, పాశం శ్రీనులతో సమానమైన స్థానం ఇతనిది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల దందాలను నడుపుతాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చే స్తాడు. సెటిల్మెంట్లు చేయడంలో దిట్ట. ప్రస్తుత మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సెలర్ గా గెలిచి టీఆర్ఎస్లో చేరాడు. అక్రమ అయుధాలు కలిగి ఉన్న కేసులో జైల్లో ఉన్నాడు. ఫహీమ్ నయీమ్ చిన్నమ్మ కొడుకు ఫహీమ్ది సంస్థాన్ నారాయణపురం. న యీం సోదరి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. అతని స్నేహితులంతా నయీమ్ వెంట తిరుగుతూ ఉండేవారు. పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేసిన నీళ్ల శ్రీధర్గౌడ్, పున్న బలరాంలు కూడా ఫహీమ్ స్నేహితులే. ఫహీమ్ ఎనిమిదేళ్ల క్రితం వరకు చౌటుప్పల్ మండలం డి.నాగారంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ విచారణ సందర్భంగా ముంబై సిట్ పోలీసులు గతంలో అదుపులోకి తీసుకుని, విచారించి వదిలేశారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. సంస్థాన్ నారాయణపురం మండలంలో దాదాపు 40మంది వరకు ఇలాంటి అనుచరులున్నారు. సందెల సుధాకర్ నయీమ్ మరో అనుచరుడు సందెల సుధాకర్. పీడీ యాక్టు కింద వరంగల్ జైల్లో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి జెడ్పీటీసీగా గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరాడు. రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసాడు. శ్రీహరి హైదరాబాద్లోని కొండాపూర్లో నయీమ్కు చెందినదిగా బయటపడ్డ 67 ఎకరాల భూమి శ్రీహరి పేరున ఉన్నట్టు సమాచారం. శ్రీహరి కూడా సంస్థాన్ నారాయణపురం వాసి అని చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్టలోనూ వందల ఎకరాల్లో చేసిన వెంచర్లను ఇతనే దగ్గరుండి చూసుకుంటున్నట్టు చెబుతున్నారు. టమాటా శ్రీను హాలియాకు చెందిన శ్రీను నల్లగొండ పట్టణంలో కూరగాయల వ్యాపారం చేస్తాడు. టమాటా శ్రీనుగా గుర్తింపు పొందాడు. పేకా ట, సింగిల్ నంబర్ లాటరీ, భూసెటిల్మెంట్లు చేస్తాడు. పేరు కోసం నయీమ్కు ముఖ్య అనుచరుడిగా చలామణి అయిన యూసుఫ్ వెంట తిరిగాడు. యూసుఫ్ సొంతంగా సెటిల్మెంట్లు చేస్తుండటంతో నయీమ్ ముఠానే హత్య చేసింది. ఆ తర్వాత శ్రీను నయీమ్ సోదరికి అనుచరుడిగా మారాడు. మండలానికో ఇన్చార్జి నయీమ్ తన నేర సామ్రాజ్యంలో మండలానికో ఇన్చార్జిని నియమించుకున్నాడు. వారు ఆ మండలంలో బాగా రియల్ వ్యాపారం చేసే వారిని, బాగా డబ్బు సంపాదించే వారిని గుర్తించి నయీమ్కు సమాచారం ఇవ్వాలి. వీరితో పాటు నయీమ్ సోదరి, అత్త, బావమరిది.. ఇలా ఆయన కుటుంబ సభ్యులంతా గ్యాంగ్లో కీలక పాత్ర పోషించేవారు. -
ఇంకా దొరకని ఏఎన్-32 విమానం ఆచూకీ
-
సౌదీలో ఆగమై..
• తప్పిపోయిన నల్లవెల్లి వాసి • తిరిగి రప్పించాలని కోరుతున్న కుటుంబ సభ్యులు ధర్పల్లి : మండలంలోని నల్లవెల్లికి చెందిన గూండ్ల గడ్డమీది సాయిలు(35) సౌదీ అరేబియా దేశంలోని దమామ్ నగరంలో తప్పిపోయి తిప్పలు పడుతున్నాడు. కుటుంబ భారాన్ని పోషించేందుకు ఆరేళ్ల క్రితం కూలీ పని చేసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇతడికి వీసా ఇచ్చిన కంపెనీ వారు ఎవరూ రాకపోవడంతో ఎయిర్పోర్ట్లో దిగి తప్పి పోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. సాయిలుకు తల్లీ సాయవ్వ, భార్య మంజుల, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సౌదీ అరేబియాలో రోడ్డు వెంట దొరికింది తింటూ బతుకుతున్నట్లు సాయిలు భార్యకు రెండు సార్లు అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. తమ భర్తను ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. కుటుంబ పెద్ద దిక్కు లేక తాము పూట గడవని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు సాయిలును రప్పించి తమను కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. -
కుటుంబ సభ్యులకు అస్వస్థత బెంగతో వృద్ధుడి ఆత్మహత్య
మృతుడి కుటుంబం మొత్తం ఆసుపత్రిలోనే... రామాయంపేట: తనతోపాటు కుటుంబ సభ్యులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారనే బెంగతో ఆ వృద్ధుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలోని నిజాంపేటలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజాంపేటకు చెందిన రేగుల పోచయ్య(70)కు ముగ్గురు కుమారులున్నారు. వీరికి పెళ్లిళ్లయ్యాయి. వారికి పిల్లలున్నారు. కాగా నాలుగైదు రోజుల క్రితం ఆ కుటుంబ సభ్యులు మొత్తం వాంతులు, విరేచనాలతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వీరితోపాటు పోచయ్య కూడా అస్వస్థతతో తల్లడిల్లుతున్నాడు. అతడి కుమారులతోపాటు కోడళ్లు, మనవలు, మనవరాళ్లను చికిత్స కోసం గురువారం రామాయంపేట తరలించగా, ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. గ్రామంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన పోచయ్య రాత్రి నిజాంపేటలోని తన ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతోపాటు అనారోగ్యంతో సతమతమవుతూ బెంగపెట్టుకున్న పోచయ్య ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందాడు. విషయం తెలుసుకొని రామాయంపేటలో చికిత్స పొందుతున్న అతడి కుటుంబ సభ్యులు జ్వరంతోనే గ్రామానికి చేరుకున్నారు. వారు తీవ్ర అనారోగ్యంతోనే మృతదేహం పక్కనే పడుకొని విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈమేరకు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇడుపులపాయలో ఘనంగా వైఎస్ జయంతి
నివాళులర్పించిన వైఎస్ జగన్, విజయమ్మ, షర్మిల, కుటుంబ సభ్యులు వేంపల్లె: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 67వ జయంతి సందర్భంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ జనసంద్రమైంది. ఉదయం 8.30 గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్కుమార్, వైఎస్ మనుమడు వైఎస్ రాజారెడ్డి, మనుమరాళ్లు వర్ష, హర్ష, అంజలిలతో కలిసి ఘాట్కు చేరుకున్నారు. ఫాదర్ రెవరెండ్ డాక్టర్ నరేష్బాబు, రెవరెండ్ బెన్హర్, పాస్టర్ మృత్యుంజయరావులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భౌతికంగా వైఎస్ మన మధ్య లేకపోయినా.. ఎప్పటికీ అందరి హృదయాల్లో నిలిచి ఉంటారని, మహానేత ప్రేమకు ప్రతిరూపమని కుటుంబ సభ్యులందరూ స్మరించుకున్నారు. వైఎస్ ఘాట్పై పూల మాలలు ఉంచి, ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల ర్పించారు. వైఎస్ సోదరులు వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ సుధీకర్రెడ్డి, వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతి, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు ఈసీ గంగిరెడ్డి, ఆయన సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు దినేష్రెడ్డి, వైఎస్ మేనత్త కమలమ్మ, సోదరి విమలమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన సతీమణి సమత, ఎమ్మెల్యేలు అంజాద్బాషా, శ్రీకాంత్రెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, ప్రజలు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. -
మహానేతకు ఘన నివాళి
-
రైలు కిందపడి నలుగురు మృతి
-
ఆ ఆరుగురు ఎలా డిసైడ్ చేస్తారు?
‘‘ఒక తండ్రి, తల్లి... వాళ్లకన్నా ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. ఆ ఇంటి పెద్ద తమ కుటుంబ సభ్యులు ఎలాంటి సినిమాలు చూడాలో? ఏవి చూడకూడదో నిర్ణయిస్తారు. ఆరుగురు వ్యక్తులు ఉన్న ఓ బోర్డ్ కన్నా నిర్ణయం తీసుకోవడంలో కుటుంబ సభ్యులే మిన్న’’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. హిందీ చిత్రం ‘ఉడ్తా పంజాబ్’కి సెన్సార్ బోర్డ్ 89 కట్స్ చెప్పడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భాషా భేదం లేకుండా ‘ఉడ్తా పంజాబ్’కు మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభా ఎలాంటి సినిమాలు చూడాలో.. ఎలాంటివి చూడకూడదో ఆరుగురు వ్యక్తులు ఎలా నిర్ణయిస్తారు? నా మద్దతు ఎప్పుడూ ఫిలిం మేకర్స్ పక్షానే ఉంటుంది’’ అని రాజమౌళి పేర్కొన్నారు. -
రేపిస్ట్ కాల్పుల కలకలం.. 11 మంది మృతి
మెక్సికో: కొందరు ఉన్మాదులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయారు. సెంట్రల్ మెక్సికోలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ రేపిస్ట్ సహా మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. స్థానిక మేయర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఓ కుటుంబంపై కక్షగట్టిన వ్యక్తి, మరోకరితో కలిసి సాయుధులుగా ఇంట్లోకి ప్రేవేశించి కాల్పులు జరిపి 11 మందిని హతమార్చారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, నలుగురు మగవాళ్లు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని తెహ్యూకన్లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాల్పులు జరిపినప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఐదుగురు వ్యక్తులు ప్రభుత్వ అధికారుల సంరక్షణలో ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలతో ఇద్దరు నిందితులను గుర్తించామని, చనిపోయిన మహిళల్లో ఒకరిని నిందితులలో ఒకడు గతంలో రేప్ చేశాడని తెలిపారు. అత్యాచారం విషయంపై నిందితుడితో ఆ కుటుంబానికి తగాదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో ఉన్న వాళ్లను హత్యచేశారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ఎస్ఐ కుటుంబ సభ్యుల ఆత్మహత్య
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ) కుటుంబ సభ్యులు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం సృష్టించింది. కశ్మీరీ గేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ కృష్ణపాల్ భార్య మునేష్(45), కుమారుడు ధీరజ్ కుమార్(23), కూతురు లూనా(21)లు మంగళవారం వేగంగా వెళ్తున్న రైలుముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. కాగా.. శనివారం నుంచి తన భార్య, పిల్లలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కృష్ణపాల్ ఫిర్యాదు చేశాడు. అయితే వీరిని వెతికే పనిలో ఉన్న పోలీసులు, షామ్లీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు రైలు కింద పడి మృతి చెందారన్న సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించగా.. ఆ ముగ్గురూ కృష్ణపాల్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరి మృతికి సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సర్కిల్ ఆఫీసర్ నిషాంక్ శర్మ తెలిపారు. -
ప్రియుడ్ని పెళ్లాడుతానన్నందుకు కాలువలో తోసేశారు
ముజఫర్నగర్: పెద్దలకు ఇష్టంలేకుండా ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ యువతిని కుటుంబ సభ్యులు నదిలో తోసేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని నిర్గజ్ని గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిర్గజ్ని గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతి ఓ యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ యువతి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా వారు పెళ్లికి నిరాకరించారు. కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లి.. గంగా నదిలో కలిసే కాలువలోకి తోసేశారు. కాగా కొందరు గ్రామస్తులు గమనించి ఆ యువతిని రక్షించారు. పోలీసులు యువతి తండ్రి, సోదరుడిపై కేసు నమోదు చేశారు. -
టూర్ వెళ్లొద్దాం ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి మనిషికి నిత్యం ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంటి బాధ్యతలు.. ఆఫీసు.. పిల్లలకు స్కూలు, కాలేజీ.. ఇలా చాలానే ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండే జీవితం కొంత మార్పు కోరుకోవడం సహజం. చేస్తున్న పనికి విరామం ఇచ్చి ఎక్కడైనా వెళ్లి ఆనందంగా గడిపి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రత్యేకించి నేటి ‘స్పీడ్’ యుగంలో ప్రతి మనిషి యాంత్రిక జీవనం నుంచి బయటపడి కొన్ని రోజులైనా సరదాగా గడపడం అవసరం కూడా. కుటుంబమంతా జాలీ ట్రిప్ వేసేందుకు ఈ వేసవి కాలమే సరైన సమయం. ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్న ప్రదేశానికి వెళ్లి రావద్దామనుకుంటారు. ఈ సమయంలో కొంచెం ప్లాన్తో సిద్ధమైతే టూర్ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. కలిసి చర్చించుకుంటే మేలు.. ఏ ప్రాంతానికి వెళ్లాలనుకుంటున్నారో.. ఆ ప్రదేశం గురించి కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకొని ఏకాభిప్రాయానికి రండి. వెళ్లనున్న చోటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని, బడ్జెట్ వేసి ఖర్చులు అంచనాకు సరిపోతుందో లేదో చూడండి. అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల ముందే రెండు వైపులా టికె ట్లు రిజర్వేషన్ చేయించుకుంటే ట్రిప్లో సగం సమస్యలు తీరిపోతాయి. బయలుదేరే ముందు.. వెళుతున్న ప్రదేశంలో దొరికే ఆహారం గురించి అప్పటికే ఒక అవగాహన ఉంటుంది. కనుక తదనుగుణంగా సిద్ధమవ్వాలి. పిల్లలు, వృద్ధులు కూడా ప్రయాణంలో ఉన్నప్పుడు వారిని అవసరమైన మందులు మర్చిపోవద్దు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంట ఉండాల్సిందే. ఊరు వెళుతున్న సమాచారాన్ని సన్నిహితులకు, ఇరుగు పొరుగువారికి తెలియజేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితిని బట్టి సమీప పోలీస్ స్టేషన్లో కూడా తెలియజేయడం తప్పనిసరి. అకస్మాత్తుగా గాలి మార్పు, నీటి మార్పు వలన కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం గడిపిన జాలీడేస్ని పదిలపరచుకోవడం కోసం కెమెరా, వీడియో ఉంటే మంచిది. కొన్ని చోట్ల సుదీర్ఘమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వాటి గురించి కూడా ముందే తెలుసుకుని అందుకు తగ్గట్టు ప్రయాణంలో బోర్ కొట్టకుండా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి ఖర్చుకు లెక్క ఉండాల్సిందే.. టూర్ సరికొత్త అనుభూతుల్ని పంచాలంటే ఉన్న సమస్యలను ఇంటి వద్దే మర్చిపోతే ఆనందంగా గడపవచ్చు. ఖర్చులకు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ డబ్బులు తీసుకెళ్లండి. పరిస్థితిని బట్టి క్రెడిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ను వినియోగించండి. చేసిన ప్రతి ఖర్చుకు లెక్క రాయండి. హోటల్లోని రూమ్లలో టైం వేస్ట్ చేయకుండా వీలైనంత సేపు సీయింగ్లో గడపండి. వీలైతే ఒక డైరీలో మీ ప్రయాణపు అనుభూతుల్ని అక్షరం బద్దం చేయండి. చారిత్రక ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాటి గురించి పిల్లలకు వివరించండి. మీ టూర్ ప్లాన్కి ఏదైనా వివరాలు అవసరమైతే టీఎస్టీడీసీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. 040- 29801039/40, 9848540371, 9848125720, 040-23450165 నంబర్లలో సంప్రదిస్తే పర్యాటక ప్రాంతాల వివరాలు అందిస్తారు. లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో కూడా పొందవచ్చు. -
ఆటోవాలాలతో సీఎం హోలీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రంగుల పండుగ సంబరాలను ఆటోరిక్షా డ్రైవర్లతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, ఆటో రిక్షా డ్రైవర్లతో కలిపి హోలీ పర్వదినాన్ని ఎంజాయ్ చేసినట్టు సీఎం ట్విట్టర్ లో తెలిపారు. తన అధికారిక నివాసంలో ఆటో వాలాలు, కుటుంబ సభ్యులు, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు, నా ప్రియమైన జుంటా తో హోలీ జరుపుకున్నానంటూ ట్విట్ చేశారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీంతోపాటు తమ సంబరాల ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు సందడి చేశారు. Played holi wid my family, volunteers, ministers, MLAs, officers, autowallas n my dear junta. Happy Holi pic.twitter.com/yBlXKfOAT1 — Arvind Kejriwal (@ArvindKejriwal) March 24, 2016 -
నిరాడంబరంగా రజనీ పెళ్లి రోజు
టీనగర్: నటుడు రజనీకాంత్ తన ముప్పై ఐదవ పెళ్లి రోజును శుక్రవారం నిరాడంబరంగా కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. కుమార్తెలు, ఐశ్వర్యా ధనుష్, సౌందర్య అశ్విన్ ఇరువురూ తమ భర్తలతోపాటు రజనీకాంత్ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. నటుడు రజనీకాంత్ ,లత వివాహం 1981లో తిరుపతిలో జరిగింది. శుక్రవారం పోయెస్ గార్డెన్లోగల తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి రజనీకాంత్ పెళ్లి రోజును నిరాడంబరంగా జరుపుకున్నారు. కుమార్తెలు ఐశ్వర్యా ధనుష్, సౌందర్యా అశ్విన్, అల్లుళ్లు నటుడు ధనుష్, అశ్విన్ రాంకుమార్ రజనీకాంత్- లత కాళ్లకు నమస్కరించి ఆశీస్సులందుకున్నారు. ప్రత్యేకంగా తెప్పించిన కేక్ను రజనీకాంత్ కట్ చేశారు. మనవళ్లు లింగా, యాత్ర ఇరువురు కేక్ను తాత రజనీకాంత్కు తినిపించారు. ముందుగా రజనీకాంత్ను చూసేందుకు ఆయన ఇంటి ముందు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రజనీకాంత్ పెళ్లి రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, చిత్రరంగ ప్రముఖులు ఫోన్ల ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
రోహిత్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) పీహెచ్డీ విద్యార్థి రోహిత్ కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. ఆయన ఈ రోజు సాయంత్రం ఉప్పల్ లోని రోహిత్ నివాసానికి వెళ్లారు. రోహిత్ సస్పెన్షన్, ఆత్మహత్యకు గల కారణాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ విషయాలు చెబుతూ రోహిత్ తల్లి రాధిక కన్నీరుమున్నీరుగా విలపించారు. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే కఠినంగా శిక్షించాలని జగన్ డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్తో పాటూ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ విభాగం చైర్మన్ మేరుగ నాగార్జునలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా రోహిత్ తల్లి రాధిక కన్నీరుమున్నీరుగా విలపించారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, చిన్నప్పటి నుంచి రోహిత్ అన్నింటిలో ముందంజలో ఉండేవాడని ... కొద్దిరోజుల క్రితం ఇంటికి వచ్చిన రోహిత్ త్వరలో శుభావార్త వింటారని చెప్పాడని ఆమె రోదించారు. రోహిత్ మృతి వెనక కుట్ర దాగి ఉందని తల్లి రాధిక ఆరోపించారు. తన కుమారుడి మృతికి వీసీనే కారణమని, అతడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
కట్నం కేసులో బుక్కైన రెండు కుటుంబాలు
ఫరీదాబాద్: అదనపు కట్నం కోసం ఇద్దరు మహిళలను వేధిస్తున్న రెండు వేర్వేరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయినట్టు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. హార్యానాలోని దయల్పూర్లో నివాసముంటున్న అన్సూ అనే మహిళకు గత జనవరి నెలలో ప్రవీణ్తో వివాహం అయింది. పెళ్లైనా నాటినుంచి కట్నం కోసం అత్తమామలు తనను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త ప్రవీణ్ సహా అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దయల్పూర్లో గాంధీ కాలనీలో అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మిత్తు అనే మహిళ, తనను భర్త శ్యామ్, కుటుంబ సభ్యులు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.