కుటుంబీకులపై మతిస్థిమితం​ లేని వ్యక్తి దాడి | family mebers injured by mentally retorded person | Sakshi
Sakshi News home page

కుటుంబీకులపై మతిస్థిమితం​ లేని వ్యక్తి దాడి

Dec 19 2017 3:15 PM | Updated on Oct 16 2018 4:50 PM

నందిగామ: మతిస్థిమితం లేనివారు ఎప్పుడు ఏమి చేస్తారో వారికో తెలియదు. ఆ కోవలోనే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన కుటుంబీకులపై విచక్షణా రహితంగా దాడి చేయగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 

వేముల ముత్యాలు అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. ఆ వ్యక్తి తన తండ్రి, భార్య, పెద్దమ్మలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో అనంతమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలుకాగా పరిస్థితి విషమంగా ఉంది. భార్య పార్వతి, తండ్రి గురవయ్యకు కూడా తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతమ్మను విజయవాడకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement