Mental Disability
-
ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్లో భారత్కు పతకాల పంట.. ఏకంగా 202 మెడల్స్
బెర్లిన్: స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ను భారత జట్టు ఏకంగా 202 పతకాలతో ముగించింది. ఇందులో 76 స్వర్ణ పతకాలు, 75 రజత పతకాలు, 51 కాంస్య పతకాలు ఉన్నాయి. బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న వారికి ప్రోత్సహించేందుకు స్పెషల్ ఒలింపిక్స్ పేరిట క్రీడలు నిర్వహిస్తారు. ఓవరాల్గా భారత్ నుంచి 198 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుజ్జల అలివేలమ్మ మహిళల టేబుల్ టెన్నిస్ డి–3 కేటగిరీ సింగిల్స్లో, డి02 డబుల్స్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ డబ్ల్యూ–7 కేటగిరీలో దూదేకుల షమీలా కాంస్య పతకం సాధించింది. -
మతిస్థిమితం లేదని.. సోదరి హత్య
మైసూరు: మానసిక అస్వస్థురాలు అయిన మహిళను ఆమె సోదరి దంపతులు హతమార్చారు, సుమారు రెండు సంవత్సరాల తరువాత ఈ ఘోరం బయటపడింది. చామరాజనగరకు చెందిన లక్ష్మిని ఆమె సోదరి రూపా, భర్త సిద్దరాజుతో కలిసి హత్య చేసింది. వివరాలు.. హేమ కుమార్తె అయిన లక్షి్మని తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన రాజేష్కు ఇచ్చి పెళ్లి చేయగా 7 ఏళ్ల ప్రీతం అనే కుమారుడు ఉన్నాడు. గత ఐదు సంవత్సరాల నుంచి లక్ష్మి మానసిక అస్వస్థకు గురి కావడంతో భర్త ఆమెను పుట్టింటిలో వదిలిపెట్టాడు. అక్కడ రాయనహుండి గ్రామంలో ఆమె సోదరి రూపా ఇంట్లో ఉండేది. రెండేళ్ల క్రితం లక్ష్మీకి మతిస్థిమితం పూర్తిగా కోల్పోయి ఉద్రేకంగా ప్రవర్తించసాగింది. మర్యాద పోతుందని ఆగ్రహంతో లక్ష్మీ కాళ్లు చేతులు కట్టి వేసి, నోట్లో బట్టలు కుక్కి రూపా, ఆమె భర్త సిద్దరాజు కలిసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా లక్ష్మి ఊపిరి ఆడక చనిపోయి ఉంది. గుట్టుగా ఇంటి వెనుకాల అర్ధరాత్రి గుంత తీసి పూడ్చిపెట్టారు. ఎక్కడికో వెళ్లిపోయిందని బంధువులకు చెప్పారు. ఇటీవల తల్లి గట్టిగా నిలదీయడంతో రూపా అసలు విషయం చెప్పింది. తల్లి వరుణా పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. (చదవండి: కంట్లో కారం చల్లి.. చేతులు నరికి) -
మానసిక వ్యాధులకు ఆరోగ్యశ్రీ
సాక్షి, అమరావతి/లబ్బీపేట (విజయవాడ తూర్పు): గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే మానసిక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా చెప్పారు. విజయవాడలో డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి నిర్వహిస్తున్న ఇండ్లాస్ విమ్హాన్స్ మానసిక వైద్యశాలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంత వాసులు మానసిక వ్యాధులకు చికిత్స పొందేందుకు ఇప్పటి వరకు ఆస్పత్రి అందుబాటులో లేదన్నారు. దీంతో కడప రిమ్స్లో రూ.50 కోట్లతో 100 పడకల మానసిక వ్యాధుల ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందన్నారు. తమ జిల్లాకు చెందిన డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, డాక్టర్ విశాల్రెడ్డి నాలుగు దశాబ్దాల కిందటే విజయవాడలో మొదటి మానసిక వ్యాధుల ఆస్పత్రి స్థాపించి, ఈ ప్రాంతం వారికి సమర్థమైన సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తాను రచించిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రికి అందచేశారు. -
దివ్యాంగ బాలుడి కేసులో... ఇండిగోకు రూ.5 లక్షల ఫైన్
న్యూఢ్లిల్లీ: మానసిక వైకల్యమున్న బాలుడిని విమానం ఎక్కకుండా అడ్డుకున్నందుకు ఇండిగో ఎయిర్లైన్స్ మీద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీరియస్ అయింది. విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించిందంటూ శనివారం రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 7న రాంచీ విమానాశ్రయంలో తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ విమానం ఎక్కబోతుండగా సదరు బాలున్ని సిబ్బంది అడ్డుకోవడం, అది వివాదానికి దారి తీయడం తెలిసిందే. ఆ సమయంలో బాలుడు ఎవరి మాటా వినకుండా ఉన్మాదంగా ప్రవర్తించాడన్న ఇండిగో వాదనను డీజీసీఏ తోసిపుచ్చింది. -
బాత్రూం గోడలో దూరిన వ్యక్తి.. 2 రోజుల తర్వాత నగ్నంగా దర్శనం
న్యూయార్క్: మతి స్థిమితం లేని ఓ వ్యక్తి సినిమా థియేటర్కు వెళ్లాడు. ఏం అయ్యిందో తెలియదు కానీ.. బాత్రూం గోడకున్న కన్నంలో దూరాడు. దాదాపు రెండు రోజుల తర్వాత గోడ పగలగొట్టిన పోలీసులకు అక్కడ నగ్నంగా ఉన్న వ్యక్తి కనిపించాడు. అతడిని బయటకు తీసుకువచ్చి.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన న్యూయార్క్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. కొన్ని రోజుల క్రితం మతిస్థిమితం లేని ఓ వ్యక్తి న్యూయార్క్లోని ఓ థియేటర్కు వెళ్లాడు. బాత్రూంకు వెళ్లిన వ్యక్తి.. అనుకోకుండా అక్కడ గోడకున్న పెద్ద కన్నంలోంచి లోపలికి వెళ్లాడు. అలా రెండు, మూడు రోజులు గడిచాయి. అప్పటి వరకు కన్నంలో ఉండిపోయిన వ్యక్తి.. ఆ తర్వాత సాయం కోసం కేకలు వేయసాగాడు. అప్పుడుగానీ అతగాడి గురించి థియేటర్ యాజమాన్యానికి తెలియలేదు. (చదవండి: అమ్మాయి వైపు నుంచి చెప్పే ప్రేమకథ ఇది) ఇక విషయం తెలిసిన వెంటనే థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాత్రూం గోడకు వేరే చోట కన్నం చేసి.. దాని గుండా ఫైబర్ ఆప్టిక్ కెమరాను పంపి.. అతడు ఉన్న ఎగ్జాక్ట్ లోకేషన్ని గుర్తించారు. ఆ తర్వాత గోడను పగలకొట్టి చూడగా.. సదరు వ్యక్తి నగ్నంగా దర్శనమిచ్చాడు. (చదవండి: ఫస్ట్డేట్ రోజే విషాదం: టిక్టాక్ స్టార్ కాల్చివేత) అతడిని బయటకు తీసుకువచ్చిన పోలీసులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘సదరు వ్యక్తి మానసిక వికలాంగుడు. సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక అతడు బాత్రూం గోడ కన్నంలోకి ఎందుకు వెళ్లాడనే విషయం అర్థం కావడం లేదు. బహుశా వెచ్చగా ఉంటుందని భావించి వెళ్లాడేమో’’ అని తెలిపాడు. చదవండి: అల్లు అర్జున్ కొత్త బిజినెస్: మహేష్కు పోటీగా! -
World Mental Health Day: డార్క్ చాక్లెట్, నారింజ పండ్లు, చేపలు.. తరచూ తిన్నారంటే..
ఆధునిక జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో మానసిక సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వెల్లువలో పడి మెదడుకు తగిన వ్యాయామం ఇవ్వడమే మరచిపోతున్నాం. ఐతే పోషకాహారం ద్వారా ఏ విధంగా మెదడు పనితీరును మెరుగుపరచుకోవచ్చో ఈ కింది అధ్యయనాల ద్వారా తెలుసుకుందాం.. చాక్లెట్స్ మీకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టమా.. ఐతే మీకో గుడ్ న్యూస్! చాక్లెట్స్ బ్రెయిన్ హెల్త్కు మేలు చేస్తాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. కోకో బీన్స్లో ఫ్లేవనాల్ అని పిలువబడే కొన్ని చిన్న అణువులు ఉంటాయి. ఈ అణువులు మెదడు చురుకుదనాన్ని మెరుగుపరుస్తాయని 'సైంటిఫిక్ రిపోర్ట్స్' జర్నల్లో ప్రచురించిన నివేధిక తెలియజేస్తుంది. మామూలు చాక్లెట్లకంటే డార్క్ చాక్లెట్లలో ఫ్లావోనాయిడ్ కంటెంట్ అధికంగా ఉంటుందని, ఇవి మెదడు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచడానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్ పండ్లు ఆరెంజ్ పండ్లలో కూడా ఫ్లావోనాయిడ్స్ అధికంగానే ఉంటాయి. రోజూ గ్లాస్ నారింజ రసం తీసుకోవడం వల్ల కాగ్నిటివ్ పనితీరు మెరుగుపడుతుందని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ నూట్రిషన్లో ప్రచురించిన అధ్యయనాలు వెల్లడించాయి. టీ మన అలవాట్లలో ముఖ్యమైనది ప్రతి ఉదయం ఒక కప్పు టీ తాగడం. దీనిలో అల్లం, మిరియాలువంటి భిన్న పదార్థాలను జోడించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం తెలిసిందే! ఐతే అదనంగా మెదడు పనితీరుకు టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన మెదడు నిర్మాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక అధ్యయనం వెల్లడించింది. తాగని వారితో పోల్చితే క్రమం తప్పకుండా టీ తాగేవారిలో ప్రయోజనాలు ఎక్కువగా కనిపించాయట. చేపలు గుండె ఆరోగ్యం నుంచి చర్మం, జుట్టు సమస్యల నివారణ వరకు చేపల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎంతో ఉపయోగపడతాయి. చేపలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడు కణాలకు ప్రయోజనకరంగా ఉంటుందని తెల్పింది. దీనిలోని విటమిన్-ఇతో పాటు, కొన్ని యాంటీఆక్సిడెంట్లు డైమెన్షియా (చిత్తవైకల్యం) ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఆకు కూరలు బ్రొకోలి, కాలె, పాలకూర వంటి ఆకుకూరలు కాగ్నిటివ్ డామేజ్ నుంచి రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సొసైటీస్ ఫర్ ఎక్స్పరిమెంటల్ బయోలజీ ప్రకారం ఆకుకూరల్లో విటమిన్ ‘కె’, బేటా కెరోటిన్, లూటిన్, ఫోలెట్ వంటివి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. శారీరక వ్యాయామాలు, యోగా, డిజిటల్ గాడ్జెస్ను తక్కువగా వాడటం వంటి అలవాట్లతోపాటు ఈ ఆహార అలవాట్లు కూడా పాటించడం వల్ల మీ మెంటల్ హెల్త్ను పదికాలాలపాటు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
గూడ్స్ రైలు ఎక్కి వ్యక్తి వీరంగం
సాక్షి,విజయనగరం: రైల్వే స్టేషన్లో మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. రైల్వే సిబ్బందితో పాటు పోలీసులను కాసేపు ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. గురువారం స్టేషన్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి నిలిచి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని వ్యయప్రయాసలతో అతన్ని కిందకు దింపి, అదుపులోకి తీసుకున్నారు. రైల్వే అధికారులు , పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. చదవండి: పది కోళ్లను తిన్న కొండచిలువ -
విషాదం: ఐదు రోజుల్లోనే అంతా తల్లకిందులు
ఎదిగిన ఒక్కగానొక్క కొడుకు తన కాళ్ల మీద తాను నిలబడి.. ఊరు కాని ఊళ్లో చెమటోడ్చి పెళ్లాం పిల్లలను పోషించుకుంటున్నాడని తలచి స్థిమితపడ్డ తల్లి, ఒక్కసారిగా తన ఆలోచనలు తలకిందులయ్యేసరికి తట్టుకోలేకపోయింది. మూడు పదులు దాటిన వయస్సులో కుమారుడు మతి తప్పిన తీరులో స్వస్థలానికి చేరుకోవడంతో ఆమె అతలాకుతలమైంది. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాక.. కృష్ణారామా అనుకోవాల్సిన వయస్సులో.. మీదపడ్డ సమస్య ఆమెను నైరాశ్యం వైపు నెట్టింది. తన బిడ్డ ప్రాణాలకే ప్రమాదం వస్తుందేమోనన్న బాధతో.. భయంతో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. పురుగు మందు తాగి ప్రాణాలు విడిచింది. అదే సమయంలో తనయుడు కూడా విషం మింగి.. ఆపై భీతిల్లి ఆస్పత్రికి పరుగులు తీశాడు. వెంటనే చికిత్స అందించినా అతిడిని కూడా మృత్యువు వెంటాడింది. విధిలీల అర్థం కాదని వ్యథ చెందడం అందరి వంతైంది. కొత్తూరు: కొత్తూరులోని కొత్తపేట కాలనీకి చెందిన కనపాకల చిన్నమ్మడు (70), ఆమె కుమారుడు శ్రీనివాసరావు (35)లు శనివారం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ముందు చిన్నమ్మడు చనిపోగా తర్వాత శ్రీనివాసరావుకు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నమ్మడుకు కొడుకుతో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. శ్రీనివాసరావుకు పదేళ్ల కిందట కొత్తూరుకే చెందిన శ్రీదేవితో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో భార్యాభర్తలు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లిపోయారు. అక్కడే శ్రీనివాసరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఐదు రోజుల కిందట శ్రీనివాసరావు ప్రవర్తనలో ఉన్నట్టుండి మార్పు కనిపించింది. అర్థం లేకుండా మాట్లాడడం, పిల్లలను ఊరికే కొట్టడం, గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ విడిచి పెట్టడం వంటి పనులు చేసేవాడు. దీంతో భయపడిన అతని భార్య అక్కడే ఉన్న బంధువులకు విషయం చెప్ప డంతో వారు పరిస్థితిని గమనించి రాత్రుళ్లు కాప లా కాయడం కూడా మొదలుపెట్టారు. అయినా శ్రీనివాసరావు ప్రవర్తన అంతు చిక్కేది కాదు. ఒక క్షణం బాగానే ఉన్నా.. మరుక్షణానికి మారిపోయేవాడు. ఈ నెల 25న శ్రీనివాసరావు అక్కడ ఎవరికీ చెప్పకుండా కొత్తూరు వచ్చేశాడు. ఇక్కడ కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వీధుల్లో తిరిగేవాడు. కొడుకు పరి స్థితి చూసి తల్లి చిన్నమ్మడు తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇలాగే చనిపోతాడేమో అని బెంగ పెట్టుకుంది. దెయ్యం పట్టిందేమోనని అతడిని కుటుంబ సభ్యులంతా కలిపి ఓ గిరిజన గ్రామానికి కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఆదివారం పూజ చేస్తామని చెప్పి వీరిని పంపించేశారు. శనివారం ఇంటిలో ఉన్న వారంతా ఉపాధి పనులకు వెళ్లిపోయారు. తల్లీ కొడుకులు మాత్రం కొత్తూరు నాలుగు రోడ్ల కూడలికి వచ్చి గడ్డి మందును కొన్నారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి ఇద్దరూ ఆ పురుగు మందు తాగేశారు. అయితే పురుగు మందు తాగాక శ్రీనివాసరావు పరుగులు పెడుతూ ఆస్పత్రికి వెళ్లిపోయాడు. తల్లి అక్కడే పడిపోవడంతో అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు ఆమెను గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీ కొడుకులకు స్థానిక సీహెచ్సీ వైద్యాధికారి దీప్తి వైద్యం అందించారు. తల్లి పరిస్థితి విషమించడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా ఆమె అక్కడే చనిపోయారు. శ్రీనివాసరావును కూడా పాలకొండ తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అర్థరాత్రి తర్వాత ఆయన కూడా తనువుచాలించాడు. చిన్నమ్మడు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ వై.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. ఇద్దరి మృతదేహాలకు పాలకొండ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనతో కొత్తూరులో విషాదం అలముకుంది. -
పవిత్రమైన మక్కాలో కారుతో హల్చల్
రియాద్ : ఇస్లాం పవిత్ర స్థలమైన మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. మసీదు వద్ద భద్రతగా ఉన్న గార్డులు అతడ్ని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తున్నది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా అధికారులు శనివారం ధ్రువీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు ఓ వ్యక్తి విఫలయత్నం చేశాడు. బయట ఉన్న రెండు బారికేడ్లను అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అతడిని వెంబడించి నిలువరించినట్లు సమాచారం. కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరును సౌదీ అధికారులు వెల్లడించలేదు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేదని మాత్రం తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయానికి పంపించామని వారు చెప్పారు. (చదవండి : పిచ్చి ప్రయోగాలకు పోతే జరిగేది ఇదే) కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. ఏడు నెలల అనంతరం ఈ నెలలో తెరుచుకున్న విషయంత తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతించారు. (చదవండి : ఆన్లైన్ గేమ్ ఆడుతుండగా భూకంపం..) Car ploughs through Grand Mosque courtyard in Makkah, crashes into door#Makkah #MasjidilHaram#SaudiArabia pic.twitter.com/YeB3qQeFE9 — Mohammad Jamlish Roy (@jamlishofficial) October 31, 2020 -
విమానంలో ఉగ్రవాది.... హై టెన్షన్
పనాజీ: విమానంలో ఉగ్రవాది ఉన్నాడంటూ ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురువారం ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఎయిరింయా విమానంలో చోటు చేసుకుంది. వివరాలు.. జియా ఉల్ హక్(30) అనే వ్యక్తి తాను స్పెషల్ సెల్ అధికారిని అని.. విమానంలో టెర్రరిస్ట్ ఉన్నాడంటూ హల్చల్ చేశాడు. దాంతో ప్రయాణికులు, అధికారులు తీవ్ర టెన్షన్కు గురయ్యారు. ఇక డబోలిమ్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. విచారణలో జియా ఉల్ హక్కి మతి స్థిమితం సరిగా లేదని తెలిసింది. అతడు ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతడిని పనాజీలోని మానసిక వ్యాధుల చికిత్స కేంద్రంలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: కోయి గోలి నహీ చలేగా..) -
వింత ఘటన : తండ్రి కోరిక మేరకు..
లక్నో : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మదురస్మృతిగా నిలిచిపోతుంది. పెళ్లి చేసుకునే వారు తమకు మంచి భార్య రావాలని కలల కంటారు. అందమైన అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటూ ఆమె కోసం అన్వేషిస్తుంటారు.కానీ ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఒక యువకుడు మాత్రం అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మను వివాహం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్రాజ్కు చెందిన శివమోహన్(90)కు తొమ్మిది మంది సంతానం. అందరిలోకి చిన్నవాడైనా పంచరాజ్ పుట్టుకతోనే మానసిక వికలాంగుడు. (ప్రగ్నెంట్ అని తెలీకుండానే బిడ్డకు జన్మనిచ్చింది) శివ మోహన్ తనకున్న ఆస్తితోనే పిల్లలందరిని పెద్ద చేసి వారికి వివాహాలు జరిపించాడు. అయితే పంచరాజ్కు కూడా పెళ్లి చేయాలని తండ్రి శివ మోహన్ అనుకున్నాడు. కానీ పంచరాజ్ మానసిక వికలాంగుడు కావడంతో అమ్మాయి దొరకడం కష్టంగా మారింది. దీంతో తన కుమారుడికి ఎలాగైనా పెళ్లి చేయాలని సంకల్పించుకున్న శివమోహన్ పెళ్లికుమార్తెను పోలిన దిష్టిబొమ్మను తయారు చేసి హిందూ సంప్రదాయం ప్రకారం పంచరాజ్కి వివాహం జరిపించారు. పైగా వివాహానికి హాజరైన వారికి చక్కని విందు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లిని మొదట పంచరాజ్ తిరస్కరించాడు. చివరకు తండ్రి కోరిక మేరకు, ఆయన గౌరవాన్ని నిలబెట్టేందుకు దిష్టి బొమ్మతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయమై శివమోహన్ స్పందిస్తూ..' ఇప్పుడు నా వయసు 90 ఏళ్లు.. నాకు తొమ్మిది మంది పిల్లలు.. నా 8 మంది పిల్లలకు పెళ్లి చేశా. కానీ మానసిక వికలాంగుడైన నా చిన్నకొడుకు పంచరాజ్కు కూడా ఎలాగైనా పెళ్లి చేయాలని తీర్మానించకున్నా. అందుకే వాడిని ఒప్పించి పెళ్లికూతురు రూపంలో ఉన్న దిష్టిబొమ్మను తయారు చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించా' అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ పోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
పారిపోతాడని సంకెళ్లతో కట్టి తాళం వేస్తే..
రాంచీ : మతిస్థిమితం లేని వ్యక్తిని బంధించటానికి వేసిన సంకెళ్ల తాళం అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. రాంచీ పట్టణానికి చెందిన జితేంద్ర కుమార్ అనే యువకుడికి మతిస్థిమితం సరిగాలేదు. తరచుగా ఇంటి నుంచి పారిపోతూ ఉండేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులు అతడ్ని సంకెళ్లతో బంధించి తాళం వేశారు. అప్పుడప్పుడు తాళం తీస్తూ ఉండేవారు. కొద్దిరోజుల కిత్రం తాళం తీసిఉన్న సమయంలో అతడు ఆ తాళాన్ని మింగేశాడు. అది కాస్తా గొంతులో అడ్డుపడటంతో ఊపిరి అందక అల్లాడసాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన డాక్టర్లు తాళాన్ని ఎండోస్కోపీ ద్వారా తీయటానికి ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. తాళాన్ని బయటకు తీయటానికి గొంతుకు ఆపరేషన్ చేయటం ఒక్కటే మార్గమని డాక్టర్లు భావించారు. ఫిబ్రవరి 14న జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించారు. విజయవంతంగా అతడి గొంతులోని తాళాని బయటకు తీశారు. 12రోజులు ఆసుపత్రిలో ఉన్న అతడు డిశ్చార్జ్ అయ్యాడు. -
మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం
సాక్షి,మణుగూరుటౌన్: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్ చర్చి ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్నగర్కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్కు చెందిన బాలికను కిడ్నాప్ చేసి వదిలేశారు. నరేష్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. -
ఆరు నెలల తర్వాత కుటుంబసభ్యుల చెంతకు
ఖమ్మంఅర్బన్ : నగరంలోని ప్రశాంతినగర్లోని అన్నం ఫౌండేషన్ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని 6 నెలల తర్వాత కుటుంబ సభ్యులకు ఆదివారం అప్పగించారు. అతడి ఆరోగ్యం కుదుట పడటంతో చిరునామా తెలిపాడు. దీంతో అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు బాగం మోహన్రావు, అశోక్రెడ్డిల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. ఆరు నెలల కిందట పచ్చిమగోదావరి జిల్లా (ఐ) పంగిడి మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన ఎంఎల్ సుబ్రహ్మణ్యం మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొంతకాలం కిందట ఖమ్మం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డులో రోడ్డుపై తిరుగుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నం ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావు తీసుకొచ్చి తన ఆశ్రమంలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతడి ఆరోగ్యం కుదుట పడింది. అనంతరం తన కుటుంబ వివరాలు, గ్రామం పేరు.. ఇతర వివరాలన్నీ చెప్పడంతో వారికి సమాచారం అందించారు. దీంతో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు శ్రీరాములు, కృష్ణకుమారి రావడంతో పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. మంచి మనిషిగా తీర్చిదిద్దిన ఫౌండేషన్ అధ్యక్షుడు అన్నం శ్రీనివాసరావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
మంటగలిసిన మానవత్వం..!
రాయగడ : ప్రజలంతా కలిసి చనిపోయేలా చితకబాది వదిలేసిన వ్యక్తికి ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కనీస వైద్యం కూడా అందించడానికి వైద్యులు ముందుకు రాకపోవడం చూస్తే మానవత్వం మంటగలిసిందా? అని పలువురు వాపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాయగడలోని మెయిన్ రోడ్డు జగన్నాథ మందిరం వీధి ప్రాంతంలో భాష రాని, మాటలు లేని మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండగా పిల్లలను దొంగిలించే వ్యక్తిగా ప్రజలు అనుమానించి ప్రాణాలు పోయేలా చితకబాది పడవేశారు. ప్రజలు కొట్టిన దెబ్బలతో తలకు తగిలిన గాయంతో ఆ వ్యక్తి అచేతనంగా పడి ఉండగా ఒంటినిండా పురుగులు చేరి కొరుక్కుని తినడం చూసిన పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో 3రోజులుగా ఉన్న వ్యక్తికి వైద్య సిబ్బంది కనిసం ప్రాథమిక చికిత్స కానీ, ఎటువంటి వైద్యం అందించక పోవడంతో మితిస్థిమితం లేని వ్యక్తి అలాగే పడి ఉన్నాడు. ఆ వ్యక్తి అలా పడి ఉంటే వైద్య సిబ్బందికి కనీసం హృదయం కరగలేదని స్థానికులు వాపోతున్నారు. రాయగడలో కొద్ది నెలలుగా ఏ ఒక్క పిల్లాడు దొంగతనానికి గురి కాకపోయినా వాట్సాప్ పుకార్ల ద్వారా, మూఢనమ్మకాల ద్వారా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన మతి స్థిమితం లేని, భాష తెలియని వ్యక్తులపై ప్రజలు దాడులు చేసి చితక బాదుతున్నారు. జిల్లా అధికారులు ప్రజలను చైతన్యం చేయడంలో సంపూర్ణంగా విఫలమవుతున్నారు. -
రాములు వచ్చేదెట్టా?
సత్తుపల్లి : మతి స్థిమితం సరిగ్గా లేక, మూగ, చెవిటి వైకల్యంతో ఉన్న ఖమ్మంజిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన కంచపోగు పెద్దరాములు అదృశ్యమై ఏడాది కాలం తర్వాత..అతను రాజస్తాన్ రాష్ట్రంలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో ఇక్కడి కుటుంబ సభ్యులు అతడిని రప్పించాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. పేద కుటుంబానికి చెందిన ఇతను అవివాహితుడు. 70 ఏళ్ల వయస్సులో..గతేడాది జూన్లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు చాలా చోట్ల వెతికినా ప్రయోజనం కన్పించలేదు. అప్పట్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. శుభకార్యాల్లో వంటలు చేస్తూ జీవించేవాడు. అయితే..పరిశుభ్రత అంటే..చాలా ఇష్టమని, ఎక్కడ చిన్న చెత్తకాగితం కనిపించినా తీసి పక్కకు వేస్తుంటాడని, శుభకార్యాలప్పుడు వచ్చి పరిసరాలను పరిశుభ్రం చేస్తుంటాడని, స్థానికంగా సుపరిచితుడని ఇక్కడివారు చెబుతున్నారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ ప్రాంతలో ఉన్నట్లు వచ్చింది. రాజస్తాన్ పత్రికలో తన వారి కోసం వృద్ధుడి ఆరాటం.. పేరిట కథనం కూడా ప్రచురితమైంది. తెలుగువాడు అయినందున సోషల్ మీడియాలో తెలుగు వాళ్లందరికీ పోస్టు చేశారు. ఈ ప్రాంతంలోని కొందరు గుర్తించడంతో పెద్దరాములు రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్పూర్లో ఉన్నట్లు వెలుగుచూసింది. కలెక్టర్, సీపీకి వినతి.. రాజస్తాన్ రాష్ట్రం నుంచి కంచపోగు పెద్దరాములును తీసుకొచ్చేందుకు సహకారం అందించాలని బంధువులు కలెక్టర్ లోకేష్కుమార్, సీపీ తఫ్సీర్ ఇక్బాల్లను కలిసి వేడుకున్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దరాములును అప్పగించాలని కోరారు. -
‘సీఎంను చంపేస్తా’.. కత్తితో హల్చల్
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని కేరళ భవన్ వద్ద శనివారం హైడ్రామా చోటు చేసుకుంది. కత్తితో భవన్ ఆవరణలోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను చంపేస్తానంటూ హల్ చల్ చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. విమల్ రాజ్(46) అనే వ్యక్తి ఈ ఉదయం చేతిలో కొన్ని పేపర్లు.. జేబులో జాతీయ జెండా, కత్తితో కన్నౌట్ ప్లేస్(ఢిల్లీ)లోని కేరళ భవన్ వద్దకు చేరుకున్నాడు. మెయిన్ గేట్ సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగోలా లోపలికి ప్రవేశించాడు. అయితే ఆవరణలోని అధికారులు అతన్ని అడ్డుకునే సరికి లోపలికి అనుమతించాలంటూ వారితో వాగ్వాదానికి దిగాడు. నెలరోజులుగా ఓ కేసు నిమిత్తం తాను సీఎంను కలిసేందుకు యత్నిస్తున్నానని, కానీ, ఆ పని జరగట్లేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతలో అధికారులు అతన్ని వెనకాల నుంచి వెళ్లి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. కొడవూర్, కరిపుజ్జాకు చెందిన విమల్కు మతిస్థిమితం సరిగ్గాలేదని, అతని చేతిలో ఉన్న పేపర్లు అతని మెడికల్ రిపోర్ట్లేనని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం ఐబీహెచ్ఏఎస్కు తరలించారు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో సీఎం విజయన్ లోపలే ఉన్నారు. -
సీఎంను చంపేస్తానంటూ వ్యక్తి హల్ చల్!
-
రాచర్ల అడవిలో అస్తిపంజరం లభ్యం
వేమనపల్లి(బెల్లంపల్లి) : రాచర్ల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం అస్తిపంజరం లభ్యమైంది. నెల రోజుల క్రితం అదృశ్యమైన ముల్కలపేట గ్రామానికి చెందిన దున్న వెంకటిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు. కుటుంబీకుల కథనం ప్రకారం వెంకటి(43) కొన్ని నెలలుగా మతి స్థిమితం లేక తిరుగుతున్నాడు. ఇంటి నుంచి వెళ్లి పోయిన నాటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకటి రాచర్ల అటవీ ప్రాంతంలోని చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. వెంచపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం గుర్తు పట్టలేకుండా కుళ్లి పోగా చెట్టుపై ఉన్న దుస్తులను బట్టి అతను వెంకటిగా గుర్తించారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై భూమేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు సంకీర్తన, స్పందన, ఒక కుమారుడు రిత్విక్ ఉన్నారు. -
‘మతి’లేకున్నా.. మంచోడు..!
కూసుమంచి ఖమ్మం జిల్లా : ఇతడు ఇక్కడి వారందరికీ సుపరిచితుడు. అందరూ యాండో (పిచ్చోడు) అని పిలుస్తుంటారు. ఈ ఫొటో చూశారా...? ఇద్దరు వృద్ధుల చేతులు పట్టుకుని రోడ్డు దాటిస్తున్నాడు. అక్కడ ఇంకెంతోమంది ‘మంచి’మనుషులు ఉన్నారు. వారెవరూ ఇతడిలా సాయపడేందుకు ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పండి... ఇతడిని పిచ్చోడా...? పిచ్చోడిలా కనిపిస్తున్న మంచోడా...?! ఈ దృశ్యం ఖమ్మం–సూర్యాపేట రాష్ట్రీయ రహదారిలోని కూసుమంచి బస్టాండ్ సెంటర్లో కనిపించింది. ఈ రోడ్డు దాటాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇక వృద్ధుల సంగతి చెప్పనక్కరలేదు. అలాంటి రద్దీగా ఉండే రోడ్డుపై శనివారం ఇద్దరు వృద్ధులను రోడ్డు దాటించి మానవత్వాన్ని చాటుకున్నాడు. -
వాట్సాప్ వదంతులు: దివ్యాంగురాలిని కొట్టి చంపారు!
భోపాల్ : సుప్రీం కోర్టు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా మూక హత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కర్ణాటకలోని బీదర్లో నలుగురు హైదరాబాదీలను పిల్లల కిడ్నాపర్లుగా పొరబడి స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన మరవక ముందే మధ్యప్రదేశ్లో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పిల్లల కిడ్నాపర్ అంటూ ఓ మానసిక దివ్యాంగురాలని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన సింగ్రాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్వా ప్రాంతంలో చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మృత దేహం ఉన్నట్లు ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరిన పోలీసులు మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ మృత దేహంగా గుర్తించారు. ఆమె గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. అయితే ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి ఎవరో కొట్టి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. పిల్లల కిడ్నాపర్లు తిరుగుతున్నారనే వాట్సాప్ వదంతులతోనే ఆమెను చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసినట్లుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల సమాచారం మేరకు ఆరుగురు నిందితులను గుర్తించారు. ఇదే తరహాలో అటవీ అధికారుపై దాడిచేసిన మరో ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక రాజస్తాన్లో ఆవుల స్మగ్లింగ్కు చేస్తున్నారని ఒకరిని కొట్టి చంపిన విషయం తెలిసిందే. చదవండి : వెంటాడి...వేటాడారు! మూక హత్య కేసులో మరో ట్విస్ట్ -
పదిహేనేళ్లుగా చీకటి గదిలోనే..
మొయినాబాద్(చేవెళ్ల): అమ్మ.. తమ్ముడు.. మరదలు అందరు ఉన్నా అతడు అనాథ అయ్యాడు. మతి స్థిమితం లేకపోవడంతో వ్యవసాయ పొలం వద్ద బందీ అయ్యాడు. 15 ఏళ్లుగా చీకటిగదిలో బందించి అన్నపానీయాలు కిటికీలోంచి ఇస్తున్నారు. తిండీ ఆ గదిలోనే.. మలమూత్ర విసర్జన ఆ గదిలోనే. మనుషుల్లో మాతవత్వం మాయమవుతుందనడానికి ఈ సంఘటనే తార్కాణం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కనకమామిడి గ్రామానికి చెందిన బలిజ బుచ్చప్ప, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. పదిహేనేళ్ల క్రితం తండ్రి బుచ్చప్ప చనిపోయాడు. పెద్దకొడుకు మల్లేష్కు మతిస్థిమితం సరిగా లేదని అతని భార్య అప్పట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పెళ్లికి ముందు మల్లేష్ అందరితో కలుపుగోలుగా, చలాకీగా ఉండేవాడు. అన్నదమ్ములు సైతం అన్యోన్యంగా ఉండేవారు. తమ్ముడి పెళ్లి అయ్యాక మల్లేష్కు మతిస్థిమితం సరిగాలేదని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చీకటి గదిలో బందించారు. అప్పటి నుంచి తల్లి సుశీల ప్లాస్టిక్ కవర్లో అన్నం, నీళ్లు తీసుకెళ్లి కిటికీలోంచి మల్లేష్కు ఇచ్చేది. తిండితోపాటు మలమూత్ర విసర్జన కూడా గదిలోనే. 15 సంత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కోట్ల విలువచేసే ఆస్తి ఉన్నా... మల్లేష్ పేరుమీద రూ.కోట్ల విలువచేసే భూమి ఉంది. అయినా తనవాళ్లు అతన్ని సరిగ్గా చూసుకోకుండా గదిలో బందించారు. తల్లి కన్న ప్రేమతో అన్నం, నీళ్లు ఇవ్వడమే తప్ప.. తమ్ముడు, మరదలు మాత్రం అస్సలు పట్టించుకునే పరిస్థితిలేదు. 15 ఏళ్లుగా గదిలోనే బందీగా ఉన్న మల్లేష్ వికృతంగా తయారయ్యాడు. ఇటీవల గ్రామస్తులు గదిలో ఉన్న మల్లేష్ను చూసి గడ్డం, తలవెంట్రుకలు తీయించారు. మల్లేష్ చదువుకునే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేవాడని చెబుతున్నారు. అతనికి నిజంగానే మతిస్థిమితం సరిగా లేకుంటే ఆసుపత్రిలో చూపించాలి కానీ చీకటి గదిలో బంధించడం ఏమిటని గ్రామస్తులు అంటున్నారు. పౌరహక్కుల కమిషన్ స్పందించి మల్లేష్ను చీకటి గదినుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
టీచర్ తలనరికి.. రోడ్డుపై తిరిగాడు
రాంచీ : జార్ఖండ్లోని ఓ ప్రైమరీ స్కూల్ టీచర్ను మతిస్థిమితం లేని వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. సుకురు హీరెసా(35) అనే మహిళ సెరైకెలా ఖర్సవాన్ జిల్లా ఖప్సారై గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మతిస్థిమితం లేని హరి హెంబ్రోం(45) ఆమె వైపు ఎప్పుడు అదోలా చూస్తు ఉండేవాడు. మంగళవారం సుకురు పాఠశాలకు వెళ్లిన తర్వాత హరి ఆమెను స్కూల్ బయటకు రావాలని పిలిచాడు. సుకురు స్కూలు బయటకు రాగానే ఆమెపై పదునైన ఆయుధంతో విచక్షణ రహితంగా దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా సుకురు తల నరికి.. ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరగసాగాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని హరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. -
మతిస్థిమితం లేని తనయుడు చేతిలో తల్లి హత్య
గజపతినగరం రూరల్ : మండలంలోని ముచ్చర్ల గ్రామానికి చెందిన మీసాల పైడమ్మ (62) మతిస్థిమితం లేని తన కుమారుడు చేతిలో మంగళవారం హతమైంది. వివరాల్లోకి వెళ్తే... ముచ్చర్ల గ్రామానికి చెందిన పైడమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి వివాహమైంది. పైడమ్మ భర్త సన్యాసప్పడు రెండు సంవత్సరాల కిందటే మృతి చెందడంతో ఆమె ముచ్చర్ల గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా విశాఖపట్నంలో మతిస్థిమితం లేని తన కుమారుడు సీతంనాయుడు ఇటీవల ముచ్చర్ల గ్రామంలోని తన తల్లి వద్దకు చేరాడు. ఒక్కోసారి బాగానే మంచివాడుగా ఉంటుండే వాడని కొన్నిసార్లు పిచ్చివాడుగా తిరుగుతుండేవాడని గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. పైడమ్మ కొన్ని నెలలుగా వేమలి గ్రామంలో తన కుమార్తె అచ్చియ్యమ్మ ఇంటి వద్ద ఉండేదని ఇటీవల ముచ్చర్ల గ్రామానికి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. తల్లి వద్దకు చేరిన కొడుకు సీతంనాయుడు ఒక్కసారిగా మానసిక స్థితి కొల్పోయి తన తల్లిని ఇంట్లో పెట్టి తలుపులు వేసి చెక్కతో తలపైన, వంటిపైన కొట్టడంతో పైడమ్మ పడిపోయింది. కొన ఊపిరితో ఉన్న పైడమ్మను గజపతినగరం సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం లేక మృతి చెందింది. పోలీసుల సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. గజపతినగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో డీఎస్పీ ఆరా! గజపతినగరం రూరల్: మీసాల పైడమ్మ హత్యకు గురవడం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు బొబ్బిలి డీఎస్పీ గౌతమి శాలి మంగళవారం ఆరా తీశారు. గజపతినగరం సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకువచ్చిన పైడమ్మను ఆమె పరిశీలించారు. సీతంనాయుడు పైడమ్మపై దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది ఆరా తీసినట్టు తెలిపారు. నిందితుడు సీతంనాయుడును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సీఐ కాళిదాసు ముచ్చర్ల గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. -
న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో నగ్నంగా...
నేలకొండపల్లి ఖమ్మం : మండలంలోని రాజారాంపేటకు చెందిన మాధవరావు, తనకు న్యాయం చేయాలంటూ నేలకొండపల్లి పోలీస్స్టేషన్లో నగ్నంగా కూర్చున్నాడు. తన భార్య కాపురానికి రావడం లేదని, కుటుంబీకులు తన జీవీతాన్ని నాశనం చేశారని, న్యాయం చేయాలంటూ అతడు ముందుగా రూరల్ ఏసీపీ పి.నరేష్రెడ్డి ఎదుట పురుగు మందు డబ్బాతో హల్చల్ చేశాడు. ఇతడి సమస్యను పరిష్కరించాలంటూ నేలకొండపల్లి ఎస్హెచ్ఓ గణపతిని ఏసీపీ ఫోన్ చేసి ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వెళ్లాలని ఏసీపీ సూచించారు. దీంతో, మాధవరావు బైక్పై నేలకొండపల్లి స్టేషన్కు చేరుకున్నాడు. దుస్తులన్నీ విప్పి పూర్తి నగ్నంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడున్న పోలీసులు వెంటనే బయటి నుంచి బట్టలు తెప్పించి కట్టించారు. ఇతడి మానసిక పరిస్థితి బాగాలేదని రాజారంపేట గ్రామస్తు లు చెప్పినట్టు ఏఎస్ఐ గణపతి తెలిపారు. -
పిల్లల్ని చంపుతాడనుకోలేదు..
-
అందరూ వాగులో నాణేలు వేస్తుంటే..ఆమె బిడ్డని విసిరేసింది
బయ్యారం(ఇల్లందు): ఓ దేవుడా ఎంత పనిచేశావయ్యా.. కొడుకుకు ఇద్దరు బిడ్డలే పుట్టారు.. మగబిడ్డ కోసం ఆపరేషన్ చేయించలే.. మూడో కాన్పులో మగబిడ్డ పుట్టాడనే తృప్తి లేకుండా చేశావు.. మేమేం చేశాం.. ఈ శిక్ష మాకెందుకు అంటూ తల్లి చేతిలో మృతి చెందిన రెండు నెలల చిన్నారి నానమ్మ లచ్చమ్మ విలపించిన తీరు పలువురి హృదయాలను కలిచివేశాయి. మతిస్థిమితం లేని తల్లి రెండు నెలల కుమారుడిని వాగులో విసిరేసి.. ఆ చిన్నారి మృతికి కారణమైంది. దీంతో మంగిమడుగు బంజార, ఎల్లంపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగు బంజారకు చెందిన గంగరబోయిన సురేష్కు మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన సరితతో వివాహమైంది. వీరికి హర్షిత, ప్రవళిక సంతానం ఉన్నారు. మరో కాన్పు కోసం ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం సరిత మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటు ంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. సరిత మతిస్థిమితం లేకుండా వ్యవహరించింది. వైద్యం చేయించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.ఏం జరిగింది..? మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తున్న సరితను బాగు చేయాలని ఆమె అత్త లచ్చమ్మ, తల్లి పద్మ, ఆడపడుచు పద్మ ఆటోలో సరితతోపాటు ఆమె పిల్లలను తీసుకుని మండలంలోని కట్టుగూడెం లోని దేవుని శివసత్తి (దేవుని పూనకం వచ్చే మహిళ) వద్దకు గురువారం తీసుకొచ్చారు. శివసత్తి వద్ద పూజలు చేసిన తర్వాత తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ సమయంలో బయ్యారంలోని పాకాలేటి బ్రిడ్జి వద్ద రూపాయి నాణెంతోపాటు నిమ్మకాయను ఏటిలో వేసేందుకు ఆటోను నిలిపారు. సరిత ఆటో దిగి కుమారుడిని వాగులో విసిరేసింది. ఆ తర్వాత ఆమె సైతం దూకేందుకు ప్రయత్నించగా తల్లి, అత్త, ఆడపడుచు గట్టిగా పట్టుకున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలతో బయటపడగా అభం శుభం తెలియని చిన్నారి కానరాని లోకాలకు వెళ్లాడు. ఓ వైపు మనవడు..మరో వైపు కన్నబిడ్డ.. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన సరిత తల్లి పద్మ నోటివెంట మాటరాని పరిస్థితి. ఓ వైపు మతిస్థిమితం లేని బిడ్డ తన కొడుకును చే తులారా ఏటిలో పడేయడం, ఆ తర్వాత త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కన్నబిడ్డ షాక్కు గురై స్పృహ తప్పి పడిపోయింది. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదని ఆమె రోదించింది. -
కూతురు కోసం ఉన్నదంతా ఇచ్చేశారు
కోజికోడ్, కేరళ : కడుపున పుట్టిన బిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడి...స్వతంత్రంగా బతికితే చాలనుకుంటారు ఏ తల్లిదండ్రులైన. ఏ లోపాలు లేకుండా ఉన్న పిల్లల గురించే ఇంతలా ఆలోచిస్తే...మరి శారీరకంగా, మానసికంగా సరిగా ఎదగని పిల్లల పరిస్థితి ఏంటి...? కన్నవారు బతికున్నంతకాలం వారికి ఎలాంటి ఢోకా లేదు...మరి తల్లిదండ్రుల తదనంతరం వారి పరిస్థితి...? ఇదే ప్రశ్నకేరళకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయ దంపతులు ఎన్ కమలాసన్(77), సరోజిని(71) దంపతులను చాలాకాలం నుంచి వేధిస్తుంది. ఎందుకంటే వారి ఏకైక కుమార్తె ప్రియ(37) కూడా బుద్ధిమాంద్యంతో బాధపడుతుంది. తల్లి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు ప్రియ. అలాంటిది రేపు మేము మరణిస్తే మా కూతురు ప్రియ పరిస్థితి ఏంటనే ప్రశ్నకమలాసన్ దంపతులను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. పోని బంధువులకు ప్రియ బాధ్యత అప్పగిద్దామంటే...ఆస్తి కోసం బంధువులు ఇలాంటి మానసిక వికలాంగులను కనికరం లేకుండా చంపేసిన సంఘటనలు తమ పరిసరాల్లో జరగడంతో ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు. మరి దారేంటి అని ఆలోచిస్తున్న తరుణంలో వారికో ఉపాయం తట్టింది. ఆలోచన వచ్చిందే తడవుగా తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియజేసారు. ప్రభుత్వం కూడా వారి నిర్ణయానికి ఆమోదం తెలపడంతో కొండంత భారం తీరినట్లయిందంటున్నారు కమలాసన్. ఇంతకు ఈ 77 ఏళ్ల వృద్ధుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తన కూతుర్ని సంరంక్షించాలనే షరతుతో తనకున్న ఇళ్లలో ఒక ఇంటిని ప్రభుత్వం వారికి ఇచ్చేశాడు. ప్రభుత్వం ఆ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చాలని కోరాడు. అప్పుడు తన కూతురుతో పాటు మరికొందరు మానసిక వికలాంగులు ఆ ఇంట్లో ఉంటారు. వారి బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భావించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు కమలాసన్. వెంటనే తన నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వానికి తెలియజేసాడు. కేరళ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కే కే శైలజ వారి నిర్ణయానికి మద్దతు ఇవ్వడమే కాక...మెచ్చుకున్నాడు కూడా. మంత్రి ఆదేశం మేరకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కొల్లమ్ జిల్లాలోని కాయిలి గ్రామంలో 83 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కమలాసన్ ఇంటిని స్వాధీనపర్చుకుని దాన్ని మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రసుత్తం ఈ ఇంటి మార్కెట్ విలువ 3 కోట్ల రూపాయలు. పది మందికి సరిపోయేలా ఉన్న ఈ ఇంటిని 50 మందికి సరిపోయేలా మారుస్తున్నారు. అంతేకాక ఈ ఇంటికి ‘ప్రియా మానసిక వికలాంగుల సంరక్షణా కేంద్రం’గా నామకరణం చేసారు. ప్రభుత్వం తన కోరికను మన్నిచండంతో కృతజ్ఞతగా కోజికోడ్లో ఉన్న 4 కోట్ల రూపాయల విలువచేసే 15 సెంట్ల స్థలంతో పాటు మరో రెండు ఇళ్లను కూడా గవర్నమెంట్కు చెందెటట్లు విల్లు రాసాడు కమలాసన్. ఈ విషయం గురించి కమలాసన్ ‘ప్రభుత్వం నా షరతుకు అంగీకారం తెలపడంతో పెద్ద సమస్య తీరినట్లుగా ఉంది. ధనవంతులకు నేను చేసే విన్నపం ఏంటంటే మీ ఇళ్లలో కూడా బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు ఉంటే మీరు కూడా మీ ఇంటిని మానసిక వికలాంగుల సంరక్షణ కేంద్రాలుగా మార్చండి. ఇలా చేయడం వల్ల చాలామంది పేదవారికి కూడా సహాయం చేసినవారవుతార’న్నాడు. 2015లో కేరళ సెక్యూరిటీ మిషన్లో భాగంగా చేపట్టిన సర్వేలో రాష్ట్ర జనాభాలో దాదాపు 2.21శాతం మంతి మానసిక, శారీరక వికలాంగులు ఉన్నట్లు తెలిసింది. కేరళ మెంటల్ హెల్త్ అథారిటి సెక్రటరీ డా. జయప్రకాశ్ కమలాసన్ చేసిన పనిని మెచ్చుకోవడమే కాక కమలాసన్ ఎందరికో ఆదర్శంగా నిలిచాడని పొగిడాడు. -
అయిన వారి కోసం ఎదురుచూపులు
పరకాల : మానసిక స్థితితో బాధపడుతున్న వృద్ధురాలు రెండు రోజులుగా అమాయకపు చూపులు..చేతులు చాపలేని దుస్థితి. పట్టించుకునేవారు ఒక్కరూ లేరు. వెంట తెచ్చుకున్న నీళ్ల సీసాతోనే రెండు రోజులుగా కాలం వెళ్లదీస్తోంది. బస్టాండ్లో అందరూ యాచకురాలిగానే చూస్తున్నారు తప్పా ఆమె ఆకలి బాధను, ఆవేదనను గుర్తించేవారే లేరు. బస్టాండ్లో అనుమానస్పదంగా కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చావని, ఎటు వెళ్లాలని సాక్షి విలేకరి ప్రశ్నించగా ఏదో చెప్పాలని ఉన్నా నోటి మాట రాక తల్లడిల్లిపోయింది. ఈ విషయాన్ని ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో అరటి పండ్లు, భోజనం అందజేశారు. ఆర్టీసీ సెక్యూరిటీ వృద్ధురాలు బంధువుల జాడ కోసం ఆరా తీస్తున్నారు. -
అతను దొంగ కాదు
అక్కన్నపేట(హుస్నాబాద్): బుధవారం మాల్చెర్వు తండాలో స్థానికులు దొంగగా భవించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారు. సైకాలజిస్టు, డాక్టర్ సహాయంతో పోలీసులు సుదీర్ఘంగా విచారణ చేశారు. చివరికి అతను దోపిడి దొంగలు, హంతక ముఠాలకు చెందిన అతను కాదని మతి స్థిమితం లేని వ్యక్తని నిర్ధారణకు వచ్చారు. పుకార్లు నమ్మొద్దు.. అక్కన్నపేట మండలంలో పిల్లలను ఎత్తుకెళ్లే వారు, దోపిడి దొంగలు సంచరిస్తున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ జీ అన్నారు. బుధవారం మాల్చెర్వుతండాలో స్థానికులు పిల్లలను ఎత్తుకెళ్లే దొంగగా భావించి పట్టుకున్న వ్యక్తికి మతిస్థిమితం లేక తప్పిపోయి వచ్చాడన్నారు. బీహార్కు చెందిన ముఠాలు సంచరిస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్ని ఉత్త పుకార్లే అని కొట్టిపారేశారు. ఆయన వెంట ఎస్ఐ పాపయ్యనాయక్ ఉన్నారు. మానవత్వం చాటిన పోలీసులు.. మాల్చెర్వుతండా వాసులు పట్టుకున్న మతి స్థిమితం వ్యక్తికి పోలీసులు కటింగ్, స్నానం చేయించి, కొత్త బట్టలు వేయించి మానవత్వం చాటారు. అనంతరం భువనగిరి జిల్లాలోని చౌటుపల్లిలోని అమ్మానాన్న ఆశ్రమానికి సొంత ఖర్చులతో తరలించారు. -
బాల్యం.. బందీ!
తొర్రూరురూరల్(పాలకుర్తి) : ఆడుతూ.. పాడు తూ.. అల్లరి చేయాల్సిన బాలుడు.. ఏడేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయాడు.. ముద్దుముద్దుగా మాట్లాడాల్సి ఉండగా గొంతు మూగబోయింది. మాట్లాడడమే మానేశాడు. తల్లిదండ్రులతో సహా అందరినీ మరిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో విడిచిపెడితే ఎక్కడికి వెళ్తాడో.. ఎవరిని గాయపరుస్తాడో.. తెలియని పరిస్థితి. అందుకే ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇనుప గొలుసులతో బంధించారు.తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన గజ్జి యాకయ్య, స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ మూడో సంతానంగా జన్మించిన సాంబరాజు మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడు. ఏమైందో ఏమో నాలుగో ఏట మతిస్థిమితం కోల్పోయాడు. ఓ రోజు ఇంట్లో బట్టలు విప్పేసుకుంటూ, నేలపై పడి బొర్లడం చేస్తుండగా తల్లి గమనించి భర్తకు తెలియజేసింది. కొడుక్కు ఏదో వ్యాధి వచ్చిందని ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కానీ వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏం వ్యాధో అంతకుచిక్కలేదు. అమెరికా తీసుకెళ్తే నయం అవుతుందని, లక్షలాది రూపాయలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఆర్థిక స్థోమత లేక స్వగ్రామానికి తిరిగి వచ్చారు. మతిస్థిమితం లేని బాలుడిని వదిలేస్తే ఎటైనా వెళ్లిపోతాడని, బాటసారులను గాయపరుస్తాడని ఏడేళ్లుగా చీకటాయపాలెంలోని తమ వ్యవసాయ భూమిలో గొలుసులతో కాళ్లను కట్టేసి ఉంచుతున్నారు. దాతలు ఎవరైనా స్పందించి ఆర్థికసాయం అందిస్తే తమ కుమారుడికి మెరుగైన వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పింఛన్ కూడా లేదు.. గొంతు చచ్చుబడి, మనుషులను గుర్తించలేని ఈ మానసిక దివ్యాంగుడికి ఆసరా పింఛన్ రావడంలేదు. పేద తల్లిదండ్రులు పలుమార్లు అధికారుల కాళ్లావేళ్లా పడ్డా అధికారులు కనికరించలేదు. దీంతో పేద తల్లిదండ్రులు కూలీ నాలి చేసి మతిస్థిమితం లేని కుమారుడిని పోషిస్తున్నారు. కలెక్టర్ చొరవ చూపి పింఛన్ అందేలా చూడాలని కోరుతున్నారు. -
‘భవిత’కు భరోసా ఏది..!
పై చిత్రంలో కనిపిస్తున్న బాలుడి పేరు దుమాల ఆశన్న. జైనథ్ మండల కేంద్రానికి చెందిన దుమాల చిన్నక్క, నడిపెన్న దంపతుల చిన్న కుమారుడు. ఆశన్న పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. సాధారణ పిల్లల్లాగా కాకుండా శారీరక, మానసిక ఎదుగుదల లోపం కనిపించడంతో జైనథ్లోని భవిత విలీన విద్య కేంద్రంలో చేర్పించారు. కొన్నేళ్లుగా ఆటపాటలతో విద్య నేర్చుకుంటున్నాడు. ఏప్రిల్ 14నుంచి ఈ కేంద్రం మూసి వేయడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ‘‘అప్పటి నుంచి మరింతగా మానసిక వేదన చెందుతున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు స్పృహ తప్పి పడిపోతున్నాడు. దినం, రాత్రి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి వస్తంది..’’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవిత కేంద్రం తెరిచి ఉంటే పిల్లలతో కలిసి ఆటపాటలతో కొంత ఉల్లాసంగా గడిపేవాడని తెలిపారు. ఆదిలాబాద్టౌన్ : పుట్టుకతో వచ్చే వివిధ రకాల శారీరక, మానసిక వైకల్యాలకు వైద్యం అందించడంతోపాటు కనీస విద్య సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం భవిత విలీన విద్యావనరుల కేంద్రానికి శ్రీకారం చూట్టింది. మానసిక వైకల్యం గల పిల్లలతోపాటు వైకల్యం గల పిల్లలకు చదువు, ఆటపాటలు నేర్పించి సాధారణ పిల్లలుగా మారే విధంగా చేయడమే భవిత కేంద్రాల లక్ష్యం. వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపి చికిత్స అందించి వారికి ప్రయోజనం చేకూర్చాలి. కానీ.. గత రెండు నెలలుగా కేంద్రాలు మూతపడ్డాయి. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, వైద్య సేవలు అందడం లేదు. సాధారణ పాఠశాలల మాదిరిగా ఈ కేంద్రాలకు కూడా విద్యశాఖ సేవలు ఇవ్వడంతో వైకల్యంతో బాధపడుతున్న చిన్నారుల బాధలు వర్ణనాతీతం. చిన్నారుల రాత మార్చే భవిత కేంద్రాలు తెరవకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే వారి ‘భవిత’వ్యం ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో.. ప్రత్యేక అవసరాలు ఉన్న శారీరక, మానసిక దివ్యాంగులకు మండల కేంద్రాల్లో భవిత కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో 17 కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా 251 మంది చిన్నారులు భవిత కేంద్రాల్లో చదువుకుంటున్నారు. 131 మంది చిన్నారులు ఫిజియోథెరఫి వైద్య చికిత్సలను పొందుతున్నారు. 88 మంది చిన్నారులు ఇంటి వద్ద చదువు నేర్చుకుంటున్నారు. భవిత కేంద్రాల్లో 23 మంది ఐఈఆర్పీ(ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. ఆరుగురు ఫిజియోథెరఫిస్టులు, 17 మంది కేర్గీవర్స్ పనిచేస్తున్నారు. పిల్లల భవితవ్యం పట్టదా.. దివ్యాంగులకు వివిధ అంశాల్లో ఆట, పాటల ద్వారా శిక్షణ ఇచ్చి క్రమంగా వారి సామర్థ్యాలను పెరిగేలా చూడాలి. దీంతోపాటు వారంలో ఒకసారి అవసరమైన వారికి ఫిజియోథెరఫితోపాటు ఇతర థెరఫిలు చేయిస్తారు. ఈ పిల్లల అంశాలను గుర్తించి తమ పనులు తాము చేసుకునేలా చూడడం, కాస్త క్రీయాశీలకంగా ఉన్న వారి సామర్థ్యాలను మరింతగా పెంచి సాధారణ విద్యార్థులతో కలిసిపోయేలా చేయడం దీని లక్ష్యం.. కానీ సర్వశిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరుగారిపోతోంది. కాగా భవిత కేంద్రాలకు ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీంతో భవిత కేంద్రానికి వచ్చి ఫిజియోథెరఫి చేసుకునే పిల్లలు ఇబ్బందులు గురవుతున్నారు. ఫిజియోథెరఫి క్రమం తప్పకుండా చేయాలి. లేనట్లయితే పరిస్థితి మొదటికి వస్తుంది. కండరాలు బిగిసుకుని చచ్చుబడిపోతాయి. ప్రైవేటుగా ఫిజియోథెరఫి చేయించుకోలేని వారే అధికంగా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం కేంద్రాలకు రాలేని స్థితిలో ఉన్న పిల్లలకు వారి ఇంటికి వెళ్లి ఐఈఆర్పీలు చదువు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫిజియోథెరఫి చేసే విధానం చూపిస్తారు. వారిలో మనోధైర్యం నింపుతారు. ఇవన్నీ నిలిచిపోయి ఇప్పటికే నెల రోజులు దాటింది. భవిత కేంద్రాలు మళ్లీ వచ్చే నెల 12న ప్రారంభమయ్యే అవకాశాలు ఉండడంతో రెండు నెలలపాటు సేవలు నిలిచిపోయినట్లే. ఉద్యోగ భద్రతా కరువే.. మానసిక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులను సాధారణ స్థితికి తీసుకువస్తున్న ఐఈఆర్పీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 10 నెలల వేతనం మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నవారి కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. ఏప్రిల్లో 13 వరకే వేతనం చెల్లించారు. మే నెలకు వేతనం లేకపోగా, జూన్ మాసంతో 20 రోజుల వేతనం ఇవ్వనున్నారు. వీరు గత కొన్నేల్లుగా ఉద్యోగం చేస్తున్నా ప్రతి సంవత్సరం రీఎంగేజ్ (రెన్యువల్) చేస్తుండడంతో ఉద్యోగ భద్రత లేదు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా రెన్యువల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేతనాలు అధికంగా ఉండగా మన రాష్ట్రంలో రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొంటున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి గత 15 సంవత్సరాలుగా వైకల్యం గల పిల్లలకు సేవలు అందిస్తున్నాను. ఐఈఆర్పీలకు ఉద్యోగ భదత్ర కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. కనీస వేతనం రూ.28,940 చెల్లించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 6 నెలల మాతృత్వ సెలవులు మంజూరు చేయాలి. ఒక్క రోజు విరామంతో తిరిగి పునర్నియామకం చేయాలి. – పుష్పవేణి, ఐఈఆర్పీ ఆదిలాబాద్ -
మూడేళ్ల నుంచి బందీగా యువకుడు
జయపురం(ఒరిస్సా) : మానవత్వం మంట గలిసిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది కొరాపుట్ జిల్లాలో జరిగిన ఓ సంఘటన. గ్రామస్తుల కఠిన వైఖరితో ఓ యువకుడు(20) మూడేళ్లుగా పశువుల శాల లాంటి గదిలో చేతులకు గొలుసులతో బందీగా ఉన్నాడు. ఈ విషయం జిల్లా అధికార యంత్రాం గాన్ని షాక్కు గురి చేసింది. ఈ సంఘటన జిల్లా ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులు ఆ యువకుడిని విముక్తిడిని చేసి కొరాపుట్ సహిధ్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల హాస్పిటల్లో చేర్చా రు. వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్ జిల్లాలోని దశమంతపూర్ సమితి ముజంగ గ్రామ పంచాయతీలోని మారుమూల గ్రామంలో ఈ సంఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన యువకుడిని మానసిక వ్యాధి గ్రస్తుడుగా గ్రామస్తులు నిర్ధారించిన తరువాత గొలుసులతో బంధించి పశువుల శాల లాంటి ఒక చీకటి గదిలో బంధించారు. ఆ యువకుడి సోదరి ప్రతిరోజూ ఆహారం తీసుకువచ్చి తినిపిస్తోంది. అతని మరో సోదరుడు ఆ గ్రామంలోనే వేరే ఇంటిలో నివాసం ఉంటున్నాడు. వారి తల్లిదండ్రులు మూడేళ్ల కిందట మరణించారు. తల్లి దండ్రులు ఉన్నంత వరకు ఆ యువకుడు మంచి ప్రవర్తన కలిగి, కూలి పనులు చేస్తుండేవాడు. అయితే తల్లిదండ్రులు పోయిన తరువాత ఆ యువకుడు అంతవరకు పనిచేస్తున్న కాంట్రాక్టర్ దగ్గర పని మానివేశాడు. అందుకు ఆ యువకుడి మానసిక పరిస్థితే కారణమని గ్రామస్తులు అంటున్నారు. నాటి నుంచి ఆ యువకుడు ప్రజలపైన, ఇళ్ల పైకప్పులపై రాళ్లు విసరడం చేస్తుండేవాడు. దీంతో ఇళ్లపై వేసిన సిమెంట్ రేకులు పగిలిపోవడం, ప్రజలకు దెబ్బలు తగలడం తదితర నష్టాలు సంభవించేవి. ఈ నేపథ్యంలో గ్రామప్రజలు ఏకమై నిర్ణయం తీసుకుని ఆ యువకుడిని బయటకు రాకుండా బంధించాలని తీర్మానించి ఒక ఇంటిలో బంధించి చేతులకు గొలుసులు కట్టి తాళం వేశారు. ఆ యువకుడిని హాస్పిటల్కు కూడా తీసుకువెళ్లకుండా స్థానిక నాటు వైద్యునితో చికిత్స చేయించారు. అయినా ఏమాత్రం నయం కాలేదు. పాత్రికేయుని చొరవతో వెలుగులోకి ఆ ప్రాంతానికి చెందిన ఓ పాత్రికేయుడు ఈ విషయం తెలుసుకుని వెలుగులోకి తీసుకు రావడంతో జిల్లా అధికారులు వెంటనే స్పందించి వెంటనే విషయం తెలుసుకోవాలని డీసీపీఓను ఆదేశించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు డీసీపీఓ రాజశ్రీ దాస్ వెంటనే ఆ గ్రామానికి వెళ్లి గొలుసులతో కట్టి తాళాలు వేసి బందీని చేసిన యువకుడిని చూసి గ్రామ ప్రజలతో చర్చించి విషయాలు తెలుసుకున్నారు. ఆమె ఈ విషయంపై సహిద్ లక్ష్మణ్ నాయక్ వైద్య కళాశాల వైద్యులతో చర్చించగా ఆ యువకుడికి ఉచితంగా వైద్యం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. నిరక్షరాస్యత, మూఢాచారాలు, అమాయకత్వం, పేదరికం, తాండవించే మారుమూల గ్రామాల్లో ఇలాంటి అనేక అవాంఛనీయ సంఘటనలు సంభవిస్తుండడం పరిపాటిగా మారింది. అటువంటి పాంతాలపై పత్రికా రంగం, జిల్లా అధికార యంత్రాంగం, సమాజసేవకులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే ఇటువంటి వాటిని అరికట్టవచ్చని సీనియర్ పాత్రికేయులు సీహెచ్ శాంతాకర్ అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా అలాంటి మారుమూల గ్రామాల ప్రజలను చైతన్య పరిచేందుకు సామూహిక ఉద్యమం అవసరమని పలువురు పరిశీలకులు సూచిస్తున్నారు. -
వివాహితపై ఇద్దరు యువకుల గ్యాంగ్రేప్
కొణిజర్ల : మతిస్థిమితం లేని ఓ వివాహితపై ఇద్దరు యువకులు గ్యాంగ్రేప్నకు పాల్పడిన సంఘటన తనికెళ్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొణిజర్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనికెళ్లకు చెందిన ఓ వివాహిత (25)కు చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగ్గా లేదు. ఈమెకు ఆరు సంవత్సరాల క్రింతం వివాహం కాగా..నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఏడాది క్రితం వదిలేశాడు. మార్చి 9వ తేదీన ఈమె తన పెద్దమ్మ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా వారి వీధిలోనే ఉండే బంటు యల్లారావు అనే యువకుడు ‘మీ అమ్మఫోన్ చేసింది. ఇదిగో ’..అంటూ ఇంటిలొకి పిలిచి, నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని స్నేహితుడు మేకల రామకృష్ణ కూడా ఆమెను అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపుతామని బెదిరించడంతో ఆమె భయపడి ఎవరకీ చెప్పలేదు. తిరిగి గత నెల (ఏప్రిల్) 17న సదరు వివాహిత మెడికల్ దుకాణానికి వెళ్లి వస్తుండగా తనికెళ్ల సెంటర్లో యల్లారావు ఆమెను లారీ కింద తోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అదృష్టవశాత్తూ బయట పడటంతో తలకు గాయమైంది. అతడే చికిత్స చేయించి ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. భయంభయంగా ఉంటుండటంతో..తల్లి ఆమెను గట్టిగా అడగడంతో సదరు యువకులు తనపై అఘాయిత్యానికి ఒడిగట్టిన విషయాన్ని తెలిపింది. దీంతో..తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వైరా ఏసీపీ దాసరి ప్రసన్నకుమార్ ఆదేశాల మేరకు సదరు యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు యువకులు పరారీలో ఉన్నారు. -
కలకలం రేపిన బాలిక కిడ్నాప్ ఘటన
సాక్షి, నారాయణఖేడ్: ఆరేళ్ల బాలికను కడ్నాప్నకు యత్నించిన ఘటన నారాయణఖేడ్ పట్టణంలో శనివారం కలకలం రేపింది. నారాయణఖేడ్ పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన ఎక్బాల్ ఆహ్మాద్ కూతురు సిద్రాబేగం (6) ఉదయం ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. నారాయణఖేడ్ మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెకందిన వెంకటేశం(48) బాలికను భుజంపై వేసుకొని పరుగులు పెట్టాడు. ఇది గమనించిన కాలనీ వాసులు బాలిక తండ్రి ఎక్బాల్ అహ్మద్కు విషయం తెలియజేశారు. బాలికను ఎత్తుకొని పరుగెడుతున్న నిందితుడిని బైక్పై వెంబడించి శాస్త్రినగర్లో పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించినట్లు ఇన్చార్జి డీఎస్పీ నల్లమల రవి తెలిపారు. నిందితుడిని ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని చెప్పారు. -
తండ్రి పాపమా ?.. విధి శాపమా ?
లోకం పోకడ తెలియని అన్నదమ్ములు ఆ పసోళ్లు.. మేనరికం పాపమో.. విధి శాపమో.. పదేళ్లు వచ్చినా పట్టుమని పది మందితో ఆడుకోలేని మానసిక దివ్యాంగులు వాళ్లు .. ఆనందమొచ్చినా.. ఆవేదన వచ్చినా ఎదిగీ ఎదగని ఆ రెండు మనసులకే అర్థమయ్యేవి. అనురాగం నిండిన అమ్మ పేగులో ఆవేదన.. మమకారం పంచిన నాన్న గుండెల్లో ఆందోళన వాళ్ల కన్నీళ్లలో కలిసిపోతుండేవి. శనివారం ఆ తండ్రి ఆందోళన క్షణికావేశంగా మారిందో.. కన్నబిడ్డలు పడుతున్న కష్టం చూసి కడుపు తరుక్కుపోయిందో.. ఆ పిల్లల పాలిట మృత్యువైంది. మాచర్ల పట్టణ శివారులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఉషోదయాన విషాద గీతికై జిల్లా నలుమూలలా ప్రతిధ్వనించింది. ఇద్దరు మానసిక దివ్యాంగుల హత్య మాచర్లరూరల్ : పుట్టుకతో మానసిక వికలాంగులుగా ఉన్న చిన్నారులు ఇంట్లోనే హత్యకు గురయ్యారు. తండ్రే వారిని హతమార్చి ఉంటాడని బంధువులు అనుమానిస్తున్నారు. పట్టణ శివారులోని వికాస్ డీఎడ్ కాలేజి సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన కుర్రి బ్రహ్మారెడ్డి, అనిత దంపతులు ఉపాధి కోసం 5 ఏళ్ల నుంచి పట్టణ శివారులోని శ్రీ వికాస్ డీఎడ్ కళాశాల సమీపంలో నివసిస్తున్నారు. బ్రహ్మారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వీరికి శశాంక్రెడ్డి (11), అదీప్రెడ్డి (9), 9 నెలల చింతన్రెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు. వీరిలో శశాంక్రెడ్డి, అదీప్రెడ్డి పుట్టకతోనే మానసిక దివ్యాంగులుగా జన్మించారు. వీరి ఆరోగ్యం కోసం వివిధ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వారిలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. శుక్రవారం రాత్రి ఎప్పటిలాగే బ్రహ్మారెడ్డి పిల్లలతో కింద పోర్షన్లో నిద్రించాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి బ్రహ్మారెడ్డి బయటకు వెళ్లిపోవడం గమనించిన నాయనమ్మ మాలకొండమ్మ తెల్లవారుతున్నా బ్రహ్మారెడ్డి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులను పరిశీలించగా శశాంక్రెడ్డి, అదీప్రెడ్డి ఉలుకూపలుకూ లేకుండా పడివున్నారు. బహ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారకముందే బయటకు వెళ్లిపోవడంతో బంధువులు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రూరల్ సీఐ దిలీప్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను విచారించారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మారెడ్డి కోసం గాలిస్తున్నారు. -
మానవత్వం చాటిన న్యాయమూర్తి
కాకినాడ లీగల్ : రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని చూసిన హైకోర్టు జస్టిస్ శివశంకరరావు కారు దిగి పరిశీలించి వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే హైకోర్టుకు జస్టిస్ శివశంకరరావు జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి బుధవారం వచ్చారు. అన్నవరంలో సత్యనారాయణస్వామిని దర్శించుకుని అక్కడ నుంచి రాజమహేంద్రవరం కారులో వెళ్తుండగా పెద్దాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పడి ఉన్న వృద్ధుడిని చూశారు. వెంటనే కారుదిగి వృద్ధుడిని పరిశీలించగా స్పహకోల్పోయి ఉన్నట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం ప్రధాన జిల్లా జడ్జి ఎన్.తుకారామ్జీకి ఫోన్లో సమాచారం తెలియజేసి ప్రభుత్వాస్పత్రిలో వైద్యసేవలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ప్రధాన జిల్లాజడ్జి పెద్దాపురం మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం తెలియజేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని వృద్ధుడికి ప్రాథమిక వైద్య సేవలు అందజేసి, అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులకు వివరాలు తెలియజేశారు. దీంతో కాకినాడ మండల లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు ప్రభుత్వాస్పత్రిలోకి తీసుకువెళ్లగా ఆస్పత్రిలో ముందుగా పేరు, ఊరు, ఎటువంటి సమాచారం లేని వ్యక్తులకు ఓపీ ఇవ్వలేమంటూ సిబ్బంది నిరాకరించారు. దీంతో న్యాయమూర్తికి విషయం తెలియజేశారు. న్యాయమూర్తి జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఫోన్ చేసి అనాథకు వైద్యసేవలు అందజేయాలని సూచించారు. దీంతో అనాథను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి అంగీకరించి వైద్యులకు, సిబ్బందికి వైద్యసేవలు అందజేయాలని సూపరింటెండెంట్ సూచించారు. పేరు, ఊరు చెప్పలేకుండా ఉన్న అతని మానసిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్యులు అతనిని ప్రత్యేక వార్డులో ఉంచి సేవలు అందిస్తున్నారు. మతిస్థిమితంలేని ఆ అనాథకు క్షౌవరం చేయించి, శుభ్రంగా స్నానం చేయించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
పురుగుమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
గోపాలపురం : గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామానికి చెందిన జగడాల సత్యనారాయణ(68) అనే వృద్ధుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై ఎం. జయబాబు చెప్పారు. మృతుడు సత్యనారాయణకు గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా జీవితం మీద విరక్తి చెంది ఉన్నాడని, పురుగుల మందు తాగుతానని బెదిరిస్తూ ఉండేవాడని, ఆయనను కుటుంబసభ్యులు ఓదార్చినా పట్టించుకోలేదన్నారు. మతిస్థిమితం లేని సమయంలో పురుగుల మందు తాగిన సత్యనారాయణను స్థానిక పీహెచ్సీకి తరలించగా తాగిన మందు మోతాదు ఎక్కువకావడంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టంకు తరలించినట్టు ఎస్సై జయబాబు తెలిపారు. -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు
పాకాల: మండలంలోని కె.వడ్డేపల్లి పంచాయతీ పోలిరెడ్డివారిపల్లిలో ఈ నెల 5వ తేదీన మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిం దితుడిని అరెస్టు చేసినట్టు సీఐ రామలింగయ్య తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పోలిరెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన లేట్ సుబ్రమణ్యం కుమారుడు హేమసుందరం(21) పక్క ఇంటి వారి పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో అక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్న మానసిక దివ్యాంగురాలి(29)పై అత్యాచారానికి ఒడిగట్టాడని చెప్పారు. బాధితురాలి వదిన దుశ్చర్యని చూసి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడన్నారు. ఎస్ఐ యు.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేపట్టారని తెలిపారు. నిందితుడు సోమవారం నేండ్రగుంట వద్ద ఉండగా అరెస్టు చేసినట్టు వివరించారు. అతన్ని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. -
వృద్ధుడి ఆత్మహత్య
పాల్వంచరూరల్: మతి స్థిమితం సక్రమంగా లేని వృద్ధుడు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని పాండురంగాపురం గ్రామస్తుడు కఠోజు శ్రీనివాసచారి(56) శనివారం రాత్రి ఇంట్లో దూలానికి లుంగీతో ఉరి వేసుకున్నాడు. తెల్లవారుజామున భార్య మేల్కొని వరండాలోకి వచ్చేసరికి, ఉరికి వేలాడుతూ భర్త కనిపించాడు. పోలీసులకు ఆమె సమాచారమిచ్చింది. మానసిక వ్యాధితో బాధపడుతున్న ఇతడు, హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలుగా చికిత్స పొందుతున్నాడు. ఇతడికి భార్య పుష్పావతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్ధలాన్ని హెడ్ కానిస్టేబుల్ సూర్యారావు పరిశీలించారు. శ్రీనివాసచారి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
యువకుడి బలవన్మరణం
మార్కాపురం: మతిస్థిమితం కొల్పోయిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొండేపల్లి రోడ్డులో నివాసం ఉండే మిరియాల వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతుల కుమారుడు మస్తాన్కు రెండేళ్ల కిందట మచిలీపట్నానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. వీరిద్దరూ పాపతో కలిసి వేరే ఇంట్లో ఉంటారు. రెండేళ్లుగా మస్తాన్ మతిస్థిమితం కొల్పోయి తరుచూ ఇంటి నుంచి బయటకు వెళ్తుండేవాడు. కుటుంబ సభ్యులు కనుగొని ఇంటికి తీసుకొచ్చేవారు. భార్య స్వప్న అత్తింటికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి రాగా భర్త మస్తాన్ ఇంట్లో ఉరేసుకుని నిర్జీవంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ భీమా నాయక్, ఏఎస్ఐ మాణిక్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఆర్మీ మాజీ ఉద్యోగి ఘాతుకం.. 2 గంటల్లో ఆరు హత్యలు
ఛండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఏ కారణం లేకుండానే ఓ వ్యక్తి ఆరుగురిని అతి కిరాతకంగా హతమార్చాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. పల్వాల్లో ఈ ఉదయం వరుస హత్యలు చోటు చేసుకున్నాయి. రాడ్తో సంచరించిన ఆ వ్యక్తి పలువురిపై దాడి చేశాడు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు ఆదర్శ్ కాలనీలో గాయాలతో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మతిస్థిమితం లేకపోవటంతోనే అతను ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. మృత దేహాలను పోస్ట్మార్టంకు పంపిన పోలీసులు.. ఓ మహిళతోపాటు, ముగ్గురు వాచ్మెన్లు మృతుల్లో ఉన్నట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో హై అలెర్ట్ విధించిన పోలీసులు.. నిందితుడిని ఫరిదాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హంతకుడు మాజీ ఆర్మీ ఉద్యోగి కాగా, అదుపులోకి తీసుకున్న వ్యక్తిని ఆర్మీ మాజీ ఉద్యోగి నరేష్ ధన్కర్గా పోలీసులు వెల్లడించారు. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా విధులు నిర్వహించిన నరేష్ 2003లో వీఆర్ఎస్ తీసుకుని మూడేళ్ల తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేరాడు. కలహాలతో భార్య కొడుకును తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం భివానీలో ఆయన ఎస్డీవోగా పని చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఆయన ఈ హత్యాకాండకు దిగగా.. ఉదయం 4గంటలలోపే ఆరుగురిని చంపేశారు. ఎట్టకేలకు ఉదయం 7 గంటలకు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆయన పోలీసులపై కూడా రాడ్తో దాడికి పాల్పడ్డాడంట. అయితే పోలీసులు అతికష్టం మీద ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నరేష్ భార్య, కొడుకును కూడా చంపేందుకు ఫ్లాన్ గీసుకున్నాడని పోలీసులు చెప్పారు. -
కుటుంబీకులపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
నందిగామ: మతిస్థిమితం లేనివారు ఎప్పుడు ఏమి చేస్తారో వారికో తెలియదు. ఆ కోవలోనే ఓ మతిస్థిమితం లేని వ్యక్తి తన కుటుంబీకులపై విచక్షణా రహితంగా దాడి చేయగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణాజిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలిలా ఉన్నాయి. వేముల ముత్యాలు అనే వ్యక్తికి మతిస్థిమితం లేదు. ఆ వ్యక్తి తన తండ్రి, భార్య, పెద్దమ్మలపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ సంఘటనలో అనంతమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలుకాగా పరిస్థితి విషమంగా ఉంది. భార్య పార్వతి, తండ్రి గురవయ్యకు కూడా తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతమ్మను విజయవాడకు తరలించారు. -
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్
తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పీయస్సీ-4 వద్ద ఓ మహిళపై మతిస్థిమితం లేని వ్యక్తి కర్రతో దాడి చేశాడు. ఈ దాడిలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండల వాడి సన్నిధిలో సుమారు 200 పైగా వివాహాలు జరగనున్నాయి. కొత్త జంటలతో తిరుమల కొండ కళకళలాడుతోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు కావడంతో భారీగా భక్తులు తరలివస్తున్నారు. నారాయణగిరి ఉద్యానవనం ప్రాంతంలో కాలిబాటన కొండపైకి వచ్చిన వారు స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. గదుల సమస్యతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
దేవుడికి చేతకానివి వేషధారణ,నటన
గలిలయ సముద్రం ఆవలనున్న గెరాసేనుల ప్రాంతానికి యేసుప్రభువు ఒకసారి వెళ్లాడు. దారిలో యేసు, ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోనె గాలివానలో చిక్కి మునిగే ప్రమాదం ఏర్పడితే యేసు గాలిని, నీటి పొంగును కూడా గద్దించి నిమ్మళపర్చాడు. అలా గెరాసేనుల దేశానికి వెళ్తే అనేక దయ్యాల పీడితులై భయంకరమైన విధ్వంసక శక్తిని కలిగి ఉన్న ఒక వ్యక్తి ఎదురయ్యాడు. నీ పేరేమిటని ప్రభువడిగితే తనలో చాలా దయ్యాలున్నాయని సూచిస్తూ ‘సేన’ అని జవాబిచ్చాడు. ప్రభువు ఆజ్ఞతో ఆ దయ్యాలన్నీ అతన్ని వదిలి అక్కడి ఒక పందుల మందలో దూరగా, వాటి ధాటికి తట్టుకోలేక అవి సముద్రంలోకి దూకి చనిపోయాయి. కాని అంతకాలంగా అంతటి విధ్వంసక శక్తిని భరించిన ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై, అత్యంత సాత్వికుడిగా మారాడు. ఆ ప్రాంతాన్నంతా దేవుని సువార్తను అతను ప్రకటించాడని చరిత్ర చెబుతోంది (లూకా 8:26–39). దయ్యాల సంగతి పక్కనబెడితే, ప్రతి వ్యక్తిలోనూ దేవుడు అనూహ్యమైన శక్తిని నిక్షిప్తం చేశాడు. అది విధ్వంసకశక్తి కావచ్చు, ప్రగతికారక శక్తి కావచ్చు. నిరంతర దైవవాక్యధ్యానం, దేవునితో ఎడతెగని సహవాసం, సద్వర్తనుల సాంగత్యంలో విశ్వాసిలోని శక్తి ప్రగతిశీలకమవుతుంది. మనిషి ఆంతర్యం పల్లపు ప్రదేశం వంటిది. దాంట్లోకి మురుగునీరు చేరితే అది మురికి కూపమవుతుంది. స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తే పదిమంది అవసరాలు తీర్చే మంచి నీటి సరస్సు అవుతుంది. మనం జీవితాంతం కలిసి బతకవలసిన వ్యక్తి ‘మనమే’ గనుక మనల్ని మనం సద్వర్తనులుగా సంస్కరించుకోగలిగితే విశ్వాసిగా అదే మన ఘనవిజయం. లోకంలో ఒక్కొక్కరిది ఒక్కొక్కతీరు. కొందర్ని కలిస్తే పన్నీటితో తడిసినట్లుంటుంది. మరికొందరిని కదిపితే డ్రైనేజీలో మునిగామా అనిపిస్తుంది. వందలాది దయ్యాల నుండి విముక్తినిచ్చి అతన్ని స్వస్థచిత్తుని చేసిన గాలిని, పొంగే నీటిని గద్దించగలిగిన దేవుని శక్తి ఈ లోకంలోని ఏ వ్యక్తినైనా మార్చగలుగుతుంది. అయితే నేను మారాలి అన్న బలమైన పరివర్తన అరుదుగా కనిపిస్తుంటుంది. అలా నిజపరివర్తన చెందిన విశ్వాసులే సమాజంలో ఆత్మీయ విప్లవాలకు సారథ్యం వహిస్తారు. దేవుడు ఎన్నడూ చేయనిది, మనిషి మాత్రం ఎప్పుడూ చేయడానికి ఇష్టపడేది ఒకటుంది. అది ‘నటన’! సమాజంలో ఆమోదం, గౌరవం కోసం కొందరు మారినట్టుగా నటిస్తారు. కాని కొద్దిసేపట్లోనే దొరికిపోతారు. దూరం నుండి మంచి నీటికుంటలాగా కనిపించే వేషధారుల విషయం జాగ్రత్త! వ్యసనాలన్నింటిలోకి అత్యంత భయంకరమైనది ‘వేషధారణ’ లేక నటన! ఈనాడు సమాజాన్ని ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి ఇది. – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
మానసిక రోగులకు తుపాకులు: ట్రంప్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ వైపు దేశంలో విదేశీయులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూనే.. మానసిక రోగులు కూడా ఆయుధాలను కొనుక్కొవచ్చనే కొత్త రూల్ను పాస్ చేసినట్లు చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సారధ్యంలో మానసిక రోగులకు ఆయుధాల అమ్మకాన్ని నిషేధించారు. ఒబామా నిర్ణయాన్ని మార్చాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు నిర్ణయం తీసుకున్నాయని ఇందుకు సంబంధించిన బిల్లు రెండు వారాల క్రితమే పాసయిందని నెల రోజుల పరిపాలనపై మాట్లాడుతూ వెల్లడించారు ట్రంప్. ట్రంప్ నిర్ణయంతో దాదాపు 75 వేల మంది మానసిక రోగులకు ఆయుధాలు కొనుక్కునే అర్హత కలుగుతుంది. గతంలో వీరందరికి ఉన్న లైసన్లను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. 2012లో దాదాపు 20 పాఠశాల విద్యార్థులను ఓ మానసిక రోగి కాల్చి చంపిన తర్వాత ఒబామా మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండటంపై నిషేధం తీసుకువచ్చారు. అమెరికాలో తాజాగా భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ఓ మానసిక రోగి హైదరాబాద్కు చెందిన ఇంజనీర్ను కాల్చి చంపాడు. ఈ ఘటన జరిగి కొద్ది రోజులు కూడా గడవకముందే మానసిక రోగులు ఆయుధాలు కలిగివుండొచ్చనే ఆర్డర్లను ట్రంప్ సర్కారు తీసుకురావడం ఆందోళన కలిగించే విషయమే. -
రాజుగారూ... మీరు మామూలోరు కాదు!
ఈ రాజుగారి దగ్గరకు వెళుతున్నారా? అయితే.. తనువూ మనసూ రెండూ జాగ్రత్త సుమా! ఎందుకంటే... మీ మనసులో ఆలోచనలను చదివేస్తారు. అంతేనా.. రాజుగారి దగ్గర అసాధారణ శక్తులున్నాయి. మీపై ఆ శక్తులను ప్రయోగించినా ఆశ్చర్యపోవడానికి లేదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే... ఈయన ‘మెంటలిస్ట్’ అన్నమాట. నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘రాజుగారి గది–2’. ఇందులో నాగార్జున ‘మెంటలిస్ట్’ పాత్రలో నటిస్తున్నారట! ‘రాజుగారి గది’లో ఇలాంటి పాత్ర లేదు. సీక్వెల్లో కొత్తగా సృష్టించారు. అది కూడా నాగార్జున ఇమేజ్కి తగ్గట్టు సై్టలిష్గా డిజైన్ చేశారట! ‘‘సినిమాలో నాగార్జున ఓ ఫ్యాన్సీ బైక్ రైడ్ చేస్తూ కనిపిస్తారు. ఇందులో సమంత కీలక పాత్ర చేస్తున్నారు. ప్రచారంలో ఉన్నట్టు ఆమె నాగార్జునకు జోడీగా నటించడం లేదు. సమంత నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది’’ అని చిత్రబృందం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరి, సమంత దెయ్యంగా నటిస్తున్నారా? అనడిగితే.. ‘‘ఇప్పుడే అవన్నీ చెప్పడం కష్టం. ఇప్పటివరకూ చేయనటువంటి పాత్ర చేస్తున్నారామె’’ అన్నారు. సీరత్ కపూర్, అశ్విన్బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
అత్యాచార ఆరోపణలు: ఏఎస్ఐ అరెస్టు
మానసిక వికలాంగురాలైన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో కర్ణాటకలోని తుముకూరులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్టు చేశారు. ఉమేష్ (54) అనే ఈ అధికారిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి, సస్పెండ్ చేసినట్లు తుముకూరు ఎస్ఐ ఇషా పంత్ తెలిపారు. ఈ నేరానికి పురిగొల్పినందుకు జీపు డ్రైవర్ ఈశ్వరప్ప (32)ను కూడా అరెస్టు చేశామన్నారు. నిందితులిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని, విచారణ పూర్తి కాగానే చార్జిషీటు దాఖలు చేస్తామని పంత్ చెప్పారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుండగా.. ఒక హోంగార్డుతో కలిసి బైకు మీద పెట్రోలింగ్ కోసం వెళ్తున్న ఏఎస్ఐ ఉమేష్ చూశారు. ఆమెను ఇంటికి దింపుతామని చెప్పి, గార్డును పోలీసు స్టేషన్కు పంపేశారు. ఆమెను ఇంటికి చేర్చడానికి సాయం చేయాలని జీపు డ్రైవర్ ఈశ్వరప్పను కోరారు. దారిలో ఆమెపై ఉమేష్ అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలికి పెళ్లయినా, మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన తల్లి ఇంట్లోనే ఉంటోందని వివరించారు. -
ఆ జవాను మానసిక స్థితి సరిగా లేదు
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) జవాను జరిపిన కాల్పుల్లో నలుగురు సహచరులు మృతి చెందిన ఘటనకు సీఐఎస్ఎఫ్ అధికారుల నిర్లక్ష్యం కూడా ఓ కారణమని తెలుస్తోంది. కాల్పులు జరిపిన బల్బీర్ సింగ్ మానసిక పరిస్థితి సరిగా లేదని, దీనికోసం సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్లు వెల్లడైంది. బల్బీర్ తల్లి మాట్లాడుతూ.. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అందరికీ తెలుసు అని అన్నారు. స్నేహితులు సైతం అతడు ప్రమాదకరమైన వ్యక్తి అని మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. గతంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు సీఐఎస్ఎఫ్ అధికారులకు వివరించినట్లు సమాచారం. గతంలో బొకారోలో విధులు నిర్వర్తించే సమయంలో సైతం బల్బీర్.. ఓ కారు డ్రైవర్ను చంపడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. బల్బీర్ మానసిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా సీఐఎస్ఎఫ్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లనే నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బల్బీర్ జరిపిన కాల్పుల్లో హెడ్ కానిస్టేబుళ్లు బచ్చా శర్మ, అమర్నాథ్ మిశ్రాతో పాటు.. ఏఎస్ఐ జీఎస్ రామ్, హవల్దార్ అరవింద్ రామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
కొత్తపల్లి(మద్దికెర): మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుండాలతండాకు చెందిన సుంకేనాయక్ ఆదివారం సాయంత్రం అత్యాచారం చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొత్తపల్లికి చెందిన యువతి మానసిక వికలాంగురాలు. సుంకేనాయక్ కొత్తపల్లికి కూలీ పనులకు వచ్చి సాయంత్రం తిరిగి వెళ్తుండగా, గ్రామ సమీపంలోని పొలంలో మానసిక వికలాంగురాలు ఒంటరిగా కనబడటంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కొట్టి చంపే యత్నం చేస్తుండగా, కొత్తపల్లి గ్రామస్తులు గమనించి కేకలు వేసుకుంటూ వచ్చేలోగా పారిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రులు, గ్రామస్తులు మద్దికెర పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడు సుంకేనాయక్పై కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ రెడ్డిహుసేన్ విలేకరులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పత్తికొండ సీఐ బి.వి.విక్రంసింహా మద్దికెర పోలీస్స్టేషన్కు వచ్చి బాధితురాలిని, తల్లిదండ్రులను విచారించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
తణుకులో కిడ్నాప్ కలకలం
తణుకు : తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద మంగళవారం మధ్యాహ్నం కిడ్నాప్ కలకలం రేగింది. అక్కడ ఆగి ఉన్న కారులోంచి ఓ మహిళ దూకి పరుగులుపెట్టడం, ఆమె వెంట ఉన్న వారు పట్టుకుని కారులో కూర్చోబెట్టి తాళ్లతో కట్టడాన్ని చూసిన స్థానికులు ఎవరో మహిళను కిడ్నాప్ చేస్తున్నారని భావించి అడ్డగించారు. విషయం ఒక్కసారిగా దావానంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున జనం అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మహిళను, కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. మీడియా ప్రతినిధులు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. అయితే ఆ మహిళకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రి నుంచి తీసుకెళ్తున్న క్రమంలో ఇదంతా జరిగిందని తేలడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మానసిక స్థితి సరిగా లేకే.. నిడదవోలు మండలం తాళ్లపాలెంకు చెందిన ప్రతిమాదేవి తమిళనాడు తంజావూరులో తన కొడుకు సంతోష్ వద్ద ఉంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమాని అయిన ఆమె జయ మరణం తర్వాత మానసిక రోగిగా మారింది. జయలలిత మరణంపై విచారణ చేయించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు గతంలో యత్నించింది. దీంతో ఇటీవల ఆమెను స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చి తిరిగి తీసుకెళ్లే క్రమంలో వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద పండ్లు కొనేందుకు ఆగారు. ఇదే సమయంలో కారు డోరు తీసుకుని మహిళ పారిపోయేందుకు యత్నించడంతో ఆమె అరవడం, కారుపై అన్ని పార్టీలకు చెందిన స్టిక్కర్లు, వాహనంలో తాళ్లు ఉండటంతో స్థానికులకు అనుమానం వచ్చి అడ్డగించారు. దీంతో పోలీసులు వచ్చి ప్రతిమాదేవితోపాటు ఆమెతోపాటు ఉన్న కొడుకు సంతోష్, సోదరి మల్లికాదేవిలను పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. వారిని ఎస్సై జి.శ్రీనివాసరావు విచారించారు. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. -
30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి
-
30 అడుగుల అండర్ డ్రైనేజీలో దూకిన వ్యక్తి
తిరుమల: తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. 30 అడుగుల లోతున్న డ్రైనేజీ మ్యాన్హోల్లోకి అతను దూకేశాడు. రెండు గంటలుగా అతడిని పైకి తీసేందుకు అగ్నిమాపక శాఖ, సెక్యురిటీ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే సహకరించకపోవడంతో అధికారుల ప్రయత్నాలు ఓ కొలిక్కిరావడంలేదు. -
ప్రేమే గెలిచింది..!
శుభం కార్డులు పడేది సినిమాలకే.. జీవితాలకు కాదు. మూడు గంటల పాటు ఏదేదో చూపించి చివరగా ఓ హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం సినిమాలకే సాధ్యమయ్యే విషయం. నిజజీవితంలో ఇలాంటి హ్యాపీ ఎండింగ్లు ఆశించడం కాస్త కష్టమే! కానీ, ఉత్తరప్రదేశ్కు చెందిన తాపేశ్వర్ జీవితానికి మాత్రం సినిమా తరహా శుభం కార్డే పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది నెలల వెతుకులాటకు చక్కని ముగింపు దొరికింది. ఆ కథేంటో మీరూ తెలుసుకోండి..! నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్లోని ధర్మశాలలో తొలిసారిగా బబితను కలిశాడు తాపేశ్వర్. అప్పటికే ఆమె పిచ్చిచూపులు చూస్తోంది. ఎవరో ఏంటో కనుక్కుందామని ప్రయత్నించాడు. మాట కలిపాడు. మాటల్లో భాగంగా అర్థమైంది అతడికి.. ఆమె గతమేంటో.. భవిష్యత్తేంటో..! బబిత మొదట్నుంచీ మానసిక రోగి. ఆరోగ్యస్థితి సరిగా లేకపోవడంతో పిచ్చిపనులు చేస్తూ కుటుంబానికి భారంగా తయారైంది. ఆ భారాన్ని వదిలించుకోవడానికే ఆమె కుటుంబ సభ్యులు ధర్మశాలలో వదిలేసి వెళ్లిపోయారు. ముప్పై ఆరేళ్ల తాపేశ్వర్ మరేం ఆలోచించలేదు. బబితను వెంటబెట్టుకుని తన స్వస్థలమైన మీరట్కు చేరుకున్నాడు. ఆమెను వివాహం చేసుకుని, ఇద్దరూ సరికొత్త జీవితం మొదలుపెట్టారు. ఈ ఏడాది మార్చి వరకూ వరకూ అంతా బాగానే ఉంది. కానీ, ఉన్నట్టుండి బబిత మాయమవ్వడంతో తాపేశ్వర్ కష్టాలు మొదలయ్యాయి. భార్య కోసం ఊరంతా గాలించాడు. ఎక్కడా ఆమె జాడలేదు. పోస్టర్లు అతికించి, ఇంటింటికీ తిరిగి ఆమె ఆచూకీ అడిగాడు. అయినా, ప్రయోజనం లేదు. అప్పటినుంచి తాపేశ్వర్కు సరిగా నిద్రకూడా పట్టేది కాదు. మానసికంగా బలహీనమైన తన భార్య ఎలాంటి పరిస్థితుల్లో ఉందోనని కుమిలిపోయేవాడు. తన జీవనాధారమైన కూలిపనిని కూడా వదిలిపెట్టి, భార్య కోసం సైకిల్పై వెదుకులాట మొదలుపెట్టాడు. అలా దాదాపు ఎనిమిది నెలల పాటు సైకిల్పై తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడికక్కడ అతికించిన పోస్టర్ల ఆధారంగా భార్య ఆచూకీ దొరుకుతుందనేది ఆయన ఆశ. కొన్నాళ్లకు బంధువుల్లో కొందరు బబితను చూశామన్నారు. ఆమెను కొందరు బలవంతంగా వేశ్యాగృహాలకు అమ్మేశారని చెప్పారు. దాంతో రెడ్లైట్ ఏరియాల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆమె ఆనవాళ్లు కనిపించలేదు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాడు. చివరకు ఓ రోజు హరిద్వార్ నుంచి ఓ ఫోన్ అందుకున్నాడు. బబితను గుర్తుపట్టిన ఓ వ్యక్తి, ఆమె భిక్షమెత్తుకుంటోందని తాపేశ్వర్కు సమాచారమిచ్చాడు. రెక్కలు కట్టుకుమరీ వాలిపోయిన ఆయన.. తన భార్య దుస్థితికి కుమిలిపోయాడు. అక్కున దగ్గరకు తీసుకుని గుండెల నిండా హత్తుకున్నాడు. ఆశ చంపుకోకుండా.. పట్టు విడువకుండా తాపేశ్వర్ చేసిన ప్రయత్నం వారి ప్రేమను గెలిపించింది. చివరకు ప్రేమే గెలిచింది!! -
అమ్మ ఒడికి మతిస్థిమితం లేని యువతి
చౌడేపల్లె: అత్యాచారానికి గురైన మతిస్థిమితం లేని తిరుపతికి చెందిన ఓ యువతిని చిత్తూరు అమ్మ ఒడి కేంద్రానికి తరలిస్తున్నట్లు ఐసీడీఎస్ ఏపీడీ నాగశైలజ తెలిపారు. గురువారం ఐసీడీఎస్ సీడీపీవో సరస్వతితో కలిసి ఆమె పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న యువతిని పరామర్శించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి ఆ యువతితో ఆటోడ్రైవర్లు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ యువతిని చిత్తూరు అమ్మ ఒడికి తరలించి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకొంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట ఏసీడీపీవో వాణిశ్రీదేవి, సూపర్వైజర్లు నాగరత్న, మాధవీలత తదితరులున్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం
పెద్దఅడిశర్లపల్లి : పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్ జిల్లా ఐఈ కోఆర్డినేటర్ ఆర్. రవి, ఎంఈఓ వేమారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైకల్యాలను గురించి వారికి వివరించారు. వివిధ రకాల పరికరాలు, శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్ పీఏపల్లి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు కె. మూనా, ఐఈఆర్పీ ఎం. ప్రేమ్సాగర్, ఆర్. రాందాస్, ఎంఐఎస్ జాహంగీర్, ఎల్డీఏ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాన్ని కలిపిన ‘తెలుగు’బంధం
• మతిస్థిమితం లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన సుబ్బాయమ్మ • గోవాలోని వాస్కోడిగామాకు చేరిన మిర్యాలగూడ మహిళ మిర్యాలగూడ: తెలుగు భాషా బంధం ఓ కుటుంబ అనుబంధాన్ని కలిపింది. మతిస్థిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ మహిళ.. 24 రోజుల తర్వాత ‘సాక్షి’ చొరవతో తమ కుటుంబాన్ని కలవబోతోంది. తమ తల్లి గోవాలో ఉందని తెలిసిన వెంటనే పిల్లలు ఆనందంలో మునిగిపోయారు. మిర్యాలగూడ సంతోష్నగర్కు చెందిన యనమల శ్రీనివాస్, సుబ్బాయమ్మ దంపతులు. వీరి పిల్లలు నందిని, జ్యోతి, మణికంఠ. మతిస్థిమితం లేక సుబ్బాయమ్మ గత నెల 20న ఇంటి నుంచి వెళ్లిపోయింది. సమీపంలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి గోవా రాష్ట్రంలోని వాస్కోడిగామాలో దిగింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో స్థానికులు ఆమెను వాస్కోడిగామా పట్టణ మానసిక రోగుల ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో ఉన్న సుబ్బాయమ్మకు తెలివి వచ్చి పది రోజులు అవుతోంది. తన విషయం చెప్పడానికి ఈ ఆస్పత్రిలో ఉన్న వారితో మాట్లాడేందుకు భాష తెలియడం లేదు. తమ బిడ్డలు గుర్తుకు వచ్చిన సుబ్బాయమ్మ కంటనీరు పెడు తోంది. ఆస్పత్రి సర్వెంట్ తెలుగు మహిళ ధనమ్మ గోవాలో పని చేస్తున్న తెలుగువారైన డిఫెన్స్ సిబ్బంది వెంకటాద్రి, నాగరాజులకు విషయాన్ని తెలిపింది. సుబ్బాయమ్మను మిర్యాలగూడకు చేర్చాలని భావించిన వెంకటాద్రి ఖమ్మం జిల్లా మణుగూరులోని తన బంధువు కె.వి. నారాయణకు సమాచారం ఇచ్చారు. దాంతో నారాయణ ‘సాక్షి’కి సమాచారం ఇచ్చారు. కాగా సాక్షి విలేకరి మిర్యాలగూడలోని సుబ్బాయమ్మ ఇంటికి వెళ్లి ఆమె భర్త శ్రీనివాస్కు, పిల్లలకు సమాచారం ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. సొంతింటికి చేర్చాలనుకున్నాం సుబ్బాయమ్మ వాస్కోడిగామలోని మానసిక ఆస్పత్రిలో ఉంది. తెలివి రావడం వల్ల ధనమ్మకు ఇచ్చిన సమాచారం మేరకు ఆమెను మిర్యాలగూడకు పంపాలని తీవ్ర ప్రయత్నం చేశాము. ఆమె బిడ్డల కోసం పడుతున్న వేదన చూసి చలించిపోయాము. చివరికి ఆమెను సొంత గ్రామానికి పంపుతున్నామని సంతృప్తిగా ఉంది. - వెంకటాద్రి, డిఫెన్స్ సిబ్బంది, గోవా ‘సాక్షి’ కి సమాచారం ఇచ్చాను మిర్యాలగూడ మహిళ సుబ్బాయమ్మ మతి స్థిమితం లేక గోవాకు చేరిందని తెలిసింది. దాంతో ‘సాక్షి’కి విషయం చెప్పాను. సుబ్బాయమ్మ సమాచారం తెలిపి ఒక కుటుంబాన్ని కలపడం ఆనందంగా ఉంది. - కేవీ. నారాయణ, ఖమ్మం -
మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. చెన్నారావుపేట: మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని గురిజాల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై పులి వెంకట్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచెపు పవన్ అనే సుతారి మేస్త్రీ ఇదే గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలి(19)పై 10 రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎక్కడైనా చెపితే చంపేస్తానని బెదిరించడంతో యువతి ఎవరికీ చెప్పలేదు. గురువారం ఆమె అమ్మమ్మ దౌడు లచ్చమ్మకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి
ఆలస్యంగా వెలుగులోకి.. చెన్నారావుపేట: మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని గురిజాల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై పులి వెంకట్గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచెపు పవన్ అనే సుతారి మేస్త్రీ ఇదే గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలి(19)పై 10 రోజుల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం ఎక్కడైనా చెపితే చంపేస్తానని బెదిరించడంతో యువతి ఎవరికీ చెప్పలేదు. గురువారం ఆమె అమ్మమ్మ దౌడు లచ్చమ్మకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మానసిక వికలాంగురాలికి విదేశీయుల చేయూత
చండ్రాయనిపల్లి(బుక్కపట్నం): మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు. గ్రామానికి చెందిన రామాంజనమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి పక్కనే ఉన్న తరుగువాండ్లపల్లికి చెందిన వ్యక్తి కావటంతో విషయం తెలుసుకొని తన వంతుగా చేయూతనిందిస్తూ గ్రీసు దేశానికి చెందిన సత్యసాయి భక్తుడు డిబిలీయస్ సహకారంతో సుమారు లక్ష రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో రూ.10 వేలు చెన్నకృష్ణారెడ్డి వాటాగా విరాళం అందించారు. ఆదివారం గ్రీసు దేశస్తుడు గ్రామానికి వచ్చారు. ఆయనకు ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విదేశీయులు చేయూతనిందించేందుకు కృషి చేసిన చెన్నకృష్ణారెడ్డికి రామాం జనమ్మ తండ్రి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
బాలికపై లైంగికదాడికి యత్నం
పమిడిముక్కల : మానసిక వికలాంగురాలైన బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ఈ ఘటన మండలంలోని ఐనపూరు దళితవాడలో జరిగింది. పోలీ సుల తెలిపిన వివరాల ప్రకారం ఐనపూరు దళితవాడకు చెందిన దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె మానసిక వికలాంగురాలు కావడంతో ఇంటివద్ద ఉంచి వారు ఇరువురు కూలీ పనులకు వెళుతున్నారు. శుక్రవారం కూడా పనులకు వెళ్లారు. సమీపంలో నివాసముండే చీలి నీలాంబరం (34) ఇంట్లో ఎవరూలేని సమయంలో వెళ్లి బాలికను (11) తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో బాలికను ఇంట్లోంచి బయటకు పంపిం చి వేశాడు. మధ్యాహ్నం 3 గంటలకు పొలం నుంచి ఇంటికి వచ్చిన దంపతులకు స్థాని కులు జరిగిన విషయం చెప్పారు. కుమార్తెను అడుగగా నీలాం బరం అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సైగల ద్వారా చెప్పింది. తమ కుమార్తెపై అత్యాచారయత్నం, అస భ్య ప్రవర్తనకు పాల్పడిన చీలి నీలాం బరంపై తగు చర్యలు తీసుకోవాలని తల్లి శనివారం పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేసింది. సీఐ సత్యన్నారాయణ, ఎస్ఐ శ్రీనివాస్లు ఐనపూరు వెళ్లి విచారణ జరిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో..
= మృత ఆడశిశువుకు జన్మనిచ్చిన మతిస్థిమితం లేని మహిళ = రోడ్డు పక్కన వదిలి వెళ్లిన వృద్ధురాలు = మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు ప్రకాశం జిల్లా : ఏ ప్రబుద్ధుడు కాపురం చేసి, వొదిలేశాడో.. ఏ మృగాడి కామవాంఛకు బలి పశువుగా మారిందో.. తెలియదు..కానీ ఓ మతి స్థిమితం లేని మహిళ గర్భం దాల్చింది. నడిబజారులో నిస్సహాయస్థితిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళను గుర్తు తెలియని వృద్ధురాలు చూసింది. మానవత్వంతో సమీపంలోని వైద్యశాలకు చేర్చింది. ఆస్పత్రిలో ఆ అభాగ్యురాలు మృత శిశువుకు జన్మనిచ్చింది. మహిళకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును రోడ్డు పక్కన వొదిలేసి వెళ్లింది. ఈ సంఘటన యర్రగొండపాలెం పట్టణంలో ఆదివారం రాత్రి జరిగింది. ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం ప్రాంతానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ (కోట్ల ఎస్తేరు) కొద్దిరోజుల క్రితం యర్రగొండపాలెం చేరింది. అప్పటి నుంచి పట్టణంలో యాచన చేస్తూ జీవిస్తోంది. ఎస్తేరుకు నెలలు నిండటంతో వృద్ధురాలి సాయంతో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరింది. అర్ధరాత్రి సమయంలో నొప్పులు రావడంతో డ్యూటీలో ఉన్న నర్స్, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్కు సమాచారం అందించారు. బిడ్డ అడ్డం తిరగడంతో డాక్టర్ చంద్రశేఖర్ వైద్యసహాయం అందించారు. దీంతో తల్లి మృతశిశువు(ఆడ)కు జన్మనిచ్చి తాను ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎస్తేరుకు తోడుగా వచ్చిన వృద్ధురాలు మృతశిశువును అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన వొదిలి వెళ్లింది. సోమవారం ఉదయం రోడ్డు పక్కన పడి ఉన్న మృతశిశువును గమనించిన కొందరు ఎస్సై ఎం.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఎస్సై ఆదేశాల మేరకు ఏఎస్సై షేక్ రఫీ ఉద్దీన్ శువును పరిశీలించారు. అనంతరం వైద్యశాలలోనే ఉన్న ఎస్తేరు ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వక పోవడంతో వైద్యాధికారి చంద్రశేఖర్ను విచారించారు. అనంతరం కొంత సమయం వేచి చూసిన పోలీసులు, మహిళ తరుపు బంధువులు ఎవరూ రాక పోవడంతో మృతశిశువును ఖననం చేశారు. -
11ఏళ్ల తర్వాత సొంత గూటికి..
తిరిగి ఇంటికి చేరిన మతిస్థిమితం లేని వ్యక్తి చౌటుప్పల్: మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయటికెళ్లిన ఓ వ్యక్తి 11ఏళ్లకు మళ్లీ సొంత గూటికి చేరాడు. మహబూబ్నగర్ జిల్లా కేశంపేట మండలం ఇప్పలపల్లికి చెందిన మాసారం రామచంద్రయ్య మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నల్లగొండలో 2011లో జరిగిన పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈయనను అమ్మానాన్న అనాథాశ్రమం నిర్వాహకులకు అప్పగించారు. ఆశ్రమ నిర్వాహకులు ఐదేళ్లుగా ఎర్రగడ్డలో చికిత్స చేయించారు. కోలుకున్న రామచంద్రయ్య తన చిరునామా చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ ఖాజా సమక్షంలో రామచంద్రయ్యను భార్య కాళమ్మ, తల్లి జంగమ్మలకు అప్పగించారు. -
'వాళ్లెవరూ మెట్రో రైల్లో ఎక్కకూడదు'
ఢిల్లీ మెట్రో రైలు అధికారులు పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మానసిక ఆరోగ్యం బాగోలేనివాళ్లు, కొన్ని రకాల వ్యాధులతో బాదపడేవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని చెప్పారు. కుష్టువ్యాధి ఉన్నవాళ్లు ఆ వ్యాధి ఎవరికీ అంటుకోదని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్తో సర్టిఫికెట్ తెచ్చిన తర్వాత మాత్రమే మెట్రో రైలు ఎక్కాలని చెప్పారు. ఈ నిబంధనలతో కూడిన పోస్టర్లను ఢిల్లీ మెట్రో పలుచోట్ల అతికించింది. అంటువ్యాధులు ఉన్నవాళ్లు తమ రైళ్లలో ఎక్కకూడదని స్పష్టం చేసింది. సెరెబ్రో స్పైనల్ మెనింజైటిస్, చికెన్ పాక్స్, డిఫ్తీరియా, మంప్స్, టైఫస్, దగ్గు, కలరా, మీజిల్స్, స్కార్లెట్ జ్వరం, టైఫాయిడ్, టీబీ.. ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్లు రైళ్లు ఎక్కడానికి వీల్లేదని తెలిపింది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థ ఈ ఆదేశాలను తీవ్రంగా విమర్శించింది. ఇది చాలా వివక్షాపూరితమని, ఢిల్లీ మెట్రో తీరును బయటపెడుతోందని మానస్ ఫౌండేషన్ ట్రస్టీ, సైకాలజిస్టు అయిన నవీన్ కుమార్ అన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని, సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకూడా ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే, ఇన్నీ ఢిల్లీ మెట్రో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం ఎప్పటి నుంచో ఉన్న నిబంధనలేనని, కొత్తగా వేటినీ సృష్టించలేదని మెట్రో అధికారి ఒకరు చెప్పారు. -
మానసిక వికలాంగురాలిపై వీఆర్ఓ గ్యాంగ్రేప్
మానసిక విలాంగురాలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో వీఆర్ఓతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో మార్చిలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముచ్చింతల్ గ్రామానికి చెందిన ఓ యువతి (23) ఇంటి వద్దనే ఉంటుంది. అయితే పొరుగింటికి చెందిన వీఆర్వో చంద్రమోహన్తో పాటు అదే గ్రామానికి చెందిన మహేందర్, శేఖర్, ఓ తోటలో పనిచేసే జిత్తు తనపై అత్యాచారం చేశారని యువతి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. మార్చి నెలలో చంద్రమోహన్ తన ఇంట్లోకి పిలువగా నలుగురూ కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం స్నానం చేయించి తనను బయటకు పంపేశారని పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానితులను అదే రోజు ఠాణాకు పిలిపించి విచారించారు. బాధితురాలి నుంచి ఆదివారం సాయంత్రం వరకు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదూ అందకపోవడంతో పోలీసులు దర్యాప్తును కొనసాగించలేదు. మరోసారి బాధితురాలు ఆదివారం స్టేషన్కు రాగా.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అట్రాసిటీ, అత్యాచారం కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ ఉమామహేశ్వర్రావు తెలియజేశారు. బాధితురాలికి మతిస్థిమితం సరిగా లేదని, ఆమె మానసిక విలాంగురాలని పోలీసులు అన్నారు. -
ఆ గ్రామాల్లో అంతా పిచ్చివాళ్లే!
జకార్త: ఇండోనేసియాలోని సిడోహార్జో, కరంగ్పటిహాన్, క్రెబెట్, పొనొరోగో గ్రామాలను సందర్శించాలంటే ఎవరికైనా భయమేస్తుంది. బాధేస్తుంది. గుండె బరువెక్కి మనసు మొద్దుబారుతుంది. ప్రపంచంలోకెల్లా పిచ్చివాళ్లు ఎక్కువగా ఉంది ఈ గ్రామాల్లోనే. దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో బతుకుతున్న పిచ్చివాళ్లను చూస్తుంటే ఎవరికైనా మనసు వికలమవుతుంది. పదేళ్ల పిల్లల నుంచి యాభై ఏళ్ల పెద్దవాళ్లు పిచ్చితో బాధ పడుతున్నారు. దగ్గరి రక్త సంబంధీకులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, పౌష్ఠికాహారలోపం, ఐయోడన్ లోపంతో ఈ గ్రామాల్లో ఎక్కువ మంది పిచ్చివాళ్లు అవుతున్నారని వైద్యులు తెలియజేస్తున్నారు. అసలు ఇండోనేషియాలోనే ఎక్కువ మంది పిచ్చివాళ్లు ఉన్నారు. మొత్తం దేశంలో 25 కోట్ల మంది జనాభా ఉండగా, వారిలో 1.40 కోట్ల మంది మానసిక వ్యాధితో బాధ పడుతున్నారని మానవ హక్కుల సంఘం ఓ నివేదికలో వెల్లడించింది. వారి దుర్భర పరిస్థితులపై ‘లివింగ్ ఇన్ హెల్’ పేరిట మానవ హక్కుల సంఘం 74 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది. దేశంలో చాలినన్ని పిచ్చాస్పత్రులు కూడా లేవు. దేశం మొత్తం మీద కేవలం 48 ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. సిడోహార్జో, కరంగ్పటిహాన్ లాంటి గ్రామాల ప్రజలు పిచ్చివాళ్లను ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన సందర్భాలు కూడా లేవు. ఎందుకంటే వీరికి మూఢనమ్మకాలు ఎక్కువ. చేతబడి చేస్తామన్న వారివద్దకే వెళతారు. అందుకని ఎవరికి పిచ్చి తగ్గిన సందర్భాలు కూడా కనిపించవు. పిచ్చితోపాటు చాలామందిలో కళ్లు కనిపించవు. చెవులు వినిపించవు. ఇక వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పిచ్చి చేష్టలు ఎక్కువైతే గొలుసులతో గోడలకు, మంచాలకు కట్టేస్తున్నారు. మరీ పిచ్చి ముదురి హింసాత్మకంగా వ్యవహరించే వారిని ఇనుప బోనుల్లో బంధిస్తున్నారు. పిచ్చి వారిని ఎవరిని కూడా గొలుసులతో కట్టివేయరాదంటూ ఇండోనేసియా 1977లో చట్టం తీసుకొచ్చింది. అయినా ఎవరు చట్టాన్ని పాటించడం లేదు. దేశంలో దాదాపు 19వేల మంది పిచ్చివాళ్లను గొలుసులతో కట్టేసి ఉంచినట్లు మానవ హక్కుల నివేదిక వెల్లడించింది. ప్రభుత్వమే కాకుండా ఎన్జీవో సంస్థలు కూడా ఈ గ్రామాల ప్రజల్లో చైతన్యం తీసుకరావడానికి కృషి చేయాల్సిందిగా ఆ నివేదిక పిలుపునిచ్చింది. -
చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించింది
కాన్పూర్: ఉత్తరప్రదేశ్లో ఓ వధువు చివరి నిమిషంలో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. వరుడి మానసిక పరిస్థితి నిలకడగా లేదన్న విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పెళ్లిపీటల మీదే వివాహం ఆగిపోయింది. కాన్పూర్లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పీజీ చదివిన వధువుకు ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఇందుకు తగిన ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి రోజున వరుడి ప్రవర్తన సాధారణంగా లేదని గ్రహించిన వధువు స్నేహితులు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. వధువు కూడా వరుడి పరిస్థితిని గమనించి, అతని మానసిక పరిస్థితి సరిగాలేదని నిర్ధారణకు వచ్చింది. దీంతో అతణ్ని వివాహం చేసుకునేందుకు నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అంగీకరించలేదు. వరుడి బంధువులు గొడవకు దిగడంతో పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. -
12 మంది పిల్లలకు పశువుల ఇంజక్షన్
కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఘటన కోలారు: మానసిక వ్యాధిగ్రస్తురాలైన ఓ మైనర్ బాలిక 12 మంది పిల్లలకు పశువులకు వేసే మందుతో ఇంజక్షన్ చేయగా బాధితులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకా నక్కలగుడ్డ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. శ్రీనివాసపురం తాలూకా మరంపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక శైలజ నక్కలగుడ్డకు చేరుకొని తాను నర్సునని, పల్స్ పోలియో తర్వాత పిల్లలకు ఇంజక్షన్ చేసేందుకు గౌనిపల్లి పీహెచ్సీ వైద్యులు తనను పంపారని స్థానికులకు తెలిపింది. అనంతరం 12 మంది పిల్లలకు పశువులకు వేసే మెలాక్సికోం అనే మందులతో ఇంజక్షన్ చేసింది. కొంత సేపటికి పిల్లలు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కోలారు ఆర్ ఎల్ జాలప్ప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు శైలజ(13)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా.. ఆ బాలికకొంత కాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్నట్లు తేలింది. -
మతిస్థిమితంలేని మహిళపై లైంగిక దాడి
పనాజీ: పదహారేళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని ఓ మహిళ(21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 'మంగళవారం ఉదయం తమ ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి పదహారేళ్ల బాలుడు వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో మతిస్థిమితం లేని మహిళ ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారం చేశాడు' అని చెప్పారు. పనాజీలోని జువెనైల్ హోంలో ఆ యువకుడిని పెట్టినట్లు పోలీసులు తెలిపారు. -
చిన్నారి కళ్లు పొడిచి చంపిన సవతి తల్లి
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఆరేళ్ల చిన్నారిని సవతి తల్లి దారుణంగా హింసించి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పదంగా మరణించిన పాప మృతదేహాన్ని గుర్తించిన పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒళ్లంతా తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న పాయల్ రాజేష్ సావంత్(6) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి హత్యకు గురైన తీరు చూసి పోలీసులు సైతం నివ్వెర పోయారు. ఐరన్ రాడ్లతో కొట్టడం, బ్లేడుతో కోయడం, గుండుపిన్నులతో గుచ్చడం లాంటి చిత్ర హింసలతోపాటుగా, అతి దారుణంగా పాప రెండు కళ్లు పదునైన ఆయుధంతో ఛిద్రం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించిన పోలీసులు సవతి తల్లి ప్రతిభను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా చేయగా, వారం రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కాగా ఆటోడ్రైవర్ గా జీవనం సాగిస్తున్న రాజేష్ మొదటి భార్య ...ఇద్దరు ఆడపిల్లలు పాయల్, మయూరిని భర్త వద్దే వదలిపెట్టి 2011లో వెళ్లిపోయింది. దీంతో రాజేష్ 2013లో ప్రతిభను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే మానసిక వికలాంగురాలైన పాయల్ ని నిత్యం వేధిస్తూ , చివరకు తీవ్రంగా కొట్టి, గొంతు నులిమి హత్య చేసింది. కాగా పోలీసుల విచారణలో ప్రతిభ నేరాన్ని అంగీకరించింది. -
ఆపరేషన్ పునర్జన్మ
-
యువతిపై అత్యాచారయత్నం
కరీంనగర్ : మానసికస్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. యువతి సోదరి చూడడంతో ఆమె వారి చెర నుంచి బయటపడింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాగర్, నరేష్ న్యూమారేడు పాక గ్రామానికి చెందిన మతిస్థిమితంలేని యువతిని బైక్పై ఎక్కించుకుని తీసుకెళుతుండగా యువతి సోదరి చూసి కేకలు పెట్టింది. స్థానికులు వారిని అడ్డగించగా నరేష్ పరారయ్యాడు. సాగర్ దొరకడంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం
యాలాల (రంగారెడ్డి) : ఓ మతిస్థిమితం లేని బాలికపై దుండగులు పైశాచికత్వానికి పాల్పడ్డారు. ఆమెకు మాయ మాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని అచ్యుతాపురం నివాసి అయిన ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
ఇంటిమసీ తగ్గితే... జీవితం మసి!
మ్యారేజ్ కౌన్సెలింగ్ దూరం పెరిగితే ఏ బంధం అయినా దగ్గరవుతుంది. కానీ దాంపత్యబంధం అలాక్కాదు. భార్యాభర్తలు నిరంతరం దగ్గరగా ఉండాలి. ఉద్యోగరీత్యా దూరంగా ఉండవలసి వచ్చినా... మానసికంగా దగ్గరగా ఉండే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అర్థం చేసుకుంటారులే అనుకుని ఊరుకుంటే... అపార్థాలు రావచ్చు. అనుమానాలు తలెత్తవచ్చు. చివరికి జీవితమే అర్ధరహితంగా అనిపించవచ్చు. మాకు పెళ్లయి 15 ఏళ్లవుతోంది. ముగ్గురు పిల్లలు. నాది మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం. క్యాంప్స్ ఎక్కువగా తిరుగుతుంటాను. నేను లేని సమయంలో నా భార్య మా పక్కింటాయనతో అక్రమ సంబంధం పెట్టుకుని, పిల్లల్ని ఒంటరిగా వదిలేసి అతనితో ఊళ్లు తిరగడం, ఉన్న ఊళ్లో సినిమాలు, షికార్లు చేయడం మొదలుపెట్టింది. అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, నన్ను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆమె ప్రవర్తనను గమనించిన వారు, చుట్టాలు, స్నేహితులు ఆమె గురించి నన్ను హెచ్చరిస్తుంటే సమాజంలో ఎంతో అవమానంగా, చిన్నతనంగా ఉంది. ఇక నా ముగ్గురు పిల్లల బాధ చెప్పనలవి కాదు. ఇటీవల ఆవిడ పిల్లల్ని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ప్రస్తుతం మా అమ్మే పిల్లల బాగోగులు చూస్తోంది. నేను విడాకులకు దరఖాస్తుచేయాలను కుంటున్నాను. సలహా చెప్పగలరు. - సుందరయ్య, శాంతినగర్ మీరు మీ భార్యకున్న క్రూయల్టీ ఇల్లిసిట్ ఇంటిమసీ అంటే అక్రమ సంబంధాన్ని కారణంగా చూపుతూ డివోర్స్కు ఫైల్ చేయవచ్చు. దానితోపాటు పిల్లల్ని పట్టించుకోవడం లేదని, సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఇంకా పైన చెప్పిన అన్ని కారణాలు చూపుతూ, ఆమె అక్రమ సంబంధానికి అన్ని సాక్ష్యాలు, ఆధారాలు కోర్టులో ఫైల్ చేస్తూ విడాకులకు దరఖాస్తు చేయండి. మీ వైపు సాక్ష్యాలూ, ఆధారాలూ అన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టువారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని, మీకు వెంటనే విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది. తీర్పు చెప్పే సమయంలో పిల్లల అభిప్రాయాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుం టుంది. ఆమె కూడా విడాకులకు సిద్ధంగా ఉందంటున్నారు కాబట్టి మీకు సులభంగానే విడాకులు రావొచ్చు. లేదా ఇద్దరు కలిసి పరస్పర అంగీకారంతో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఫైల్ చేసి విడాకులు పొందవచ్చు. మీకిది ఇష్టం లేకపోతే పైన చెప్పినట్లు క్రూయల్టీ కింద అయినా విడాకులకు ఫైల్ చేసి ఆర్డర్ పొందవచ్చు. ప్రయత్నించి చూడండి. మాకు పెళ్లయి 8 ఏళ్లయింది. ఇద్దరు పిల్లలు. ఆయనది బంగారంలాంటి ప్రభుత్వోద్యోగం. అయితే నా భర్తకు లేని చెడ్డ అలవాట్లు లేవు. తాగుబోతు. తిరుగుబోతు. దీనికి తోడు మాదక ద్రవ్యాలకు కూడా బానిస అయ్యాడు. తన దురలవాట్ల మూలంగా విధులకు గైర్హాజరవుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉన్నతోద్యోగులు ఈయన్ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.దాంతో మరింత రెచ్చిపోయి రోజూ తాగొచ్చి ఇంట్లో నన్ను, పిల్లల్ని కొట్టడం, ఇంటిని నరకం చేయడమే తన దినచర్యగా మార్చుకున్నాడు. ఖర్చుల కోసం నా ఒంటిమీదున్న బంగారంతో సహా ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నింటినీ అమ్మేశాడు. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్ను కావడంతో నాకొచ్చే జీతంతో పిల్లల్ని పోషిస్తూ కష్టపడి చదివించుకుంటున్నాను. ఇక ఇతనితో జీవించడం దుర్లభం అని నిశ్చయించుకున్నాను. నేను విడాకులకు అప్లై చేసుకోవచ్చా? విడాకులు వస్తాయా? - క్రిస్టినా, హైదరాబాద్ మీ భర్త మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా హింస పెట్టడాన్ని గురించి కోర్టుకు తెలియజేస్తూ విడాకులకు దరఖాస్తు చేయవచ్చు. క్రూయల్టీ గ్రౌండ్స్ కింద మీకు విడాకులు మంజూరవుతాయి. అయితే మీరు పైన చెప్పిన కారణాలన్నింటినీ సాక్ష్యాలతో కోర్టులో నిరూపించగలగాలి. మీరెలాగూ ప్రభుత్యోద్యోగి కాబట్టి మీకు, పిల్లలకు మెయింటినెన్స్ ఎలాగూ వద్దంటున్నారు కాబట్టి, అతన్నుండి మీరు పర్మినెంట్ కాంపన్సేషన్ (భరణం)గానీ, మెయింటినెన్స్గానీ కోరుకోవట్లేదు కాబట్టి క్రూరత్వం కింద డివోర్స్ గ్రాంట్ అవుతాయి. మీరు ఇక ప్రశాంతంగా పిల్లలతో గడపండి. -
కాల్పుల కలకలం
మతి స్థిమితం లేని ఖైదీ వీరంగం బెంగళూరు: మానసిక వికలాంగుడైన ఓ విచారణ ఖైదీ నగరంలోని ప్రముఖ వైద్య విద్యా సంస్థ నిమ్హాన్స్లో జరిపిన కాల్పులు పోలీసు శాఖ మొత్తాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్యకేసులో నిందితుడైన రౌడీ షీటర్ విశ్వనాథ్ మతి స్థిమితం లేని కారణంగా మూడేళ్ల నుంచి నగరంలోని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకోసం తరచుగా నిమ్హాన్స్కు తీసుకొచ్చి తరువాత అతన్ని జైలుకు తరలించేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం సైతం అతన్ని నిమ్హాన్స్ ఆస్పత్రికి జైలు అధికారులు తీసుకొచ్చారు. చికిత్స సమయంలో తాను మూత్రవిసర్జనకు వెళ్లాలని అధికారులను విశ్వనాథ్ కోరాడు. వారు సమ్మతించడంతో భద్రతా సిబ్బంది విశ్రాంతి తీసుకునే గది నుంచి వెళుతున్న విశ్వనాథ్ ఒక్కసారి నియంత్రణ కోల్పోయాడు. అక్కడున్న ఒక 303 ఎస్ఎల్ఆర్ రైఫిల్ను తీసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గది నుంచి బయటికి వచ్చి ఆ గదికి బయట తాళం వేసేశారు. దీంతో గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ రైఫిల్తో విశ్వనాథ్ గాల్లోకి కాల్పులు జరిపాడు. సుమారు పది నిమిషాల పాటు సాగిన కాల్పులతో నిమ్హాన్స్ వైద్యులతోపాటు అక్కడున్న రోగులు, వారి బంధువులు తీవ్ర ఆందోళనకు గురై పరుగులు తీశారు. మొత్తం 23 రౌండ్ల కాల్పులు జరిపిన అనంతరం విశ్వనాథ్ కాసేపు కాల్పులను ఆపేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న అధికారులు విశ్వనాథ్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. ‘మీ అమ్మను ఇక్కడకు తీసుకువస్తాం, కాల్పులు జరపకు విశ్వా’ అని సెక్యూరిటీలో ఉన్న హెడ్కానిస్టేబుల్ చెప్పినప్పటికీ వారి మాటలను విశ్వనాథ్ వినిపించుకోలేదు. అయినా కూడా పోలీసులు విశ్వనాథ్ తల్లి భాగ్యమ్మను అక్కడకు తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఇక విశ్వనాథ్ కదలికలను అదే గదిలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా గమనించిన అధికారులు అతన్ని ఎలాగైనా అదుపులోకి తీసుకునేందుకు గరుడా ఫోర్స్ సహాయాన్ని తీసుకున్నారు. రంగంలోకి దిగిన గరుడా ఫోర్స్లోని 30 మంది సభ్యులు ‘ఆపరేషన్ విశ్వనాథ్’ను ప్రారంభించారు. ముందుగా టియర్గ్యాస్ ప్రయోగించాలని భావించిన ప్పటికీ అత ను నియంత్రణ కోల్పోతుండడంతో గరుడా ఫోర్స్లోని సభ్యులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ తూటా విశ్వనాథ్ గుండెకు దగ్గరగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తక్షణమే ఆ గదిలోకి చేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని నిమ్హాన్స్ నుంచి పక్కనే ఉన్న మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గమధ్యంలోనే విశ్వనాథ్ మృతి చెందాడు. ‘ఆపరేషన్ విశ్వనాథ్’ అనంతరం మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ ధీన్ని ధ్రువీకరించారు. -
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
వరంగల్ (నర్మెట్ట) : మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిగిన ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. నర్మెట్ట మండలం బొత్తలపర్రి గ్రామానికి చెందిన ఓ యువతికి ఈ నెల 8 వ తేదీన కడుపు నొప్పి రావటంతో తల్లిదండ్రులు స్థానిక ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆర్ఎంపీ ఆమె 6 నెలల గర్భవతి అని తేల్చాడు. నమ్మలేని ఆ తల్లిదండ్రులు ఆర్ఎంపీ డాక్టర్కేమీ తెలియదులే అని ఊరుకున్నారు. ఎందుకైనా మంచిదని ఆ మరుసటి రోజు పెద్దాసుపత్రికి తీసుకెళ్లి మళ్లీ పరీక్షలు చేయించారు. వారు కూడా మీ అమ్మాయి గర్భవతి అని చెప్పడంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ఈ విషయం గురించి ఆరా తీయగా గ్రామానికి చెందిన ముడికె సంజీవ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఆ యువతికి జరిగిన విషయం ఇన్ని రోజులూ తెలియలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు సంజీవ పరారీలో ఉన్నాడు. -
తల్లి, భార్యను హత్య చేసిన మానసికరోగి
లక్నో: మానసిక స్థితి నిలకడలేని వ్యక్తి తల్లి, భార్యను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర ప్రాంతంలోని సవారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. సంతోష్ కుమార్ దుబె అనే వ్యక్తి కర్రెతో తల్లి ప్రాణమతి (60), భార్య సంగీతను బాదాడు. ప్రాణమతి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన సంగీత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సంతోష్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తల్లి, భార్య, కూతుర్లను నరికి చంపాడు
అనంతపురం(కంబదూరు): కంబదూరు మండలం నూతిమడుగులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. సోమశేఖర్(40) అనే మతిస్థిమితం లేని వ్యక్తి తల్లి, భార్యా, కుమార్తెలను పాశవికంగా నరికి చంపాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి నర్సమ్మ(54), భార్య రామాంజమ్మ(34), కుమార్తె చిన్ను(4) అక్కడిక్కడే మరణించారు.ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి
కూనవరం : మతిస్థిమితం లేని మహిళపై ఓ ప్రబుద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మండలంలోని వెంకటాయపాలెంలో మంగళవారం జరిగింది. ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బేతి శ్రీను అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మహిళ సోదరి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదు చేశామని, నిందితుని బుధవారం రిమాండ్కు పంపనున్నామని ఎస్సై తెలిపారు. -
మతిస్థిమితంలేని యువతి ఆత్మహత్య
పుట్టపర్తి (అనంతపురం జిల్లా): మతిస్థిమితంలేని ఒక యువతి ప్రమాదవశాత్తు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం కప్పలబండ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం..కప్పలబండ గ్రామానికి చెందిన చిన నర్సింహుడు, వెంకటమ్మ దంపతుల కుమార్తె సాయిలీల(22) చిన్నతనంలోనే మతిస్థిమితం కోల్పోయింది. కాగా గురువారం గ్రామంలో తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ క్రమంలోనే బాధను తట్టుకోలేక పరుగులు తీసి పక్కనే ఉన్న పాకలోకి వెళ్లింది. దీంతో పాకకు నిప్పంటుకుంది. విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కానీ ఆ యువతి మంటల్లోనే మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.