పదహారేళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని ఓ మహిళ(21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
పనాజీ: పదహారేళ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. మతిస్థిమితం లేని ఓ మహిళ(21)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 'మంగళవారం ఉదయం తమ ఇంటికి పక్కనే ఉన్న మరో ఇంట్లోకి పదహారేళ్ల బాలుడు వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో మతిస్థిమితం లేని మహిళ ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారం చేశాడు' అని చెప్పారు. పనాజీలోని జువెనైల్ హోంలో ఆ యువకుడిని పెట్టినట్లు పోలీసులు తెలిపారు.