Tumakuru
-
క్యాన్లో పెట్రోల్ పోయించుకుంటూ ఉండగా ఒక్కసారిగా మంటలు
-
దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..
బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. PM Shri @narendramodi dedicates HAL helicopter factory to the nation in Tumakuru, Karnataka. pic.twitter.com/dqAZMsJXnI — BJP (@BJP4India) February 6, 2023 మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం
సాక్షి, తుమకూరు: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తుమకూరు జిల్లాలో పర్యటించనుండగా ఆయన కోసం అపురూపమైన హారం, తల పేటా సిద్ధమయ్యాయి. జిల్లా వ్యవసాయ సంస్కృతికి అద్దం పట్టేలా వక్కలతో తీర్చిదిద్దిన హారం, పేటా సిద్ధమయ్యాయి. జిల్లాలో వక్క, టెంకాయ తోటలు విస్తారంగా ఉండడం తెలిసిందే. నేడు ప్రధాని మోదీ పర్యటన శివాజీనగర: ప్రధాని నరేంద్రమోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం బెంగళూరుకు వస్తున్నారు. నెల రోజుల్లో మోదీ రావడం ఇది మూడవసారి. ప్రత్యేక విమానంలోఉదయం 8.20 గంటల సమయంలో డిల్లీ నుంచి బయలుదేరి 11 గంటలకు బెంగళూరుకు చేరుకొంటారు. నగరంలో జరిగే భారత ఇంధన వారోత్సవాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తుమకూరు జిల్లాకు వెళ్తారు. (చదవండి: ఎన్ఐఏ చేతికి ‘ఉగ్ర త్రయం’ కేసు ) -
శభాష్ డ్రైవరన్న.. చెరువులో మునిగిపోతున్న బాలికలను రక్షించి..
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
అనాథలమని ఆవేదన చెంది.. ముగ్గురు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య..
సాక్షి, బెంగళూరు: తమకు ఎవరూ లేరనే ఆవేదనతో ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘోరం కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా బరకనహాల్ తాండాలో గురువారం వెలుగుచూసింది. అక్కాచెల్లెల్లైన రంజిత924), బిందు(21),చందన(18)ల తల్లిదండ్రులు చాలా ఏళ్ల కిందటే మరణించారు. వీరిని అమ్మమ్మ పోషిస్తోంది. ఆమె కూడా మూడు నెలల క్రితం మరణించడంతో ముగ్గురూ కుంగిపోయారు. తాము అనాథలం అయిపోయామని బాధపడేవారు. రంజిత, బిందు ఓ గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. చందన పీయూసీ చదువుతోంది. 9 రోజుల నుంచి ముగ్గురూ ఇంటి నుంచి బయటకు రాలేదు. గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు విషయాన్ని తెలిపారు. వారు వచ్చి ఇంటి పైకప్పు తీసి పరిశీలించగా ముగ్గురూ ఉరివేసుకున్నట్లు కనిపించారు. మృతదేహాలు కుళ్లిపోవడంతో వాటిని చిక్కనాయకనహళ్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్గానికి తరలించారు. చదవండి: నిబంధనలకు ‘నిప్పు’.. ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలు -
కర్నాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. బీజేపీ ప్రభుత్వమే కారణమా?
కర్నాటకకు చెందిన మరో కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులకు బిల్లులు క్లియర్ కాకపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కాంట్రాక్టర్ ఆత్మహత్య సందర్భంగా తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉండటం గమనార్హం. వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టీఎన్ ప్రసాద్(50) ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి బిల్లులు క్లియర్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ కింద రూ.16 కోట్ల విలువైన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ ప్రసాద్ చేపట్టారు. అయితే బిల్లుల బకాయిలను ప్రభుత్వం క్లియర్ చేయకపోవడంతో అప్పులపాలయ్యాడు. దీంతో, అప్పులు చెల్లించకలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదంటూ సూసైడ్ నోట్లో ఉందని చెప్పారు. మరోవైపు.. ప్రసాద్ మృతిపై కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని బలరాం చెప్పుకొచ్చారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని తెలిపారు. బిల్లుల క్లియరెన్స్లో ఆలస్యం వల్ల తాను మనోవేదనకు గురవుతున్నట్టు తనతో చర్చించినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో కర్నాటకలోని బీజేపీ సర్కార్పై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు పాస్ కావంటూ కొందరు కాంట్రాక్టర్లతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. -
పొలిటికల్ పార్టీపై మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి క్లారిటీ.. 'ఆ రోజే అన్ని చెబుతా'
సాక్షి, బెంగళూరు: డిసెంబరు 25వ తేదీన అన్నీ చెబుతానని మాజీ మంత్రి తెలిపారు. తుమకూరు నగరంలో ఉన్న సిద్దగంగా మఠాన్ని మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, భార్య లక్ష్మి అరుణ సందర్శించారు. శివకుమార స్వామి సమాధి వద్ద పూజలు చేసి మఠాధ్యక్షుడు సిద్దలింగ స్వామిని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మఠం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 సంవత్సరాల నుంచి మఠాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. బసవణ్ణ ఆదర్శంగా ఎలాంటి ప్రచారం లేకుండా లక్షల మందికి సేవ చేసిన ఘనత దివంగత శివకుమార స్వామిదని అన్నారు. తనకు మానసికంగా, దైహికంగా శక్తిని ఇచ్చేది మఠాలేనని చెప్పారు. మఠంలో ఎలాంటి రాజకీయాలను మాట్లాడనని, ఈ నెల 25వ తేదీన బెంగళూరులో మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలనూ అక్కడ వెల్లడిస్తానని చెప్పారు. చదవండి: (ఉజ్వల లబ్ధిదారులకు రూ.500కే సిలిండర్) -
మద్యం మత్తులో విద్యార్థులను చితక బాదేశాడు
సాక్షి, బెంగళూరు(తుమకూరు): మద్యం మత్తులో పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడు విద్యార్థులను చితకబాదిన ఘటన తుమకూరు తాలూకా మల్లసంద్ర విశ్వభారతి వసతి పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పాఠశాల పరిపాలన విభాగం సభ్యుడైన భరత్ నాలుగు రోజుల క్రితం రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగి వసతి భవనానికి వచ్చాడు. పడుకుని ఉన్న 40 మంది విద్యార్థులను నిద్ర లేపి ఇంత త్వరగా పడుకుంటారా అంటూ కట్టెతో, బెల్టుతో చితకబాదాడు. దీంతో ఓ విద్యార్థి చేయి విరిగింది. ఇద్దరు విద్యార్థుల మర్మాంగాలకు గాయం కాగా, పలువురి వీపులపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి భరత్ కనిపించకుండా పోయాడు. జరిగిన ఘటనను బాధిత విద్యార్థులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకురావడంతో వారు గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ) -
ఫ్రిజ్లో నాగుపాము
తుమకూరు: తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కొత్తగెరె గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి చెందిన ఇంటిలో నాగుపాము దూరింది. శనివారం ఉదయం ఇంటిలోకి ప్రవేశించిన నాగుపాము ఫ్రిజ్ వెనుకభాగంలోకి చేరింది. కుటుంబ సభ్యులు స్నేక్ నిపుణుడు మహాంతేశ్కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి చేరుకుని పామును పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టారు. -
పురిటిలో మృత్యు ఘోష.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి, కవలలు మృతి
వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు. జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడ్రస్ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. తీవ్ర రక్తస్రావమై దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు. ముగ్గురు సస్పెండ్ అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ల నిరసన ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్, మేయర్ ప్రభావతి, ఉప మేయర్ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్ నయాజ్ అహ్మద్లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. -
బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..
సాక్షి, బెంగళూరు(తుమకూరు): చదువులో రాణించలేననే భయంతో ఓ యువతి సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు తాలూకా బెళ్లావిలో పవిత్ర (18) అనే విద్యార్థిని బీకాం డిగ్రీ మొదటి ఏడాది చదువుతోంది. అయితే ఎప్పుడు ఆటలాడుతూ సమయం వృథా చేస్తావా? చదువుకో అని తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఆ పవిత్రకు చేదుగా అనిపించాయి. దీనికి తోడు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు కోపడుతారని, అలాగే మొబైల్ కొనివ్వరని మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకుందని పోలీసులు తెలిపారు. చదవండి: (రోడ్డు ప్రమాదంలో డాక్టర్ ఎస్.పి.నాయుడు మృతి) -
బడిలోనే బార్.. ఆ టీచరమ్మ రూటే వేరు
తుమకూరు (బెంగళూరు): గురువు అంటే దేవునితో సమానం, కానీ ఓ మహిళా ఉపాధ్యాయురాలు పాఠశాలనే బార్గా మార్చుకుంది. మద్యం తాగుతూ మత్తులో నానా యాగీ చేస్తూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. ఈ సంఘటన విద్యాకేంద్రంగా ప్రసిద్ధి చెందిన తుమకూరు జిల్లాలో జరిగింది. వివరాలు.. తుమకూరు తాలూకాలోని చిక్కసారంగిలోఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గంగలక్ష్మమ్మ అనే ఉపాధ్యాయురాలు గత 25 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తోంది. గత 5 సంవత్సరాల నుంచి ఆమె మద్యానికి బానిస అయ్యింది. ఈ మత్తులో నానా హంగామా చేస్తోంది. టేబుల్లో మద్యం సీసాలు ఈ విషయమై గ్రామస్తులు, బాలల తల్లిదండ్రులు ఆమెకు అనేకసార్లు మందలించినా తీరుమారలేదు. దీంతో బీఈఓకు ఫిర్యాదు చేయడంతో గురువారం వచ్చి విచారించారు. ఉపాధ్యాయురాలి టేబుల్లో మద్యం సీసాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. వాటిని తీయాలని బీఈఓ ఆదేశించడంతో ఆమె టేబుల్కు తాళం వేసి భీష్మించుకుంది. బీఈఓ, తల్లిదండ్రులు కలిసి టేబుల్ను బయటికి తీసుకొని వచ్చి తాళం పగలగొట్టి చూసి ఒక బాటిల్, రెండు ఖాళీ సీసాలు ఉన్నాయి. ఇంతలో నేను ఆత్మహత్యా చేసుకుంటానంటూ ఉపాధ్యాయురాలు కేకలు వేయగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. మద్యం సీసాలను సీజ్చేశారు. చదవండి: (ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..) -
భయానక రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. తుముకూరు జిల్లాలోని బాలినహళ్లిలో ఓ లారీ జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతుచెందిన వారిని రాయచూర్ జిల్లావాసులుగా గుర్తించారు. అయితే, 48వ నెంబర్ జాతీయ రహదారిపై రాయచూర్ నుంచి బెంగళూరు వస్తున్న జీపును ఓవర్టేక్ క్రమంలో లారీ ఢీకొట్టినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఒకే కుటుంబంలో ఐదుగురిని కాటేసిన పాము
తుమకూరు: ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి పాము కాట్లు.. వారిలో ఐదుగురి మృత్యువాత.. ఇలా చనిపోయిన వారంతా పురుషులే.. ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా తొగరిఘట్ట గ్రామంలో ధర్మణ్ణ కుటుంబంలో ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాము కాటుకు గురవుతున్నారు. గడిచిన 20–25 ఏళ్లలో పాముల కాటుతో ధర్మణ్ణ ఉమ్మడి కుటుంబంలో ఆయనతో పాటు హనుమంతప్ప, వెంకటేశ్, శ్రీనివాస్, ఇటీవల గోవిందరాజు మరణించారు. పాముకాటు బాధిత కుటుంబం గత బుధవారం రాత్రి గోవిందరాజు పొలంలో నీరు పెడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చనిపోయిన వారంతా దాదాపు ఒకే ప్రదేశంలో పాము కాట్లకు గురయ్యారు. ధర్మణ్ణ ఒక రోజు తన పొలం వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టును ఉన్నపళంగా నరికేశాడు. ఆ చెట్టు శాపమే ప్రస్తుతం ఈ మరణాలకు కారణమని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. అయితే ఆ చెట్టు ఆ తర్వాత కాలంలో మళ్లీ చిగురించి చెట్టుగా ఎదిగింది. పాము పగ పోవాలని గ్రామస్తులు స్థానిక మునియప్ప ఆలయంలో నిత్య పూజలు చేపట్టారు. -
లవర్తో భార్య పరార్.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి భర్త ఆత్మహత్య
బెంగళూరు: వివాహేతర సంబంధాలు జీవితాలనే నాశనం చేస్తున్నాయి. ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయిన క్రమంలో మనస్తాపం చెందిన భర్త తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన కర్ణాటకలోని తుమకూర్ జిల్లా, పీహెచ్ కాలనీలో గురువారం వెలుగు చూసింది. మృతుడిని సమీయుల్లాగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సమీయుల్లాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల కింద భార్య సహీరా బాను.. ప్రియుడితో కలిసి సౌదీ అరేబియాకు వెళ్లిపోయింది. అక్కడ పనిమనిషి ఉద్యోగం చేస్తూ.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. భర్తకు అప్పుడప్పుడు వీడియో కాల్స్ చేస్తూ వారు తిరిగే ప్రదేశాలను చూపించేది. ఈ క్రమంలో ఇంటికి రమ్మని భర్త ఎంత బతిమిలాడినా ఆమె మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సమీయుల్లా.. తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి అనంతరం తానూ విషం తాగాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: బిహార్లో నకిలీ పోలీస్ స్టేషన్.. 8 నెలలుగా వసూళ్ల పర్వం -
భర్త, పిల్లలు వద్దు ప్రియుడే కావాలి.. వీడియో కాల్స్ చేసి..
తుమకూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి ప్రియునితో కలిసి దుబాయ్కి వెళ్లిపోయిందో మహిళ. తరువాత కాల్స్ చేస్తూ ఆటపట్టిస్తోంది. ఈ హింసను తట్టుకోలేక ఆ భర్త ముగ్గురు పిల్లలకు పురుగుల మందు ఇచ్చి తాను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం కర్నాటకలో చోటుచేసుకుంది. వీడియో కాల్స్తో హేళన.. తుమకూరులోని పిహెచ్ కాలనీలో సమీవుల్లా (45) భార్య సాహెరా బాను, ముగ్గురు పిల్లలతో నివసిస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సాహెరాబాను ప్రియునితో కలిసి దుబాయ్కి వెళ్లిపోయింది. అప్పటినుంచి సమీవుల్లా ఒక్కడే ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును పోషిస్తూ జీవిస్తున్నాడు. మరోవైపు సాహెరా బాను దుబాయ్ నుంచి తన పిల్లలకు వీడియో కాల్ చేస్తూ హేళనగా మాట్లాడేది. ఈ పరిణామాలతో విరక్తి చెందిన సమీవుల్లా గురువారం ఉదయం పిల్లలకు పురుగుల మందు తాగించి, తాను కూడా సేవించాడు. కొంతసేపటికే సమీవుల్లా చనిపోగా, పిల్లలు ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూసిన ఇరుగుపొరుగు పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అంబులెన్సులో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. ఇది కూడా చదవండి: అన్నతో కాళ్లు మొక్కించారని కోపం.. ప్రాణం తీసిన రెండేళ్ల కిందటి మెసేజ్ -
మహాత్మా మన్నించు..
దేశమంతటా తిరంగా ఉత్సవాల్లో మునిగితేలుతోంది. స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిని నడిపించి అహింసా విధానంలో స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గాంధీజీకి జేజేలు పలుకుతున్నాం. కానీ ఆయన విశ్రమించిన భవనాల బాగోగులూ ఎవరికీ పట్టడం లేదు. తుమకూరు: జాతి పిత మహాత్మా గాంధీ నడయాడిన స్థలాలు ఎంతో పేరుపొంది నేడు పర్యాటక ప్రదేశాలుగా మారాయి. ఆ మహానుభావుడు బసచేసిన భవనాలు స్మారక కట్టడాలుగా పేరు పొందాయి. కానీ తుమకూరు జిల్లాలోని తిపటూరులోని ఓ కట్టడానికి ఆ భాగ్యం కలగలేదు. గాంధీజీ సేదతీరిన ఒకనాటి ఇల్లు నేడు కనీస పర్యవేక్షణ లేక అధ్వాన్నంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు. తిపటూరులోని పాత బీడిఓ కార్యాలయం ప్రస్తుతం తాలూకా పంచాయతీ ఆఫీసు వెనుక భాగంలో ఉన్న ఓ ఇల్లు ఉంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో.. 1927 ఆగస్టు 21వ తేదీన దేశమంతటా పర్యటిస్తూ తిపటూరుకు వచ్చిన బాపూజీ ఇదే గదిలో విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఉన్న చేద బావి నీటిని ఉపయోగించారు. అలా ఆ భవనం చరిత్రకెక్కింది. 1915– 1948 వరకు సంఘటనలతో కూడిన డీటైల్డ్ క్రోనాలజీ అనే పుస్తకంలో కూడా నమోదు చేశారు. జయదేవ హాస్టల్ ఆవరణలో సభలో గాంధీజీ ప్రసంగిస్తూ స్వరాజ్య సంగ్రామంలో పాల్గొనాలని ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ ఘన చరిత గల భవనం నేడు నిర్లక్ష్యపు చీకట్లో మగ్గుతోంది. చుట్టూ చెత్త పేరుకుపోయింది. జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తుమకూరు కాలేజీ మైదానం గది కూడా.. అలాగే తుమకూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్న మహాత్మా గాం«దీజీ స్మారక భవనం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎమ్మెల్యే పరమేశ్వర్ ఆదివారం ఆ భవనాన్ని పరిశీలించారు. 1932లో, 1937లో గాం«దీజీ పలుమార్లు తుమకూరు జిల్లాకు వచ్చారని, అప్పుడు కాలేజీ మైదానంలో ఉన్న గదిలో బస చేశారని చెప్పారు. ఆ గదిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పటికైనా సంరక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: వీడియో: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు.. ఈ పాటలు విన్నప్పుడల్లా ఉప్పొంగే దేశభక్తి -
రుస్తంను కనిపెట్టాడు.. జాక్పాట్ కొట్టాడు
వైరల్: రుస్తం.. పర్షియన్ పురాణాల్లో ఓ వీరుడి పేరు. అలాంటి పేరును ఇక్కడో వ్యక్తి తాను ప్రేమగా పెంచుకున్న చిలుకకు ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ.. అది కనిపించకుండా పోయేసరికి అల్లలాడిపోయాడు. ఆచూకీ చెప్పినా.. తెచ్చి ఇచ్చినా మంచి పారితోషకం ఇస్తానని ప్రకటించాడు. అంతేకాదు పోస్టర్లతో పాటు నగరం అంతటా ప్రకటన ఇచ్చాడు. కనిపించకుండా పోయిన తను రుస్తంను పట్టి తెచ్చిస్తే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించాడు కూడా. ఆ ప్రకటన చూసి శ్రీనివాస్ అనే ఓ స్థానికుడు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫలితంగా.. రుస్తం దొరక్కగా.. ఓ ఓనర్ మరో 35 వేల రూపాయలను అదనంగానే ఇచ్చాడు. కర్ణాటక తుమ్మకూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్జున్ అనే వ్యక్తి ఓ ఆఫ్రికన్ చిలుకను రెండున్నరేళ్లుగా పెంచుకుంటున్నాడు. దానికి రుస్తం అని పేరు పెట్టారు. అది ఆ కుటుంబంతో మమేకం అయిపోయింది. అయితే జులై 16వ తేదీ ఇంట్లోంచి ఎగిరిపోయి.. అది మళ్లీ తిరిగి రాలేదు. దీంతో అర్జున్ ఒక ప్రకటన ఇచ్చాడు. అయితే ఆ ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో చెట్లలో గాయపడి.. ఆకలితో, భయంతో ఉన్న తన రుస్తంను శ్రీనివాస్ చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చారని, అందుకే అదనంగా పారితోషకం ఇచ్చానని అర్జున్ చెప్తున్నాడు. ఇన్స్టంట్ అదృష్టం కూడా ఊరికే రాదు.. అందుకూ ఏదో ఒక ప్రయత్నం చేయాల్సిందే అని అంటున్నారు ఈ ఘటన చూసిన కొందరు. -
రుస్తుమా ఎగిరిపోయింది.. కనిపెట్టిన వారికి రూ.50వేల నజరానా
బెంగళూరు: ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎగిరిపోయిందని బాధపడుతోంది కర్ణాటక తుమకూరుకు చెందిన ఓ కుటుంబం. ఇంట్లో ఓ కుటుంబసభ్యుడిగా ఉన్న చిలుకను బాగా మిస్ అవుతున్నట్లు చెబుతోంది. దాని ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేలు నజరానా ఇస్తామని ప్రకటన కూడా ఇచ్చారు కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను తుమకూరు వ్యాప్తంగా అతికించారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 'మా చిలుక కన్పించడం లేదు. దానికి మాకు చాలా అనుబంధం ఉంది. మీకు ఎక్కడైనా కన్పిస్తే చెప్పండి. రూ.50 వేలు ఇస్తాం. మీ ఇంటి బాల్కనీ, కిటీకీలు వెతకండి' అని చిలుక యజమానులు పల్లవి, అర్జున్ ప్రకటనలో తెలిపారు. #Karnataka Family Announces Rs 50K Reward For Finding Missing #Parrot #Trending #Viralvideo #India pic.twitter.com/cTVRLVjlKZ — IndiaObservers (@IndiaObservers) July 19, 2022 వీరిది జంతు ప్రేమికుల కుటుంబం. కొన్నేళ్లుగా ఆఫ్రికాకు చెందిన రెండు చిలుకలను పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకటి శనివారం నుంచి కన్పించడం లేదు. దాని పేరు రుస్తుమా. అది ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని వీళ్లు భావిస్తున్నారు. రెండున్నరేళ్లకుపైగా ఈ చిలుక వీళ్లతో ఉంది. రెండుసార్లు దానికి ఘనంగా పుట్టినరోజు వేడుక కూడా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: అక్రమ మైనింగ్ ఆపేందుకు వెళ్లిన డీఎస్పీ.. ట్రక్కుతో తొక్కించి చంపిన మాఫియా గ్యాంగ్ -
ఘనంగా మంత్రి కుమారుడి వివాహం
తుమకూరు (కర్ణాటక): తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా జే.సి.పురంలో గురువారం రాష్ట్ర మంత్రి జే.సి.మాదుస్వామి కుమారుడు డాక్టర్. జే.ఎం. అభిజ్ఞ, డాక్టర్. ఎస్.ఎం. అశ్వినిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు మఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, హోం మంత్రి జ్ఞానేంద్ర, మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవెగౌడ, ఒక్కలిగ మఠాధ్యక్షుడు నిర్మలానందనాథ స్వామిజీ తదితర ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
కాన్పు చేసిన నర్సులు.. బిడ్డతో సహా గర్భిణి మృతి
సాక్షి, బెంగళూరు: పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాల్సిన గర్భిణి వైద్య సేవలు అందక కన్నుమూసింది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లాలోని హొసకెర పీహెచ్సీలో చోటు చేసుకుంది. వివరాలు.. మధుగిరి తాలూకా బ్రహ్మదేవరహళ్లికి చెందిన కమలమ్మ(28) కు పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. ఎంతసేపైనా రాకపోవడంతో కారులో హొసకెరె పీహెచ్సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో నర్సులే కాన్పు చేసేందుకు ఉపక్రమించారు. ఈక్రమంలో పరిస్థితి విషమించి కడుపులో ఉన్న బిడ్డతో సహా గర్భిణి మృతి చెందింది. వైద్యులు లేకపోవడం వల్లనే తన భార్య మృతి చెందినట్లు భర్త కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమానుషం.. అస్పత్రి మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం -
శ్రుతిమించిన ప్రేమికుల ప్రవర్తన.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో
తుమకూరు (కర్ణాటక): నగరంలోని ఉద్యానవనంలోకి వచ్చే ప్రేమికుల ప్రవర్తనపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక్కడి స్మార్ట్సిటీ ఉద్యానవనానికి అనేక మంది ఉదయం, సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వస్తుంటారు. అదే సమయంలో కళాశాలల్లో చదువుకుంటున్న ప్రేమజంటలు ఇక్కడికి వచ్చి శ్రుతిమించి వ్యవహరిస్తున్నారు. ఈ దృశ్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (సామాజిక మాధ్యమాల్లో భార్య నగ్న దృశ్యాలు.. కస్టమర్లు ఒప్పుకుంటే..) -
లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..
తుమకూరు (కర్ణాటక): నగరంలోని బెస్కాం ఆఫీసులో మహిళా సిబ్బందిని తిపటూరు సబ్టౌన్ రెవెన్యూ శాఖలో అసిస్టెంట్గా పనిచేసే బీకే జగదీశ్ లైంగిక వేధిస్తున్నట్లు ఏడుగురు మహిళా సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఓ ఉద్యోగిని మాట్లాడుతూ జగదీశ్ను తాను అన్న అని పిలుస్తానని, అలా పిలవరాదని అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డ్యూటీ అయిపోయాక ఫోన్లు చేస్తూ ఇంట్లో ఎవరూ లేకుంటే.. వచ్చేస్తా.. ఓకేనా అంటూ వేధిస్తున్నట్లు వాపోయారు. లాడ్జికి రావాలని వేధించినట్లు మరో ఉద్యోగిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమశేఖర్గౌడ స్పందిస్తూ జగదీశ్ను మరో ప్రాంతానికి బదిలీ చేస్తామని చెప్పారు. చదవండి: (ఆరు నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ఒంటిపై పంటిగాట్లు గుర్తించి..) -
విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు..
బెంగళూరు(తుమకూరు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హేమావతి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తుమకూరు జిల్లా చేళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులను కేబీ క్రాస్ హేమావతి కాలువ కార్యాలయంలో సహాయ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న రమేష్(55), అతని భార్య మమత(46), కుమార్తె శుభ(25)గా గుర్తించారు. ఈ ముగ్గురు గురువారం సాయంత్రం కారులో సాగరనహళ్లి గేట్ వద్దకు చేరకుని హేమావతి కాలువలోకి ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కాలువలో శవాలు తేలుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పాపం ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాడు.. అదే శాపమై..) -
కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం
సాక్షి, తుమకూరు: డబ్బులు, ఆస్తి కోసం సొంత కొడుకునే తల్లిదండ్రులు పిచ్చివానిగా ప్రచారం చేసి ఇంట్లో బంధించి హింసించిన అమానవీయ ఘటన ఇది. ఈఘటన తిపటూరు తాలూకా నొణవినకెరె హోబళి నెల్లికెరె గ్రామ పంచాయతీ పరిధిలోని చిగ్గావి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సోమశేఖరయ్య కుమారుడు మంజునాథ్ (23) బాధితుడు. సోమశేఖరయ్య మంజునాథ్ను సరిగా చూసుకునేవాడు కాదు. ఇటీవల కొబ్బరి పంట అమ్మగా వచ్చిన రూ.3 లక్షలను కూడా కూతురు, అల్లునికి ఇచ్చాడు. మంజునాథ్ ఖర్చుల కోసం రూ.2 వేలు ఇమ్మని ప్రాధేయపడితే రూపాయి కూడా ఇవ్వనని చెప్పి కొట్టి గదిలో వేసి బంధించారు. అతనికి పిచ్చిపట్టిందని అందరికీ చెప్పారు. ఈ నెల 23న సీనియర్ సివిల్ జడ్జి నూరున్నీసాకు ఒక వ్యక్తి మంజునాథ్ దీనగాథను వివరించాడు. వెంటనే జడ్జి, పోలీసులతో కలిసి వచ్చి మంజునాథ్ను గృహ నిర్బంధం నుంచి విడిపించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కర్కోటక తండ్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..) -
పిలవడానికి వస్తే ప్రాణం పోయింది
తుమకూరు: ఇంటి పైకప్పు కూలడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన తుమకూరు జిల్లా శిరా తాలూకా గౌడగెరె సమీపంలో ఉన్న యరువరహళ్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రత్నమ్మ (55) తన ఇంటి పక్కనే ఉన్న లక్ష్మమ్మ ఇంటికి వచ్చింది. పనికి రావాలని చెబుతుండగా ఒక్కసారిగా పైకప్పు కూలిపోయి రత్నమ్మపై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సమయంలో ఇంటిలో ఉన్న లక్ష్మమ్మ, వెంకటేశ్లు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. శిరా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మైసూరులో పట్టపగలే నగల దుకాణంలో దోపిడీ -
ఏమీ కాదని మమతే భర్తకు ధైర్యం చెప్పింది.. కానీ అంతలోనే
తుమకూరు/కర్ణాటక: ప్రసూతి కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణి వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని తిపటూరు పట్టణంలో ఉన్న ప్రైవేట్ నర్సింగ్ హోంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. వివరాలు.. కుందూరు గ్రామానికి చెందిన వ్యాపారి చేతన్ భార్య మమత (34)కు నెలలు నిండాయి. కాన్పు కోసం శనివారం ఉదయం జేనుకల్ నర్సింగ్హోంలో అడ్మిట్ చేశారు. సాధారణ కాన్పు అవుతుందని వైద్యులు చెబుతూ వచ్చారు. చివరకు సిజేరియన్ చేయాలని హడావుడిగా భర్త నుంచి సంతకాలు తీసుకుని శనివారం రాత్రి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఏమీ కాదని, ధైర్యంగా ఉండాలని మమత భర్త, బంధువులకు ధైర్యం కూడా చెప్పింది. తల్లి మృత్యువాత గంట తరువాత నర్సులు మగబిడ్డను తండ్రి చేతిలో పెట్టి మీరు కింది అంతస్తులోకి వెళ్లండి అని చెప్పారు. కొంతసేపటికి మమత మృతదేహాన్ని అప్పగించడంతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పుట్టిన క్షణమే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. వైద్యులు ఉదయాన్నే స్పందించి ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని భర్త, బంధువులు విలపించారు. సిజేరియన్ వికటించి రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ఆదివారం ఆస్పత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యుల నిర్లక్ష్యంపై తిపటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
ముద్దొచ్చే చిన్నారులు.. ఎందుకిలా చేశావమ్మా?
మండ్య/కర్ణాటక: కుటుంబ కలహాలతో తల్లి తన ఇద్దరు పిల్లల సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జిల్లాలోని నాగమంగళ తాలూకా హుళ్లెనహళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని కెరెగోడు సమీపంలో ఉన్న గౌడగెరె గ్రామానికి చెందిన గిరీశ్ భార్య సించన (32), పిల్లలు డింపన (4), మహేంద్ర (6) ఉన్నారు. కుటుంబంలో వచ్చిన గొడవలతో సించన పుట్టినిల్లు హుళ్లెణహళ్లి గ్రామానికి వచ్చింది. గురువారం ఉదయం తన పిల్లలతో కలిసి సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. ముద్దొచ్చే చిన్నారులను చూసైనా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందమ్మా అంటూ విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. వివాహిత దారుణహత్య తుమకూరు: గొర్రెలను మేత కోసం తీసుకెళ్తున్న మహిళపై దుండగులు వేటకొడవలితో నరికి హత్య చేశారు.ఈ ఘటన తుమకూరు తాలూకా కోడి తిమ్మనహళ్లిలో గురువారం చోటు చేసుకుంది. కోరా పోలీసుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నాగరాజు భార్య సిద్దగంగమ్మ(40) రోజులాగే గురువారం ఉదయం గొర్రెలను మేత కోసం పొలానికి తీసుకెళ్తుండగా గ్రామ సమీపంలో కాపుగాసిన దుండగులు ఆమెపై దాడి చేశారు. వేడకొడవలితో మెడపై, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా నరికి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తనకు, అన్నదమ్ముల మధ్య పొలం విషయంలో గొడవలు ఉన్నాయని, తన భార్యను వారే హత్య చేసి ఉంటారని హతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
పోలీసుల దాష్టీకం: బాలింత అన్న కనికరం కూడా లేదా?
తుమకూరు/కర్ణాటక: మూడు నెలల బాలింతపై పోలీసులు దౌర్జన్యం చేశారు. ఆమె ఇంట్లోని సామగ్రినంతా బయటకు పడవేసి బాలింతతో పాటు చిన్నారిని ఇంటి నుంచి గెంటేశారు. ఈ ఘటన తురువేకెరె తాలూకా దండినశివర హోబళి బాణసంద గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామంలో సదరు బాలింతకు జరిగిన అన్యాయాన్ని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి అనంతరం ఆ గ్రామస్తులంతా ఆమెకు బాసటగా నిలిచారు. ఆ మహిళకు న్యాయం చేయాలని గ్రామంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. అక్క, చెల్లికి పొలం వాటా విషయంలో వివాదం ఉంది. ఈ క్రమంలో చంద్రమ్మ అక్కడే గుడిసెలో ఉంటోంది. దీంతో తరచూ అక్క చెల్లి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతుండటంతో పోలీసులు చంద్రమ్మను అక్కడి నుంచి ఖాళీ చేయించాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని గ్రామస్తులు చెప్పారు. -
విడాకులు తీసుకున్న మహిళతో పెళ్లి వద్దన్నందుకు
తుమకూరు: తన ప్రేమ పెళ్లిని తండ్రి నిరాకరించాడనే ఆగ్రహంతో కన్న కుమారుడే తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన తుమకూరు జిల్లాలోని శిరా తాలుకాలోని ద్వారనకుంటె గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి చెందిన లక్ష్మణ్ (50), హరీశ్ (28) తండ్రి కుమారుడు. ఈ క్రమంలో హరీశ్ విడాకులు తీసుకున్న మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లిని తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. శనివారం రాత్రి మరోసారి తండ్రి, కుమారుడి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో హరీశ్ తండ్రిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టనాయకనహళ్లి పోలీసులు హరీశ్ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కరోనాకు మరో నిర్మాత బలి -
పెళ్లికొడుకు కావాల్సిన వాడివి.. శ్మశానానికి వెళ్లావా నాన్నా!
తుమకూరు/ కర్ణాటక: కొద్దిరోజుల్లో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన యువకున్ని కరోనా మహమ్మారి చితికి చేర్చింది. మొబైల్షాపులో పనిచేస్తున్న 29 ఏళ్ల యువకుడు కరోనాతో చనిపోయాడు. ఇతని స్వస్థలం జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకా హాలుకట్టి గొల్లరహట్టి. ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. మూడు రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లగా అక్కడ బెడ్లు ఖాళీ లేవన్నారు. తిపటూరుకు వెళ్లగా అక్కడ కూడా చేర్చుకోలేదు. ఈ క్రమంలో హాసన్ జిల్లా ఆస్పత్రిలో చేర్చేందుకు తీసుకువెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశాడు. తుమకూరులోనే వైద్యం చేసి ఉంటే బతికేవాడు, పెళ్లికొడుకు కావాల్సినవాడు శ్మశానానికి వెళ్లావా నాన్నా అంటూ తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి రోదిస్తున్న తీరు అందరిచేత కంటతడి పెట్టించింది. చదవండి: గుడిలో నా పెళ్లి సర్.. మమ్మల్ని వదిలేయండి! -
కరోనా విపత్తులో సీఎం జగన్ సేవలు భేష్
తుమకూరు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై స్ఫటికపురి మహా సంస్థాన మఠాధ్యక్షుడు నంజావదూత స్వామీజీ ప్రశంసల వర్షం కురిపించారు. కరోనా రోగులకు రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందిస్తున్నారని అభినందించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్లా కోవిడ్ రోగులకు ఉచిత చికిత్సనందించి వారి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఆదివారం కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా తాలూకా పట్టనాయకనహళ్లిలో ఉన్న స్ఫటికపురి మహాసంస్థాన మఠంలో స్వామీజీ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి వల్ల కర్ణాటకలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిరుపేదలు చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీ అప్పుల్లో ఉన్నా అక్కడ సీఎం వైఎస్ జగన్ ఔదార్యంతో ఎంతో మంది కరోనాకు ఉచితంగా చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. కర్ణాటకలో అన్ని ఆస్పత్రుల్లో కరోనాకు ఉచిత వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు. -
పనికి రానంటావా?
పనికి రాకపోవడంతో బాలునిపై దౌర్జన్యం చేస్తున్న యజమాని. ఆదివారం బెంగళూరు లాల్బాగ్లో బాల కార్మిక దురాచారానికి వ్యతిరేకంగా నిర్వహించిన బయలు నాటకంలో ఓ సన్నివేశం. బాలలను పనికి కాదు, బడికి పంపాలని ఈ సందర్భంగా చాటిచెప్పారు. బోనులో చిక్కిన భల్లూకం తుమకూరు: తుమకూరు సిద్దగంగ మఠ పరిసరాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఎట్టకేలకు చిక్కింది. నాలుగైదు నెలలుగా ఓ ఎలుగుబంటి మఠం పరిసరాల్లో సంచరిస్తు రెండుసార్లు ఏకంగా మఠంలోకే ప్రవేశించింది. దీంతో మఠం సిబ్బంది ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు మఠం చుట్టుపక్కల బోన్లు ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి ఎలుగుబంటి బోనులో చిక్కింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఎలుగుబంటిని అడవిలోకి తరలించారు. పక్షులను కాపాడుకోవాలి గౌరిబిదనూరు: వేసవి ప్రారంభం కావడంతో పక్షులను కాపాడుకోవాలని యశస్వీ పీయూ కళాశాల అధ్యక్షుడు శశిధర్ అన్నారు. ఆదివారం పక్షులకు ఆహారం, నీరు ఇవ్వండి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పక్షులకు ఆహారం, నీరు సకాలంలో అందక పోవడంతో మృత్యువాతపడుతున్నాయని, ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు విద్యార్థులు చిన్నపాటి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, ధాన్యపు గింజలు ఉంచి మానవత్వం చాటుకుంటున్నారని అభినందించారు. -
ఇక్కడ పాతిపెట్టొద్దు.. అయ్యో బిడ్డా..
తుమకూరు: అనారోగ్యంతో మృతి చెందిన నాలుగు నెలల చిన్నారి అంత్యక్రియలను అడ్డుకున్న ఘటన సోమవారం తుమకూరు జిల్లా కొరటిగెరె తాలుకా జెట్టి అగ్రహార పంచాయతీ పరిధిలోని కైమార గ్రామంలో చోటుచేసుకుంది. కొరటెగెరె నుంచి మధుగిరి వైపు వెళ్లే ఎత్తినహొళె పైప్లైన్ బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. బ్లాస్టింగ్ల కారణంగా రంగనాథ్, నేత్రా దంపతులకు చెందిన నాలుగు నెలల చిన్నారి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని తీసుకుని కొరటగెరెలోని తాలూకా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారి మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు తిరిగి గ్రామానికి వచ్చి సమీపంలోని షాహీ గార్మెంట్స్ సంస్థ సమీపంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సంస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఇక్కడ పాతిపెట్టొద్దని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అక్కడకు చేరుకుని సిబ్బందికి సర్దిచెప్పి అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
విషాదం: వైద్యురాలు దుర్మరణం
సాక్షి, తుమకూరు: ధార్వాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వైద్యులు దుర్మరణం చెందిన ఘటన మరవక ముందే మరో వైద్యురాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. శిరాకు చెందిన వైద్యురాలు వర్ణిక(33) తన పుట్టిన రోజు సంబరాల కోసం మామ, బీజేపీ నేత బి.గోవిందప్ప, భర్త స్వామిదర్శన్ తదితరులతో కారులో గోవా వెళ్లారు. బుధవారం తిరిగి వస్తుండగా రాణిబెన్నూరు సమీపంలోని బ్యాడగి సర్వీసు రోడ్డులో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు లారీని ఢీకొంది. ప్రమాదంలో వైద్యురాలు వర్ణిక మృతి చెందగా గోవిందప్పకు భుజం, కాలు, వెన్నెముకకు గాయాలయ్యాయి. అత్త రత్నమ్మ, కుమారుడు మోహిత్కు చిన్నచిన్న గాయాలయ్యాయి. చదవండి: (ప్రాణం తీసిన ట్రిప్పు.. 9 మంది లేడీ డాక్టర్ల మృతి) -
మాజీ ప్రధాని ఓటమికి కాంగ్రెస్ కుట్ర..!
బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్ నేతలు బీజేపీ సహరించారంటూ వస్తున్న వార్తలు కన్నడనాట తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని తూమకూరు లోక్సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థిగా దేవెగౌడ పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజు స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అయితే దెవెగౌడ ఓటమికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కేఎన్ రాజన్ కుట్ర పన్నారని.. ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆరోపిస్తోంది. దేవెగౌడను ఓడించడానికి బసవరాజుకు అధిక మొత్తంలో డబ్బు పంపారని, పార్టీ అంతర్గత విషయాలను బీజేపీ నేతలకు చేరవేశారని తూమకూర్ జిల్లా అధ్యక్షుడు ఆర్ రామకృష్ణ సంచలన పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు కేసీ వేణుగోపాల్కు ఆయన లేఖ రాశారు. రాజన్ కారణంగానే దేవెగౌడ ఓటమి చెందారని, వెంటనే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని లేఖలో పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ.. సొంత పార్టీ నేతలే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం కాంగ్రెస్ నేతలను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ మంచి ప్రభావం చూపినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం దారుణ ఓటమిని మూటగట్టుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో సునాయసంగా విజయం సాధించింది. జేడీఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. -
గదిలో చిరుత.. బాత్రూమ్లో అత్తా కోడళ్లు
సాక్షి, తుమకూరు: కర్ణాటకలోని తుమకూరు జిల్లా కేంద్రంలో ఓ చిరుత జనాలను హడలెత్తించింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రంగనాథ్ అనే వ్యక్తి ఇంట్లోకి చిరుత ప్రవేశించి తిష్టవేసింది. కుటుంబ సభ్యులందరూ బయటకు పరుగులు తీయగా అత్త వనజాక్షి,, కోడలు వినూత బాత్రూమ్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ప్రాణ భయంతో గడిపారు. ఎమ్మెల్యే రఫిక్ అహ్మద్, జిల్లా కలెక్టర్ కేపీ మోహన్రాజు, ఎస్పీ గోపీనాథ్దివ్య అక్కడకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసు, అటవీ సిబ్బందితో ఇంటి గోడ పగుల గొట్టి ఆ ఇద్దరినీ బయటకు తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల వరకు చిరుతను బంధించేందుకు విశ్వప్రయత్నం చేశారు. బెంగళూరులోని బన్నేరుఘట్ట ఉద్యానవనం నుంచి మత్తుమందు ఇచ్చే నిపుణుడిని రప్పించి చిరుతకు మత్తు మందు ఇంజక్షన్ వేసి బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. -
ఏరుకొనేందుకు ఎగబడ్డారు !
-
ఏరుకొనేందుకు ఎగబడ్డారు!
తుమకూరు (కర్ణాటక): ఏరుకున్న వాళ్లకు ఏరుకున్నన్ని కోడిగుడ్లు దొరికాయి.. ఎక్కడనుకుంటున్నారా! ఈ చిత్రం కర్ణాటకలో శనివారం కనిపించింది. తుమకూరు జిల్లా, శిరా తాలూకా కళ్లంబెళ్ల జాతీయ రహదారిపై టైరు పంక్చరై రోడ్డు పక్కన నిలిపిన కోడిగుడ్ల లారీని కేఎస్ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో లారీలోని 6 లక్షల రూపాయల విలువైన కోడిగుడ్లన్నీ రోడ్డుపాలయ్యాయి. ఎక్కువశాతం గుడ్లు పగిలిపోగా మిగిలిన వాటిని ఏరుకొనేందుకు స్థానికులు ఎగబడ్డారు. రోడ్డంతా పగిలిన గుడ్లతో చిందరవందరగా తయారైంది. కోడిగుడ్లను ఏరుకునేందుకు జనం ఎగబడటంతో అక్కడ కోలాహలం నెలకొంది. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పెళ్లి చేసుకుంటే గ్రామ బహిష్కరణే..!
► కట్టుబాట్ల చెరలో శీగేబావి ► కుల పెద్దల మాటే వేదం ► తప్పు చేస్తే గ్రామ బహిష్కారం ► డిజిటల్ యుగంలో వింత ఈ గ్రామంలో ఉన్న కురుబ సముదాయ ప్రజలు.. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఎవరూ ఎవరితో గొడవ పడరాదు. కుల పెద్దలు చెప్పినట్లు మాత్రమే నడుచుకోవాలి, కులాంతర వివాహం చేసుకోరాదు. కుల పెద్దల మాట జవదాటినా, నియమాలు ఉల్లంఘించినా వారికి జరిమానాతో పాటు గ్రామ బహిష్కార దండన తప్పదు. ఈ గ్రామం ఎక్కడో కాదు, బెంగళూరుకు సమీపంలో ఉన్న తుమకూరు జిల్లాలోని చిక్కనాయకనహళ్లి తాలూకాలో ఉన్న శీగేబాగి గ్రామంలో ఇలాంటి కఠినమైన కట్టుబాట్లే అమలవుతున్నాయి. తుమకూరు(కర్ణాటక): శీగేబాగి గ్రామంలోని కురుబ కులస్తులకు ఆ సముదాయం పెద్దలు చెప్పిందే తీర్పు. పట్టుమని వెయ్యి మంది ఉండే ఊళ్లో ఈ వర్గీయులు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. ఇక్కడ గ్రామంలో ఇప్పటికి సంప్రదాయాల పేరుతో కుల పెద్దలు గీసిన లక్ష్మణరేఖను దాటడానికి ఎవరూ ధైర్యం చేయరు. మూడు సంవత్సరాల కిందట గ్రామంలోని కొందరు కురుబ పెద్దలు సముదాయం పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి కట్టుబాట్లు విధించారు. కులంలోని వారికి సంబంధించి ఎక్కడ గొడవ జరిగినా పెద్దలు అక్కడికి వెళ్లి పంచాయతీ పెడతారు. తప్పు ఎవరిదో నిర్ధరించి వారికి జరిమానా విధిస్తారు. తప్పు తీవ్రమైనదైతే వారిని ఊరి నుంచి బహిష్కరించడం జరుగుతుంది. జీవితాంతం గ్రామంవైపు కన్నెత్తి చూడరాదు. ఒకవేళ తిరిగి వచ్చినా వారితో ఇతరులెవరూ మాట్లాడవద్దు. ఒక వేళ మాట్లాడినట్లు తెలిసిన వారికి అదేశిక్ష తప్పదు. ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లలు చేసినా కూడ వారికి కూడ ఇదేశిక్ష తప్పదు. చిన్న పిల్లలు చేస్తే వారి పెద్దలకు జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి పాత కాలం పద్ధతులు ఇంకా మనుగడలో ఉండడం ఇక్కడ మాత్రమే చూడగలమేమో. ప్రేమ వివాహానికి శిక్ష.. గ్రామ బహిష్కారం ఇదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కుమార్తె ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. ఆమె రెండేళ్ల కిందట ఒక అగ్రవర్ణ యువకునితో ప్రేమపెళ్లిచేసుకుంది. గ్రామ పెద్దలు తండ్రి ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టారు. కొత్త దంపతులు ఊళ్లోకి అడుగుపెట్టరాదని, ఆమె తండ్రి కుటుంబంతో ఎవరూ మాట్లాడరాదని తీర్పు చెప్పారు. దీంతో ఎవరూ కూడా ఆ కుటుంబంతో మాట్లాడటం లేదు. ఇటీవలే ఆ వ్యక్తి మరణించగా, కడసారి చూడడానికి కూడా కూతురిని గ్రామం గడప తొక్కనివ్వలేదు. వస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆమె తమ్ముణ్ని హెచ్చరించడం విశేషం. ఈ కట్టుబాట్లను ఎక్కువమంది సముదాయంవారు వ్యతిరేకిస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
తుమకూరు: ప్రజల ప్రాణాలతో చెలగాటామాడుతున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కే.పీ.మోహన్రాజ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై మాట్లాడారు. పావగడ, చిక్కనాయకనహళ్లి తదితర తాలూకాల్లో నకిలీ వైద్యులు ఇష్టారాజ్యంగా చికిత్సలు చేస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 123మంది నకిలీ వైద్యులను గుర్తించామని, వారిపై చర్యలు తప్పవన్నారు. నకిలీ వైద్యులపట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఎన్ఎం కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని, జిల్లా వ్యాప్తంగా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఇందిరా సురక్ష పథకం కింద వైద్య సేవలు అందించాలన్నారు. -
ఇద్దరు టెక్కీల జల సమాధి
తుమకూరు(కర్ణాటక): విహారానికి వచ్చిన ఐదుగురు టెక్కీల్లో ఇద్దరు జల సమాధి అయ్యారు. ఈ ఘటన తుమకూరు నగర సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరుకు చెందిన కార్తీక్ (28), వరుణ( 26)తోపాటు మరో ముగ్గురు టెక్కీలు కోరమంగళలో ఉన్న హెచ్పీ కంపెనీలో పని చేస్తున్నారు. వీక్ఎండ్ కావడంతో ఆదివారం దేవరాయణదుర్గకు వచ్చారు. అక్కడ మద్యం తాగి సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లారు. కార్తిక్ నీటిలో మునిగి పోతుండగ కాపాడటానికి వెళ్లిన వరుణ కూడా గల్లంతయ్యాడు. మిగతా ముగ్గురు అప్రమత్తమై క్యాత్సంద్ర పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం ఎగ్జామినేషన్ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఈ - బడ్జెట్
రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు పాలికెలో ప్రవేశపెట్టిన వైనం ల్యాప్టాప్లో బడ్జెట్ వివరాలు పరిశీలించిన సభ్యులు తుమకూరు : రాష్ట్రంలో తొలిసారిగా తుమకూరు నగరపాలికెలో ఈ-బడ్జెట్ను (కాగిత రహిత) ప్రవేశపెట్టారు. మంగళవారం ఉదయం పాలికెలో రూ. 2కోట్లు మిగులుతో ఈ బడ్జెట్ను పాలికె ఆర్థిక స్థాయీ సమితి అధ్యక్షుడు నగేష్ బావికట్టె ప్రవేశపెట్టారు. కాగిత రహితంగా ఉండడంతో ల్యాప్టాప్లో ఉన్న బడ్జెట్ అంశాలను ఆయన సభ్యులకు చదివి వినిపించారు. అదే సమయంలో సభ్యులు కూడా వారి వద్ద ఉన్న ల్యాప్టాప్లలో బడ్జెట్ అంశాలను పరిశీలించారు. ఈ తరహా బడ్జెట్నుప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ప్రవేశపెట్టిన తుమకూరు పాలికె 2015-16 బడ్జెట్లో నీటి సరఫరా, చెత్త సేకరణ, విభజన, రోడ్ల అభివృధ, యూజీడీ తదితర అభివృ్ధ పనులకు పెద్ద పీట వేశారు. పాలికెకు పన్నుల రూపంలో ఆదాయం పెంచుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు. నిరుపేదలకు, వసతి లేని వారికి నైట్ షెల్టర్స్ను ఏర్పాటు చేయడం కోసం రూ. 50 లక్షలను కేటాయించారు. నగర పాలికె అభివృ్ధ కోసం ఆస్తి పన్ను, దుకాణాల సముదాయాలపైన అద్దె పెంచనున్నారు. పాలికెకు వచ్చే ఆదాయంలో పేదలకు, మురికివాడల్లో నివసించే వారికి మూలభూత సౌకర్యాలను కల్పించేందుకు కృష చేయనున్నారు. ఈ-బడ్జెట్ను ప్రవేశపెట్టడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ తరహా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ల్యాప్టాప్ల వినియోగం గురించి తెలియని పలువురు సభ్యులు తమకు ప్రత్యేకంగా శిక్షణను ఇప్పించాలని మేయర్ లలితారవీష్ను కోరారు. దీనిపై మేయర్ మాట్లాడుతూ.. పాలికెలో కాగిత రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టడం వలన స్టేషనరీ ఖర్చు తగ్గుతోందని అన్నారు. సమావేశంలో సభ్యులతో పాటు పాలికె కమిషనర్ హర్షద్ రసూల్ షరీఫ్, ఉప మేయర్ వెంకటేష్, నయాబ్, విపక్ష నేత సురేంద్ర పాల్గొన్నారు. -
అత్యాచారానికి గురైందని ఇంటి నుంచి బాలిక గెంటివేత
తుమకూరు : అత్యాచారానికి గురైన ఓ బాలికను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి గెంటేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు... తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన మంజునాథ (25), సునీల్ (26), మరో మైనర్ బాలుడు కొద్ది రోజుల క్రితం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటివేశారు. ప్రస్తుతం ఆ బాలిక మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలభవన్లో ఆశ్రయం పొందుతోంది. కాగా, ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితులకు సహకరించిన సుజాతను విచారిస్తున్నట్లు సమాచారం. -
పరమ శివయ్య ఇకలేరు
ప్రముఖ నీరావరి నిపుణులు, విశ్రాంత ఇంజనీర్ డాక్టర్ పరమశివయ్య (97) కన్నుమూశారు. మంగళవారం ఉదయం 11.40 గంటలకు ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో తుమకూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయన మరణవార్త తెలియగానే తుమకూరులోని పరమ శివయ్య స్వగృహానికి బంధువులు, వివిధ సంఘ సంస్థల నేతలు చేరుకున్నారు. అంతిమ దర్శనం చేసుకున్న వారిలో సిద్దగంగా మఠాధ్యక్షుడు శివకుమారస్వామిజీ, సిద్దలింగమహాస్వామీజీ, ఎంపీ జీఎస్.బసవరాజ్, విధానపరిషత్ సభ్యుడు డాక్టర్ ఎంఆర్ హులినాయ్కర్, ఎమ్మెల్యే డాక్టర్ రఫీక్ అహ్మద్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.షఫీ అహ్మద్ .. ఉన్నారు. నీరావరి పథకాలకు ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడిగా పరమ శివయ్య విధులు నిర్వహిస్తున్నారు. చిక్కబళ్లాపురం, కోలారు, బెంగళూరు గ్రామాంతర, గౌరిబిదనూరు, దొడ్డబళ్లాపురంతో పాటు తొమ్మిది జిల్లాలకు శాశ్వత నీటి సదుపాయం కల్పించడానికి పరమ శివయ్య ఓ నివేదికను తయారు చేసి 14 సంవత్సరాల కిందటే ప్రభుత్వానికి అందజేశారు. దాన్ని అమలు చేయాలంటూ నాటి నుంచి అనేక పోరాటాలు చేస్తూ బయలు సీమ జిల్లా ప్రజలకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు -
ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ వైఫల్యం
తుమకూరు, న్యూస్లైన్ : తుమకూరు జిల్లా ప్రజలకు హేమావతి నీటిని అందించడానికి దేవెగౌడ కుటుంబ ఎప్పుడు కూడ అడ్డు పడలేదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విపలమైందని, కాంగ్రెస్ పార్టీలోఇప్పటికి గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, కేవలం ప్రజల మెప్పు పొందడానికి రూపాయికి కిలోబియ్యం పథకం ప్రవేశపెట్టి దానిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అదే విధంగా చెరకు రైతులకు మద్దతు ధర అందించడం లేదని, ఇందు కోసం ఏర్పాటు చేసిన కమిటీ రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేవెగౌడ కటుంబానికి చెందిన వారు ఎవరు ఎన్నికల పోటీలో ఉండరని, కేవలం దేవెగౌడ వ ూత్రం బరిలో ఉంటారని కుమార స్పష్టం చేశారు. రాష్ట్రంలో జేడీఎస్ పార్టీని బలోపేతం చేయడానికి బూత్ స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడాలన్నారు. కార్యక్రమంలో కుణిగల్ ఎమ్మెల్యే నాగరాజయ్య, స్థానిక నాయకులు సురేష్బాబు, శిరా మాజీ మంత్రి సత్యనారాయణ పాల్గొన్నారు.