నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు | The first electronic court | Sakshi
Sakshi News home page

నగరంలో తొలి ఎలక్ట్రానిక్ కోర్టు

Published Fri, Aug 16 2013 2:48 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM

The first electronic court


 ముంబై:నగరంలో బాంబే హైకోర్టుకు చెందిన తొలి ఎలక్ట్రానిక్(ఈ) కోర్టును రాష్ర్ట ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గురువారం ప్రారంభించారు. జస్టిస్ నితిన్ జందార్ ఆధ్వర్యంలో ఈ-కోర్టు పనిచేసే తీరును ప్రధాన న్యాయమూర్తి మోహిత్ షాతో పాటు బాంబే హైకోర్టు న్యాయవాదులందరూ దగ్గరుండి వీక్షించారు. మొదటగా కంపెనీలకు సంబంధించి కేసులు విచారణకు వస్తాయని, ఆ తర్వాత ఇతర కేసులను కూడా విచారించనున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.
 
 బాంబే హైకోర్టు భవనంలోని కోర్టు గది నంబర్ 47లో తొలి కేసును విచారించారు. ఈ కేసు విచారణ తీరును సెంట్రల్ హాల్‌లో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీక్షించారు. ఈ-కోర్టు గదిలో నితిన్ జందార్ టేబుల్‌పై ఫైల్‌లకు బదులుగా ఓ కంప్యూటర్ ఉంది. వ్యాజ్యదారుల ప్రయోజనార్ధం అదే కోర్టులో ఏర్పాటుచేసిన భారీ స్క్రీన్‌లో జందార్ కంప్యూటర్‌లో ఏ పేజీలు పరిశీలిస్తున్నారో అనేది కూడా కనిపించనుంది. ఎలక్ట్రానిక్ పత్రాల(పీడీఎఫ్, వర్డ్ ఫైల్)ను పెన్‌డ్రైవ్, సీడీలో కోర్టుకు పిటిషన్‌దారులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ కోర్టు ఫీజు చెల్లింపులకు మంచి స్పందన లభించింది. సుప్రీం కోర్టు, హైకోర్టు మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు జిల్లా, సబార్డినేట్ కోర్టులను కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ-కోర్టులను ప్రోత్సహిస్తోంది. వచ్చే యేడాది మార్చి 31 నాటికి 969 కోర్టు కాంప్లెక్స్‌ల్లోని 2,249 కోర్టులను కంప్యూటరీకరణ చేయాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement