సాక్షి, హైదరాబాద్: గొర్రెల కాపరులకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో పశుసంవర్థకశాఖ దీనిపై కసరత్తు ప్రారంభించింది. గొర్రె పిల్లలను ఎక్కడ సేకరించాలో సమాచారం తెలుసుకునేందుకు 14 బృందాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు పంపినట్లు ఆ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు.
మొత్తం 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ బృందాలు సమగ్రంగా అధ్యయనం చేసి కొనుగోలు అవకాశాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో నెల్లూరు బ్రౌన్ రకం గొర్రెలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రకం గొర్రెల కోసం అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.