21 నగర పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా  | 21 Town Panchayats Get Municipality Status | Sakshi
Sakshi News home page

21 నగర పంచాయతీలకు మున్సిపాలిటీ హోదా 

Published Sun, Mar 25 2018 2:19 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM

21 Town Panchayats Get Municipality Status - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని 21 నగర పంచాయతీల స్థాయిని మున్సిపాలిటీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ జాబితాలో బడంగ్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, నర్సంపేట, సత్తుపల్లి, గజ్వేల్, వేములవాడ, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, హుజూర్‌నగర్, జమ్మికుంట, నాగర్‌కర్నూల్, పరకాల, హుజూరాబాద్, మధిర, హుస్నాబాద్, బాదేపల్లి, అచ్చంపేట, ఐజా, దేవరకొండ, కొల్లాపూర్, అందోల్‌–జోగిపేట్‌లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement