శంషాబాద్: రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 480 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న480 గ్రాముల బంగారాన్ని వారి వద్ద గుర్తించారు . అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. నిందితులు కేరళకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.