మియాపూర్ (హైదరాబాద్) : మియాపూర్ నుంచి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు మియాపూర్ డిపో -2 మేనేజర్ బి.వెంకారెడ్డి సోమవారం తెలిపారు. గంటకు ఒకటి చొప్పున ప్రతిరోజూ 48 ట్రిప్పులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ బస్సు సర్వీసులు పటాన్చెరువు, రాంచంద్రాపురం, చందానగర్, మియాపూర్ ఆల్విన్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. మియాపూర్ నుంచి శంషాబాద్కు బస్సు చార్జీ రూ.250 గా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మియాపూర్-శంషాబాద్ మార్గంలో ఏసీ బస్సులు
Published Mon, Nov 2 2015 6:10 PM | Last Updated on Tue, Oct 30 2018 4:05 PM
Advertisement
Advertisement