miyapur
-
మనవడి పుట్టిన రోజు నాడే తాత బలవన్మరణం
మియాపూర్: మనవడి పుట్టిన రోజు నాడే అతడి తాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా మాధవనగర్కు చెందిన రాఘవేందర్ రావు(60) భార్య విజయలక్ష్మితో కలిసి మియాపూర్లోని దీప్తిశ్రీనగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాఘవేందర్రావు కాలనీలో విజయ స్వగృహ ఫుడ్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాఘవేందర్రావు మనవడు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సాయంత్రం వేడుకలు నిర్వహించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కలిసి షాపింగ్కు వెళ్లారు. రాఘవేందర్ రావును కూడా రావాలని కోరగా.. తాను ఇంట్లోనే ఉంటానని, మీరు వెళ్లి రండి అని చెప్పారు. సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా బెడ్రూం లోపలి నుంచి డోర్ వేసి ఉంది. రాఘవేందర్రావును ఎంత పిలిచినా సమాధానం రాకపోవడంతో.. కిటికిలోంచి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే తలుపు బద్దలు కొట్టి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా రాఘవేందర్ రావు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, దీంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మనవడి పుట్టిన రోజు నాడే రాఘవేందర్ రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. -
భర్త వేధింపులు తట్టుకోలేక..
మియాపూర్: మనస్పర్థలు, కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ సీఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా చత్రి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన మొక్కపాటి వెంకట నాగలక్ష్మి(28) వివాహం భీమవరానికి చెందిన సామినేని సతీష్ తో 2018లో జరిగింది. వీరికి 2019లో కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల తర్వాత వారు విడిపోయారు. 2023 నవంబర్లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుమార్తె వెంకటనాగలక్ష్మి దగ్గరే ఉంటుంది. నాగలక్ష్మి కూతురుతో కలిసి మియాపూర్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది.ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు 22న నాగలక్ష్మి ఏలూరు జిల్లా తోచిలుక గ్రామానికి చెందిన మువ్వా మణికంఠ మనోజ్ను రెండవ వివాహం చేసుకుంది. మనోజ్ సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరిగాయి. నాగలక్ష్మి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని మనోజ్ తన పేరుపై నమోదు చేయాలని, బ్యాంక్ అకౌంట్కు తన ఫోన్ నంబర్ను యాడ్ చేయించాలని ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ పాస్వర్డ్లు చెప్పాలని తరచూ వేధిస్తుండేవాడు. ఇటీవల కాలంలో రెండుసార్లు ఆమెను విపరీతంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. మనస్తాపం చెందిన నాగలక్ష్మి గత నెల 28వ తేదీన ఆన్లైన్లో గడ్డిమందు ఆర్డర్ చేయగా ఈ నెల 4వ తేదీ డెలివరీ అయ్యింది. కాగా బుధవారం మనోజ్, నాగలక్ష్మిల మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నాగలక్ష్మి భర్త మనోజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. -
మియాపూర్ శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ శ్రీచైతన్య కాలేజీలో ఓ విద్యార్థి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీచైతన్య బాయ్స్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువున్న విద్యార్థి కౌశిక్ రాఘవ(17) నిన్న రాత్రి హాస్టల్ గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ లో చిరుత కలకలం
-
HYD: మియాపూర్లో చిరుత.. భయాందోళనలో స్థానికులు
సాక్షి,హైదరాబాద్: అడవుల్లో ఉండే చిరుత భాగ్యనగరంలోకి ఎంటరైంది. శుక్రవారం(అక్టోబర్ 18)మియాపూర్ లో చిరుత సంచరించడం సంచలనం రేపింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏకంగా మియాపూర్ మెట్రో స్టేషన్ వెనుక భాగంలో చిరతు సంచరించింది. స్థానికుల సమాచారంతో చిరుత సంచరించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చిరుత కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న వీడియోను స్థానికులు ఫోన్లో బందించారు. -
‘హైడ్రా’ సిఫార్సులు.. మియాపూర్లో అక్రమ కట్టడాలపై రెవెన్యూ కొరడా
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ కట్టడాలు చేసిన బిల్డర్పై కేసు నమోదు చేశారు. మ్యాప్స్ ఇన్ఫ్రా యజమాని సుధాకర్ రెడ్డి పైన కేసు నమోదైంది. మ్యాప్స్ కంపెనీ సుధాకర్రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదు చేసిన అధికారులు.. హైడ్రా సిఫార్సు మేరకు కేసులు నమోదు చేశారు.ఎర్రగుంట చెరువును ఆక్రమించి చేసి బహుళ అంతస్తుల భవనాలను మ్యాప్స్ నిర్మించింది. ఈర్ల చెరువులో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించిన ముగ్గురిపై బిల్డర్స్పై కేసులు నమోదు చేశారు. స్వర్ణలత, అక్కిరాజు శ్రీనివాసులపై కేసులు నమోదయ్యాయి.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. హైడ్రా సిఫారసు మేరకు ఆరుగురు అధికారులపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణఫై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పునాటి నరసింహారావుకు ఇండియన్ పోలీస్ మెడల్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగంలో నిబద్ధత కలిగి ఉండటం.. ఏ విభాగంలో పని చేసినా.. అక్కడ అత్యుత్తమ సేవలందించడం.. డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారుల చేత మన్ననలు అందుకోవడం ఆ పోలీసు అధికారికి మొదటి నుంచి ఉన్న ట్రాక్ రికార్డ్. అందుకే ఇప్పుడు ఇండియన్ పోలీస్ మెడల్ ను అందుకుని మరోసారి తన వర్క్లో సిన్సియారిటీని చూపించారు. ఆయన ఎవరో కాదు.. హైదరాబాదులోని మియాపూర్ ఏసీపీ నరసింహరావు. మియాపూర్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపికయ్యారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన మెడల్ను అందుకున్నారు. 1995లో ఎస్సైగా విధుల్లో చేరిన ఆయన 2009లో సి.ఐగా పదోన్నతి పొందారు. వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించారు. పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలకు గాను గతంలోనూ ఉత్తమ సేవా పతకం అందుకోగా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్(ఐ.పి.యమ్ )కు ఎంపిక చేసింది. 2021లో ఏసీపీగా పదోన్నతి పొందిన ఆయన.. ఇంటిలిజెన్స్ విభాగంలో కొంతకాలం పనిచేశారు. ప్రస్తుతం నరసింహారావు మియాపూర్ ఏసిపిగా విధుల్లో కొనసాగుతున్నారు. ఇండియన్ పోలీస్ మెడలను అందుకున్న ఆయనకు మియాపూర్ సబ్ డివిజన్ కు చెందిన పోలీసు సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, డిపార్ట్ మెంటుపై ప్రజలకు నమ్మకం కలిగించడం... అవగాహన, కౌన్సెలింగ్ ద్వారా నేరాలు చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయడం లాంటివి చేస్తూ... తన ఉద్యోగధర్మ నిర్వర్తిస్తున్నట్టు ఏసీపీ నరసింహరావు మెడల్ అందుకున్న సందర్భంగా చెప్పారు. తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే తాను డిపార్టుమెంటులో అత్యుత్తమ సేవా పతకాలు పొంది. ప్రజలకు మరింత చేరువ అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ తన శక్తి మేరకు మంచి సేవలందించడమే తన కర్తవ్యమని ఆయన చెప్పారు. -
Hyderabad: మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపింది. సైబర్ టవర్స్ దగ్గర అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 14 మంది యువకులు, ఆరుగురు యువతులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బర్త్డే పార్టీ సందర్భంగా రేవ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.నిర్వాకుడు నాగరాజ్ యాదవ్తో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపివేశారు. విదేశీ మద్యంతో పాటు డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్లో దారుణం..కారులో యువతిపై గ్యాంగ్ రేప్
సాక్షి,హైదరాబాద్ : హైదరాబాద్లో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై సామూహిక హత్యాచారం జరిగింది.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల్ని అరెస్ట్ చేసిన జైలుకు తరలించినట్లు పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జేఎస్ఆర్ గ్రూప్ సన్సిటీ అనే రియల్ ఎస్టేట్ కంపెనీలో బాధితురాలు ట్రైనీగా చేరింది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సంగారెడ్డి, జనార్దన్రెడ్డి బాధితురాలితో కలిసి సైట్ విజిట్ నిమిత్తం యాదాద్రికి కారులో వెళ్లారు. అక్కడ సైట్ విజిట్ చేసి తిరిగి వస్తుండగా నిందితులు ఆమెకు ముందుగా మత్తు మందు కలిపిన ఆహార పదార్ధాలు తినేలా ప్లాన్ చేశారు. ఆమె తినకపోవడంతో మత్తుమందు కలిపిన కూల్డ్రింగ్ ఇచ్చారు. ఆ కూల్డ్రింక్ తాగిన ఆమెపై కారులోనే దారుణానికి ఒడిగట్టారు. అనంతరం ఆమెకు స్ప్రహ రావడంతో హస్టల్ దగ్గర వదిలేసి పరారయ్యారు. అయితే తనపై జరిగిన దాడిపై బాధితురాలు ఉప్పల్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ కేసును మియాపూర్ పోలిస్ స్టేషన్కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సంగారెడ్డి, జనార్ధన్రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాల్ని ఆస్పత్రికి తరలించారు. నిందితులు విచారణలో చేసిన దారుణాన్ని అంగీకరించారు అని పోలీసులు వెల్లడించారు. -
మియాపూర్ లో తగ్గిన ఉద్రిక్తత, అమలులో 144 సెక్షన్
-
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
-
HYD Alert: మియాపూర్, చందానగర్ పరిధిలో 144 సెక్షన్ విధింపు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్, చందానగర్ పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.కాగా, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదివారం ఉదయం మియాపూర్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మదీనాగూడ సర్వే నెంబర్ 100, 101లో శాంతి భద్రతలను పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నాం. మియాపూర్, చందానగర్ పరిధిలో ఈరోజు నుంచి జూన్ 29వ తేదీ వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఎక్కువ మంది వ్యక్తులు గుమ్మిగుడి ఉన్న చట్టపరమైన చర్యలు ఉంటాయి. ప్రభుత్వ స్థలాలలో ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందిపైన కేసులు నమోదు చేశాం. మరికొంత మందిని గుర్తించి కేసులు పెడతాము అని చెప్పారు. ఇదిలా ఉండగా.. మియాపూర్లో ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసుల కేసులు నమోదు చేశారు. సంగీత, సీత అనే మహిళలు చాలా మంది మహిళలను రెచ్చగొట్టారని తెలిపారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారని అన్నారు. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. The people of Miyapur came to take over the lands campaigned on social media in Hyderabad saying come and take over the lands.#Hyderabad #Miyapur pic.twitter.com/z29xhzJWvX— ఉత్తరతెలంగాణ నౌ (@UttaraTGNow) June 23, 2024 -
మియాపూర్ ఘటనపై స్పందించిన కేటీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు.కాగా, శనివారం మియాపూర్లోని హెచ్ఎండీఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోవడం.. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడంపై కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని స్పష్టం చేశారు. అలాగే, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చూశారా అంటూ కామెంట్స్ చేశారు. No Law No OrderHave you ever seen such nonsense in last 10 years? https://t.co/nd4LP6P72n— KTR (@KTRBRS) June 23, 2024 ఇదిలా ఉండగా.. మియాపూర్లోని దీప్తిశ్రీనగర్లో శనివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ భూమిలో వేలాది మంది గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసుల సహాయం వాటిని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.కాగా, శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నంబర్లు 100, 101లో సుమారు 504 ఎకరాల్లో హెచ్ఎండీఏ భూమి ఉన్నది. ఇందులో గుడిసెలు వేసుకొని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. అయితే, ప్రభుత్వం ఇక్కడ ఇండ్ల స్థలాలు ఇస్తుందని స్థానికంగా ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడి పలు ప్రాంతాల నుంచి భారీగా జనం తరలివచారు. దాదాపు 2వేల మంది వరకు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అధికారులు యత్నించారు.అయితే, గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ అధికారులు హెచ్చరించారు. వారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో కదిలేది లేదంటున్నారు. దీంతో మియాపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గతంలో ఇది ప్రభుత్వ భూమని తెలియక 16మంది వ్యక్తులు కొన్నారని పోలీసులు తెలిపారు. భూమి ప్రభుత్వానిదని కోర్టు నిర్ధారించి.. హెచ్ఎండీఏకు అప్పగించిందన్నారు. కొందరు కొన్నవారు సుప్రీం కోర్టును ఆశ్రయించారని.. మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. -
మియాపూర్: వీడిన బాలిక హత్య కేసు మిస్టరీ
సాక్షి,హైదరాబాద్: మియాపూర్లో సంచలనం రేపిన బాలిక హత్య కేసును పోలీసులు చేదించారు. బాలిక మర్డర్ కేసులో ఆమె తండ్రే హంతకుడని పోలీసులు తేల్చారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారించారు. బాలిక మిస్సింగ్ మిస్టరీ వారం రోజుల తర్వాత వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రి బానోతు నరేష్ పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.తన కోరిక తీర్చాలంటూ బాలికపై తండ్రి ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు హత్య జరిగిన ప్రదేశానికి నిందితుడు తిరిగి వెళ్లినట్లు గుర్తించారు. -
మియాపూర్లో సందడి చేసిన డింపుల్ హయాతి (ఫొటోలు)
-
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ను సీపీ సస్పెండ్ చేశారు. సదరు సీఐ ఓ మహిళతో అమర్యాదకంగా ప్రవర్తించిన కారణంగా ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. మియాపూర్ సీఐ ప్రేమ్కుమార్ను సైబరాబాద్ సీపీ సస్పెండ్ చేశారు. కాగా, తనతో అమర్యాదగా ప్రవర్తించారని ఓ మహిళ సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో, సదరు మహిళ ఫిర్యాదుపై సీపీ అవినాష్ మహింతి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఆమెతో ప్రేమ్కుమార్ అమర్యాదగా ప్రవర్తించాడని తేలడంతో సీఐని సస్పెండ్ చేశారు. -
భక్తులారా జాగ్రత్త..గణేష్ లడ్డు మాయం..
-
అత్తింటి కుటుంబంపై అల్లుడు విష ప్రయోగం..
హైదరాబాద్: మియాపూర్లో దారుణం జరిగింది. సొంత అల్లుడే అత్తింటి కుటుంబంపై విషప్రయోగం చేశాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. మిగిలిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్తింటివారిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే బాధిత కుటుంబానికి చెందిన అల్లుడు వారిపై విష ప్రయోగం చేశాడని పోలీసులు తెలిపారు. అత్తింటివారిని అంతం చేయాలని పథకం పన్నిన అల్లుడు అజిత్.. వారు తినే ఆహారంలో విషం కలిపాడు. విషయం తెలియక ఆ విష ఆహారాన్ని తిన్న బాధితుల ఆరోగ్యం క్షీణించసాగింది. హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసిన నిజానిజాలను పసిగట్టారు. నిందితుడు ముప్పవరపు అజిత్ కుమార్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికి ఆరుగుర్ని అరెస్టు చేశారు పోలీసులు. శిరీష తల్లి మహేశ్వరి మృతి చెందింది. ఇతర కుటుంబ సభ్యులకు హస్పిటల్లో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇదీ చదవండి: Bholakpur Scrap Godown Blast: బోలక్పూర్లో పేలుడు.. -
Hyderabad: 300 మందిని నిండా ముంచిన రియల్ఎస్టేట్స్ సంస్థ
మియాపూర్ (హైదరాబాద్): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును ప్లాట్ల కొనుగోలు కోసం చెల్లిస్తే.. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ఎస్టేట్స్ సంస్థ వారిని నిండా ముంచింది. సుమారు 300 మంది నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసి.. వారికి ప్లాట్లు ఇవ్వకుండా, డబ్బులూ తిరిగివ్వకుండా బోర్డు తిప్పేసింది. దీనితో హైదరాబాద్లోని మియాపూర్ ఆల్విన్ క్రాస్రోడ్డు వద్ద ఉన్న మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆదివారం ధర్నాకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో అక్కడి నుంచి మియాపూర్ పోలీస్స్టేషన్ వరకు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలదాకా.. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన జానీ బాషాషేక్ రామంతాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మియాపూర్లో మైత్రి ప్రాజెక్టు రియల్ ఎస్టేట్స్ పేరిట కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. హైదరాబాద్ శివార్లలోని గాగిలాపూర్లోని రాయల్ లీఫ్, రామేశ్వర్బండలోని రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ వింట్, హంబ్టాన్ ఫామ్స్ పేరుతో వెంచర్లు వేసి.. ఓపెన్ ప్లాట్లను విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ప్లాట్లను ఇస్తామంటూ ప్రజలను నమ్మించాడు. పలు ప్రాంతాలకు చెందిన 300 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుండి రూ.30 లక్షల మేర కట్టించుకున్నాడు. కానీ రిజిస్ట్రేషన్స్ చేయకుండా బాధితులను మూడేళ్లుగా తిప్పించుకుంటూ వచ్చారు. చివరికి మకాం మార్చి సంస్థకు తాళం వేసి పారిపోయాడు. నెల రోజుల కిందే ఫిర్యాదు చేసినా.. తమకు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్, పటాన్చెరువు, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లలో నెల రోజుల క్రితం ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మైత్రి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మియాపూర్ పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ చేశామని వివరించారు. మైత్రిలో డబ్బులు కట్టినవారంతా పేద, మధ్య తరగతికి చెందినవారమేనని.. తమ కలలు కల్లలు అవుతున్నాయని వాపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
హైదరాబాద్ మియాపూర్ లో భారీ మోసం
-
హైదరాబాద్: బోర్డు తిప్పేసిన మైత్రి ప్రాజెక్ట్ సంస్థ
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ పేరడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండి జానీ భాషా షేక్ గత మూడు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మబ్బి పెడుతూ కాలం గడుపుతున్నాడని బాధ్యతలు తెలిపారు. ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పుడు దాకా ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. ఇందులో అందరూ మధ్య తరగతి, పేద తరగతి వారే ఉన్నామని దయచేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇందుకు నిరసనగా ఈరోజు మియాపూర్ ఆల్విన్ కాలనీలోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసుల స్పందించి వెంటనే జానీ భాషా షేక్ ను అరెస్టు చేయాలని కోరారు. చదవండి: ఆ దేవుడు నిన్ను తీసుకెళ్లాడా బావా.. నాకు తోడుగా ఉంటావనుకుంటే.. -
31 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,297 కోట్లా..!
సాక్షి, హైదరాబాద్: ఆరు వరుసలకు విస్తరిస్తున్న రోడ్డది.. నిడివి 31 కి.మీ. మాత్రమే. కానీ దాని నిర్మాణానికి మాత్రం ఏకంగా రూ. 1,297 కోట్లు ఖర్చు కానుంది! అంటే ఒక కిలోమీటర్కు దాదాపు రూ. 42 కోట్ల వ్యయం అన్నమాట. దీన్ని మరోలా చెప్పాలంటే ఎనిమిది వరుసలు, 158 కి.మీ. నిడివితో రూపుదిద్దుకున్న ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్కు అయిన ఖర్చు స్థాయికి దాదాపు సమానమన్నమాట! ఈ కాస్త దూరానికే అంత ఖర్చు ఎందుకు అనుకుంటున్నారా? ఇందులో నిర్మించేది ప్రధాన రోడ్డొక్కటే కాదు.. సరీ్వసు రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, జంక్షన్ల వద్ద వంతెనలు, అండర్పాస్లు, కల్వర్టులు.. ఒకటేమిటి ఎక్స్ప్రెస్ వే అంటే ఇలా ఉండాలనే రీతిలో ఇది రూపుదిద్దుకోబోతోంది. ఓ రకంగా చెప్పాలంటే మోడల్ ఎక్స్ప్రెస్ వేగా నిలవబోతోంది. హైదరాబాద్–పుణే జాతీయ రహదారిపై మియాపూర్–సంగారెడ్డి మధ్య ఉన్న ఈ మార్గం ఎక్స్ప్రెస్ వే తరహాలో ముస్తాబుకానుంది. అందుకే ఖర్చు సైతం భారీగా ఉంది. ట్రాఫిక్ చిక్కులకు తెరదించేలా... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో విస్తరించి ఉన్న 65వ నంబర్ జాతీయ రహదారిపై కొన్నేళ్లుగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో దాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ శివార్లలో ఆ మార్గాన్ని యుద్ధప్రాతిపదికన 6 వరుసలకు విస్తరించనుంది. ఇందులో హయత్నగర్ దాటాక విజయవాడ రోడ్డులో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు విస్తరణను చేపట్టనుండగా ముంబై రహదారిలో మియాపూర్ సమీపంలోని మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం అభివృద్ధి చేయనుంది. తాజాగా మదీనాగూడ–సంగారెడ్డి మధ్య 6 వరుసల విస్తరణ పనులకు సంబంధించిన డీపీఆర్కు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అ«దీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదించింది. దీంతో ఇక టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవి ఖరారయ్యాక రెండున్నరేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. రోజుకు సగటున లక్ష వాహనాలు.. నగరం నుంచి సంగారెడ్డి రోడ్డు అత్యంత బిజీగా మారిపోయింది. డీపీఆర్ తయారీలో భాగంగా గత ఆగస్టులో ఇస్నాపూర్, పటాన్చెరు మధ్య వెళ్తున్న వాహనాల సంఖ్యపై జాతీయ రహదారుల విభాగం సర్వే నిర్వహించగా ఒక రోజులో సగటున లక్ష వాహనాలు ప్రయాణిస్తున్నట్లు తేలింది. పటాన్చెరు వద్ద రోజుకు 30,683 కార్లు, 12,353 త్రిచక్ర వాహనాలు, 34,437 ద్విచక్ర వాహనాలు, 5,551 బస్సులు, 9 వేల ట్రక్కులు... ఇలా అన్నీ కలిపి రోజుకు లక్ష వరకు తిరుగుతున్నాయి. ఇక మదీనాగూడ ప్రాంతంలో ఆ సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ రోడ్డును విస్తరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడేం చేస్తారు..? మదీనాగూడ నుంచి సంగారెడ్డి వరకు 31 కి.మీ.మేర రోడ్డును 6 వరుసలకు విస్తరించనున్నారు. మూడు వరుసల సరీ్వసు రోడ్డు, ఫుట్పాత్, వరద నీటి డ్రెయిన్తో 11.66 కి.మీ., మిగతా నిడివిలో రెండు వరుసల సరీ్వసు రోడ్డు ఉండేలా నిర్మించనున్నారు. రుద్రారం వద్ద 1,020 మీటర్ల మేర, గంగారం వద్ద 840 మీటర్ల మేర రెండు ఎలివేటెడ్ కారిడార్లతోపాటు కొత్తగా 11 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఏడు మేజర్, 19 మైనర్ జంక్షన్లను విస్తరించనున్నారు. ఏడు ప్రాంతాల్లో అండర్పాస్లు, ఆరు చోట్ల కల్వర్టులను కట్టనున్నారు. ఐదు ప్రాంతాల్లో లిఫ్టు వసతి ఉండే ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, రోడ్డుకు రెండు వైపులా క్రాష్ బ్యారియర్లను ఏర్పాటు చేయనున్నారు. వెరసి ప్రధాన క్యారేజ్ వే మీదకు చుట్టుపక్కల నుంచి ఇతర వాహనాలు, మనుషులు, జంతువులు వచ్చే వీలుండదు. ప్రధాన క్యారేజ్ వే మీదుగా వెళ్లే వాహనాలకు, దీన్ని దాటుతూ అటూఇటూ పోయే వాహనాలకు పరస్పరం ఆటంకం లేని విధంగా డిజైన్ చేశారు. ఇందుకు వీలుగా అదనంగా కావాల్సిన భూమి కోసం రూ. 166 కోట్లు వెచి్చస్తున్నారు. అన్నీ కలిపి నిర్మాణానికి రూ. 1,297 కోట్లు ఖర్చు కానున్నట్టు డీపీఆర్లో పేర్కొనగా దానికి తాజాగా కేంద్రం ఆమోదముద్ర వేసింది. బీహెచ్ఈఎల్ వంతెన కాకుండా.. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా బీహెచ్ఈఎల్ కూడలి వద్ద 131 కోట్లతో భారీ వంతెన నిర్మిస్తున్నారు. 60 మీటర్ల వెడల్పుతో అది ఉండనుంది. దాన్ని ఈ రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో కాకుండా విడిగా చూపారు. దానికి సంబంధించి ఎన్హెచ్ఏఐ రూపొందించిన నమూనా ప్రకారం పనులు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలోని ఎన్హెచ్ విభాగం ఇటీవల ప్రతిపాదించింది. దీనిపై ఇరు విభాగాల మధ్య విభేదాలు తలెత్తడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం మీరంటే మీరంటూ ఇరు విభాగాలు లేఖలు రాసుకోవడం వివాదాస్పదంగా మారింది. చదవండి: డేటా దేశం దాటిందా? -
Miyapur: బ్రష్ చేస్తుండగా మూర్ఛ.. సంపులో పడి యువతి మృతి
సాక్షి, మియాపూర్: ఓ యువతికి మూర్ఛరావడంతో సంపులో పడి మృతిచెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ గిరీష్ తెలిపిన మేరకు.. సూర్యాపేట జిల్లా గాం«దీనగర్లోని బాచనాయక్తండాకు చెందిన లునావత్ నిర్మల(26) మియాపూర్లోని మయూరినగర్ స్వదర్ గృహ అనాథాశ్రమంలో ఉంటుంది. నిర్మల మూర్చవ్యాధితో బాధపడుతుండేది. సోమవారం ఉదయం బ్రష్ చేసుకుంటూ ఉండగా మూర్ఛ రావడంతో అనాథాశ్రమ ప్రాంగణంలో ఉన్న సంపులో పడిపోయింది. ఎవరూ చూడకపోవడంతో అందులో మునిగి మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత నిర్మల అశ్రమంలో కనిపించకపోవడంతో నిర్వాహకులు వెతకగా సంపులో కనిపించింది. బయటకు తీయగా అప్పటికే మృతిచెంది ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని గాందీ ఆసుపత్రికి తరలించారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మియాపూర్ బస్టాండ్లో వ్యక్తి దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ బస్టాండ్లో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. తాగిన తర్వాత ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమై ఉండవచ్చాని పోలీసులు భావిస్తున్నారు. బండరాయితో నెత్తి పైన గట్టిగా కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. మృతుడిని బీహార్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’
సాక్షి, హైదరాబాద్: ఒత్తిడి తట్టుకోలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రాయుడు శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబం కేవీఆర్ టవర్స్లో నివాసముంటోంది. కుమార్తె సంజన(14) పటాన్చెరు బీరంగూడలోని అకడమిక్ పబ్లీక్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం సంజన పాఠశాలకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. అనంతరం తన బెడ్రూమ్లోకి వెళ్లి గడియ పెట్టుకుంది. చాలా సేపటి వరకు సంజన బయటికి రాకపోవడంతో తల్లి శిరీష, సోదరుడు మోహిత్లు తలుపులు తట్టగా ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా సీలింగ్ ప్యాన్కు వేలాడుతూ కనిపించింది. స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఓ పేపర్పై హాయ్ అమ్మా... నాన్న.. మోహిత్ నేను అసలు ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించండి... ఐ లవ్ యూ అని రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడిందని గుర్తించారు. చదువులో ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక అంచనలో తేలింది. -
మియాపూర్ టు సంగారెడ్డి ట్రాఫిక్ రద్దీకి చెక్.. ఆరు వరుసలుగా రోడ్డు
సాక్షి, హైదరాబాద్: మియాపూర్–సంగారెడ్డి మార్గంలో నిత్యం నరకప్రాయంగా ఉన్న ట్రాఫిక్ రద్దీకి తెరపడనుంది. ట్రాఫిక్ చిక్కులు తొలగిపోనున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి కూడలి (పోత్రెడ్డిపల్లి చౌరస్తా) వరకు ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డును ఆరు వరుసలుగా 60 మీటర్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి డీపీఆర్ సిద్ధమైంది. వారం రోజుల్లో ఇది కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రిత్వ కార్యాలయ అనుమతి కోసం ఢిల్లీ చేరనుంది. అక్కడి నుంచి అనుమతులు రాగానే టెండర్లు పిలిచేందుకు జాతీయ రహదారుల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. 31 కి.మీ. నిడివి ఉన్న ఈ రోడ్డు విస్తరణకు రూ.1,400 కోట్ల వ్యయం కానుంది. ఇందులో రోడ్డునిర్మాణ పనులకు రూ.వేయి కోట్లు, భూసేకరణ పరిహారానికి రూ.400 కోట్లు ఖర్చు కానుంది. నగరంలోనే పెద్ద రోడ్డుగా.. ఈ మార్గంలోనే ఉన్న కూకట్పల్లి వద్ద అత్యంత రద్దీ ట్రాఫిక్ వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటికే మియాపూర్ వరకు రోడ్డును విస్తరించింది. అక్కడి నుంచి రోడ్డు విస్తరణ బాధ్యతను జాతీయ రహదారుల విభాగం తీసుకుంది. ఈ రోడ్డు 60 మీటర్లకు వెడల్పు కానుంది. ప్రధాన క్యారేజ్ వే, దాని పక్కన సర్వీస్ రోడ్లు కలిపి 200 అడుగుల విశాలంతో రోడ్డు ఏర్పడుతుంది. నగరంలో విశాలంగా ఉన్న ప్రధాన రోడ్డు ఇదే కానుంది. ప్రస్తుతం రోడ్డు నాలుగు వరుసలుగా ఉన్నా.. 60 మీటర్ల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ మొత్తం రోడ్డుగా మారబోతోంది. అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు ఈ రోడ్డులో వాహనాలకు క్రాసింగ్ రోడ్లతో ఇబ్బంది లేకుండా ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ఇందులో బీహెచ్ఈఎల్ వద్ద ఫ్లైఓవర్ రానుంది. దీనిని ఈ రోడ్డులో భాగంగానే నిర్మించాల్సి ఉంది. అక్కడ ట్రాఫిక్ చిక్కుల దృష్ట్యా ఆ పనులను విడదీశారు. త్వరలో అక్కడ నిర్మాణ పనులు జరగబోతున్నాయి. ఇక పటాన్చెరు, ఇస్నాపూర్, ముత్తంగి, రుద్రారం,కంది ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. నగరంలో ప్రస్తుతం రోడ్డు విస్తరణకు వీలుగా 60 మీటర్ల స్థలం అందుబాటులో ఉంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప పెద్దగా నిర్మాణాలు అడ్డుగా లేవు. బీహెచ్ఈఎల్ దాటిన తర్వాత చాలా ప్రాంతాల్లో నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. ఏప్రిల్ నాటికి టెండర్లు పూర్తి చేసి జూలై నాటికి పనులు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పనులు ప్రారంభమైన రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. కానీ, రెండున్నరేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. -
మియాపూర్ ప్రేమోన్మాది దాడి కేసు: యువతి తల్లి మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లోని ప్రేమోన్మాది దాడి కేసులో తీవ్రంగా గాయపడిన యువతి తల్లి శోభ మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. కాగా మియాపూర్లో సందీప్ అనే యువకుడు ప్రియురాలు వైభవీ ఆమె తల్లి శోభపై కత్తితో దాడి చేసి..తాను గొంతుకోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ తల్లి కూతుళ్ల వైభవీ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. నిందితుడు సందీప్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐతే ప్రస్తుతం సందీప్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఈఎన్టీ వైద్యులు తెలిపారు. అసలేం జరిగిందంటే గుంటూరు జిల్లా ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపుతుల కుమార్తె శోభ, నిందితుడు సందీప్ గతంలో ప్రేమించకున్నారు. ఇంట్లో వాళ్లు మందలించడంతో సందీప్ని దూరంగా ఉంచడమే గాక ఆమెకు మరోకరితో వివాహం నిశ్చయించారు. వచ్చే ఆదివారం నిశ్చితార్థం కాగా, ఈ విషయం తెలుసుకున్న సందీప్ కోపంతో వైభవీ ఇంటికి వచ్చి గొడవ చేసి.. కత్తితో తల్లి కూతుళ్లపై దాడి చేశాడు. ఆ తర్వాత అదే కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి అరుపులు విని స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత) -
ప్రియురాలికి మరోకరితో పెళ్లి....జీర్ణించుకోలేక కత్తితో దాడి..ఆ తర్వాత
సాక్షి, మియాపూర్ (హైదరాబాద్): ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై ఓ యువకుడు కత్తితో దాడి చేయడమేగాక తానూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... గుంటూరుజిల్లా, ఇసుకపల్లికి చెందిన వెంకటరాజు, శోభ దంపతులకు కుమార్తె వైభవీ, కుమారుడు గోవర్ధన్ ఉన్నారు. వెంకటరాజు ముంబైలో ప్యాబ్రికేషన్ పనులు చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శోభ తన కుమార్తె వైభవీ, గోవర్ధన్తో కలిసి మియాపూర్లోని న్యూ – హఫీస్పేట ఆదిత్య నగర్లో ఉంటోంది. కాగా అదే గ్రామానికి చెందిన సందీప్ అలియాస్ బబ్లూ వారి ఇంటి పక్కనే ఉండేవాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ విషయం తెలియడంతో వైభవి కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. దీంతో కొన్నాళ్లుగా వైభవీ సందీప్ను దూరం పెడుతుంది. దీనిని జీర్ణించుకోలేని సందీప్ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తరచూ ఫోన్ చేసి తనతో మాట్లాడాలని లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో శోభ ఇద్దరు పిల్లలతో సహా నగరానికి వలస వచ్చి న్యూ – హాపీస్పేట ఆదిత్యనగర్లో ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం వైభవికి తమ సమీప బంధువుతో పెళ్లి కుదిరింది. వచ్చే ఆదివారం వారి నిశ్చతార్థం జరిపేందుకు నిశ్చయించారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం ఉదయం నగరానికి వచ్చిన సందీప్ నేరుగా వైభవి ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. కోపంతో కూరగాయాలు కోసే కత్తితో వైభవీ, ఆమె తల్లి శోభపై దాడి చేశాడు. వైభవిని గొంతు కింద చాతీభాగంలో, తల్లి శోభను కడుపులో పొడిచాడు. ఆ తర్వాత అదే చాకుతో దీపూ గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న ముగ్గురిని ఆసుపత్రికి కొండాపూర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సందీప్ను కోఠిలోని ఈఎన్టీ ఆసుపత్రి తరలించారు. వైభవీ, తల్లి శోభలను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిలకడగా సందీప్ ఆరోగ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందీప్ను పోలీసులు కోఠి ఈఎన్టీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగి పరిస్థితి పరిశీలించిన ఈఎన్టీ వైద్యులు అతడి గొంతుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
హైదరాబాద్: మియాపూర్లో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, హైదరాబాద్: ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. నగరంలోని మియాపూర్ ఆదిత్యానగర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడు ఓ వ్యక్తి. తనను దూరం పెడుతుందనే కోపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఇక దాడి సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని తీవ్రంగా గాయపర్చాడు ఆ ప్రేమోన్మాది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం తాను గొంతు కోసుకుని ఆ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. బాధితురాలిని వైభవిగా, తల్లి శోభగా గుర్తించారు. వాళ్లను చికిత్స కోసం కొండాపూర్ కిమ్స్కు తరలించారు. మరోవైపు ప్రేమోన్మాది సందీప్ అలియాస్ బబ్లూను చికిత్స కోసం గాంధీకి తరలించినట్లు తెలుస్తోంది. బబ్లూ స్వస్థం రేపల్లెగా గుర్తించారు. రేపల్లెకు చెందిన సందీప్ కుమార్ అలియాస్ బబ్లూ, వైభవికి మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రెండేళ్ల నుండి బబ్లూని దూరం పెడుతూ వస్తోంది వైభవి. ఫోన్ నెంబర్ సైతం బ్లాక్ చేయడంతో.. వేరే నెంబర్లతో కాల్ చేసి తనతో మాట్లాడాలని వేధించసాగాడు బబ్లూ. మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లేదంటే చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ మే నెలలో రేపల్లె నుండి హైదరాబాద్ వచ్చి ఆదిత్య నగర్ లో తన తల్లి, సోదరుడితో ఉంటోంది వైభవి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్కు వచ్చిన సందీప్.. నేరుగా వైభవి ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడు. ఆ ఆవేశంలోనే వైభవితోపాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అదే కత్తితో గొంతు కోసుకున్నాడు సందీప్. -
'నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. జీవితాన్ని చాలిస్తున్నా'
సాక్షి, హైదరాబాద్(మియాపూర్): డిగ్రీ విద్యార్థిని 20 అంతస్థుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనపై ఎస్ఐ యాదగిరి రావు అందించిన వివరాలివి. పటాన్చెరులోని ఏపీఆర్ ఫామ్స్లో నివసిస్తున్న మణినాథ్, సౌందర్యల కూతురు కోమలిక (21) నిజాం కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మియాపూర్లోని మాతృశ్రీనగర్లోని ఎస్ఎంఆర్ వినయ్ ఫౌంటెన్ హెడ్ అపార్ట్మెంట్లోని అమ్మమ్మ, తాతయ్య ఫ్లాట్లో 6 నెలలుగా ఉంటోంది. ఈ క్రమంలో కోమలిక కళాశాల నుంచి మంగళవారం సాయంత్రం అమ్మమ్మ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి అపార్ట్మెంట్ 20వ అంతస్తు పైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకింది. తల, శరీర భాగాలకు తీవ్ర రక్తపు గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. డైరీలో ‘నాకు చనిపోవాలని అనిపిస్తోంది.. నా జీవితాన్ని చాలించుకుంటున్నా’ అని ఇంగ్లిష్లో రాసి పెట్టిందని పోలీసులు తెలిపారు. కోమలిక ఫోన్ను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
భవనం నుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
మియాపూర్: ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు టెర్రస్పై నుంచి పడి మృతి చెందాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. విజయవాడకు చెందిన నాగ సందీప్(32), భార్య సింధూజ, కూతురుతో కలిసి దీప్తీశ్రీనగర్లోని విశ్వం ఎలైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. నాగ సందీప్ దుబయ్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల క్రితం కూతురు పుట్టిన రోజు సందర్భంగా నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సోదరుడు కార్తీక్ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి అపార్ట్మెంట్లోకి వచ్చి ఇంట్లోకి వెళ్లకుండా ఐదు అంతస్తుల టెర్రస్పైకి వెళ్లి కూర్చొని ఆన్లైన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ల్యాప్టాప్తో సహా కిందపడ్డాడు. రాత్రి కావడంతో ఎవరూ గమనించలేదు. ఉదయం 5.30 గంటల సమయంలో తండ్రి సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్న సందీప్ను గమనించాడు. స్థానికుల సహాయంతో దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు సోదరుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాపు ్తచేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కదం తొక్కిన కార్మికులు) -
Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం
మియాపూర్: గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు మహిళలను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్లోని ప్రభా సాయిధరమ్ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు అపార్ట్మెంట్లో మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశాఖపట్నం చిన్నజాగ్రావుపేటకు కిష్టాఫర్ సన్నీ(25), చెలమ భరత్ (35), మరో ఇద్దరు మహిళలను గుర్తించారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా కిష్టాఫర్ సన్నీ, చెలమ భరత్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ వ్యభిచారం నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: (ప్రాణం తీసిన సెల్ఫోన్ వివాదం.. నవ వధువు ఆత్మహత్య) -
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో సేవలకు అంతరాయం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్లైన్ మెట్రో రూట్లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
Hyderabad: అపార్ట్మెంట్లో వ్యభిచారం.. పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై మియాపూర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన మేరకు.. మియాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో గురువారం దాడి చేశారు. ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్ ఇర్ఫాన్ (22), సాయిగణేష్రెడ్డి (27), మహిళను అదుపులోకి తీసుకున్నారు. దీంతో షేక్ ఇర్ఫాన్, గణేష్రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళను రెస్క్యూ హోమ్కు తరలించినట్లు తెలిపారు. చదవండి: (దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్) -
మియాపూర్లో సీక్రెట్గా హైటెక్ వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ రైడ్లో ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. మియాపూర్ గోకుల్ ప్లాట్స్లో ఉన్న సాయిరాం రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ 1205లో గుట్టుగా హైటెక్ వ్యభిచారం నడుస్తోంది. ఒంగోలుకు చెందిన షైక్ ఇర్ఫాన్(26), సాయి గణేష్ రెడ్డి(27)లు.. మహిళలతో వ్యభిచార వ్యవహారం నడుపుతున్నారు. కాగా, ఫ్లాట్లో వ్యభిచారం నడిపిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు శుక్రవారం రైడ్స్ వెళ్లారు. దాడుల్లో భాగంగా ఇద్దరు నిర్వాహాకులను అదుపలోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో అదుపులోకి తీసుకున్న ఓ మహిళను రెస్క్యూ హోమ్కు తరలించారు. వ్యభిచారం నిర్వహణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: న్యూడ్ కాల్స్తో పెళ్లి చేసుకోవాలని బ్లాక్ మెయిల్.. ప్రియుడ్ని హత్య చేసి యాక్సిడెంట్గా డ్రామా -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహాన్ని నడుపుతున్న నిర్వాహకుడితో పాటు మరో ఇద్దరిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని లిటిల్ రాక్ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. మెదక్ జిల్లా కాజీపల్లికి చెందిన విజయ్కుమార్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అతనితో పాటు మెదక్ జిల్లా శంకరంపేట్కు చెందిన అభిలాష్, మచ్చబొల్లారానికి చెందిన మహిళను(20) అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీస్స్టేషన్కు తరలించి విచారించగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు తెలిపారు. విజయ్కుమార్, అభిలాష్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళను మెమోరియల్ ట్రస్ట్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భార్య, భర్త.. మధ్యలో ప్రియుడు..క్రైమ్ కథా చిత్రమ్) -
తుపాకీ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
సాక్షి, మియాపూర్: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తుపాకీ తీసుకొచ్చి విక్రయిస్తున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏసీపీ కృష్ణప్రసాద్ వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన గౌతమ్ కుమార్ ఠాకూర్ అమీన్పూర్లో ఉంటూ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్కు చెందిన వికాస్ అనే వ్యక్తి నుంచి రూ.20 వేలకు దేశీ తుపాకీ(7.65) తీసుకువచ్చి మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకునేందుకు పథకం పన్నాడు. దీనిపై సమాచారం అందడంతో మియాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బొల్లారం రోడ్డులో ఆటోలో వస్తున్న గౌతమ్కుమార్ ఠాకూర్ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి లైసెన్స్ లేని పిస్తొల్, మూడు బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమావేశంలో సీఐ తిరుపతిరావు, ఎస్ఓటీ పోలీసులు నర్సింహారెడ్డి, ఎస్ఐ యాదగిరిరావు, డీఐ కాంతారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (చదవండి: కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం) -
మియాపూర్: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా..
సాక్షి, మియాపూర్: సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా గురువారం మియాపూర్ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్ తెలిపింది. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ... దాంతో.. -
మియాపూర్: డివైడర్ను ఢీకొని అమెజాన్ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, మియాపూర్: ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ మెట్రో పిల్లర్ను ఢీకొని ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కృష్ణా జిల్లా, పునాదిపాడు మండలం, కంకిపాడు గ్రామానికి చెందిన రావూరి దుర్గప్రసాద్(37) మియాపూర్లోని ప్రజయ్ సిటీలోని బ్లాక్ నంబర్.5లో ఉంటూ అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య శ్రావణి, మూడేళ్ల పాప ఉన్నారు. ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు బైక్పై ఇంటికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ నంబర్.631 వద్ద డివైడర్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో మియాపూర్ పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: దారుణం: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పసికందు -
'వివాహేతర సంబంధం అంటగడుతూ వేధిస్తున్నాడు'
-
అంతకు ముందే పెళ్లి.. వివాహేతర సంబంధం అంటూ రెండో భార్యను
సాక్షి, హైదరాబాద్: తనకు వివాహేతర సంబంధం అంటగడుతూ భర్త నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. భర్తతోపాటు అత్తామామలు, ఆదపడుచులందరు కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి ముందు పోరాటానికి కూర్చుంది. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియపూర్లో నివాసముంటున్న రవళిని(21) కాప్రా శ్రీరాం నగర్కు చెందిన వెంకటేష్(38) అనే వ్యక్తికి ఇచ్చి 2017 జూన్ 14న పెద్దలు వివాహం జరిపించారు. వివాహ సమయంలో కట్నం కింద 8లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు పెట్టారు. చదవండి: హైదరాబాద్ మొదటి పేరు భాగ్యనగర్ కాదు.. అసలు పేరు ఏంటంటే! అయితే వెంకటేష్కు అంతకుముందే వివాహం జరిగి విడాకులు కూడా అయి రవళిని వివాహం చేసుకోవడం గమనార్హం. వీరికి నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. వివాహం జరిగిన ఏడాది వరకు కాపురం బాగానే కొనసాగింది. తరువాత భర్త, అత్తామామలు, ఆడపడుచులు అందరూ కలిసి మానసికంగా, శారీరకంగా, సూటిపోటి మాటలతో దాడులకు దిగుతూ వేధింపులకు గురి చేస్తున్నారని రవళి ఆరోపించింది. చదవండి: అప్పుల బాధలు: గతంలో భర్త, చిన్నకుమారుడు, అల్లుడు.. ఇప్పుడేమో అదనపు కట్నం తీసుకురమ్మని, ఎవరితోనో వివాహేతర సంబంధముందని నిరాధార ఆరోపణలు చేస్తూ నిత్యం వేధిస్తున్నారని రవళి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వెంకటేష్ చెడు తిరుగుళ్లు తిరుగుతూ ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను గ్యాస్ లీక్ చేసి చంపాలని కూడా ప్రయత్నించినట్లు ఆరోపించింది. ప్రభుత్వం, పోలీసులు, మీడియా అందరూ కలిపి తనకు తగిన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసింది.తనకు న్యాయం జరిగే వరకు ధర్నా ఆపేది లేదని స్పష్టం చేసింది. -
ఏం జరిగిందో.. కరెంట్ వైర్ తీసుకుని రూమ్కి వెళ్లి..
సాక్షి,మియాపూర్(హైదరాబాద్): కరెంటు వైరుతో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవికిరణ్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్లోని హాఫీజ్పేట్ ఆదిత్యానగర్కు చెందిన సంపత్ (51) అదే కాలనీలో సెంట్రింగ్ సామాగ్రి గోడౌన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా గోడౌన్లోని సెక్యూరిటీ రూమ్లోనే ఉంటున్నాడు. ఇతనికి సంబంధించిన బంధువులు, స్నేహితులు ఎవరూ లేరు. శనివారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో సెంట్రింగ్ గోడౌన్లో పనిచేసే సిబ్బంది వచ్చి సెంట్రింగ్ సామగ్రిని తీసుకుపోయేందుకు వాచ్మెన్ డోరు తీసి చూడగా రూమ్లో సంపత్ వేలాడుతూ కనిపించాడు. దీంతో సిబ్బంది సూపర్ వైజర్ కిశోర్ దేవోజీ, మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేవని పోలీసులు తెలిపారు. గోడౌన్ సూపర్ వైజర్ కిశోర్ దేవోజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వరద బాధితులను రక్షిస్తూ.. ఆశల దీపం ఆరిపోయింది -
చిన్నారి అనుమానాస్పద మృతి
-
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం
-
మియాపూర్లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్లో దారుణం జరిగింది. 13 నెలల చిన్నారి అనుమానాస్పదంగా మృతి చెందింది. నిన్న ఓంకార్ నగర్లో చిన్నారి అదృశ్యం కాగా, ఈ రోజు తెల్లవారుజామున ఇంటి ముందు మృతదేహం లభ్యమైంది. తొలుత చిన్నారి మృతదేహాన్ని ఆమె అమ్మమ్మ చూసింది. ఇక నీటిలో ముంచి చిన్నారిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 13 ఏళ్ల బాలుడు ఎత్తికెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కళ్లు పొడిచి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాప మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. ఇవీ చదవండి: ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం భర్త ఫోన్కాల్: భార్యను చంపేశా.. కూతుర్లను కూడా చంపేస్తా.. -
Aspire Spaces: మియాపూర్లో అమేయా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన నిర్మాణ సంస్థ అస్పైర్ స్పేసెస్ మియాపూర్లో 10.18 ఎకరాల విస్తీర్ణంలో అమేయా పేరిట లగ్జరీ అపార్ట్మెంట్ను నిర్మిస్తోంది. 16.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో మొత్తం 1,066 ఫ్లాట్లుంటాయి. 9 బ్లాక్లలో స్టిల్ట్+13 అంతస్తులలో నిర్మాణం ఉంటుంది. 1,210 చ.అ. నుంచి 1,940 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. హెచ్ఎండీఏ, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్లో ధర చ.అ.కు రూ.4,849. డిసెంబర్ 2024 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని అస్పైర్ స్పేసెస్ ఎండీ టీవీ నర్సింహా రెడ్డి చెప్పారు. అమేయా ప్రాజెక్ట్కు ఆర్టి్కటెక్ట్గా జెన్సెస్ కంపెనీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ నిర్వహిస్తుంది. ల్యాండ్స్కేపింగ్ను టెర్రా ఫర్మా చేస్తుంది. 30కి పైగా ఆధునిక వసతులు.. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 50 వేల చ.అ.లలో క్లబ్హౌస్తో పాటు 30కి పైగా ఆధునిక వసతులుంటాయి. పిల్లల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ కోసం డే కేర్ అండ్ ఎన్రిచ్మెంట్ సెంటర్లు ఉంటాయి. యోగా, మెడిటేషన్ చేసుకోవటం కోసం ఆక్సిజన్ డిసిగ్నేటెడ్ స్పేసెస్, బిల్డింగ్ పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సెంటల్ కోర్ట్ యార్డ్ ల్యాండ్స్కేపింగ్, ఇండోర్ మరియు ఔట్డోర్ జిమ్ ఏర్పాట్లుంటాయి. మల్టీపర్పస్ బాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, మినీ థియేటర్, కల్చరల్ సెంటర్, స్పా, సెలూన్ పార్లర్, కాఫీ షాప్, గ్రాసరీ స్టోర్ ఉంటుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్వా్కష్ కోర్ట్ వంటివి ఉంటాయి. జాగింగ్ ట్రాక్, రెఫ్లెక్సాలజీ పాత్ ఉంటుంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన వర్క్ స్టేషన్స్ ఉంటాయి. 24 గంటలు వైఫై అందుబాటులో ఉంటుంది. కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ రూమ్స్ ఉంటాయి. లొకేషన్ హైలైట్స్.. మియాపూర్ మెట్రో స్టేషన్కి 5 నిమిషాలు దూరంలో అమేయా ప్రాజెక్ట్ ఉంటుంది. హైటెక్సిటీ 10 కి.మీ., ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కు చేరువలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, సెనీటా గ్లోబల్ స్కూల్, కెన్నిడీ గ్లోబల్ స్కూల్, సాన్ఫోర్డ్ గ్లోబల్ స్కూల్, సిల్వర్ ఓక్స్ వంటి పాఠశాలలున్నాయి. ఎస్ఎల్జీ హాస్పిటల్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్, ల్యాండ్మార్క్ ఆసుపత్రి, అంకురా హాస్పిటల్, రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రులు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్నాయి. జీఎస్ ఎం మాల్, మంజీరామాల్, ఫోరం మాల్, శరత్ క్యాపిటల్ మాల్, ఐకియా వంటివి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి. -
మియాపూర్: సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. మియాపూర్ నడిగడ్డ తండా సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో కానిస్టేబుల్ బుధవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్ పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చనిపోయిన కానిస్టేబుల్ గుజరాత్కు చెందిన సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్గ ఠాగూర్ శంకర్గా గుర్తించిన పోలీసులు.. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. -
మియాపూర్: ఐదేళ్ల చిన్నారిని లిఫ్టులోకి లాక్కెళ్లి..
సాక్షి, మియాపూర్: అపార్ట్మెంట్లోకి దూరి అక్కడ ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. రాజస్థాన్లోని గోరక్పూర్కు చెందిన గోరక్ ప్రసాద్, రేణుక పదేళ్ల నుంచి మియాపూర్ హాఫీజ్పేట్లోని మార్తాండనగర్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటూ ఇంటిరీయర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. మూడో కుమార్తె(5) సోమవారం మధ్యాహ్నం దుకాణంలో చాక్లెట్ తీసుకొని అపార్ట్మెంట్ ముందు ఆడుకుంటోంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్మెంట్లోకి వచ్చి చిన్నారిని అపార్ట్మెంట్ లిఫ్టులోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. చిన్నారి ఏడ్చుకుంటూ తల్లిదండ్రులకు విషయం చెప్పింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన మియాపూర్ ఎస్సై
సాక్షి, మియాపూర్: స్టేషన్ బెయిల్ మంజూరు చేయిస్తానని, మరో వ్యక్తి పేరును కేసులో లేకుండా చూస్తానని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. మియాపూర్నకు చెందిన షేక్ సలీమ్ పుమా కంపెనీకి చెందిన బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. వీటితో పాటు ఈ కంపెనీ పేరు వాడుకొని నకిలీ దుస్తులు కూడా అమ్ముతున్నట్లు మియాపూర్ పీఎస్లో వారం రోజుల క్రితం సదరు కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షేక్ సలీమ్తో పాటు అతని దుకాణంలో పనిచేస్తున్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి షేక్ సలీమ్కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు అతని షాపులో పనిచేసే ఉద్యోగి పేరు కేసులోంచి తొలగించేందుకు మియాపూర్ సెక్టార్– 2 ఎస్ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ నెల 3న ఎస్ఐ యాదగిరి రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం పోలీస్ స్టేషన్లో షేక్ సలీమ్ తీసుకుంటుండగా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ బృందం పట్టుకున్నారు. ఎస్ఐని అదుపులోకి తీసుకొని రూ.20 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎస్ఐ యాదగిరి అక్రమ ఆస్తులపై దృష్టి సారించారు. మియాపూర్లోని వీడియో కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు. -
బైక్తో బీటెక్ విద్యార్థి బీభత్సం.. 8 నెలల నిండు గర్భిణిని
హైదరాబాద్: మియాపూర్లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బైక్తో బీభత్సం సృష్టించాడు. అతి వేగంతో 8 నెలల గర్భిణి అయిన భానోత్ అచ్చిబాయిని బైక్తో డీకొట్టాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అచ్చిబాయికి ప్రమాదం తప్పినా.. గర్భం శోకం తప్పలేదు. ఆమెకు అబార్షణ అయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే విద్యార్థి బైక్ నడిపినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి:అమెరికాలో మియాపూర్ వాసి మృతి -
అమెరికాలో మియాపూర్ వాసి మృతి
-
అమెరికాలో మియాపూర్ వాసి మృతి
మియాపూర్: అమెరికాలో బోటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు మియాపూర్కు చెందిన యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా, అత్తలూరు గ్రామానికి చెందిన మాజీనేని నాగ వెంకట శ్రీనివాస్రావు, రమాదేవి దంపతులు నగరంలోని మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు ప్రవీణ్కుమార్(30) 2011లో ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ప్రస్తుతం టెక్సెస్ స్టేట్లోని ఆస్టిన్ నగరంలో ఉంటూ అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం ఈనెల 18న సాయంత్రం సమీపంలోని ఓ లెక్లో బోటింగ్ చేసేందుకు వెళ్లిన ప్రవీణ్ ప్రమాదవశాత్తు లెక్లో మునిగిపోయాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి మృతదేహాన్ని వెలికి తీసి, అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. శుక్రవారం ప్రవీణ్ కుమార్ మృతదేహం నగరానికి చేరుకోచ్చునని కుటుంబీకులు తెలిపారు. చదవండి: శామీర్పేట చెరువులో శవాలై తేలిన డాక్టర్లు, సెల్ఫీనే కారణమా? -
Photo Feature: వాహనాల బారులు, హిమాలయ అందాలు
కరోనా కట్టడికి తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉండటంతో ఈ సమయంలో హైదరాబాద్ నగర రహదారులు కిక్కిరిపోతున్నాయి. మరోవైపు కరోనా నుంచి రక్షణ కోసం రకరకాల మాస్క్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా కాలుష్యం తగ్గడంతో హిమాలయ సానువులు స్పష్టంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. -
ఏం జరిగిందో...తల్లి లేచే చూసేసరికి..
సాక్షి, హైదరాబాద్: ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం... కర్ణాటక రాష్ట్రం నాగరపల్లి గ్రామానికి చెందిన అశోక్, రమాదేవి దంపతులు మియాపూర్ టీఎన్ నగర్లో నివాసం ఉంటున్నారు. అశోక్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సింధే సుదీప్కుమార్ (18) ఉన్నారు. సుదీప్ స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఉండటంతో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతున్నాడు. తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద డబ్బులు తీసుకొని జల్సాలు చేస్తూ రోజూ అర్ధరాత్రి ఇంటికి వస్తుండేవాడు. దీంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఇదిలా ఉండగా, సుదీప్ బుధవారం రాత్రి హైటెక్ సిటీ హోటల్కు వెళ్దామని తన స్నేహితులను పట్టుపట్టగా, ఈ సమయంలో వద్దని వారించడంతో వారితో గొడపడ్డాడు. రాత్రి ఒంటి గంటకు స్నేహితులు అతడిని ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపు స్నేహితులతో ఫోన్లో చాట్ చేసిన సుదీప్ ‘మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి’ అని మెసేజ్ పెట్టాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు తల్లి లేచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: మైనర్పై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. ) -
వకీల్సాబ్ షూటింగ్: పవన్ మెట్రో ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురువారం మెట్రోరైలులో ప్రయాణించారు. సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన పవన్ అక్కడ ఉన్న ద్రాక్షరామం రైతుతో ముచ్చటించారు. ఆయన మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో ప్రయాణించారు. వకీల్సాబ్ షూటింగ్ నిమిత్తం ఆయన మియాపూర్ వెళ్లాల్సి వచ్చింది. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోస్టేషన్లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు. ఈ ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో సంభాషించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. దీంతో ఆయన ద్రాక్షారామానికి చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయం బాగా దెబ్బతింది అని చెప్పారు. తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది పవన్ కల్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పారు. ఈ ప్రయాణంలో పవన్ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ కూడా నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అని అన్నారు. ఇక ఈ మెట్రోప్రయాణంలో పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. చదవండి:పండగ నాడు వకీల్ సాబ్ టీజర్?! -
ఆమె కోసం మెట్రో పరుగు!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ... రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా... రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్ మెట్రో రైలు పరుగులు తీసింది. సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది. రాత్రిపూట ఒంటరిగా స్టేషన్కు... ఈ నెల 14న రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్–మియాపూర్ మార్గంలోని విక్టోరియా మెమోరియల్ (కొత్తపేట) స్టేషన్కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్ మెట్రో స్టేషన్కు చేర్చాలని అధికారులను వేడుకుంది. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు. ఎల్బీ నగర్ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. శుక్రవారం మెట్రోరైలు భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ఎండీ ఎన్వీఎస్రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు. -
హైదరాబాద్: మియాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
-
విషాదం: పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్ : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాన్ని బలతీసుకుంది. పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. జహీరాబాద్కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ డైట్సెట్ పరీక్ష రాసేందుకు బైక్పై ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఇక విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన తమ పిల్లలు ఇక తిరిగిరాదనే చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కరోనా భయం ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో శుక్రవారం రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి మియాపూర్లోని న్యూసైబర్ హిల్స్లో కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న భయంతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్రూంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా బెడ్రూంలో సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబసభ్యలుకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
శానిటైజర్ క్యాన్లతో వెళ్తున్న లారీ దగ్ధం
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్లో శానిటేషన్ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీలో మంటలు వ్యాపించాయి. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా మియాపూర్ బస్డిపో వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లారీలో ఒక్కొక్క క్యాన్లలో 20 లీటర్ల శానిటేషన్ ద్రావణం ఉన్నట్లు సమాచారం. -
ఆర్టీసీ బస్సు బీభత్సం.. స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. జహీరాబాద్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి బీదర్ వెళ్తుండగా ఓ బైక్ను వెనకాల నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతున్ని స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న సుమన్ నాయక్గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సుమన్ కొంత కాలంగా మియాపూర్లో నివాసం ఉంటూ స్విగ్గీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. -
ఫోన్లో గేమ్ ఆడుకోనివ్వలేదని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గేమ్ ఆడుకునేందుకు మొబైల్ ఇవ్వలేదని 12 ఏళ్ల బాలుడు అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం మియాపూర్లో చోటుచేసుకుంది. వివరాలు.. బాలవెంకట్ సత్య ప్రసాద్(12) అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి మియాపూర్లోని స్వప్న నిర్వాన్ అపార్టుమెంట్లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ట్యాబ్లో గేమ్ ఆడుకునేందుకు తండ్రి నిరాకరించాడన్న మనస్థాపంతో అపార్టుమెంట్పై నుంచి దూకి మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదం అలుముకుంది. ఇక ఇటీవల కాలంలో చిన్నారులపై సెల్ఫోన్లు, గేమ్ల ప్రభావం ఎంతగా ఉందో మరోసారి ఈ తాజా ఘటనతో రుజువైంది. -
మియాపూర్లో కారు బీభత్సం.. ఒకరు మృతి
-
మియాపూర్లో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: మియపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని హాఫిజ్ పేట్ వద్ద బుధవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో కారు అదుపుతప్పి గ్రీన్ బావర్చి హొటల్ ముందు సిగరెట్ తాగుతున్న అఫ్సర్ అనే వ్యక్తి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బీహెచ్ఈఎల్ ప్రాంతానికి చెందిన అఫ్సర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తీన్మార్ దోశ.. మనసు దోచె
మియాపూర్ : మసాల దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశల రుచి చూస్తుంటారు...దోశల్లో వెరైటీలను తినాలనుకుంటున్నారా... మియాపూర్ రావాల్సిందే. ఒకేచోట 111 రకాల దోశలు ఆహారప్రియుల మది దోచుకుంటున్నాయి. చందానగర్లోని ప్రధాన రహరిదారిలో ఉన్న బిందు టిఫిన్సెంటర్లోఈ వెరైటీ దోశలు లభిస్తున్నాయి. ఏమేం దోశలంటే.. తీన్మార్ దోశ, పిజ్జాదోశ, కాజుదోశ, దిల్కుష్దోశ, పావ్బాజీ దోశ, ప్రకృతి దోçశ, కేరళ ఓపెన్, అమెరికన్ చొప్సే దోశ లున్నాయి. ఇక్కడకు వచ్చేవారు ఎక్కువగా పన్నీర్దోశ, మష్రూమ్దోశ, స్వీట్కార్న్ దోశ, బేబీకార్న్, మైసూర్ మసాలదోశ ఇష్ట పడుతుంటారు. ఇంకా ప్లెయిన్ దోశలో 8 రకాలు, మసాల దోశలో 15 రకాలు, పెసరదోశలో17, రాగిదోశలో 18 రకాలు, చెజ్వీన్ 21 రకాలు లభిస్తాయి. మియాపూర్, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల నుంచి దోశె ప్రియులు ఇక్కడికివస్తుంటారు. సంగారెడ్డి జిల్లా ఇంకేమూరి గ్రామానికి చెందిన పండరిరెడ్డి, సంజీవరెడ్డిలు దీనిని నిర్వహిస్తున్నారు. బెంగళూర్లో చూసి.. బెంగళూరులోని హోటల్లో 100 రకాల వెరైటీ దోçశలు తయారీని చూశారు. దీంతో అలాంటి టిఫిన్ సెంటర్ హైదరాబాదులో నిర్వహించాలని అనుకున్నారు.ఒక మాస్టర్ దగ్గర దోçశల వెరైటీలను నేర్చుకున్నారు. టాటా మ్యాజిక్ బండిని టిఫిన్ సెంటర్గా తయారు చేసుకున్నారు. -
హైదరాబాద్లో ‘కరోనా’ కలకలం..
సాక్షి, హైదరాబాద్ : చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులను వైద్యులు గుర్తించారు. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అలాగే వైరస్ సోకిందనే అనుమానంతో ఇప్పటికే పలువురు వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తాజాగా మియాపూర్కు చెందిన ఓ వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటీవలే అతను చైనా నుంచి నగరానికి వచ్చారు. అయితే ప్రస్తుతం గాంధీలో అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు కోసం ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అనుమానితుల రక్త నమూనాలను కొరియర్ ద్వారా విమానాల్లో పుణేకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఆ ఫలితాలు రావడానికి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా గాంధీ ఆసుపత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని వైద్య యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గాంధీ ఆసుపత్రిలోని వైరాలజీ ల్యాబ్లో కరోనా పరీక్షలు చేసేందుకు అనువుగా ఉందని వైద్య అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రాణాంతక కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. అలాగే చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లలో ప్రత్యేకంగా థర్మల్ స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. చదవండి : కరోనా పరీక్షలు ఇక ‘గాంధీ’లోనే భారత్లోకి ప్రవేశించిన ‘కరోనా’ -
మరోసారి ఆగిన మెట్రో రైలు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు మరోసారి మొరాయించింది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రో రైలు శనివారం మధ్యాహ్నం సాంకేతిక కారణాలతో పంజగుట్ట స్టేషన్ వద్ద నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులను స్టేషన్లోనే దింపేశారు. ఫెయిల్ అయిన రైలును ఎర్రమంజిల్–పంజగుట్ట మధ్యలో ఉన్న పాకెట్ ట్రాక్లోకి మళ్లించి మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్బీనగర్–మియాపూర్ మధ్య చాలాసేపు మెట్రో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమీర్పేట్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీ పెరగడంతో అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు అదనపు రైళ్లను నడపాల్సి వచ్చింది. మధ్యాహ్నం తరువాత ఎల్బీనగర్–మియాపూర్ మధ్య మెట్రో రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. -
బిడ్డా.. ఈ అడ్డాలు డేంజర్
మియాపూర్లోని 100, 101 సర్వే నంబర్లలోని భూమి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పూర్తి నిర్మానుష్యంగా పొదలు, బండరాళ్లతో ఉన్న ఈ ప్రాంతంలో హత్యలు కూడా జరిగాయి. రెండేళ్ల క్రితం చాందిని జైన్ అనే యువతి స్నేహితుడితో కలిసి పీజేఆర్ ఎన్క్లేవ్ పక్కనే ఉండే 100 సర్వే నంబర్ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ వారి మధ్య గొడవ జరగడంతో స్నేహితుడు చాందిని జైన్ను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమీన్పూర్కు చెందిన ఆటో డ్రైవర్ గడ్డం ప్రవీణ్ను అతడి స్నేహితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం దీప్తిశ్రీనగర్ వద్దనున్న 101 సర్వే నంబర్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారు. కవాడిగూడలో 10 నెలల క్రితం ఓ యువతిని నిర్మానుష్యంగా ఉన్న డీబీఆర్ మిల్లు పరిసరాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. డీబీఆర్ వెనక భాగంలో అర కిలోమీటర్ వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఏం జరిగినా ఎవరికీ తెలియని పరిస్థితి. సాక్షి, హైదరాబాద్ : కొద్దిగా చీకటయితే చాలు అసాంఘిక శక్తులు వళ్లు విరుచుకుంటున్నాయి. జనసంచారం తగ్గుముఖం పట్టగానే జంతువులై స్వైరవిహారం చేస్తున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను అనుసరిస్తూ.. మంచిగా నటిస్తూ అవకాశం దొరకబుచ్చుకుని సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. నిర్దాక్షిణ్యంగా నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. కంటపడిన వాళ్లు ‘ఆడ’వాళ్లయితే చాలు.. వయసుతో నిమిత్తం లేదు. పసికూనల నుంచి వయోధికుల వరకు ఈ మృగాలు వెంటబడి వేటాడుతున్నాయి. ఎంతోమంది యువతులు మృగాళ్ల పశువాంఛకు సమిధలవుతున్నారు. ఇదంతా సాధారణ జనజీవనానికి దూరంగా ఉండే అడవుల్లో కాదు.. కొండలు, గుట్టల్లో కాదు.. నాలుగువందల ఏళ్ల మహోన్నతమైన చరిత్ర గల హైదరాబాద్ మహానగరంలోనే. అంతర్జాతీయ నగరంగా విల్లసిల్లే రాజధాని నగరంలో అనేక ప్రాంతాలు ఆటవికుల అడ్డాలుగా మారాయి. ఫ్లైఓవర్ క్రీనీడ, కాలనీ అంచుల్లోని కాలిబాట, మెట్రో మలుపులు, రైల్వేస్టేషన్ పరిసరాలు, నివాస సముదాయాలకు కూత వేటు దూరాలు, ఎక్కడితేనేం మనుషుల అలికిడి తగ్గితే చాలు అరాచక శక్తులు నిద్ర లేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు, దారుణాలు చోటుచేసుకుంటున్నప్పటికీ భద్రత కరవవుతోంది. ఫిర్యాదు చేస్తే గంటకు తప్ప స్పందించని పోలీసు యంత్రాంగం అనేకానేక విషాదాంతాలకు మౌనసాక్షిగా నిలుస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా, వేలాది మంది పోలీసులతో కూడిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న హైదరాబాద్లో మృగాళ్లు పంజా విసురుతున్నారంటే.. అత్యాధునిక పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందన్న ప్రశ్నలు మనసున్న వారికి శరాలై తగులుతున్నాయి. నగరంలో విస్తరించిన అసాంఘిక శక్తుల అడ్డాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చదవండి : 28 నిమిషాల్లోనే చంపేశారు! ప్రమాదకర కొన్ని ప్రదేశాలు ► పంజాగుట్ట సమీపంలోని సాహెబ్నగర్లో వివాదాస్పదమైన హుడా లేఅవుట్లో అసాంఘిక పనులు నిత్యకృత్యం. అక్కడ మద్యం, వ్యభిచారం పరిపాటిగా మారింది. ► డివిజన్ మూసీ పరివాహిక ప్రాంతం కూడా అసాంఘిక శక్తులకు నెలవు. ► లింగోజిగూడలోని అధికారినగర్, కామేశ్వర్రావుకాలనీ, అమ్మవారి టెంపుల్ ఏరియా, సరూర్నగర్ గాంధీ విగ్రహం ప్రాంతం రాత్రి వేళల్లో అసాంఘిక పనులు సాగుతున్నా పోలీసులు చర్యలు తీసుకున్నది లేదు. ► విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న కొత్తపేట చౌరస్తాలోని వీఎంహోమ్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. రాత్రిళ్లు మందుబాబులు తప్పతాగి చిందులేస్తుంటారు. ప్రహరి కూలిపోవడంతో వెనుక నుంచి గ్రౌండ్లోని చెట్ల మధ్య కూర్చుని తాగుతూ పేకాడుతుంటారు. ► హెచ్ఎంటీ ప్రదేశం సుమారు 700 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఇందులో హత్యలు, దోపిడీలు, ఆత్యాచార సంఘటనలు అనేకం జరిగాయి. ఒక వైపు జీడిమెట్ల, మరోవైపు జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ రాత్రిపూట ఇటు నుంచి ఒంటరిగా వెళ్లాలంటే సామాన్యులు సాహసించలేరు. ► కొంపల్లి కేటీఆర్ పార్కు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని జంటలు ప్రేమ పేరుతో తిష్ట వేస్తున్నారు. వీరిని అనుసరించే వచ్చే అల్లరిమూకలు మిగతా యువతులు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతుంటారు. ఇక రాత్రి వేళల్లో ఈ ప్రాంతం వ్యభిచార కేంద్రంగా మారిపోతుంది. ఇక తాగుబోతుల ఆగడాలు ఎన్నో చెప్పడం కష్టం. ► వెన్సాయి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్ ఖాళీగా ఉండడంతో రాత్రిళ్లు కొందరు మద్యం తాగి రెచ్చిపోతున్నారు. కార్టన్ల కొద్ది బీరు బాటిళ్లను తీసుకొచ్చి తాగాక వాటిని రోడ్ల మీదనే పగులగొడుతున్నారు. చర్లపల్లి, మధుసూదన్నగర్సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం ► బస్ భవన్ వెనక సైతం గల్లీల్లో ప్రమాదకమైన పరిస్థితులే ఉన్నాయి. అడిక్మెట్ ప్లైఓవర్ బ్రిడ్జి కింద పట్టాలపై పోకిరీలు అర్ధరాత్రి వరకు తమ చీకటి కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. ► రహమత్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలు. ఇక్కడ మద్యం, గంజాయి తాగడం నిత్యకృత్యం. చుట్టూ చెట్లు, గుట్టలతో నిర్మానుష్యంగా ఉండడంతో వారికి అనువుగా మారింది. ► బ్రహ్మశంకర్ ఫేజ్–2 బస్తీకి వెళ్లే దారిలో వీధి దీపాలు లేక మహిళలు రాత్రి వేళల్లో తమ నివాసాలకు వెళ్లలంటే భయపడుతున్నారు. చుట్టూ గుట్టలు నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ హంగామా సృష్టిస్తున్నారు. ► రామంతాపూర్లో కొన్ని ప్రాంతాల్లో చీకటి పడగానే పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇక్కడి చిన్న చెరువు, నెహ్రూనగర్ కమ్యూనిటీహాల్, రాజేంద్రనగర్ చౌరస్తా, చిన్న జెండా బస్తీ, బైపాస్ రోడ్డు, భగాయత్ మూసీ పరివాహక ప్రాంతాలు రాత్రి అవుతుండగానే పోకిరీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో వారిదే ఇష్టారాజ్యం. మద్యం తాగి పార్టీల పేరుతో చేసే హంగామాతో స్థానికులు అందోళన చెందుతున్నారు. ► రామంతాపూర్లోని కొన్ని బస్తీలలో బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. రామంతాపూర్ ప్రధాన రహదారిలోని చర్చి స్కూల్ నుంచి దూరదర్శన్ కేంద్రం వరకు ఆరు వైన్ షాపులు, ఆరు బార్లు ఉండటంతో రోడ్ల మీదే మందు బాబులు చెలరేగిపోతున్నారు. ఈ ప్రాంతంలో సామాన్యులు నడిచి వెళ్లేందుకు భయపడుతుంటారు. ఇక్కడి పరిస్థితి పోలీసులకు తెలిసినా మౌనంగా ఉంటారు. ► ఎస్పీఆర్హిల్స్ రిజర్వాయర్ ఆవరణలోనూ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్లు ఉండటంతో పేకాట, మద్యపానం సర్వసాధారణం. ► నాచారం బాబానగర్, దుర్గానగర్, ఎర్రకుంట చెరువు కట్ట, సీడీఎస్ బిల్డింగ్ వెనుకభాగం, దుర్గానగర్, బాబానగర్, పాతబడిన కెమికల్ కంపెనీలు తాగుబోతులకు, పోకిరీలకు అడ్డాలుగా ఉన్నాయి. ► నాగర్జుననగర్, హెచ్బీకాలనీ లక్ష్మీనగర్ కాలనీవాసులకు ఇక్కడి వైన్స్ షాపులతో సమ్యలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ► కూకట్పల్లిలోని బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే మహిళా కార్మికులపైనా వేధింపులు కానసాగుతున్నాయి. ఇక్కడ గతంలో ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు గొంతుకోసి చంపాడు. ► గూడ్స్షెడ్ రోడ్డులో మద్యం తాగిన లారీ డ్రైవర్లు, హమాలీలు ఒంటరిగా వెళ్లే మహిళలను వేధించడం నిత్యకృత్యమైంది. ఆలయ ఆవరణలో మద్యం బాటిళ్లు.. ► అడవిని తలపించేలా ఉండే నిమ్మ్మే మైదానంలో నిత్యం మద్యం, గంజాయి సేవిస్తుంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికనగర్ బస్టాప్ పక్కన ఉన్న నిమ్స్మే మైదానంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పరిపాటిగా మారాయి. ► కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, భాగ్యనగర్కాలనీ, నిజాంపేట ప్రాంతంలో రాత్రి 10 దాటాక వ్యభిచారులు రోడ్లపైకి రావటంతో ప్రతిరోజూ ఏదో ఒక దుర్ఘటన జరుగుతోంది. ► చంపాపేట పరిధిలోని డీఎంఆర్ఎల్ చౌరస్తా నుంచి 2 కి.మీ పొడవున గాయత్రినగర్ చౌరస్తా వరకు అర్ధరాత్రి 12 నుంచి వందలాది ఇసుక లారీలు అక్రమంగా పార్క్ చేస్తారు. వీటి డ్రైవర్లు ఇక్కడే మద్యం తాగుతూ చిదులేస్తుంటారు. ► మల్లాపూర్, మల్లికార్జున్నగర్, జేఎన్యూఆర్ఎం కాలనీ, భవానీనగర్లో సాయంత్రం విద్యార్థులు ట్యూషన్ విడిచిపెట్టే సమయంలో కొంతమంది పోకిరీలు ద్విచక్ర వాహనాలపై వారిని భయపెడుతుంటారు. ఇక్కడి బెల్టుషాపుల కారణంగా తెల్లవారుజామున 5 గంటలకే మున్సిపల్ గ్రౌండ్ వద్ద తాగి తందానాలాడుతున్నారు. ► చర్లపల్లి, మధుసూదన్నగర్, వెంకట్రెడ్డినగర్కాలనీల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం పోకిరీలకు అడ్డాగా మారింది. చీకటి పడగానే కాలనీకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి రావడం, మద్యం, గంజాయి తాగడం.. కొందరు అమ్మాయిలతో కలిసి విచ్చలవిడిగా ప్రవర్తించడం పరిపాటి. ఈ క్రమంలో దారి వెంట వెళ్లేవారితో ఘర్షణ పడటం, సమీప కాలనీల్లో ఇళ్లల్లో చోరీలు చేస్తున్నారు. ► చిలుకానగర్ చౌరస్తా వైన్షాపుల వద్ద పోకిరీల ఆగడాలపై పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు కాలనీవాసులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. నాగోల్ నుంచి శిల్పారామం వెళ్లే రోడ్డుపై వ్యభిచారుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. చీకటి పడితే నిర్మానుష్యమయ్యే యాకుత్పురా రైల్వే ట్రాక్ రోడ్డు ► మన్సూరాబాద్ డివిజన్ పెద్దచెరువు, చిన్న చెరువు ప్రాంతాల్లో చీకటి పడగానే మందు బాబులదే రాజ్యం. నాగోలు పరిధి బండ్లగూడ చెరువు ప్రాంతం అసాంఘిక కార్యకలపాలకు అడ్డా. హయత్నగర్ ఆటోనగర్లో ఇసుక లారీల అడ్డా వెనుక ఖాళీ ప్రదేశం కూడా అంతే. ఇక్కడ రాత్రిపూట లారీ డ్రైవర్లు, కూలీలు మద్యం తాగుతూ అసాంఘిక పనులకు పాల్పడుతున్నారు. ► ఉప్పల్ బస్టాండ్ కమాన్ వద్ద ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిత్యం వ్యభిచారులు విటులను ఆకర్షిస్తుంటారు. వీరి చర్యలకు స్కూల్ పిల్లలు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ► యాకుత్పురా రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్ రోడ్డు, తలాబ్కట్ట రైల్వే ట్రాక్ రోడ్డు, గౌలిపురా మేకలమండి రోడ్లు చీకటి పడగానే నేరగాళ్లకు స్థావరాలవుతున్నాయి. తలాబ్కట్ట, యాకుత్పురా రైల్వే ట్రాక్ రోడ్డులో తరచు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసంచారం ఉండే ఈ ప్రాంతంలో చీకటి పడగానే ద్విచక్ర వాహనదారులు మాత్రమే రాకపోకలు సాగిస్తుంటారు. వీధి దీపాలు సైతం సరిగా వెలగకపోవడంతో అసాంఘిక శక్తులకు చెలరేగుతున్నాయి. కొందరు మందుబాబులు ఈ ప్రాంతాల్లో తిష్టవేసి వెక్కిలి చేష్టలతో రాత్రి వేళల్లో స్థానికులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. ఉప్పుగూడ రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రాంతంలో సైతం రాత్రి వేళల్లో ఇబ్బందికరంగా ఉటోంది. పోకిరీలు రైల్వే స్టేషన్ సమీపంలో తిష్టవేసి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ► ఫలక్నుమా రైల్వేస్టేషన్ నుంచి చాంద్రాయణగుట్టకు వెళ్లే రహదారి పేరు చెబితే ఈ ప్రాంత ప్రజలు భయపడతారు. పూర్తిగా చెట్లతో, నిర్మానుష్యంగా ఉన్న ఈ దారిలో ఇప్పటికే ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. దారి దోపిడీలు, దాడులు, హత్యలు జరిగాయి. ఈ రూట్లో రాత్రి పూట పోలీస్ గస్తీ పెంచాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు. అసాంఘిక శక్తులకు అడ్డా ఫలక్నుమా రైల్వే స్టేషన్ రహదారి ► జీడిమెట్ల పారిశ్రామికవాడలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయ సమీపంలో తాగుబోతుల ఆగడాలు అరికట్టేవారు లేదు. ఆహ్లాదకర వాతావరణం, కూర్చోవడానికి గద్దెలు, ఎవరూ రారన్న ధీమాతో మందుబాబులు ఇక్కడే తాగి గొడవలు పడుతుంటారు. ఈ రోడ్డు గుండానే మహిళ కార్మికులు రాకపోకలు సాగిస్తుంటారు. పోలీస్ ఫెయిల్! సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో మహిళ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. మళ్లీ పోలీసు వ్యవస్థ తీరుపై విమర్శనలు వెల్లువెత్తుతున్నాయి. నేర నివారణ అంశాన్ని పక్కనబెట్టి నేర పరిశోధనకే ప్రాధాన్యత ఇస్తుండటంపై విమర్శలకు దారి తీసింది. శంషాబాద్ సమీపంలో డాక్టర్ ప్రియాంకారెడ్డి బంధువులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినప్పుడు తమ పరిధి కాదని తిప్పిపంపడం, వేగంగా కార్యాచరణలో దిగడంలో విఫలమయ్యారని మహిళా, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల బాధ్యత లేకనే.. డాక్టర్ ప్రియాంకరెడ్డి దారుణ హత్యకు గురవడం పోలీస్ వ్యవస్థ విఫలమవ్వడంగానే భావించాలి. బంధువులు ఫిర్యాదు చేసిన వెంటనే సరైన రీతిలో స్పందించి ఉంటే కనీసం ప్రియాంక ప్రాణాలతోనైనా దొరికేది. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, వాస్తవానికి పొంతన లేదని చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. – డాక్టర్ శ్వేతాశెట్టి, నేషనల్ విమెన్స్ పార్టీ ప్రెసిడెంట్ మద్యం వల్లే నేరాలు.. స్మార్ట్ ఫోన్లలో క్లిక్ దూరంలో ఉండే అశ్లీల వెబ్సైట్లు, ఎక్కడపడితే అక్కడ లభించే మద్యంతో సమాజంలో నేరాలను పెంచతున్నాయి. ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం సీరియస్గా ఉండాలి. అదేవిధంగా మహిళలు సైతం తమ చుట్టూ ఉండే మప్పు నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా వ్యవహరించాలి. – అనూప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్ అప్రమత్తంగా ఉండాలి ఓ తల్లిగా చెప్పుతున్నా.. నాక్కూడా ఓ కూతురు ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఆడ పిల్లలకు మాత్రం రక్షణ దొరకడం లేదు. ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు చెప్పకుండా అర్ధరాత్రి తర్వాత కూడా బయట తిరుగుతున్నారు. జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ లేట్నైట్లో నిర్మానుష్య ప్రాంతాల్లోకి వెళ్లడం చాలా ప్రమాదం. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటనే అత్యవసర ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ చిరంజీవి, ఆర్థోపెడిక్ సర్జన్, సన్షైన్ ఆస్పత్రి ఫిర్యాదులకు ఒకే నెంబర్ ఉండాలి తల్లిదండ్రులు తమ పిల్లలకు కేవలం చదువు మాత్రమే చెప్పించడం కాదు.. చదువుతో పాటు కొంత సంస్కారం కూడా నేర్పించాలి. మానవ సంబంధాలు, సమాజంపై అవగాహన కల్పించాలి. ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే దొరికి పోతామనే భయం కల్పించినప్పుడే అత్యాచారాలు తగ్గుతాయి. అంతే కాదు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తమ రక్షణ కోసం ఏ ఫోన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలో కూడా చాలా మంది మహిళలకు తెలియదు. ఒక్కో సమస్యకు ఒక్కో నెంబర్ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. అనివార్యమైన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు కూడా ఏమీ చేయలేక పోతున్నారు. అన్ని రకాల ఫిర్యాదులకు ఒకే నెంబర్ కేటాయించి, ఆ నెంబర్పై పనితీరుపై పిల్లలకు అవగాహన పెంచితే రక్షణ సులువవుతుంది. – డాక్టర్ మంజుల అనగాని, గైనకాలజిస్ట్ చదవండి : శంషాబాద్లో మరో ఘోరం అందుకే ఆలస్యం: సీపీ సజ్జనార్ ప్రియాంకను హత్య చేసింది ఆ నలుగురే మరో ఘోరం : కిడ్నాప్, గ్యాంగ్రేప్ -
ఆర్టీసీ సమ్మె : ఉద్యోగం పోతుందనే బెంగతో..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో గుండె ఆగింది. భవిష్యత్పై బెంగతో మియాపూర్-1 డిపోలో డ్రైవర్గా పనిచేసే ఎరుకాల లక్ష్మయ్య గౌడ్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లక్ష్మయ్య మృతికి నిరసనగా కార్మికులు మియాపూర్ డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడు నల్గొండ జిల్లాలోని మర్రిగూడవాసిగా తెలిసింది. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 12 వరోజుకు చేరింది. (చదవండి : చర్చించుకోండి!) ఇదిలాఉండగా.. ప్రభుత్వ వైఖరిపై మనస్తాపం చెందిన ఖమ్మం డిపో డ్రైవర్ దేవిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆత్మహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. రాణిగంజ్ బస్ డిపోలో కండక్టర్గా పనిచేసే సురేందర్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్సీయూ బస్ డిపోలో కండక్టర్గా పనిచేసే సందీప్ బ్లేడ్తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రాణాలతో బయటపడ్డాడు.ఈక్రమంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్వస్తి పలకాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించింది. -
భవనంపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. మదీనగూడా సమీపంలో గల ల్యాండ్మార్క్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివాసం ఉండే మహితి (28).. తాను నివసిస్తోన్న ఐదు అంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. మహితి టీసీఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తల ఒకచోట.. మొండెం మరోచోట
మియాపూర్: అప్పుగా తీసుకున్న డబ్బుల్ని తిరిగి చెల్లించలేదని ఓ ఆటోడ్రైవర్ను దారుణంగా హతమార్చి అతడి తలను ఒకచోట, మొండాన్ని మరొక చోట పడేశారు. మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతోందని చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన నగరంలోని మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా, గూడూరు మండలం తీగెలపాడుకు చెందిన గడ్డం ప్రవీణ్(25) అమీన్పూర్లోని శ్రీవాణి నగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నా డు. ఎంఏనగర్లో నివాసముంటున్న ఏపీకి చెం దిన బావాబామ్మర్దులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్లు మియాపూర్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు చిన్న మొత్తాల్లో ఫైనాన్స్లు ఇస్తుంటారు. ఈ క్రమంలో శ్రీవాణినగర్లో ఉండే తాడేపల్లిగూడెంకు చెందిన ఆటోడ్రైవర్ రాజేశ్కు రూ.15 వేలు అప్పుగా ఇచ్చారు. డబ్బులు సకాలం లో తిరిగి ఇవ్వక పోవడంతో ప్రవీణ్తో కలసి శ్రీకాంత్, శ్రీనివాస్లు గురువారం రాత్రి 12 సమయంలో రాజేశ్ ఇంటికి వెళ్లి అతడిని, ఆటో బయటకు తీసుకెళ్లారు. ఆటోలోనే రాజేశ్ను కొట్టుకుంటూ దీప్తిశ్రీనగర్లోని ధర్మ పురి క్షేత్రం సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ యాదవ్ తన వెంట తెచ్చుకున్న చున్నీని అనూహ్యంగా ప్రవీణ్ మెడకు చుట్టాడు. ఆ వెంటనే శ్రీకాంత్ యాదవ్ కత్తితో ప్రవీణ్పై దాడి చేశాడు. ప్రవీణ్పై దాడిని పసిగట్టిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయి మియాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్, శ్రీనివాస్లిద్దరూ తనపై దాడి చేశారని, ప్రవీణ్ను హత్య చేశారని పోలీసులకు చెప్పాడు. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులకు ప్రవీణ్ మొండెం మాత్రమే లభించింది. ఉద యం మియాపూర్ లోని ట్రాఫిక్ పీఎస్ ముందు బొల్లారం క్రాస్రోడ్డులో గుర్తు తెలియని తలపడి ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. తల, మొండెం స్వాధీ నం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్రావు, మియాపూర్ ఏసీపీ రవి కుమార్ పరిశీలించారు. పాతకక్షలే కారణమా? అమీన్పూర్లో ఉండే ఓ బిల్డర్కు శ్రీకాంత్ యాదవ్కు మధ్య గతంలో గొడవ జరిగింది. దీంతో ఆ బిల్డర్ శ్రీకాంత్యాదవ్పై కేసు పెట్టాడు. స్నేహితుడైన ప్రవీణ్ ఆ బిల్డర్తో సన్నిహితంగా ఉంటున్నాడని తనపై దాడి చేసే అవకాశం ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే రాజేష్తో గొడవ పడినట్లుగా నటించి బావమరిదితో కలసి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు శ్రీకాంత్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్లను వరంగల్లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఘరానా దొంగ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో టూవీలర్ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 18 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వివరాలు.. నేనావత్ చందర్ నాయక్ అనే వ్యక్తి బీఈడీ చదివాడు. ప్రస్తుతం అతడు స్విగ్గీలో ఫుడ్ డెలివరీబాయ్గా పని చేస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ చందర్కు చాలినంత జీతం రాకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నాడని డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఏడేళ్లలో సరాసరి రోజుకో పిల్లర్ నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో తొలి దశలో తుది ఘట్టం ఆవిష్కృతమైంది. ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్ – ఎంజీబీఎస్, నాగోల్ – హైటెక్ సిటీ మార్గాల్లో (66 కి.మీ) చిట్టచివరి పిల్లర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ అరుదైన ఘట్టానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) చిరునామాగా నిలిచింది. ఇక్కడి మెట్రో స్టేషన్ సమీపంలోనే తుది పిల్లర్ (నెంబర్ 2599)ను ఇటీవల ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు, ఆస్తుల సేకరణసమస్యలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని కారుచీకటిలోకాంతిపుంజంలా దూసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టు నగరంలో ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి పిల్లర్ను 2012 ఏప్రిల్ 19న ఉప్పల్ జెన్ప్యాక్ట్ (పిల్లర్ నెంబర్ 19) వద్ద ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ... ఇటీవల ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చివరి పిల్లర్తో పూర్తయింది. తొలి దశలో భాగంగా పాతనగరం ఎంజీబీఎస్ – ఫలక్నుమా (6 కి.మీ) మినహా అన్ని రూట్లలో పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడంపై ఎన్వీఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టుల శకంలో ఏకంగా 66 కిలోమీటర్ల మార్గంలో అన్ని పిల్లర్లు ఏర్పాటు చేసిన ఎల్అండ్టీ సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. మెట్రో తొలి పిల్లర్ ఏర్పాటైనప్పటి నుంచి లెక్కిస్తే సరాసరి ఏడేళ్లలో రోజుకో పిల్లర్ ఏర్పాటు చేయడం మెట్రో ప్రాజెక్టు ఆవిష్కరించిన సరికొత్త రికార్డని హెచ్ఎంఆర్ తెలిపింది. కాగా పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్నుమా (6 కి.మీ) మార్గం మినహా మెట్రో తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తికానుందని పేర్కొంది. ఇక మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో, అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి రావడంతో పలు చోట్ల విభిన్న ఆకృతుల్లో అమర్చారు. మెట్రో ప్రాజెక్టును సాకారం చేయడంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ ఇంజినీరింగ్ హెడ్స్ ఎంపీ నాయుడు, శంకర్లింగం, కేఎం రావు, ఇతర ఇంజినీర్లు జియాఉద్దీన్, విష్ణువర్దన్రెడ్డి, రాజేశ్వర్, ఎ.బాలకృష్ణ తదితరులు విశేష కృషి చేశారు. సవాళ్లు, రికార్డులివీ... ♦ ప్రధాన రహదారులపై పిల్లర్ల ఏర్పాటుకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతుల కోసం మూడేళ్లు, రక్షణ శాఖ అనుమతుల కోసం నాలుగేళ్లు, రైల్వే అనుమతులకు నాలుగేళ్ల సమయం పట్టింది. ♦ 3 వేల ఆస్తుల సేకరణకు 370 కేసులను ఎదుర్కొని విజయం సాధించారు. ♦ 380 చోట్ల 200 కి.మీ మార్గంలో హెచ్టీ, ఎల్టీ విద్యుత్ కేబుల్స్ను తరలించారు. 25 కి.మీ రూట్లో సీవరేజీ లైన్లు, వాటర్లైన్లు, 5 వేల విద్యుత్ స్తంభాలను తరలించారు. ♦ నిర్మాణ సమయంలో ఎదురైన అనేక ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించారు. ♦ 2,100 భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ విధానంలో వేరే చోటుకు తరలించి వాటిని పరిరక్షించారు. మెట్రో కారిడార్లలో 6 లక్షల మొక్కలు నాటారు. ♦ మియాపూర్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి వీలుగా వంపు తిరిగిన ప్రధాన రహదారిని సరళ మార్గంలో సవరించారు. ♦ హైదర్నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా బైపాస్ దారులను ఏర్పాటు చేశారు. ♦ జేఎన్టీయూ ప్రాంతంలో దేవాలయాలను తరలించి వేరొక చోట నిర్మించారు. ♦ కేపీహెచ్బీ, మూసాపేట్ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను వేరొక చోటుకు తరలించారు. ♦ ఐడీఎల్ దర్గా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ ఐడీఎల్ చెరువు వద్ద మతపరమైన కట్టడాలను వేరొక చోటుకు తరలించారు. ♦ బాలానగర్లో సర్వీసు రహదారిని ఏర్పాటు చేశారు. ♦ మలక్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో అనేక అడ్డంకులను అధిగమించారు. ♦ మూసాపేట్ ఆర్టీసీ డిపో వద్ద వరదనీటి కాల్వను డైవర్షన్ చేశారు. ♦ భరత్నగర్ వద్ద భారీ కూరగాయల మార్కెట్ను వేరొక చోటుకు తరలించారు. ♦ సుందర్నగర్కాలనీ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఈఎస్ఐ ఆస్పత్రి, విజయలక్ష్మి థియేటర్ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఎస్ఆర్నగర్ మక్బరా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ అమీర్పేట్ కాజ్వేను భారీగా విస్తరించి ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ♦ ఖైరతాబాద్ ఏడుగుళ్ల కూడలి వద్ద బైపాస్రోడ్డు ఏర్పాటుచేసి భారీ మెట్రో స్టేషన్ను నిర్మించారు. ♦ రవీంద్రభారతి జంక్షన్ నుంచి పోలీస్కంట్రోల్ రూమ్ మార్గంలో అమరవీరుల స్తూపం, అసెంబ్లీ గౌరవానికి భంగం వాటిల్లకుండా మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేశారు. ♦ పబ్లిక్గార్డెన్ వద్ద నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ నాలాను దారిమళ్లించి పిల్లర్లు నిర్మించారు. ♦ ఎంజీబీఎస్ వద్ద దోభీఘాట్, ఆర్టీసీ వర్క్షాప్లను తరలించి భారీ ఇంటర్ఛేంజ్ స్టేషన్ను నిర్మించారు. ♦ సుల్తాన్బజార్, బడీచౌడీ వద్ద వ్యాపారులతో సానుకూలంగా చర్చలు జరిపి మెట్రో పిల్లర్లు ఏర్పాటు చేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ గ్రీన్ల్యాండ్స్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్పోస్ట్ మార్గంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించారు. ♦ ఒలిఫెంటా బ్రిడ్జీతో పాటు పలు రైల్వే బ్రిడ్జీల వద్ద అనేక ఇంజినీరింగ్ సవాళ్లను ఎదుర్కొని పిల్లర్లను ఏర్పాటు చేశారు. మెట్రో పిల్లర్లు ఇవీ.. రకం సంఖ్య సాధారణ పిల్లర్లు 1569 కాంటీలీవర్ 224 స్టేషన్ పిల్లర్లు 602 సుత్తె ఆకృతి 51 పోర్టల్ పిల్లర్లు 153 మొత్తం 2,599 -
ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ లింగానాయక్ సమాచారం మేరకు... వైజాగ్ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్లోని సిన సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్ ఆల్విన్కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్ రూంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమవ్యవహారం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
-
మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీ విద్యార్ధి ఆత్మహత్య
-
అన్నను నరికి చంపిన తమ్ముడు..!
సాక్షి, హైదరాబాద్ : అత్తాపూర్లో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని పట్టపగలు నరికిచంపిన ఘటన మరువక ముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిగడ్డ తండాలో సొంత తమ్ముడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అన్నాదమ్ముల మధ్య నెలకొన్న ఆస్తి తగాదా ఈ హత్యకు దారితీసినట్టు సమాచారం. ఇల్లు అమ్మిన డబ్బుల కోసం గత కొంతకాలంగా వీరిమధ్య వివాదం కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజామున తమ్ముడు రవీందర్ తన స్నేహితుడు సాయితో కలిసి అన్న రాందాస్ను నరికి చంపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మియాపూర్లో ఐదేళ్ల బాలుడిపై కుక్కల స్వైర విహారం
-
హైదరాబాద్ మియాపూర్లో యువతి ఆత్మహత్య
-
మియాపూర్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
‘నిరూపిస్తే అసెంబ్లీ ముందు ఉరేసుకుంటా’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్న వార్తలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు ఏ కుంభకోణంతోనైనా సంబంధం ఉందని నిరూపిస్తే అసెంబ్లీ ముందే ఉరేసుకుంటానని చెప్పారు. కేసీఆర్కు కాంగ్రెస్ అంటే భయం పట్టుకుందన్నారు. టీఆర్ఎస్ హయాంలో వెలుగులోకి వచ్చిన నయీం కేసు, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ ఎంతవరకు వచ్చిందో సమా«ధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
ప్లాట్ల వేలం ప్రక్రియను కొనసాగించుకోండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మియాపూర్ మయూరి నగర్ కాలేజీలో ఉన్న ప్లాట్ల వేలం ప్రక్రియను కొనసాగించుకోవచ్చని హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఏ ఒక్కరి బిడ్లను ఖరారు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ కొన్నేళ్ల క్రితమే మియాపూర్లో పలు స్థలాలను ప్రజావసరాల కోసం ఇచ్చిందని, ఇప్పుడు వాటిని హెచ్ఎండీఏ అధికారులు వేలం వేస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమని మయూరినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది తేలప్రోలు చరణ్ వాదన లు వినిపిస్తూ ప్రజావసరాల కోసం కేటాయించిన భూముల్లో కొంత భాగాన్ని హెచ్ఎండీఏ గతంలో అమ్మేసిందని, ఇప్పుడు మిగిలిన వాటిని కూడా వేలం ద్వారా విక్రయించాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ వాదనలను హెచ్ఎం డీఏ తరఫు న్యాయవాది వై.రామా రావు తోసిపుచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, వేలం ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని స్పష్టం చేశారు. -
జాగ్రత్త.. ముగ్గులోకి దించి ముంచేస్తారు
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లోకంటే నగరాల్లో ముగ్గుల సందడి ఎక్కువైంది. తామంటే తామంటూ పోటీలు పడి వేస్తున్నారు. ఇక బహుమతులని చెబుతుండటంతో వారి ఆరాటానికి అంతే లేకుండా పోయింది. ముఖ్యంగా సంక్రాంతి కావడంతో నలుగురికి తమను తాము గొప్పగా పరిచయం చేసుకోవాలనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు ముగ్గులేసేందుకు ముచ్చటపడుతున్నారు. ఈ పాయింట్ను దొంగలు క్యాచ్ చేసుకున్నారు. తమ బ్రెయిన్కు పదును పెట్టి, పోలీసుల కళ్లుగప్పి దర్జాగా దోపిడీలకు ప్రణాళిక రచించి వెంటనే అమల్లోకి తెచ్చారు. కాలనీల్లోకి వెళ్లి సంక్రాంతి సందర్భంగా తాము ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, గెలిచినవారికి పెద్ద పెద్ద బహుమతులు కూడా ఇస్తామని ప్రకటించారు. వారి అసలు ప్లాన్ తెలియక ముచ్చటపడిన మగువలంతా అందంగా ముస్తాబై బయటకు రావడమే కాకుండా తమ నగలను కూడా నలుగురికి కనిపించేలా వేసుకొని ముగ్గులు వేసేందుకు రావడం మొదలైంది. అలా వచ్చి ముగ్గులో నిమగ్నమవగానే చైన్ స్నాచర్లను తమ చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు. వరుసగా బైక్లపై వచ్చి వారి చైన్లు లాక్కెళ్లడం మొదలు పెట్టారు. ఇప్పుడు మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. -
పాఠశాలలో అగ్నిప్రమాదం: మూడు బస్సులు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ జనప్రియ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అగ్నిప్రమాదం సంభవించి మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జనప్రియ స్కూల్కు చెందిన బస్సులన్నిటినీ పాఠశాల ఆవరణలో ఒకేచోట నిలిపి ఉంచారు. ఎలా జరిగిందో కానీ అగ్నిప్రమాదం సంభవించి వీటిల్లోని మూడు బస్సులు దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సిగరెట్ తాగి పడేయడం వల్లే అగ్నిప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. కాగా, గత ఏడాదికూడా ఇదేవిధంగా పాఠశాలకు చెందిన రెండు బస్సులు దగ్ధం అయ్యాయి. -
మియాపూర్ స్కాంపై కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూకుంభకోణానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు కంపెనీల డైరెక్టర్లను సైతం కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మియాపూర్ భూకుంభకోణంపై జరుగుతున్న పోలీసు దర్యాప్తును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. బీజేపీ అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్ రావు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీజే నేతృ త్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో ముగ్గురు నిందితులపై కింది కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు. దర్యాప్తులో ఇతరుల పాత్ర ఉందని తేలితే వారిని నిందితులుగా చేరుస్తూ అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల డైరెక్టర్లకు సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు జారీ చేసి వివరణలు తీసుకున్నామన్నారు. ఈ భూముల యాజమాన్యపు హక్కులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. -
ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేయండి
సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూముల వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మియాపూర్ భూకుంభకోణంపై తుది విచారణను జనవరి 30న చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి జస్టిస్ ఎ.కె.సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. మియాపూర్ భూములు ఎక్కడికీ పోలేదని, ఎలాంటి భూకుంభకోణమూ జరగలేదని సీఎం కేసీఆరే ప్రకటన చేశారని అందువల్ల ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని వాదించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌల్, పాల్వాయి వెంకట్రెడ్డి వాదిస్తూ ఈ పిటిషన్కు విచారణార్హత లేదని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పురోగతిలో ఉందని ధర్మాసనానికి వివరించారు. దీంతో కేసును లోతుగా విచారించాల్సి ఉన్నందున ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసును మరో సివిల్ కేసుకు జతచేసి విచారించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. -
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
హైదరాబాద్ : భర్త వదిలేశాడని, తనను ఆదుకోవాలని కోరుతూ ఓ గృహిణి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మియాపూర్లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక వదిలేశాడని సుష్మ అనే మహిళ ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె భర్త ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. -
భర్త ఇంటి ముందు భార్య ధర్నా
-
మెట్రోలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రయాణం
సాక్షి, హైదరాబాద్ : సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా ప్రారంభం కానున్న మెట్రో రైలులో మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహా, పలువురు మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మెట్టుగూడా వరకు 8 కి.మీ. మార్గంలో రైలులో ప్రయాణించడంతోపాటు.. మెట్రో స్టేషన్లు, రైలు పనితీరును తెలుసుకున్నారు. మంత్రులతోపాటు ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, మీడియా ప్రతినిధులు సైతం ఈ ట్రయల్ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్రో ఎఒండీ ఎన్వీఎస్రెడ్డి మాట్లాడుతూ.. అన్నిరకాల ట్రాన్స్పోర్ట్ సర్వీసులు, నగదు చెల్లింపులు జరిగేలా త్వరలోనే స్మార్ట్ కార్డు అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే మెట్రో రైలు ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. మరోవైపు మెట్రో తుది దశ పనులను తెలంగాణ ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ రఘునందనరావు పర్యవేక్షించారు. తుది దశ పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎస్ ఎస్పీ సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాని ప్రారంభించే మియాపూర్ మెట్రో పైలాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల వివరాలను డీజీపీ మహేందర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. -
మంత్రులు, ఎమ్మెల్యేల మెట్రో రైడ్...
-
మియాపూర్ భూములపై సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూములపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి ఎం.రఘునందన్రావు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ మియాపూర్లోని 693 ఎకరాలకు సంబంధించిన సేల్ డీడ్ను రద్దు చేసినట్టుగా హైకోర్టులో ప్రభుత్వం తరపున బి.ఆర్.మీనా అఫిడవిట్ను దాఖలు చేశారని చెప్పారు. సేల్డీడ్లను రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇటీవలనే తీర్పులను ఇచ్చాయన్నారు. అయినా సేల్స్ డీడ్లను రద్దు చేసినట్టుగా రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బి.ఆర్.మీనా హైకోర్టుకు ఎలా నివేదించారని రఘునందన్రావు ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ముఖ్య పాత్రధారి అయిన గోల్డ్స్టోన్ ప్రసాద్తో ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారని ఆరోపించారు. రద్దు చేసిన భూములకు సీఎం కేసీఆర్కూడా ఆమోదం తెలుపుతూ సంతకాలు చేశారని రఘునందన్రావు ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఒక సినిమా నిర్మాత 80 గుంటలు తీసుకొని 80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ కుంభకోణంలో మొదటి ముద్దాయి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల రిజిస్ట్రేషన్ల రద్దు విషయంపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ సమాధానం చెప్పాలని, సీఎం కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రఘునందన్రావు డిమాండ్ చేశారు. -
మియాపూర్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ మక్త మహబూబాబపేటలో పెద్ద ఎత్తున మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. మత్తు మందు తరలిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి కిలోన్నర ఓపీఎం డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుంభకోణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
బీజేపీ నేత రఘునందన్రావు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ మూడేళ్లలో ఎక్కడా మియాపూర్ భూమి రిజిస్ట్రేషన్ కాలేదని, గజం భూమి కూడా అన్యాకాంతం కాలేదని శ్వేతపత్రం ఇవ్వాలన్నారు. సోమవారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామన్నారు. -
మియాపూర్ స్కాంపై కేంద్రానికి నివేదికలు
బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు నివేదికలు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్రావు తెలిపారు. ఈ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ద్వారా దర్యాప్తు జరిపించాలని కోరినట్లు చెప్పారు. ఈ స్కాంపై సీఎం కేసీఆర్ మౌనాన్ని వీడకపోతే దాన్ని ఒప్పుకున్నట్లే అవుతుందని, ఈ విషయంలో సీఎం చేస్తున్నదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తప్పు చేసినట్లు కేసీఆర్ తన మౌనం ద్వారా ఒప్పుకుంటున్నారని భావించాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గోల్డ్ స్టోన్ ప్రసాద్ను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపించారు. ప్రసాద్ ఆచూకీని కనిపెట్టేందుకు పోలీస్ శాఖ లుకౌట్ నోటీస్ కూడా ఎందుకు జారీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలన్నారు. బీజేపీ నాయకులకు ఈ భూ కుంభకోణాలతో ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. గ్రూప్–2 నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడం టీఎస్పీఎస్సీకి చెంప పెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. కోర్టు అనర్హులుగా గుర్తించిన వారిని టీఎస్పీఎస్సీ ఏ విధంగా అర్హులుగా గుర్తించిందని ప్రశ్నించారు. దీనిపై టీఎస్పీఎస్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
సబ్రిజిస్ట్రార్ శ్రీనివాస్రావుపై ఏసీబీ కేసు
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు - పలు కంపెనీల్లో కోట్ల రూపాయల పెట్టుబడులు - మొత్తం ఆస్తుల విలువ రూ.150 కోట్ల పైనే.. సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్రావు ఇళ్లపై, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మంగళవారం బోయిన్పల్లి, అల్వాల్లోని శ్రీనివాస్రావు నివాసాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు కేసు నమోదు చేశారు. శ్రీనివాస్రావు ఆయన కుమారుడు కనిష్క పలు కంపెనీలు స్థాపించి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. హాసిని పవర్ ప్రాజెక్ట్, జయశ్రీ ఎంటర్ప్రైజెస్, పద్మనాభ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీలు స్థాపించినట్టు ఏసీబీ తెలిపింది. అక్రమార్జనను 12 బ్యాంకు ఖాతాల ద్వారా జరిపినట్టు బయటపెట్టింది. హాసిని పవర్ ప్రాజెక్ట్లో రూ.1.90 కోట్లు, నార్త్ స్టార్ హోమ్స్ కంపెనీలో రూ.1.93 కోట్లు, మంజీరా హోల్డింగ్స్లో రూ.50 లక్షలు, ఐకాన్ కన్స్ట్రక్షన్లో రూ.8.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఏసీబీ తెలిపింది. శ్రీనివాస్రావు తన బినామీల పేరిట రూ.1.27 కోట్ల విలువైన ఆరు ఇళ్ల స్థలాలు కూడబెట్టారు. అదే విధంగా మూసాపేట్లో రూ.11లక్షల విలువైన 11 ఎకరాల భూమి కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా శ్రీనివాస్రావు ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ అభిప్రాయపడింది. భార్య మృతిచెందినా బ్యాంకు లావాదేవీలు శ్రీనివాస్రావుకే చెందిన అల్వాల్ సత్యసాయి కాలనీలోని ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సునీతరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించారు. సునీత తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్రావు ఇంట్లో నుండి పలు బ్యాంక్లకు చెందిన పాస్ పుస్తకాలు, దస్తావేజులు, 17 క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్రావు భార్య జయశ్రీ మృతి చెందినప్పటికి ఆమె పేరుమీద ఇప్పటికీ బ్యాంక్ లావాదేవీలు జరగడం విశేషం. శ్రీనివాస్రావు భార్య, కొడుకు, తోడల్లుడు పేర్ల మీద డొల్ల కంపెనీలు సృష్టించారని తెలుస్తోంది. సోదరుడి ఇంట్లోనూ సోదాలు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు సోదరుడి ఇంట్లో కూడా మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కేపీహెచ్బి కాలనీలో ఉన్న శ్రీనివాసరావు రెండవ సోదరుడు నాగేందర్ నివాసంలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఏసీబీ డీఎస్పీ, సీఐలతో పాటు పలువురు అధికారులు ఈ సోదాలలో పాల్గొన్నారు. -
జనపథం - న్యూ కాలనీ , మియాపూర్
-
‘ల్యాండ్’ మైన్స్!
► రోజురోజుకూ పెరిగిపోతున్న మియాపూర్ భూముల స్కాం పరిధి ► మొత్తం ఎకరాలు816 ► స్కాం విలువ15,000 కోట్లు ► ఎల్బీనగర్, బాలానగర్లకూ విస్తరించిన అక్రమాలు ► ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అరెస్ట్.. దందా వెనుక బడాబాబులు ► గోల్డ్స్టోన్ ప్రసాద్కు ఉన్నతాధికారుల అండ ► 2002లో హైదర్నగర్లో వంద ఎకరాలు కాజేసే యత్నం ► శంకర్పల్లి ప్రాంతంలో ఓ చానల్ సీఈవోతో కలసి భూముల కొనుగోలు సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణాన్ని తవ్వేకొద్దీ విస్తుబోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలనం రేపుతున్న ఈ స్కాం ఏకంగా 816.04 ఎకరాలకు విస్తరించింది. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న అక్రమార్కులకు కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సబ్ రిజిస్ట్రార్లు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు అరెస్టయ్యారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ అధికారులతో రియల్టర్లు, అక్రమార్కుల కుమ్మక్కుతోనే ఈ భారీ కుంభకోణం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా... మియాపూర్, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో అక్కడ ఎకరా రూ.15 కోట్ల దాకా పలుకుతోంది. దీంతో వీటిపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, రియాల్టర్లు రంగంలోకి దిగారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తమకు అనువుగా మార్చుకున్నారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వేదికగా చేసుకుని ఈ కుంభకోణానికి తెరలేపారు. సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, 20లో 109.18 ఎకరాలు, 28లో 145.26 ఎకరాలు, 100లో 207 ఎకరాలు... ఇలా మొత్తం 693.04 ఎకరాలపై బడాబాబులు కన్నేశారు. 2016 జనవరి 15న అమీరున్నీసా బేగంతో పాటు మరికొందరు ఆ భూములపై తమకు హక్కులున్నాయని, వాటిపి ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మ తదితరులకు దఖలు పరుస్తూ రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్గా పని చేసిన రాచకొండ శ్రీనివాసరావు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకుండా అనుమతించడంతోపాటు ఆ భూములకు ఎలాంటి మార్కెట్ విలువ లేదంటూ రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించేశారు. ఈ కేసులో శ్రీనివాసరావుతోపాటు పార్థసారథి, పీవీఎస్ శర్మలను సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితుల జాబితాలో ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్, దానికి డైరెక్టర్గా ఉన్న గోల్డ్స్టోన్ ప్రసాద్ (డాక్టర్ పి.సంజీవని ప్రసాద్) భార్య పి.ఇంద్రాణి ప్రసాద్, మరో డైరెక్టర్ మహితా కడ్డల్, సికింద్రాబాద్లోని సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్, గోల్డ్స్టోర్ ఇన్ఫ్రాటెడ్ లిమిటెడ్లో సివిల్ ఇంజనీర్గా పని చేస్తూ సువిశాల్ సంస్థలో డైరెక్టర్గా ఉన్న సయ్యద్ రఫియుద్దీన్ తదితరులను చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ భూమాయ వెనుక గోల్డ్స్టోన్ ప్రసాద్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు గోల్డ్స్టోన్ ఇన్ఫ్రా టెక్ కంపెనీతోపాటు ట్రినిటీ ఇన్ఫ్రా, సువిశాల్ పవర్ జెన్ సంస్థల పుట్టుపూర్వోత్తరాలు తవ్వే పనిలో ఉన్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు లేక కూడా రాశారు. మరో రెండు ఫిర్యాదులు భూ కుంభకోణాలకు సంబంధించి కూకట్పల్లి ఠాణాలో ఉన్న కేసుకు తోడు మియాపూర్ పోలీసుస్టేషన్లోనూ మంగళవారం రెండు ఫిర్యాదులు అందాయి. శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తిరుపతిరెడ్డి, హెచ్ఎండీఏ సైట్ ఆఫీసర్ జోగారావు ఈ ఫిర్యాదులు చేశారు. మియాపూర్ గ్రామం సర్వే నం.44లో 25 ఎకరాలు, 45లో 85 ఎకరాలు సైతం ఇదే రకంగా అక్రమ రిజిస్ట్రేషన్ అయినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ కుంభకోణం విస్తృతి 693.04 ఎకరాల నుంచి 816.04 ఎకరాలకు చేరినట్లైంది. మొత్తం దాదాపు రూ.15 వేల కోట్ల స్కామ్ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో ఇద్దరి అరెస్ట్.. మియాపూర్ స్కాంపై దర్యాప్తు సాగుతుండగానే... ఎల్బీనగర్, బాలానగర్లోనూ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సబ్ రిజిస్ట్రార్లు రమేశ్ చంద్రెడ్డి, యూసుఫ్ అరెస్టయ్యారు. భూముల రిజిస్ట్రేషన్న్ భాగోతంలో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు అక్రమార్కులకు ఇచ్చిన స్టాంపు డ్యూటీ మినహాయింపుతో ప్రభుత్వానికి ఏకంగా రూ.587.11 కోట్ల ఆదాయానికి గండి పడింది. సబ్ రిజిస్ట్రార్లు ఇలా అక్రమార్కులకు సహకరించడం వెనుక పెద్దల హస్తం సైతం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్న్ వివరాలను రిజిస్ట్రార్లు బుక్–1లో నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూడకుండా ఉండేందుకు అరెస్టయిన సబ్ రిజిస్ట్రార్లు ఆ వివరాలను చరాస్తులను రిజిస్ట్రేష¯న్ చేసే బుక్–4లో నమోదు చేయడం గమనార్హం. గతంలో రిజిస్ట్రేషన్ శాఖ.. ఆడిట్లో ఈ విషయం గుర్తించినట్లు సమాచారం. అయితే ప్రభుత్వానికి చేరిన నివేదికను కొందరు పెద్దలు తొక్కిపెట్టారని తెలుస్తోంది. గోల్డ్స్టోన్ ప్రసాద్కు ఉన్నతాధికారుల సహకారం నగర శివార్లలో ప్రభుత్వ భూములు కాజేయడం గోల్డ్స్టోన్ ప్రసాద్కు కొత్తమీ కాదు. 2002లోనూ ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేషీలో ఓ ఉన్నతాధికారి సహకారంతో హైదర్నగర్లో వంద ఎకరాలకు పైగా కాజేసే ప్రయత్నంలో అనేక నకిలీ పత్రాలు సృష్టించాడు. తాను అనుకున్న పని పూర్తి చేసేందుకు అధికారులకు పెద్ద ఎత్తున లంచాలు ఎరచూపడం, ఆస్తులు కొనుగోలు చేసి ఇవ్వడం ప్రసాద్కు అలవాటు. ఇలా మియాపూర్లో అత్యంత విలువైన వందలాది ఎకరాలను చేజిక్కించుకున్నాడు. ప్రైవేట్, ప్రభుత్వ భూములను కొల్లగొట్టాడు. చనిపోయిన వ్యక్తుల పేరిట నకిలీ జీపీఏలు సృష్టించి వేల కోట్ల అక్రమార్జన ధ్యేయంగా ఫోర్జరీ సంతకాలు, బీనామీ వ్యక్తులతో సూట్కేస్ కంపెనీలను సృష్టించి బడా రియల్టర్లను, వ్యాపారస్తులను మోసం చేసిన తీరు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వంలో తన సమీప బంధువు ఒకరి సాయం తీసుకోవడం ద్వారానే భూ కుంభకోణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ అధికారి పాత్రకు సంబంధించి ఆధారాలు సేకరించాల్సి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. టీవీ ఛానల్ సీఈవోతో కలసి.. ప్రముఖ ఛానల్ సీఈవో ఒకరితో కలిసి గోల్డ్స్టోన్ ప్రసాద్ హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసిన వ్యవహారం బయటపడింది. ఇందుకు మూడు కంపెనీలను సృష్టించిన ప్రసాద్.. సదరు టీవీ చానల్ సీఈవో కుటుంబ సభ్యులు ఇద్దరినీ అందులో డైరెక్టర్లుగా నియమించాడు. ఈ భూములకు సంబంధించి సర్వాధికారాలు కంపెనీ డైరెక్టర్లవే. పన్నెండేళ్ల క్రితమే ఈ భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం అవి కంపెనీ ఆధీనంలోనే ఉన్నాయా లేదా అన్న అంశంపై పోలీసులు విచారణ జరిపే అవకాశం ఉంది. జూన్ 2కు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో అరెస్టయిన కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు, స్థిరాస్తి వ్యాపారులు పార్థసారథి, పీవీఎస్శర్మలు వేసిన బెయిల్ పిటిషన్ విచారణను మియాపూర్ కోర్టు జూన్ 2కు వాయిదా వేసింది. అలాగే వీరిని కస్టడీలోకి కోరుతూ మియాపూర్ పోలీసులు వేసిన పిటిషన్ను మియాపూర్ కోర్టు కొట్టేయడంతో రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎంఎస్జే కోర్టులో మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చే అవకాశముంది. -
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
-
భూదందాలో బడా బాబులు!
రూ.10 వేల కోట్ల భూముల కుంభకోణం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని మియాపూర్లో రూ.10 వేల కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో పలువురు రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన ఈ ప్రభుత్వ భూములపై కన్నేసిన పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన రాజకీయ నేతలు కలసి రిజి స్ట్రేషన్ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర తీసినట్లు సమాచారం. ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్న ఈ అక్రమార్కులు.. తమ బాగోతం బయటపడకుండా మరిన్ని అవకతవకలకూ పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో పాత్రధారులతో పాటు తెర వెనుక సూత్రధారులను పట్టుకొనేందుకు వేట ప్రారం భించారు. ఈ వ్యవహారంలో ఎకరానికి రూ.కోటి వరకు చేతులు మారినట్లు భావిస్తున్నారు. దర్యాప్తు వేగంగా సాగేందుకు ప్రభుత్వం ఈ భూదందా కేసు ను సోమవారం సీఐడీ విచారణకు అప్పగించింది. కాగా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన నాలుగు డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ల శాఖ రద్దు చేసింది. చల్లగా కాజేశారు.. శేరిలింగంపల్లి మండలం మియాపూర్, ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడ బహిరంగ మార్కెట్ ప్రకారం ఎకరం ధర సుమారు రూ.14.5 కోట్ల పైనే ఉంటుంది. దీంతో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన పలువురు రాజకీ య నాయకులు, బడా రియల్టర్లు ఆ భూములపై కన్నే శారు. రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో కుమ్మక్కై 693.04 ఎకరాలను కాజేసేందుకు వ్యూహం పన్నారు. ‘ఎక్క డైనా భూముల రిజిస్ట్రేషన్ (ఎనీవేర్ రిజిస్ట్రేషన్)’ వెసులుబాటును తమకు అనుకూలంగా మల్చు కున్నారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని దీనికి వేదికగా చేసుకున్నారు. 2016 జనవరి 15న అమీరున్నీసా బేగంతో పాటు మరికొందరు ఆ భూములపై తమకు హక్కులు ఉన్నాయని.. వాటిని ట్రినిటీ ఇన్ఫ్రా వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ పీఎస్ పార్థసారథి, సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ పీవీఎస్ శర్మలకు దాఖలు పరుస్తున్నామని పేర్కొంటూ రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఈ వ్యవహారంపై ఎలాంటి సందేహాలూ వ్యక్తం చేయకుండానే.. సర్వే నంబర్ 101లో 231 ఎకరాలు, నంబర్ 20లో 109.18 ఎకరాలు, నంబర్ 28లో 145.26 ఎకరాలు, నంబర్ 100లో 207 ఎకరాలు మొత్తంగా 693.04 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసేశారు. అంతేకాదు అసలు ఈ భూములకు ఎలాంటి మార్కెట్ విలువ లేదంటూ రిజిస్ట్రేషన్ ఫీజును పూర్తిగా మినహాయించేశారు. ఈ కొనుగోలు వ్యవహారంలో సువిశాల్ పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ తరఫున మేనేజర్ పీవీఎస్ శర్మ రిజిస్ట్రేషన్కు హాజరైనట్లు తెలిసింది. మరిన్ని అవకతవకలు కూడా.. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్రావు బాగోతం బయటపడ కుండా మరిన్ని అవకతవకలకూ పాల్పడ్డారు. వాస్తవానికి ఏదైనా స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలను బుక్–1లో నమోదు చేయాల్సి ఉండగా.. ఈ భూముల రిజిస్ట్రేషన్లను చరాస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించిన బుక్–4లో నమోదు చేశారు. స్టాంపు డ్యూటీ మినహాయింపు కూడా ఇచ్చారు. వాస్తవానికి ఈ భూములను రిజిస్ట్రేషన్ చేస్తే రూ.587 కోట్ల వరకు స్టాంపు డ్యూటీగా వసూలు చేయాల్సి ఉండేది. అది కూడా లేకుండా చేశారు. కేసు సీఐడీకి అప్పగింత వేల కోట్ల భూముల కుంభకోణం కావడంతో ఈ కేసును సీఐడీకి బదిలీ చేయనున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఈ కేసులో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుతో పాటు రియల్ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పీవీఎస్ శర్మ, పీఎస్ పార్థసారథిలను అరెస్టు చేశామని చెప్పారు. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న రియల్ఎస్టేట్ సంస్థల బాధ్యులను పట్టుకునేందుకు ముగ్గురు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని వెల్లడించారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ప్రచారమవుతున్న గోల్డ్స్టోన్ ప్రసాద్కు సంబంధించి సాక్ష్యాధారాలేవీ ఇప్పటివరకు దొరకలేదని తెలిపారు. సూత్రధారుల కోసం వేట భూముల కుంభకోణంలో పాత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు.. సూత్రధారుల కోసం వేట ప్రారం భించారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కొంత మంది రాజకీయ నాయకులు, బడా రియల్టర్ల హస్తం ఉందన్న సమాచారం మేరకు ఆ దిశగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న గోల్డ్స్టోన్ ప్రసాద్ కోసం గాలింపు ముమ్మ రం చేశారు. ప్రత్యేక బృందాలు ముంబై, బెంగళూరు లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో శర్మ, పార్థసారథిల సోదరుడు కూడా కీలకపాత్ర పోషించినట్లుగా పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఆయనను అదుపులోకి తీసుకుంటే చిక్కుముడి వీడి.. బాగోతం వెనుక ఉన్న పెద్దల వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కాగా పోలీసు అరెస్టు చేసిన ముగ్గురిని మియాపూర్ కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. గోల్డ్స్టోన్ సంస్థ పాత్రపై సందేహాలు ఈ కుంభకోణంలో భాగస్వామి అయిన పార్థసారథి గోల్డ్స్టోన్ ఇన్ఫ్రాటెక్ సంస్థలో డైరెక్టర్గా ఉండడంతో ఆ సంస్థ పాత్రపైనా సందేహాలు వస్తున్నాయి. మియాపూర్ పరిధిలో గోల్డ్స్టోన్ సంస్థకు మంచి పట్టు ఉంది. 172, 77, 78 సర్వే నంబర్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే పలు సర్వే నంబర్లలోని భూముల విషయంలో గోకుల్ ప్లాట్స్ కాలనీవాసులకు, గోల్డ్స్టోన్ సంస్థకు మధ్య భూ వివాదాలు ఉండడం గమనార్హం. కాలనీలు, రోడ్లు ఉన్నా కూడా.. శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని సర్వే నంబర్లు 20, 28, 100, 101లలో మొత్తంగా 1,187.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సర్వే నంబర్ 20లో మొత్తం 252 ఎకరాలు ఉండగా.. హుడాకు 109.18 ఎకరాలు కేటాయించారు, మిగతా 142.22 ఎకరాల్లో ఇళ్లు, రహదారులు తదితరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఇదే సర్వే నంబర్లోని109.18 ఎకరాలను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక సర్వే నంబర్ 28లో మొత్తం 384.15 ఎకరాలుండగా... హుడాకు 140.38 ఎకరాలు, మెట్రోరైల్కు 104 ఎకరాలు కేటాయించగా, మరో 100 ఎకరాల్లో హుడా లేఅవుట్ చేశారు. మిగతా సుమారు 39.17 ఎకరాల్లో కాలనీలు, రోడ్లు ఉన్నట్లు రికార్డులు తెలియ జేస్తున్నాయి. ఈ సర్వే నంబర్లో 145 ఎకరాలను గంపగుత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక సర్వే నంబర్లు 100, 101లో 550.39 ఎకరాలుండగా... ఏకంగా 438 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమిలోనూ పలు కాలనీలతో పాటు ఖాళీ స్థలాలు ఉన్నాయి. తొలి నుంచీ అవినీతిమయమే! కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాస్రావు తీరుపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన గతంలో టీఎన్జీవోల భూములకు సంబంధించిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్కు గురైనట్లు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ స్థానం నుంచి మూడుసార్లు బదిలీ అయినా.. తనకున్న పలుకుబడి, రాజకీయ నేతల అండదండలతో ఐదేళ్లుగా అక్కడే కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు వివాదాస్పద భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లలో చాలా వరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వెసులుబాటుతో కూకట్పల్లి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోనే జరగడం శ్రీనివాస్రావు పాత్రపై మరిన్ని సందేహాలు రేకిత్తిస్తోంది. అదంతా హెచ్ఎండీఏ స్థలమే: కమిషనర్ చిరంజీవులు మియాపూర్లోని 100, 101, 20, 28 సర్వే నంబర్లలో ఉన్న 693.04 ఎకరాల భూమి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దేనని కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్లతో ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేసిన అంశాన్ని తీవ్రంగా తీసుకున్న చిరంజీవులు.. దీనిపై జిల్లా కలెక్టర్తో చర్చించి క్రిమినల్ కేసు నమోదుచేయాలని నిర్ణయించారు. ఆ భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి మియాపూర్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన భూములు ప్రభుత్వానివేనని.. అవి ప్రస్తుతం హుడా, మెట్రోరైల్, ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని శేరిలింగంపల్లి తహసీల్దార్ తిరుపతిరావు తెలిపారు. సర్వే నంబర్లు 20, 28, 100, 101లలో ఉన్న ఈ భూములు ప్రభుత్వ భూములని స్పష్టం చేస్తూ 2007లోనే రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశామని.. అయినా ఆ భూములను రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొన్నారు. -
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్లోని జనప్రియ ఫోర్త్ ఫేస్ బ్లాక్ బి అపార్ట్మెంట్పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లకు చెందిన జగదీశ్(26)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూకుంభకోణం నిందితులకు రిమాండ్
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో ముగ్గురు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.587కోట్ల విలువైన 693 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక వేత్తలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని మూసాపేట రిజిస్టార్ శ్రీనివాసరావు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా అప్పనంగా భూములను పొందిన గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రా ప్రతినిధి పార్థసారథిని, అకౌంటెంట్ శర్మలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నిందితులను చర్లపల్లి జైలుకు తరలించాని కోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణ కోసం ముగ్గురు నిందితులను పదిరోజుల కస్టడీకి అనుమతినివ్వాలిని పోలీసులు పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈభూముల అక్రమ రిజిస్ట్రేషన్లలో సుమారు పదివేల కోట్ల కుంభకోణం జరిగినట్లు అధికారులు, భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇప్పటి వరకూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
మియాపూర్లో దారుణం
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక హఫీజ్పేట్ ప్రేమ్ నగర్ శివారు ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్ పోసి తగులబెట్టారు. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారు ఈ విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వయస్సు 30 ఏళ్లు ఉంటుందని తెలుస్తోంది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
మియాపూర్లో భారీ చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలుపడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ రైల్వేట్రాక్ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన సాయికిరణ్ నెదర్ల్యాండ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్టీసీ కాలనీలోని అతని ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడి ఇంట్లో ఉన్న 6 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులతో పాటు రూ. 30 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన సాయికిరణ్ బంధువులు ఈరోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పార్క్ చేసిన బస్సులు దగ్ధం
హైదరాబాద్: పార్కు చేసి ఉంచిన కళాశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు బస్సులు కాలిపోయాయి. మియాపూర్ జనప్రియ అపార్టుమెంట్ల సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడి ఖాళీ స్థలంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులను పార్క్ చేసి ఉంచుతుంటారు. అయితే, శుక్రవారం సాయంత్రం ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనున్న మరో బస్సుకు అంటుకున్నాయి. అక్కడే ఉన్న డ్రైవర్లు మిగతా బస్సులను వెంటనే అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఫైర్ సిబ్బంది వచ్చి రెండు బస్సుల మంటలను ఆర్పివేశారు. ఎవరైనా సిగరెట్ తాగి అక్కడ పడవేసి ఉంటారని అదే ప్రమాదానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఆ సమయంలో విద్యార్థులెవరూ బస్సులో లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. -
కళాశాల విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్లోని ఓ మహిళా కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న సాత్విక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఎంపీసీ గ్రూప్ చదువుతున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన సాత్విక మంగళవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేకనే ఆమె ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని తోటి విద్యార్థులు అంటున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మియాపూర్లో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ లేక్వేవ్ అపార్ట్మెంట్లో భారీ చోరీ జరిగింది. అపార్ట్మెంట్లోలోని ఓ ఫ్లాట్ తాళాలు పగులగొట్టిన దొంగలు ఇంట్లో ఉన్న 60 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. అపార్ట్మెంట్లో నివాసముండే ప్రభావతి, ఆమె కుమారుడు అమర్నాథ్ వ్యక్తిగత పనులపై బయటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు అదే అపార్ట్మెంట్లో నివాసముంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లి పడుకుంది. ఇదే అదునుగా భావించిన దుండగులు తాళాలు పగులగొట్టి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. గురువారం ఉదయం గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
స్లీప్వెల్... లైవ్వెల్
మియాపూర్: సినీ నటి లిఖిత సిటీలో సందడి చేసింది. స్లీప్వెల్ ఇండియా మియాపూర్లోని ఆల్విన్ చౌరస్తాలో నెలకొల్పిన 33వ షోరూమ్ ఫ్యుజన్ ఫర్నీచర్ స్లీప్వెల్ వరల్డ్ను ఆమె శనివారం ప్రారంభించారు. సరైన నిద్రతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు అమిత్పటేల్, విమల్పటేల్, షోరూం నిర్వాహకులు భూషణ్పాఠక్, జయం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మదీనాగూడలో నాగచైతన్య సందడి
మియాపూర్: డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రిని మియాపూర్లోని మదీనాగూడలో ప్రముఖ నటుడు నాగచైతన్య సోమవారం ప్రారంభించారు. డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అశ్విన్ అగర్వాల్, మెడికల్ డైరెక్టర్ వంశీధర్, నందిని, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ నాలా... ఇప్పుడు 4 అడుగులు కూడా లేదు!
మియాపూర్: చెరువుల దిగువ ప్రాంతంలో నాలాలు పూర్తిగా కబ్జాకు గురి కావడంతో నగరంలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఇందుకు తాజా ఉదాహరణ మియాపూర్. ఈ ప్రాంతంలో 10 వరకు చెరువులు ఉన్నాయి. ఒక దానికొకటి అనుసంధానంగా నాలాలు ఉన్నాయి. ఈ చెరువుల కింద పూర్తిగా నాలాలు కబ్జాకు గురయ్యాయి. ఒక్క పటేల్ చెరువు కింద ఉన్న నాలా పక్కనే దాదాపుగా 10 కాలనీలు, అపార్ట్మెంట్లు వెలిశాయి. దీంతో నాలా దాదాపు కనుమరుగయింది. ఓ కళాశాల యాజమాన్యం తన నిర్మాణాలకు అడ్డుగా ఉన్నందున నాలా ఆనవాలు లేకుండా పూడ్చి వేసి కేవలం చిన్న పైపులను ఏర్పాటు చేసింది. దాదాపు ఈ నాలా వెడల్పు రెవెన్యూ రికార్డుల ప్రకారం 40 అడుగులుంటుంది. కానీ, ఇప్పుడు అది 4 అడుగులు కూడా లేదు. దీంతో వాన, డ్రెయినేజీ నీరు నాలాల గుండా పోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కాలనీల ప్రధాన రహదారులపై నీరు ప్రవహిస్తుంది. అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో నిర్మాణ దారులు తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి నాలాలను పూడ్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా దీప్తీశ్రీనగర్, సీబీఆర్ ఎస్టేట్, దుర్గా ఎస్టేట్, శాంతినగర్, ఆదర్శనగర్, విశ్వేశ్వరయ్య కాలనీ, మదీనాగూడతో పాటు మరికొన్ని అపార్ట్మెంట్లలో 6 వేలకు పై చిలుకు మంది నివాసం ఉంటున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఈ కాలనీలు అన్ని పూర్తిగా జలమయమయ్యాయి. -
మియాపూర్లో మహిళ దారుణ హత్య
హైదరాబాద్: మియాపూర్ హఫీజ్పేట్లో గురువారం రాత్రి ఓ మహిళ హత్యకు గురయింది. కాలనీకి చెందిన గుర్రం భిక్షపతి భార్య నిర్మల(32)కు నీలకంఠం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. శుక్రవారం ఉదయం నిర్మలను నిద్ర లేపేందుకు ఆమె కూతురు హసీనా యత్నించగా ఆమె లేవలేదు. దీంతో హసీనా చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. వారంతా వచ్చి చూసి ఆమె చనిపోయినట్లు గుర్తించారు. నీలకంఠం అనే వ్యక్తి ఆమెను గొంతు పిసికి చంపినట్లు నిర్మల సోదరి భవాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మందులోకి వాటర్ ప్యాకెట్లు తేలేదని హత్య
మియాపూర్ : వాటర్ప్యాకెట్లు తేనందుకు ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులను మియాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మియాపూర్ సీఐ రమేష్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. స్థానిక బేకరీలో పని చేసే ఇస్మాయిల్(20), సయ్యద్ షఫీ (23) అనే వ్యక్తులు ఈ నెల 18న మర్తాండ నగర్లోని ఏవీ ఏస్టేట్లో మరో వ్యక్తితో కలిసి మద్యం సేవించారు. అనంతరం సదరు వ్యక్తిని వ్యక్తిని మద్యంతో పాటు వాటర్ బాటిళ్లు తీసుకురమ్మని చెప్పడంతో అతను వెళ్లి తిరిగి రాలేదు. దీనికి కోపోద్రిక్తులనైన ఇస్మాయిల్, సయ్యద్ షఫీ అతడిని పట్టుకుని వాటర్ ట్యాంకు వద్దకు తీసుకువచ్చి గొడవపడ్డారు. మాట మాట పెరగడంతో అతడి తలపై బండరాయితో మోది హత్య చేశారు. వైన్ షాపుల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిచిన పోలీసులు ఇస్మాయిల్, సయ్యద్ షఫీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. కాగా హతుడు ఎవరనేది తెలియరాలేదని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని, నిందితులను రిమాండ్కు తరలించారు. -
మియాపూర్లో కారు బీభత్సం
హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ సిగ్నల్స్ వద్ద ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న కారు... బైకులను ఢీకొట్టి... వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
అదుపు తప్పిన లారీ ఘటనా స్థలంలో ఇద్దరు, చికిత్స పొందుతూ మరొకరు మృతి ఇంకొకరి పరిస్థితి విషమం లారీడ్రైవర్ నిర్లక్ష్యమే కారణం? మియాపూర్: లారీ డ్రైవర్ అజాగ్రత్త, నిద్రమత్తు ఇద్దరి బతుకులు నిద్రలోనే తెల్లారిపోయేలా చేసింది. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూసేలా చేసింది. వీరంతా తూర్పుగోదావరి జిల్లా నుంచి పొట్టచేతపట్టుకుని వ్యాపారం నిమిత్తం వచ్చిన వారే. సోమవారం తెల్లవారుజామున మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. సీఐ రమేష్ కొత్వాల్ కథనం ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం, కోరుమిల్లి గ్రామానికి చెందిన ఆదిబాబు (30), చీకట్ల శ్రీనివాస్ (30), చీకట్ల కృష్ణమూర్తి, చీకట్ల సురేష్ మొక్కల వ్యాపారులు. ఆ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రకాలైన మొక్కలు కొనితెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తుంటారు. పది రోజుల క్రితం మొక్కల లోడ్తో వచ్చిన ఈ నలుగురూ 9వ నెంబర్ జాతీయ రహదారిపై మియాపూర్లోని మదీనాగూడ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో తాత్కాలిక నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులోనే రేకుల డబ్బా ఏర్పాటు చేసుకుని బస చేస్తున్నారు. పగలంతా వ్యాపారం చేసి, రాత్రి వేళ ఆ డబ్బాలోనే నిద్రిస్తున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి డబ్బాలోనే పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు లారీ రూపంలో మృత్యువు వీరి పైకి దూసుకొచ్చింది. ఉప్పులోడుతో మియాపూర్ నుంచి చందానగర్ వైపు వెళ్తున్న లారీ (ఏటీటీ 1517) మదీనాగూడ ఆంజనేయస్వామి గుడి సమీపంలో అదుపు తప్పింది. తెల్లవారుజాము కావడం.. లారీ మితిమీరిన వేగంతో ఉండటంతో పాటు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న తాత్కాలిక నర్సరీలోకి దూసుకుపోయింది. లారీ వేగానికి డబ్బా ఛిద్రమైంది. అందులో నిద్రపోతున్న ఆదిబాబు, శ్రీనివాస్ లారీ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే చనిపోయారు. కృష్ణమూర్తి, సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందగా... సురేష్ పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ లారీ దిగి పారిపోయారు. ఈ ప్రమాదంపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనం కూడా ధ్వంసమైంది. మూడు మృతదేహాలకూ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. -
మియాపూర్లో యువకుడి దారుణ హత్య
హైదరాబాద్: నగరంలోని మియాపూర్, మార్తాండోనగర్లో షరాఫత్(24) అనే యువకుడు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి స్వస్థలం ఉత్తర్ప్రదేశ్. బతుకుదెరువు నిమిత్తం 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి గోపాలపురంలో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ గ్లాస్ఫిట్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే షరాఫత్కు వివాహం నిశ్చయమైంది. షరాఫత్తో వివాహం కుదిరిన అమ్మాయిని వేరొక వ్యక్తి ప్రేమించాడు. ప్రేమించిన వ్యక్తికి ఈ వివాహం ఇష్టంలేకే షరాఫత్ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మద్యాహ్నం ఒంటి గంట సమయంలో షరాఫత్ను బండరాయితో మోది హతమార్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అడ్డుగా ఉన్నాడని.. చంపించింది..!
మియాపూర్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ఓ భార్య కిరాయి హంతకులతో అంతం చేసింది. తన చేతికి మట్టి అంటకుండా పక్కాగా ప్లాన్ చేసినా.. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను కూకట్పల్లి ఏసీపీ భుజంగరావు తెలిపారు...మహారాష్ట్ర నాందేడ్ జిల్లా డెగ్లూర్కు చెందిన డి.అంకుశ్ (24), అంబిక భార్యాభర్తలు. అయితే బతుకుదెరువు కోసం కొన్ని నెలల క్రితం అంకుశ్ ఒక్కడే హైదరాబాద్లో ఉంటున్న తన బాబాయి వద్దకు వచ్చాడు. స్వగ్రామంలోనే ఉన్న అంబిక.. సూర్యకాంత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. తన సంతోషానికి అడ్డు ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే భర్తతో మాట్లాడుతూ అతని కదలికలను ఎప్పటికప్పుడు ప్రియుడికి చేరవేస్తోంది. వారిద్దరూ కలసి అంకుశ్ను చంపేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన తుకారాం, ప్రకాశ్ అనే వారికి రూ.1.30 లక్షల సుపారీ ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నారు. ముందుగా వారికి రూ.10 వేలు ఇచ్చి వారిని హైదరాబాద్ కు పంపింది. ఈ మేరకు 9వ తేదీ రాత్రి ప్రకాశ్, తుకారాంలు మియాపూర్లో అంకుశ్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మద్యం దుకాణం వద్దకు అతడిని తీసుకెళ్లారు. మద్యం తాగిన అనంతరం అదను చూసుకుని తలపై రాయితో మోది చంపేశారు. ఈ ఘటనపై ఈ నెల 10 వ తేదీన అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చివరికి భార్యనే ముద్దాయి అని తేల్చారు. నిందితులు సూర్యకాంత్, తూకారాంలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న 1అంబికా, ప్రకాశ్ల కోసం గాలిస్తున్నారు. -
కార్మికుల కష్టంతోనే ఆర్టీసీ లాభాల్లోకి: చైర్మన్
మియాపూర్ (హైదరాబాద్) : కార్మికులు కష్టపడి పనిచేసినప్పుడే ఆ సంస్థ లాభాల బాట పడుతుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం మియాపూర్లోని బస్బాడీ యూనిట్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను, పనితీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ రూ.202 కోట్ల అప్పుల్లో ఉందని, కార్మికులు సమష్టిగా కష్టించి పనిచేసి లాభాలవైపు గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆర్టీసీకి 400 బస్సులు అవసరం ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్: నగరంలో ఓ రౌడీ షీటర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రశాంత్నగర్ లో శుక్రవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జనార్థన్ ను గుర్తుతెలియని దుండగులు అతన్ని బండరాళ్లతో మోది హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. జనార్థన్ పై రౌడీషీట్ ఉంది. -
అగ్నిప్రమాదంలో రూ.4లక్షల ఆస్తి నష్టం
మియాపూర్ : విద్యుత్ షార్ట్సర్క్యూట్తో గుడిసెలు అగ్నికి ఆహుతై దాదాపు రూ.4లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. మియాపూర్ పోలీస్స్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్ల సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గిరి, గుణ, శ్రీను, రాముల కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అయితే సంక్రాంతి పండుగకు సొంతూరు వెళ్లేందుకు సిద్ధమైన వారంతా కొంత నగదు, దుస్తులు, నగలు సిద్ధంగా ఉంచుకుని సోమవారం ఉదయం పనులకు వెళ్లిపోయారు. కాగా విద్యుత్ షార్ట్సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు గుడిసెలు కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న కూకట్పల్లి ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తామంతా కట్టుబట్టలతో మిగిలామని.. రూ.4 లక్షల మేర ఆస్తినష్టం సంభవించిందని బాధితులు వాపోతున్నారు. -
మియాపూర్లో ‘సమాచార విశ్లేషణ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: హైదరాబాద్లో మరో ప్రతిష్టాత్మక సంస్థ కొలువుదీరనుంది. ప్రభుత్వపథకాలు, బ్యాంకు రుణాలు, వ్యక్తిగత వివరాల సమాచార మార్పిడి, విశ్లేషించేందుకు ‘సమాచార విశ్లేషణాకేంద్రం (డాటా ఎనలైటికల్ సెంటర్) ఏర్పాటు కానుంది. శేరిలింగంపల్లి మండలం మియాపూర్లోని సర్వే నంబర్ 20,28 తేదీల్లో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు స్థలాన్ని పరిశీలించాలని రంగారెడ్డి జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ తాజాగా లేఖ రాశారు. మెట్రో రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ సెంటర్ ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఆధార్ అనుసంధానిత ప్రాజెక్టుల అమలుకు దిక్సూచిగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్లకు, పాస్పోర్టుల జారీ, పింఛన్ల మంజూరు, బ్యాంకు ఖాతాలు, ఆదాయ పన్ను చెల్లింపు సమయంలోను ఆధార్ విశిష్ట సంఖ్య నమోదును తప్పనిసరి చేశారు. దీంతో తప్పుడు సమాచారం పొందుపరిచినా, ప్రభుత్వ పథకాల్లో అనర్హులున్నా తేల్చేందుకు వివిధ సందర్భాల్లో సమర్పించిన డాటాతో విశ్లేషిస్తారు. తద్వారా అక్రమార్కుల గుట్టు బయటకురావడమేగాకుండా.. సమాచార వాస్తవికత ను నిర్ధారించుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలు దుర్వినియోగం జరగకుండా.. పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు వీలు పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కోహెడలో ఫైరింగ్ రేంజ్! హయత్నగర్ మండలం కోహెడలో పోలీస్ ఫీల్డ్ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయిం చింది. హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి ప్రత్యేక శిక్షణాశిబిరం లేకపోవడంతో పొరుగున ఉన్న మహబూబ్నగర్ లేదా మొయినాబాద్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ను సమకూర్చుకోవాలని నగరపోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి నిర్ణయించారు. దీనికి అనుగుణంగా కోహెడలో పది ఎకరాలను కేటాయించాలని కోరుతూ కలెక్టర్ రఘునందన్రావుకు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు గుట్టలు, కొండలతో ఫైరింగ్కు అనువుగా ఉన్నట్లు గుర్తించిన భూమిని ఇచ్చేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వేను నిర్వహించింది. త్వరలోనే భూమి కేటాయింపుల అనుమతుల పరిశీలనకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
చిన్నారిపై యువకుని పైశాచికం..
మద్యం మత్తులోఒక యువకుడు ఐదేళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేశాడు. చుట్టుపక్కల వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ కొత్వాల్ తెలిపిన వివరాలివీ.. రవి (22) అనే వ్యక్తి సికింద్రాబాద్లోని ఓ హోటల్లో కార్మికుడు. అతడు ధనలక్ష్మి అనే వివాహితతో సంబంధం పెట్టుకుని ఆమె కుమార్తె(5) సహా ఆదిత్యనగర్లో ఉంటున్నాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ధనలక్ష్మి ఇంట్లో లేని సయమంలో రవి పీకలదాకా మద్యం తాగి వచ్చి ఆ చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ.. రక్తం వచ్చేలా రక్కుతూ చిత్రహింసలు పెట్టాడు. బాధ తాళలేక చిన్నారి పెద్దగా ఏడవటంతో చుట్టుపక్కలవారు అక్కడికి వచ్చారు. రవి నిర్వాకాన్ని గమనించిన స్థానికులు అతడిని చితక బాదారు. అనంతరం మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పొర్లు దండాలకు అనుమతించలేదని...
హైదరాబాద్: పొర్లు దండాలతో అసెంబ్లీ వరకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించటం లేదంటూ ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తన డిమాండ్ను నెరవేర్చకుంటే కిందికి దూకేస్తానని బెదిరింపులకు దిగాడు. మియాపూర్ ప్రాంతానికి చెందిన మల్లేష్ గౌడ్..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే పొర్లు దండాలతో అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం వద్దకు వస్తాననని దేవుడికి మొక్కుకున్నాడు. రాష్ట్రం అవతరించటంతో మొక్కు తీర్చుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం నగర పోలీసులకు అనుమతి కోసం వినతి పెట్టుకున్నాడు. అయితే, వారు నిరాకరించారు.దీంతో అతడు మంగళవారం ఉదయం మియాపూర్ పోలీస్స్టేషన్ ముందున్న సెల్టవర్ ఎక్కాడు. తన డిమాండ్ను అంగీకరించకుంటే కిందికి దూకుతానని బెదిరిస్తున్నాడు. నగర పోలీస్ కమిషనర్ వచ్చేవరకు టవర్పైనే ఉంటానని భీష్మించుకు కూర్చున్నాడు. పోలీసులు మల్లేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారు -
మియాపూర్-శంషాబాద్ మార్గంలో ఏసీ బస్సులు
మియాపూర్ (హైదరాబాద్) : మియాపూర్ నుంచి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు మియాపూర్ డిపో -2 మేనేజర్ బి.వెంకారెడ్డి సోమవారం తెలిపారు. గంటకు ఒకటి చొప్పున ప్రతిరోజూ 48 ట్రిప్పులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సు సర్వీసులు పటాన్చెరువు, రాంచంద్రాపురం, చందానగర్, మియాపూర్ ఆల్విన్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. మియాపూర్ నుంచి శంషాబాద్కు బస్సు చార్జీ రూ.250 గా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
మెట్రో ట్రయల్ రన్
కేపీహెచ్బీ కాలనీ : మియాపూర్లోని మెట్రో రైల్ డిపో నుంచి ఎస్.ఆర్.నగర్ వరకు ట్రయల్ రన్లో భాగంగా గురువారం మెట్రో రైళ్లు పరుగులు పెట్టాయి. సుమారు 12 కిలోమీటర్ల మేర ట్రాక్పై మెట్రో రైళ్లు రాకపోకలు సాగించడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మియాపూర్ నుంచి భరత్ నగర్ వరకు ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయినప్పటికీ భరత్నగర్ రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఇంతకాలంఎస్.ఆర్.నగర్ వరకు రాకపోకలు సాగించేందుకు వీలు కాలేదు. ఇటీవల బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ట్రయల్ రన్కు అవకాశం దక్కింది. ఈ ట్రయల్ రన్ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎమ్డీవీబీ గాడ్గిల్ జెండా ఊపి ప్రారంభించారు. 50 కేఎంపీహెచ్ వేగంతో రైలును నడిపారు. రైలు వేగం, సిగ్నలింగ్, ట్రాక్లతో పాటు 18 రకాల ప్రయోగ పరీక్షలు నిర్వహించినట్లు ఎల్ అండ్ టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మియాపూర్ టు పంజగుట్ట
-
మియాపూర్ టు పంజగుట్ట
హైదరాబాద్: నగర వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైళ్లు వచ్చే ఏడాది ప్రారంభంలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో పరుగులు తీయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముందుగా అనుకున్నట్టు నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో రాకపోకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ స్టేషన్ వరకు మార్గాన్ని పొడిగిస్తే వాణిజ్య పరంగా, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందన్న అంచనాతో అక్కడ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం విదితమే. సికింద్రాబాద్ స్టేషన్ వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగించాలంటే ఆలుగడ్డ బావి, ఒలిఫెంటా బ్రిడ్జి, చిలకలగూడ వద్దనున్న రైల్వేట్రాక్ల పైనుంచి రైల్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి. ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాక్ల పైనుంచి భారీ స్టీలు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఈ మూడు ఆర్ఓబీల నిర్మాణానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి దశలో మియాపూర్-పంజగుట్ట మార్గంలో సుమారు 15 కి.మీ. పరిధిలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మూడు మెట్రో కారిడార్లు కలిసే అమీర్పేట్ వద్ద ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణం పూర్తి కాలేదు.ఎస్.ఆర్.నగర్లో మెట్రో స్టేషన్ అందుబాటులో ఉన్నందున ఈ మార్గంలో రాకపోకలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఎల్అండ్ టీ వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా ఎప్పు డు ప్రారంభించాలనే విషయంలో సీఎం కేసీఆర్దే తుది నిర్ణయమని మెట్రో రైలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నగర మెట్రో రైళ్లలో కనిష్టం గా రూ.10, గరిష్టంగా రూ.25 చార్జీని వసూలు చేయాలని నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లు తెలిసిం ది. పొరుగునే ఉన్న చెన్నైలో కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ.40 వసూలు చేస్తున్న విషయం విదితమే. దీనిపై ప్రభుత్వ నిర్ణయమే కీలకం. తొలగని ప్రతిష్టంభన అసెంబ్లీ వెనుక వైపు నుంచి మెట్రో మార్గం మళ్లించే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ.. సుల్తాన్ బజార్, కోఠి ఉమెన్స్ కళాశాల,పాత నగరంలో అలైన్మెంట్ మార్పుపై ప్రతిష్టంభన తొలగలేదు. సీఎం ఆదేశాల మేరకు పాతనగరంలో 3.2 కి.మీ. మార్గంలో మెట్రో అలైన్మెంట్ను పూర్తిగా మూసీ నది మధ్య నుంచే వేయాల్సి ఉంది. వాణిజ్య, సాంకేతిక పరంగా అవాంతరాలు ఎదురవుతాయని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ అధ్యయనంలో తేలినట్లు సమాచారం. సుల్తాన్బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లించేందుకు నిర్మాణ సంస్థ అధ్యయనం చేసి, రెండు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిసింది. వీటిలో ఏదో ఒక మార్గానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పక్షంలో పనులు ఊపందుకుంటాయి. 60 కి.మీ. మేరకు ఊపందుకున్న పనులు నాగోల్-రహేజా ఐటీ పార్క్, ఎల్బీ నగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్నుమా కారిడార్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్న విషయం విదితమే. ప్రస్తుతానికి 60 కి.మీ. మార్గంలో పనులు ఊపందుకున్నాయి. నాగోల్-సికింద్రాబాద్ స్టేషన్, మియాపూర్-పంజగుట్ట, మెట్టుగూడ-బేగంపేట్, బేగంపేట్-శిల్పారామం, ఎల్బీనగర్-నాంపల్లి మార్గాల్లో సుమారు 60 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లు, వాటిపై ట్రాక్ల ఏర్పాటుకు వయడక్ట్ సెగ్మెంట్లు, స్టేషన్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కోఠి-ఫలక్నుమా మార్గంలో పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. పార్కింగ్ స్థలాల అన్వేషణ షురూ... మెట్రో స్టేషన్లకు సమీపంలో ప్రయాణికుల వాహనాలు పార్క్ చేసేందుకు మూడు కారిడార్ల పరిధిలో సుమారు 18 చోట్ల స్థలాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతానికి ఓల్డ్ గాంధీ ఆస్పత్రి, తార్నాక, ఖైరతాబాద్, గడ్డిఅన్నారం, నాగోలు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఖరారైనట్టుసమాచారం. ఇతర ప్రాంతాల్లోనూ అవసరమైతే ప్రైవేటు స్థలాలను లీజుకు తీసుకొని పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు హెచ్ఎంఆర్ అధికారుల బృందం కసరత్తు చేస్తోంది. త్వరలో ఈ విషయంలో స్పష్టత రానుందని ‘మెట్రో’ అధికారులు తెలిపారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఎన్ని బస్సులు కొనుగోలు చేయాలన్న అంశంపై ఎల్అండ్టీ కసరత్తు చేస్తోంది. -
ఏటీఎం చోరీకి విఫలయత్నం
హైదరాబాద్: నగరంలో గుర్తుతెలియని దుండగులు ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. గురువారం అర్థరాత్రి దుండగులు ఏటీఎం మిషన్ తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు. అయితే అది ఫలించక పోవడంతో దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన మియాపూర్ స్వర్ణపురి కాలనీలోని బస్టాప్ వద్ద ఎస్బీహెచ్ ఏటీఎంలో జరిగింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సీసీ కెమరాల ఫూటేజి ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.12 కోట్లతో చిట్టీల మాధవి ఉడాయింపు
హైదరాబాద్: రాజధాని నగరంలో మరో చిట్టీల మోసం బయటపడింది. మియాపూర్ మదీనాగూడ ప్రాంతానికి చెందిన మాధవి, వెంకటేశ్వర్లు దంపతులు ఖాతాదారులకు రూ. 12 కోట్లకు శఠగోపం పెట్టారు. ఇరుగు పొరుగుతో ఊరికి వెళ్లివస్తానని చెప్పి ఉడాయించారు. ఎన్నిరోజులైనా వీరు తిరిగిరాకపోవడంతో ఖాతాదారులు లబోదబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. రూపాయి రూపాయి కూడబెట్టి మాధవి దగ్గర చిట్టీలు కట్టామని బాధితులు వాపోయారు. రూ.10 వడ్డీ ఇస్తామని తమకు ఆశపెట్టారని వెల్లడించారు. మాధవి, వెంకటేశ్వర్లు ఐదేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు వీరి దగ్గర పెద్ద ఎత్తున చిట్టీలు వేసి మోసపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరుతున్నారు. -
ఏటీఎం చోరికి విఫలయత్నం
-
మియాపూర్ ఎస్బీహెచ్ ఏటీఎంలో చోరీకి యత్నం
హైదరాబాద్ : మియాపూర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి తీవ్ర ప్రయత్నం చేశారు. ఏటీఎం పగులకొట్టి డబ్బు తస్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడానికి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ పోలీసులు తెలిపారు. -
వచ్చే ఏడాది ప్రారంభంలో మెట్రో పరుగులు
జంటనగరాల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రారంభించిన హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు మొత్తం 2017 జూన్ నాటికి పూర్తవుతుందని హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నాగోల్- సికింద్రాబాద్, మియాపూర్- పంజాగుట్ట మార్గాలలో మాత్రం వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే మొదలవుతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు లాభనష్టాలు లేని స్థితికి రావడానికి ముందు అనుకున్న సమయం కంటే ఒకటి రెండేళ్లు ఎక్కువ పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల మెట్రోపై మరీ అంత ఎక్కువ ప్రభావం పడలేదు గానీ, బ్రేక్ ఈవెన్కు వచ్చేందుకు మాత్రం ఒకటి రెండేళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టు ప్రారంభమైన నాలుగు- ఐదేళ్లలోనే బ్రేక్ ఈవెన్ వస్తుందని భావించామని, కానీ ఇప్పుడు ఆరేడేళ్లు పట్టేలా ఉందని ఆయన తెలిపారు. హైదరాబాద్ మంచి వాణిజ్య కేంద్రమని.. ఇది ఎప్పటికీ మారదని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతున్నాయని, రెండు ప్రాంతాల్లో రూటు మార్పుకు సంబంధించి సాంకేతిక నివేదికలు ప్రభుత్వానికి చేరాయని ఆయన చెప్పారు. ముందు అనుకున్నట్లుగానే 2017 జూన్ నాటికి మొత్తం ప్రాజెక్టు అంతా సిద్ధంగా ఉంటుందని, మెట్రో రైలు పరుగులు తీస్తుందని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. -
కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు
-
కూకట్ పల్లి-మియాపూర్ లో మెట్రో రైలు పరుగులు
హైదరాబాద్: కూకట్ పల్లి-మియాపూర్ మార్గంలో మైట్రో రైలు పట్టాలెక్కింది. గురువారం ఈ మార్గంలో ట్రయన్ రన్ నిర్వహించారు. 4 కిలోమీటర్ల వరకు విజయవంతంగా ఈ ట్రయల్ రన్ సాగింది. మరోవైపు ఉప్పల్- మెట్టుగూడ మార్గంలో ట్రయల్ రన్ కొనసాగుతోంది. దీని ద్వారా వివిధ స్థాయిల్లో పనులను అధికారులు సమీక్షిస్తున్నారు. సిగ్నలింగ్, ట్రాక్, డ్రైవర్ రహిత టెక్నాలజీ వినియోగం, లైటింగ్, రైళ్ల సామర్థ్యం వంటి సాంకేతిక అంశాల్లో ఉప్పల్ మెట్రోడిపోలోని 8 రైళ్లు విజయవంతంగా ప్రయోగ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. కాగా ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మార్చి 21 (ఉగాదిన)న మెట్రో రైలు సర్వీసును నాగోలు- మెట్టగూడల మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. -
కరెంట్ షాక్తో ఇద్దరు కార్మికులు మృతి
హైదరాబాద్: నాలా శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన మియాపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. ఓ కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ కరెంట్ తీగలు తెగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. (మియాపూర్) -
మియాపూర్ డిపోకు మరో నాలుగు మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ మెట్రో రైలు డిపోకు మరో నాలుగు మెట్రో రైళ్లు శుక్రవారం రాత్రి పొద్దుపోయాక చేరుకున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్ రోటెమ్ కంపెనీ తయారు చేసిన ఈ రైళ్లు సముద్ర మార్గంలో భారీ నౌకల ద్వారా చెన్నై పోర్టుకు, అక్కడి నుంచి భారీ ట్రక్కుల ద్వారా నగరానికి చేరుకున్నాయి. ఉప్పల్ డిపోలో సిద్ధంగా ఉన్న ఏడు మెట్రో రైళ్లకు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్ డిపోలో మరో మూడు రైళ్లు ఉన్నాయి. తాజాగా శుక్రవారం సిటీకి చేరుకున్న 4 మెట్రో రైళ్లు మియాపూర్ డిపోకు చేరాయి. 2015 మార్చి నాటికి మొత్తంగా 14 రైళ్లు నాగోల్-మెట్టుగూడ, ఎస్.ఆర్.నగర్-మియాపూర్ (ఒక్కో రూట్లో ఏడు చొప్పున) మార్గంలో రాకపోకలు సాగిస్తాయని హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. -
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు టీఆర్ఎస్ అభ్యంతరం
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్టీఆర్ 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ లోని అల్వీన్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ టీఆర్ఎస్ అడ్డుతగలడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. దాంతో మియాపూర్ లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే టీఆర్ఎస్ కార్యకర్తల నిరసనను టీడీపీ నేతలు ఖండించారు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని జీహెచ్ఎంసీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. -
పూర్తికాని నాలుగులేన్ల రహదారి!
పటాన్చెరుటౌన్, న్యూస్లైన్: రంగారెడ్డి జిల్లా మియాపూర్ నుంచి మెదక్ జిల్లా సంగారెడ్డి వరకు వేసిన 31 కిలోమీటర్ల నాల్గు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఈ జాతీయరహదారిపై ట్రాఫిక్ పెరగడంతో మియాపూర్ నుంచి సంగారెడ్డివరకు నాల్గు లేన్లతో రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఓ నిర్మాణ సంస్థకు (బీఓటీ) బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిన ప్రభుత్వం అప్పగిచింది. అయితే 2008 డిసెంబర్ నాటికి సదరు సంస్థ 80 శాతం రోడ్డు పనులను మాత్రమే పూర్తి చేసింది. 80 శాతం పనులు మాత్రమే పూర్తి చేసిన సదరు సంస్థకు టోల్ప్లాజా ఏర్పాటు చేసుకొని వాహన దారులనుంచి డబ్బులు వసూలు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. టోల్ గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిర్మాణ సంస్థ ఐదు సంవత్సరాలు గడిచినా మిగిలిన 20 శాతం పనులను పూర్తి చేయలేదు. కానీ ప్రతి రెండు సంవత్సరాలకోసారి 10 శాతం టోల్ గేటు రుసుము పెంచుతుందని విమర్శలు వస్తున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా పట్టణంలోని మార్కెట్ సమీపంలో కల్వర్టు ఏర్పాటు చేసి సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కల్వర్టు నిర్మించకుండా సర్వీసు రోడ్డును వేయడమే మానేశారు. అంతే కాకుండా పట్టణంలో ప్రయాణికుల భద్రత కోసం రోడ్డు మద్యలో గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉండగా అటువంటి ఏర్పాట్లే చేయలేదు. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ గతంలో ఓ అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో అధికారులు పట్టించు కోలేదనే విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో నైనా మిగిలిన రోడ్డు పనులకు మోక్షం లభిస్తుందోమోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. సంగారెడ్డి నుంచి మియాపూర్ వరకు ఎటువంటి ప్రమాదాలు జరిగినా సదరు సంస్థ క్షతగాత్రులను ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. కానీ ఏ రోజు కూడా ఆంబులెన్స్ అందుబాటులో ఉండదు. టోల్ ప్లాజా వద్ద నామమాత్రంగా డొక్కు అంబులెన్స్ దర్శనమిస్తుంది. రోడ్డు నిర్వాహణ బాధ్యత సదరు సంస్థపై ఉన్నప్పటికీ ఆ రోడ్డు ఏ రోజు చూసినా అపరిశుభ్రంగా ఉంటోంది. సదరు సంస్థ కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పాటు చేయలేదు. రోడ్డుపై సిగ్నల్స్ ఏర్పాటు చేయకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. -
వడదెబ్బకు ముగ్గురి బలి
వడదెబ్బకు ముగ్గురి బలి: వీపనగండ్ల / మాగనూర్ / జడ్చర్ల టౌన్, న్యూస్లైన్ : జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు వడదెబ్బకు గురై మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం వీపనగండ్ల మండలం మియ్యాపూర్కు జె.సత్యన్న (55) సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు చేపట్టాడు. అదే రాత్రి ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య చిలకమ్మతో పాటు కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు బోరుమన్నారు. మరో సంఘటనలో కొన్నాళ్లుగా మాగనూర్ మండలం కృష్ణకు చెందిన కాళప్ప (65) స్థానిక రైల్వేస్టేషన్ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం గడిపేవాడు. ఈయనకు భార్య సరస్వతి ఉంది. రెండు రోజులుగా ఎండలు విపరీతంగా ఉండటంతో శుక్రవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై రైల్వేస్టేషన్ ప్రాంతంలోని చెట్టు కింద మృతి చెందాడు. అలాగే జడ్చర్ల మండలం ఉదండాపూర్కు చెందిన చెన్నయ్య (62) స్థానికంగా కూలి పనులు చేసుకుని జీవించేవాడు. ప్రస్తుతం పశువుల కాపరిగా వ్యవహరిస్తున్నాడు. ఈయనకు భార్య చెన్నమతో పాటు మగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం శివారులో పశువులను తీసుకెళ్లి మేపి అదే రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం వాంతులు, విరేచనాలు కావటంతో కుటుంబ సభ్యులు గమనించి ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించారు. చివరకు శుక్రవారం ఉదయం ఇంట్లోనే మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని వీఆర్ఓ పాండురంగయ్య పరామర్శించి పంచనామా నిర్వహించారు. -
నార్వే నుంచి పిల్లల చెంతకు..
హైదరాబాద్ చేరుకున్న చంద్రశేఖర్ దంపతులు సాక్షి, హైదరాబాద్: నార్వే కఠిన చట్టాల కారణంగా జైలుపాలైన తెలుగు దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమ తిరిగి హైదరాబాద్ వచ్చారు. కన్నబిడ్డను మందలించిన కేసులో ఏడాదికిపైగా శిక్ష అనుభవించిన వీరు ఇటీవల మియాపూర్లోని తమ ఇద్దరు పిల్లల చెంతకు చేరుకుని సంతోషంగా ఉన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రశేఖర్ మూడేళ్ల కిందట భార్య, ఇద్దరు కొడుకులు సాయిశ్రీరామ్(7), అభినవ్(3)లతో నార్వే వెళ్లారు. సాయిశ్రీరామ్ స్కూల్లో అల్లరి చేస్తున్నాడని, ఓసారి నిక్కర్ తడిపేసుకున్నాడని టీచర్లు ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్ దంపతులు అతణ్ని మందలించి ‘తిరిగి ఇండియాకు పంపేస్తామ’ని బెదిరించారు. శ్రీరామ్ ఈ సంగతి స్కూల్లో చెప్పడంతో పోలీసులు గత ఏడాది నవంబర్లో వారిని అరెస్టు చేశారు. నార్వే చట్టాల ప్రకారం పిల్లలను కొట్టడం, తిట్టడం, బె దిరించడం నేరం కనుక గత ఏడాది డిసెంబర్లో ఓస్లో కోర్టు చంద్రశేఖర్కు 18 నెలలు, అనుపమకు 15 నెలల శిక్ష జైలు శిక్ష వేసింది. దీనిపై వారు న్యాయపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అయితే కోర్టు చంద్రశేఖర్ శిక్షను ఏడాదికి, అనుపమ శిక్షను 11 నెలలకు తగ్గించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 22న విడుదలైన అనుపమ అదే నెల హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 2న విడుదలైన చంద్రశేఖర్ 4న వచ్చారు. సాయిశ్రీరామ్, అభినవ్లు ఏడాదిగా మియాపూర్లోని నానమ్మ, తాతల వద్ద ఉంటున్నారు. చంద్రశేఖర్ దంపతులకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ తాము చేపట్టిన పోరాటానికి సాక్షి దినపత్రిక, టీవీ చానల్ మద్దతునిచ్చాయని, అందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని చంద్రశేఖర్ బంధువు శైలేంద్ర చెప్పారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ సంఘటన జరిగింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. పోలీసులు వెంటనే మంటలు ఆర్పి బాధితుణ్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప్రత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడి మూడేళ్ల క్రితం దొంగతనం కేసులో నిందితుడు. ఇటీవల మియాపూర్ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరగడంతో అతణ్ని పిలిపించి పోలీసులు విచారించారు. అయితే ప్రస్తుతం తాను దొంగతనం చేయడం మానేశానని, పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని బాధితుడు చెప్పాడు. అయినా పోలీసులు వేధించడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని బాధితుడు ఆరోపించాడు. -
మియాపూర్కు మెట్రో వెలుగు!
హైదరాబాద్: మియాపూర్... ఒకప్పుడు నగరం నుంచి విసిరేసిన ట్టుగా ఉండేది. మెరుగైన మౌలిక సదుపాయాలుండేవి కావు. కానీ, నేడా పరిస్థితులు లేవు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ ప్రాంగణం... 269 ఎకరాల్లో నిర్మించనున్న మెట్రో రైల్వే టెర్మినల్తో ఇప్పుడీ ప్రాంతం హైదరాబాద్ను ప్రపంచ దేశాల సరసన నిలబెడుతోంది. మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు తమ సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. హైటెక్ సిటీ, సైబర్ టవర్స్తో మాదాపూర్ మాత్రమే కాదు... మియాపూర్, గచ్చిబౌలి, నానక్రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలకు అభివృద్ధి శరవేగంగా వెళ్లింది. మియాపూర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు సులువుగా ప్రయాణం చేసే సౌకర్యాలుండటం, మెగా షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మియాపూర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కేవలం అరగంట ప్రయాణం... ఇవన్నీ మియాపూర్ అభివృద్ధిని రెండింతలు చేశాయి. వ్యక్తిగత గృహాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, లగ్జరీ విల్లాలు కూడా మియాపూర్లో అధికం. ప్రస్తుతం ఇక్కడ చ.అ. ధర రూ.3,000 నుంచి ప్రారంభమౌతోంది. కానీ, మరో ఆరు నెలల్లో సుమారు రూ.4,500కు చేరవచ్చని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ అధిపతి రామ్రెడ్డి చెప్పారు. ఐటీ, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్ సంస్థలకు మియాపూర్ కేంద్రబిందువుగా మారిందంటూ... మెట్రో టెర్మినల్, అంతర్జాతీయ షాపింగ్మాళ్లు, ఆసుపత్రులకు నిలయం కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. మెట్రో ఎఫెక్ట్... కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 28.87 కి.మీ.లలో మెట్రో వస్తోంది. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టు నాటికి ఈ మార్గం పూర్తవుతుందని ఎల్ అండ్ టీ వర్గాలు చెబుతున్నాయి. మియాపూర్లో 269 ఎకరాల్లో మెట్రో రైల్వే టెర్మినల్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మెట్రో రైల్ను మరింత విస్తరించే అవకాశం ఉందనేది నిపుణుల మాట. బాచుపల్లి నుంచి గచ్చిబౌలి, పటాన్చెరు వరకూ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఇదే సాధ్యమైతే రానున్న రోజుల్లో మియాపూర్ అతిపెద్ద జంక్షన్గా అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. మెట్రో కారిడార్లలో కళ్లు చెదిరే మాల్స్, మల్టీప్లెక్స్ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్లను నిర్మించేందుకు ఎల్అండ్టీ సంస్థ ప్రణాళికలు రచించింది. కూతవేటు దూరంలో.. మియాపూర్ మెట్రో రైల్వే టెర్మినల్కు కూతవేటు దూరంలో నగరంలోని పలు నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్లున్నాయి. మై హోమ్ జ్యుయల్, అపర్ణా సైబర్ కౌంటీ, ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, ల్యాండ్మార్క్ టవర్స్, ఆర్వీ అవనీంద్ర, హేమదుర్గా టవర్స్ వంటివి పూర్తికాగా దివ్యశ్రీ శక్తి, ఫార్చ్యూన్ హైట్స్, జనప్రియ నైల్వ్యాలీ వంటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. 9 ఎకరాల్లో 965 ఫ్లాట్లతో ఎస్ఎంఆర్ నిర్మిస్తున్న వినయ్ ఫౌంటెయిన్ హెడ్, 2 ఎకరాల్లో 196 ఫ్లాట్లతో ఆర్వీ నిర్మాణ్ నిర్మిస్తున్న శిల్ప హోమ్స్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో ధర రూ.3,200 నుంచి 3,600 వరకు చెబుతున్నారు.