కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ | ccs trabajadores para depositar fondos GeographyHiramandalam | Sakshi
Sakshi News home page

కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ

Published Sun, Sep 28 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

ccs trabajadores para depositar fondos GeographyHiramandalam

ఎట్టకేలకు సిబ్బందికి రుణాలు
 

హైదరాబాద్: కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్లు చొప్పున పాత బకాయిలు చెల్లిం చడంతో అందులోంచి రూ.223 కోట్లను కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం జమచేసింది. ఆగస్టు 31 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇవి సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.53 కోట్లను యాజమాన్యం సీసీఎస్‌కు జమచేయాల్సి ఉంటుంది.

ఆ మొత్తం నుంచి  కుటుంబావసరాలకు కార్మికులు రుణంగా పొందుతారు.  కానీ 5 నెలలుగా వాటి ని జమచేయకుండా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఫలితంగా రుణాల కోసం కార్మికులు చేసుకున్న 20 వేల దరఖాస్తులు పేరుకుపోయా యి. ఆగస్టు 31 తర్వాత అందిన దరఖాస్తులు మరో 300 వరకు పెండింగ్‌లో ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement