ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు రేషన్షాపుల ద్వారా సరఫరా చేస్తున్న గోధుమల ప్యాకెట్లలో రసాయన ఎరువుల గుళికలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఓ రేషన్షాపు నుంచి తీసుకొచ్చిన గోధుమ ప్యాకెట్ను వినియోగదారులు బుధవారం విప్పి చూడగా వాటిలో యూరియా, 20-20-20 వంటి ఎరువుల గుళికలు కన్పించాయి. ఇలాంటివి వాడితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్యాకెట్లపై బ్యాచ్ నెంబర్-1, 2015 జూలైలో ప్యాక్ చేసినట్లు ముద్రించి ఉంది.