
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు ఇచ్చిన దసరా సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ నెల 18వ తేదీ వరకే సెలవులు ఇచ్చినప్పటికీ, తాజాగా ఈ నెల 19, 20 తేదీలు కూడా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు 21వ తేదీ ఆదివారం కావడంతో మొత్తంగా మరో మూడు రోజులు సెలవులుగా వెల్లడించింది. ఈ నెల 22వ తేదీన కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సెలవు దినాలను పాటించాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment