73 రోజుల తరువాత చేరిన మృతదేహం | dead body reached after 73days from soudi arabia | Sakshi
Sakshi News home page

73 రోజుల తరువాత చేరిన మృతదేహం

Published Tue, Mar 14 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 5:59 AM

73 రోజుల తరువాత చేరిన మృతదేహం

73 రోజుల తరువాత చేరిన మృతదేహం

చిన్నశంకరంపేట: సౌదీ అరేబియాలో మృతి చెందిన మెదక్‌ జిల్లావాసి మృతదేహం 73 రోజుల తరువాత సోమవారం సొంతూరుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన కేతావత్‌ రవి(28) బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లి మృతి చెందిన విషయం విదితమే.

గత డిసెంబర్‌ 31న సౌదీలోని రియాద్‌ సమీపంలో కలిబులిలో రోడ్డు పక్కన ఇసుకను లోడ్‌చేసే పనిలో నిమగ్నమైన రవిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 73 రోజుల తరువాత రవి శవం కళ్లజూసిన అతడి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement