వ్యాపారాలు ‘పాడ’వుతున్నాయి | etela rajender letter to arun jaitley for center help | Sakshi
Sakshi News home page

వ్యాపారాలు ‘పాడ’వుతున్నాయి

Published Fri, Dec 2 2016 4:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

వ్యాపారాలు ‘పాడ’వుతున్నాయి

వ్యాపారాలు ‘పాడ’వుతున్నాయి

సాక్షి, హైదరాబాద్: ఎక్కువ కాలం నిల్వ ఉండని పౌల్ట్రీ, పాలు, కూరగాయలు, పలు వ్యవసాయ, వ్యవసాయాధార ఉత్పత్తుల రంగాలపై పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్ర  ప్రభావాన్ని చూపిందని రాష్ట్ర ఆర్థిక  మంత్రి ఈటల రాజేందర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో ఈ రంగాల పరిశ్రమలు మళ్లీ నిలదొక్కుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి గురువారం ఆయన లేఖ రాశారు. ఈ రంగాలకు చెందిన పరిశ్రమలకు సంబంధించిన టర్మ్ రుణాల వడ్డీలు, వాయిదాల చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని జైట్లీని కోరారు. మొండి రుణాలను రీ షెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement