Arun Jaitley
-
బడా నేతల పుట్టినిల్లు డీయూ.. జైట్లీ నుంచి రేఖా వరకూ..
న్యూఢిల్లీ: దేశంలో పేరెన్నికగన్న విద్యాలయాల్లో ఢిల్లీ విశ్వవిద్యాలయం(డీయూ) ఒకటి. ఈ వర్శిటీ అనుబంధ కళాశాలల్లో చదివిన పలువురు పెద్ద రాజకీయ నేతలుగా ఎదిగారు. వీరిలో చాలామంది క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఢిల్లీ యూనివర్శిటీ(Delhi University) పరిధిలోని వివిధ కళాశాల్లో చదివి బడా నేతలుగా ఎదిగిన వారి జాబితాలో అరుణ్ జైట్లీ, శశి థరూర్ మొదలుకొని మొన్ననే ఢిల్లీ పీఠమెక్కిన రేఖాగుప్తా కూడా ఉన్నారు. మరి.. వీరిలో ఎవరెవరు ఏ కాలేజీలో చదివారనే వివరాల్లోకి వెళితే..శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్అరుణ్ జైట్లీ: మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(Arun Jaitley) 1973లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి బి.కామ్ ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుండి ఎల్ఎల్బీ పట్టా పొందారు.విజయ్ గోయెల్: కేంద్ర మాజీ మంత్రి విజయ్ గోయెల్ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి ఎం.కామ్ పట్టా పొందారు.జితిన్ ప్రసాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జితిన్ ప్రసాద్.. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి వాణిజ్యంలో డిగ్రీ పట్టా పొందారు.సెయింట్ స్టీఫెన్స్ కళాశాలశశి థరూర్: కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ 1975లో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.మణిశంకర్ అయ్యర్: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్(Mani Shankar Iyer) సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బీ.ఎ. పట్టా పొందారు.వీరభద్ర సింగ్: మాజీ కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బీ.ఎ. ఆనర్స్ డిగ్రీని అందుకున్నారు.ఖుష్వంత్ సింగ్: ఖుష్వంత్ సింగ్ రచయితగా, న్యాయవాదిగా, పాత్రికేయునిగా, దౌత్యవేత్తగా పేరొందారు. ఈయన సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో చదువుకున్నారు.హిందూ కళాశాలడాక్టర్ సుబ్రమణియన్ స్వామి: రాజకీయవేత్త, ఆర్థికవేత్త, క్యాబినెట్ మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణియన్ స్వామి హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.రావు ఇంద్రజిత్ సింగ్: భారత ప్రభుత్వ మాజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ హిందూ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.మీనాక్షి లేఖి: భారత ప్రభుత్వ మాజీ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ఢిల్లీలోని హిందూ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ (బీఎస్సీ) పూర్తి చేశారు.రాంజస్ కళాశాలచౌదరి బ్రహ్మ ప్రకాష్: ఢిల్లీ మొదటి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్, ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంజస్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.సోమనాథ్ భారతి: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతి, రాంజస్ కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు.సరూప్ సింగ్: 1990లో మొదట కేరళ గవర్నర్గా, ఆ తర్వాత గుజరాత్ గవర్నర్గా పనిచేసిన సరూప్ సింగ్, రాంజస్ కళాశాల నుండి బీ.ఎ. ఇంగ్లీష్ చదివారు.కిరోరి మాల్ కళాశాలనవీన్ పట్నాయక్: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు.మదన్లాల్ ఖురానా: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, మదన్లాల్ ఖురానా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.ప్రవేశ్ వర్మ: ప్రవేశ్ వర్మ ప్రస్తుత ఢిల్లీ బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరి మాల్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చదివారు.హన్స్రాజ్ కళాశాలకిరణ్ రిజిజు: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. హన్స్రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.అజయ్ మాకెన్: ప్రస్తుత ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ హన్స్రాజ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్అనుప్రియ పటేల్: పార్లమెంటు సభ్యురాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాజీ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Anupriya Patel) లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల నుండి బీ.ఎ. పట్టా పొందారు.మేనకా గాంధీ: మాజీ ఎంపీ, మహిళా, శిశు అభివృద్ధి మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త, పర్యావరణవేత్త మేనకా గాంధీ ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దయాల్ సింగ్ కళాశాలపంకజ్ సింగ్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడు, నోయిడా ఎమ్మెల్యే పంకజ్ సింగ్ 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దయాళ్ సింగ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా పొందారు. ఆయన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు.అల్కా లాంబా: జాతీయ కాంగ్రెస్ మహిళా నేత అల్కా లాంబా 1996లో దయాళ్ సింగ్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.దౌలత్ రామ్ కళాశాలరేఖ గుప్తా: కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని దౌలత్ రామ్ కళాశాల నుండి బీ.కాం. పట్టా అందుకున్నారు.ఇది కూడా చదవండి; Mahakumbh: 75 జైళ్లలో ఖైదీల పవిత్ర స్నానాలు -
అందరికీ వృద్ధి ఫలాలు అందడమే అసలైన అభివృద్ధి
న్యూఢిల్లీ: సమ్మిళిత వృద్ధి (అందరికీ వృద్ధి ఫలాలు చేరేలా) లేకుండా అసలైన వృద్ధి సాధ్యపడదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు ఈ దిశగా తీసుకున్నట్టు చెప్పారు. తొలిసారిగా అరుణ్జైట్లీ స్మారక ఉపన్యాసం ఇచ్చారు. ప్రైవేటు రంగాన్ని వృద్ధిలో భాగస్వామిగా చూస్తున్నట్టు చెప్పారు. సమ్మిళిత వృద్ధి కోసం తీసుకున్న చర్యలను వివరిస్తూ.. ‘‘9 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశాం. 10 కోట్ల టాయిలెట్లను ప్రభుత్వం నిధులతో నిర్మించాం. 45 కోట్ల బ్యాంకు ఖాతాలను పేదల కోసం తెరిచాం. 2014కు ముందు పదేళ్లలో 50 వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, గత 7–8 ఏళ్లలో 209 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి’’అని చెప్పారు. భారత్ తప్పనిసరి అయి సంస్కరణలు చేపట్టడం లేదని స్పష్టం చేస్తూ.. తదుపరి 25 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని దృఢ విశ్వాసంతో అమలు చేస్తున్నట్టు తెలిపారు. సంస్కరణలు అందరికీ ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ బీజేపీ నేత అయిన అరుణ్జైట్లీకి ప్రధాని నివాళులు అర్పించారు. -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
ఆ ఇద్దరు మహానేతల మృతికి మోదీనే కారణం..
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక బీజేపీ అగ్రనేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ప్రాణాలు కోల్పోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సుష్మా, జైట్లీ కుటుంబాలు తీవ్రంగా ఖండించాయి. సుష్మా స్వరాజ్ కుమార్తె భానుశ్రీ స్వరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఉదయనిధి గారూ, మీ ఎన్నికల ప్రచారం కోసం మా అమ్మ పేరును వాడకండి. మీ ఆరోపణలన్నీ అవాస్తవం. నా తల్లికి ప్రధాని మోదీ ఎంతో విలువ ఇచ్చారో మాకు తెలుసు. కష్ట సమయాల్లో ప్రధానితో పాటు పార్టీ కూడా మా కుటుంబానిక అండగా నిలిచింది. మీ వ్యాఖ్యలు మమ్మల్ని ఎంతో బాధించాయి అంటూ పేర్కొన్నారు. మరోవైపు జైట్లీ కుమార్తె సొనాలీ జైట్లీ బక్షీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "ఉదయనిధి గారూ, మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. అయితే మా తండ్రిని అగౌరవపరిస్తే మాత్రం ఊరుకోను. ప్రధాని మోదీ, నా తండ్రి మధ్య ఎంతో గాఢమైన బంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైంది. అంతటి స్నేహాన్ని అర్థం చేసుకునే శక్తిని మీరు సంపాదించుకుంటారని విశ్వసిస్తున్నాను'' అంటూ సొనాలీ జైట్లీ ట్వీట్ చేశారు. -
‘మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు’
చెన్నె: బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రుల మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్చర్ కారణమని సినీ నటుడు, డీఎంకే యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి ఒత్తిడి తట్టుకోలేకనే సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మృతి చెందారని ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై తాజాగా వారి వారసులు స్పందించారు. ఎన్నికల వేళ రాజకీయాల కోసం తమ తల్లి, తండ్రి పేర్ల ప్రస్తావన సరికాదని ఉదయనిధికి విజ్ఞప్తి చేశారు. ‘మీరు చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం తీవ్రంగా బాధపడింది. మా అమ్మ మృతిని అపవిత్రం చేశారు. రాజకీయాల కోసం డీఎంకే ఇంత దిగజారింది’ అని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ట్వీట్లో పేర్కొంది. ఉదయనిధి వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ కుమార్తె సోనాలి జైట్లీ భక్షి కూడా స్పందించింది. ‘ఉదయనిధి గారు మీరు ఎన్నికల ఒత్తిడిలో ఉన్నారని నాకు తెలుసు. మీరు అబద్ధం చెప్పారు. మా నాన్నను అగౌరవపరుస్తున్నారు. అరుణ్జైట్లీ, నరేంద్ర మోదీ మధ్యం రాజకీయంగా కాకుండా గొప్ప బంధం ఉంది. ఆ స్నేహాన్ని తప్పుపట్టవద్దని కోరుతున్నా’ అని సోనాలీ ట్వీట్ చేసింది. సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ బీజేపీలో అగ్ర నాయకులు. వాజ్పేయి హయాంలో వీరిద్దరు కేంద్ర మంత్రులుగా పని చేయగా అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కూడా ఉన్నారు. సుష్మ, జైట్లీ 2019 ఆగస్టులో అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు వారి మరణం తమిళనాడు ఎన్నికల్లో ప్రస్తావనకు రావడం హాట్ టాపిక్గా మారింది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించకుండా వారి వారసులు స్పందించడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఇటీవల ఎయిమ్స్ ఇటుక అంటూ ఇటుక చూయించి హాట్ టాపిక్గా మారాడు. అతడి ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా ఉండేలా కనిపిస్తోంది. @udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India — Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021 .@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory. Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India — Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021 -
ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి
న్యూఢిల్లీ : ఫిరోజ్షా కోట్లా క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డీడీసీఏ నిర్ణయంపై భారత స్పిన్ దిగ్గజం ,బిషన్ సింగ్ బేడీ మండిపడ్డారు. తన నిరసనను తెలుపుతూ డీడీసీఏ ప్రస్తుత అధ్యక్షుడు, అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీకి ఆయన లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని లేఖలో వ్యాఖ్యానించిన ఆయన క్రికెటర్ల కన్నా ఎక్కువగా పాలకులను ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కోట్లా స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండుకు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. అంతేకాకుండా డీడీసీఏలో తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నానని వెల్లడించాడు. భారత క్రికెట్కు బేడీ అందించిన సేవలకు గుర్తింపుగా 2017లో ఆయన పేరుతో స్టాండును ఏర్పాటు చేశారు. ఈ లేఖపై స్పందించేందుకు డీడీసీఏ విముఖత వ్యక్తం చేసింది. -
నిర్మలా సీతారామన్తో పనిచేయడం కష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏడాది తరువాత దీనికి గల కారణాలపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది అక్టోబర్ 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఆయన శనివారం సుదీర్ఘమైన బ్లాగ్ పోస్ట్లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఎందుకు రాజీనామా చేసిందీ బ్లాగులో ప్రచురించారు. ముఖ్యంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పనిచేయడం కష్టంగా తాను భావించానని పేర్కొన్నారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. వాస్తవానికి ఆర్థికమంత్రి తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనీ చెప్పారు. తన రాజీనామా నిర్ణయం వెనుక రెండు కారణాలున్నాయని గార్గ్ చెప్పారు. మొదటిది 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థనుంచి కేంద్రం పక్కకుపోవడం, రెండవది ఆర్థిక మంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆర్థికమంత్రిత్వ శాఖ కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదన్నారు. భిన్నమైన వ్యక్తిత్వం, నాలెడ్జ్ ఎండోమెంట్, నైపుణ్యం, ఎకనామిక్ పాలసీలకు సంబంధించి సరియైన విధానాన్ని కలిగి ఉన్నారంటూనే ఆమెతో పనిచేయడం కష్టమని గార్గ్ వ్యాఖ్యానించారు. అలాగే 10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంనుంచి కేంద్రం పక్కకుపోయిందనీ, ఇది సాధ్యంకాదనే విషయం తనకు ప్రారంభంలోనే స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో కలిసి పనిచేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉత్తమమైనదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న మాస్టర్ మైండ్ జైట్లీ అని కొనియాడారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ తదితర అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచిపెట్టేవారని గుర్తు చేసుకున్నారు.నిర్మలా సీతారామన్కు కూడా తనపై నమ్మకం ఉన్నట్టు అనిపించలేదనీ, చాలా అసౌకర్యంగా ఉన్నట్టు గుర్తించానని గార్గ్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆర్ బీఐ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ పథకం విషయాలపై ఇద్దరి మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడ్డాయని మాజీ ఆర్థిక కార్యదర్శి చెప్పారు. దీంతో అధికారికంగా, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన ఒక నెలలోనే, 2019 జూన్లో తన బదిలీ కోసం సీతారామన్ పట్టుబట్టినట్లు గార్గ్ పేర్కొన్నారు. అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నాను. జూలై 24 న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానని చెప్పారు. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానని తన బ్లాగులో చెప్పారు. -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
కీలక పదవిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది. మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో అధ్యక్షుడు రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. -
పన్నుల వ్యవస్థలో విప్లవాత్మకం... జీఎస్టీ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థ ప్రవేశపెట్టడంతో పన్నుల భారం తగ్గిందని, దీనితో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందనీ ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. ఆర్థికశాఖ మాజీ మంత్రి అరుణ్జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ పలు ట్వీట్స్ చేసింది. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్ల ఉపసంహరణలతో 2017 జూలై 1న జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు బాధ్యతల్లో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్జైట్లీ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్థికశాఖ తాజా ట్వీట్స్ సారాంశాన్ని పరిశీలిస్తే... ► జీఎస్టీ ప్రవేశపెట్టకముందు అమల్లో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ– వ్యాల్యూయాడెడ్ ట్యాక్స్ (వీఏటీ), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీల వల్ల దేశ పౌరులపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకూ ఉన్న అధిక స్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి పోయింది. తాజా వస్తు,సేవల పన్ను విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకూ స్నేహపూర్వకమైంది. ► జీఎస్టీకి ముందు అధిక పన్ను భారం వల్ల ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి. అయితే సరళతర జీఎస్టీ వ్యవస్థలో పన్ను భారం తగ్గింది. దీనితో పన్ను చెల్లింపుదారు బేస్ కూడా పెరిగింది. ► జీఎస్టీ తొలినాళ్లలో అసెస్సీల సంఖ్య 65 లక్షలయితే, ఇప్పుడు ఈ సంఖ్య 1.24 కోట్లను దాటింది. ► జీఎస్టీ అమల్లో అరుణ్జైట్లీ పాత్ర కీలకమైనది. భారత్ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక చరిత్రాత్మక సంస్కరణ. అప్పట్లో వివిధ రాష్ట్రాలు విధించే విభిన్న పన్ను రేట్లు తీవ్ర వ్యయ భరితంగా ఉండేవి. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి రేట్లను జీఎస్టీ తగ్గించింది. అప్పట్లో రెవెన్యూ న్యూట్రల్ రేటు 15.3 శాతం అయితే, దానితో పోల్చితే ఇప్పుడు జీఎస్టీ రేటు 11.6 శాతానికి తగ్గింది. ► రూ.40 లక్షల వరకూ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలపై ఇప్పుడు జీఎస్టీ మినహాయింపు ఉంది. ప్రారంభంలో ఇది రూ.20 లక్షలుగా ఉండేది. దీనికితోడు రూ.1.5 కోట్ల వరకూ టర్నోవర్ ఉన్న ఒక కంపెనీ కాంపోజిషన్ స్కీమ్ కింద కేవలం ఒక శాతం పన్నును మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉంది. ► జీఎస్టీ అమల్లోకి రావడంతోటే అనేక వస్తువులపై పన్ను రేట్లను తగ్గించడం జరిగింది. 28 శాతం పన్ను శ్లాబ్లో ఉన్న దాదాపు 230 వస్తువుల్లో దాదాపు 200 వస్తువులను తక్కువ స్లాబ్స్ రేట్లలోకి మార్చడం జరిగింది. హౌసింగ్ రంగాన్ని 5 శాతం శ్లాబ్లో ఉంచగా, చౌక గృహాలకు సంబంధించి జీఎస్టీ రేటును ఒక శాతానికి తగ్గింది. ► జీఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంతా పూర్తిగా ఆటోమేటెడ్ చేయడం మరో విషయం. ప్రస్తుతం 50 కోట్ల రిటర్న్స్ను ఆన్లైన్లో దాఖలు చేయడం జరిగింది. 313 కోట్ల ఈ–వే బిల్లులు జనరేట్ అయ్యాయి. స్థిరంగా పెరుగుతున్న రెవెన్యూ 2017 జూలై 1వ తేదీ అర్థరాత్రి నుంచీ భారత పన్నుల వ్యవస్థలో చరిత్రాత్మక మార్పు. ఒకే మార్కెట్గా భారత్ ఆవిర్భవించింది. బహుళ పన్ను వ్యవస్థకు తెరపడింది. ప్రస్తుతం 480 వస్తువులు పన్ను రహిత లేదా 5 శాతంలోపు పన్ను రేట్లలో ఉన్నాయి. 221 వస్తువులు 12 శాతం రేటు వద్ద, 607 వస్తువులు 18 శాతం రేటు వద్ద ఉండగా, కేవలం 29 వస్తువులు మాత్రమే 28% రేటు వద్ద ఉన్నాయి. ఆయా సడలింపుల నేపథ్యంలో పన్ను గడచిన మూడేళ్లలో పన్ను బేస్ పెరిగింది. 2017–18 తొమ్మిది నెలల్లో (జూలై–మార్చి) సగటు రెవెన్యూ రూ.89,700 కోట్లు. 2018–19లో నెలకు సగటు రెవెన్యూ 10% పెరిగి మొత్తంగా ఆదాయాలు రూ.97,100 కోట్లకు చేరాయి. 2019–20లో ఈ ఆదాయం ఏకంగా రూ.1,02,000కోట్లకు ఎగసింది. రేట్ల తగ్గింపు, పలు సడలింపులు ఇస్తున్నప్పటికీ, జీఎస్టీ స్థిరంగా పెరుగుతూ వస్తున్న విషయం గమనార్హం. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో, జీఎస్టీ భారం తగ్గడానికి ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ప్రవేశపెట్టింది. – అరుణ్జైట్లీ వర్ధంతి సందర్భంగా రాసిన ఒక ఆర్టికల్లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ -
ఆసక్తికరంగా నిర్మల ప్రసంగం..
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్పై ఆమె ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. తన ప్రసంగం ప్రారంభంలో మాజీ ఆర్థిక మంత్రి దివంగత అరుణ్ జైట్లీని నిర్మల గుర్తుచేసుకున్నారు. జీఎస్టీ తీసుకురావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. జీఎస్టీని తీసుకురావడం చారిత్రత్మకమైన నిర్ణయమని పేర్కొన్న నిర్మల.. శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగిందన్నారు. న్యూ ఇండియా, సబ్కా సాత్.. సబ్కా వికాస్, ప్రజా సంక్షేమం.. లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. (మరింత ఈజీగా జీఎస్టీ: నిర్మలా సీతారామన్) (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలను వివరిస్తూ సాగుతున్న నిర్మల ప్రసంగం.. ఆకట్టుకునేలా ఉంది. మధ్యలో ఆమె ఓ కవితను కూడా చదివి వినిపించారు. ‘నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది మానవత్వం, దయతో కూడిన సమాజం అవసరం నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం మా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది’ అని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మల ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. గతంలో మాదిరిగానే నిర్మల ఈసారి కూడా ఎర్రనీ వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్ ప్రతులును తీసుకునివచ్చారు. నిర్మల బడ్జెట్ ప్రసంగం వినేందుకు ఆమె కుమార్తె వాఙ్మయి, ఇతర కుటుంబభ్యులు పార్లమెంట్కు వచ్చారు. (జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు) -
జీఎస్టీ : అరుణ్ జైట్లీ ముందు చూపు
సాక్షి, న్యూడిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీసుకొస్తున్న యూనియన్ బడ్జెట్ 2020పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరి 1 శనివారం నిర్మలా సీతారామన్ ఆర్థికమంత్రిగా రెండసారి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. దీనికి ముందు ఆమె 15వ ఆర్థిక సంఘం రిపోర్టును సభ ముందు ఉంచారు. రాజకీయ స్థిరత్వంతోపాటు, ఆర్థిక పురోగతిని కాంక్షిస్తూ ప్రజలు తమకు అధికారాన్నిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ది పథంలో నడిపించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని ఆర్థికమంత్రి చెప్పారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అన్ని రంగాల్లో వృద్ది రేటు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఈ క్రమంలో తాము తీసుకొచ్చిన జీఎస్టీ చాలా కీలకమైందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా ,కొనుగోలు శక్తి పుంజుకునేలా బడ్జెట్ వుంటుందని ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. జీఎస్టీ చారిత్రాత్మక నిర్ణయమని, పన్ను రేట్ల శ్లాబుల వల్ల సామాన్యుల నెలవారీ ఖర్చులు తగ్గాయి, తద్వారా వారికి భారీ ప్రయోజనం చేకూరిందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రికి అరుణ్ జైట్లీకి నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలో చాలా కీలకమైన జీఎస్టీ విషయంలో జైట్లీ చాలా ముందు చూపుతో వ్యవహరించారంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. (ఐ యామ్ వెయిటింగ్: కిరణ్ ముజుందార్ షా) -
జైట్లీ, సుష్మాకు విభూషణ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగింటి ముద్దుబిడ్డ పీవీ సింధును పద్మభూషణ్ పురస్కారం వరించింది. సింధు సహా తెలంగాణ నుంచి ముగ్గురిని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరిని పద్మ పురస్కారాలు వరించాయి. ప్రజావ్యవహారాల రంగం నుంచి మాజీ కేంద్ర మంత్రులు, దివంగత జార్జి ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్లకు కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. మాజీ కేంద్ర మంత్రి దివంగత మనోహర్ పారికర్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఇటీవల దివంగతులైన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వేశతీర్థ స్వామీజీకి పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవ వేళ భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను హోం శాఖ శనివారం ప్రకటించింది. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రం ఈ పురస్కారాలు ప్రకటిస్తుంది. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి, ఏప్రిల్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని హోం శాఖ ప్రకటించింది. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రధాని ప్రశంసలు.. ‘పద్మ’ పురస్కార గ్రహీతలను ప్రధాని మోదీ ప్రశంసించారు. మన సమాజానికి, దేశానికి మానవీయతకు అసాధారణ సేవలందించిన ప్రత్యేక వ్యక్తులు వీరు. వీరందరికీ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పద్మవిభూషణ్ (ఏడు) పురస్కారాలు: 1. జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం) 2. అరుణ్ జైట్లీ (మరణానంతరం) 3. అనిరు«ద్ జగ్నాథ్ జీసీఎస్కే 4. ఎం.సి. మేరీ కోమ్ 5. ఛన్నులాల్ మిశ్రా(హిందుస్తానీ గాయకుడు) 6. సుష్మా స్వరాజ్ (మరణానంతరం) 7. విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం) పద్మభూషణ్ పొందిన వారిలో ప్రముఖులు: ఎం.ముంతాజ్ అలీ(ఆధ్యాత్మికం,–కేరళ) సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం), (ప్రజావ్యవహారాలు, బంగ్లాదేశ్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (ప్రజా వ్యవహారాలు–జమ్మూకశ్మీర్), అజోయ్ చక్రవర్తి (కళలు–పశ్చిమ బెంగాల్), మనోజ్ దాస్ (సాహిత్యం, విద్య–పుదుచ్చేరి), బాల్కృష్ణ దోషి (ఆర్కిటెక్చర్–గుజరాత్), కృష్ణమ్మాళ్ జగన్నాథన్ (సామాజిక సేవ–తమిళనాడు), ఎస్.సి.జమీర్(ప్రజా వ్యవహారాలు, నాగాలాండ్), అనిల్ ప్రకాష్ జోషి (సామాజిక సేవ–ఉత్తరాఖండ్), త్సెరింగ్ లాండోల్ (వైద్యం, లదాఖ్), ఆనంద్ మహీంద్ర (వర్తకం, వాణిజ్యం–మహారాష్ట్ర), నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు–కేరళ), మనోహర్ గోపాలకృష్ణ పారికర్ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు– గోవా), పి.వి.సింధు( క్రీడలు– తెలంగాణ), వేణు శ్రీనివాసన్ (వర్తకం, వాణిజ్యం–తమిళనాడు). 118 మందికి పద్మశ్రీ: మొత్తం 118 పద్మ శ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఇద్దరికి ఈ పురస్కారం లభించింది. వ్యవసాయ రంగం నుంచి చింతల వెంకటరెడ్డి, సాహిత్యం మరియు విద్య రంగం నుంచి విజయసారథి శ్రీభాష్యం ఈ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి పద్మ శ్రీ పురస్కారం లభించింది. కళల రంగం నుంచి పౌరాణిక నటుడు యడ్ల గోపాలరావు, దళవాయి చలపతిరావులకు ఈ పురస్కారం లభించింది. దళవాయి చలపతిరావు తోలు బొమ్మలాట కథకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక బాలీవుడ్ సినీ ప్రముఖులు కంగనా రనౌత్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, అద్నన్ సమీ తదితరులకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అరుణ్ జైట్లీ: 2019 మేలో ఈయన మృతి చెందారు. 2014–19 సంవత్సరాల మధ్య కేంద్ర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్ కూడా అయిన జైట్లీ ఆర్థిక మంత్రిగా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి పలు విధానాలను ప్రవేశపెట్టారు. సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. సుష్మా స్వరాజ్: బీజేపీ సీనియర్ నేత, సుప్రీంకోర్టు లాయర్గా పనిచేసిన సుష్మా స్వరాజ్ గత ఏడాది చనిపోయారు. ప్రధాని మోదీ కేబినెట్లో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసి అందరి ప్రశంసలు పొందారు. ఇందిరాగాంధీ తర్వాత విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ సుష్మా. జార్జి ఫెర్నాండెజ్: కార్మిక నాయకుడు, రాజకీయవేత్త, జర్నలిస్టు అయిన జార్జి మాథ్యూ ఫెర్నాండెజ్ లోక్సభలో అత్యధిక కాలం సభ్యునిగా కొనసాగిన వారిలో ఒకరు. 1967లో ముంబైలో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ బిహార్ నుంచే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధిగా కొనసాగారు. శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ: ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరు. దాదాపు 8 దశాబ్దాలపాటు ఆధ్యాత్మిక సేవ చేశారు. శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. విశ్వేశతీర్థ స్వామీజీ, ఛన్నులాల్ మిశ్రా, మనోహర్ పారికర్ అజ్ఞాత హీరోలు చండీగఢ్లోని పీజీఐ ఆస్పత్రి వద్ద రోగులు, వారి సహాయకులకు ఉచితంగా ఆహారం అందజేస్తున్న జగ్దీశ్ లాల్ అహూజా, దాదాపు 25 వేల అనాథ శవాలకు అంతిమ సంస్కారం జరిపిన ఫైజాబాద్కు చెందిన మొహమ్మద్ షరీఫ్, గజరాజుల వైద్యుడిగా పేరున్న అస్సాం వాసి కుషాల్ కొన్వర్ తదితర ఎందరో అజ్ఞాత హీరోలను ఈ ఏడాది పద్మశ్రీ వరించింది. 40 గ్రామాల్లోని ప్రత్యేక అవకరాలు కలిగిన 100 మంది పిల్లలకు 2దశాబ్దాలుగా ఉచిత విద్యనందిస్తున్న కశ్మీర్కు చెందిన దివ్యాంగుడు జావెద్ తక్, అడవుల్లోని సమస్త జీవజాతుల గురించి తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకకు చెందిన తులసి గౌడ(72)కు, 40 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో విద్యనందిస్తూ అంకుల్ మూసాగా పేరున్న అరుణాచల్కు చెందిన సత్యానారాయణ్కు ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. -
జైట్లీ సంస్కరణలు ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ హితాన్ని తన ప్రథమ కర్తవ్యంగా భావించి చివరిదాకా అదే సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి అరుణ్ జైట్లీ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉపరాష్ట్రపతి నివాసంలో ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మాట్లాడారు. ‘జైట్లీ దశాబ్దాలుగా నాకు ఆత్మీయ మిత్రుడు. ముఖ్యమైన సమయాల్లో ఆయన విలువైన సూచనలు ఇచ్చేవారు. అలాంటి జైట్లీ ఇకలేరనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా’అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. పుస్తకాన్ని వెంకయ్య కొడుకు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్సభ స్పీకర్ బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ రాజీనామా ఇంకా ఆమోదించలేదు’
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
‘రాజీ పడలేక రాజీనామా చేస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేశారు. అతడి రాజీనామాను డీడీసీఏ సీఈఓ, సీఏసీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదముద్ర వేయడం గమనార్హం. దీంతో డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇక రజత్ శర్మ రాజీనామా తర్వాత సెలక్షన్ కమిటీ చైర్మన్ అతుల్ వాసన్, కోచ్ కేపీ భాస్కర్ల భవిత్యం ప్రశ్నార్థకంగా మారింది. ‘డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారు. డీడీసీఏ సమగ్రతను కాపాడుతూ నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలని భావించాను. కానీ డీడీసీఏ అలా ఉండటం సాధ్యపడటం లేదు. అయితే ఆ విషయాల్లో నేను రాజీ పడే ప్రసక్తే లేదు. దీంతో రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను’ అని రజత్ శర్మ పేర్కొన్నారు. ఇక రజత్ రాజీనామా అనంతరం వినోద్ తిహారా అధ్యక్షపదవి రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే బోర్డు ప్రవర్తనా నియమవాళిని ఉల్లఘించిన నేపథ్యంలో తిహారా సస్పెండ్కు గురైన విషయం తెలిసిందే. రజత్ రాజీనామాతో తిహారా సస్పెన్షన్పై డిసెంబర్ 1న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో పునరాలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
మాకు పెన్షన్ వద్దు.. వాళ్లకే ఇవ్వండి!
న్యూఢిల్లీ : దివంగత బీజేపీ నేత, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబం పెద్దమనసు చాటుకుంది. అరుణ్ జైట్లీ పెన్షన్ తమకు వద్దని చెప్పిన ఆయన భార్య సంగీత జైట్లీ.. ఆ డబ్బును రాజ్యసభ దిగువ తరగతి సిబ్బందికి ఇవ్వాల్సిందిగా కోరారు. అరుణ్ జైట్లీ ఉదారత, సేవాగుణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు. అరుణ్ జైట్లీ పేరిట తనకు వచ్చే నెలవారీ పెన్షన్ రూ. 25 వేల మొత్తాన్ని రాజ్యసభ నాలువ తరగతి ఉద్యోగులకు అందజేయాలని కోరారు. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిగా, బీజేపీ ట్రబుల్ షూటర్గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుణ్ జైట్లీ ఆగష్టు 24న కన్నుమూసిన విషయం విదితమే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడిన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇక అరుణ్ జైట్లీ సేవా గుణాన్ని చాటుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే వారన్న విషయం తెలిసిందే. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే ఆయన.. తన వద్ద పనిచేసిన ఎంతో మంది సిబ్బంది పిల్లలను ఉచితంగా చదివించారు. అదే విధంగా 2018లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం అరుణ్ జైట్లీ ఎయిమ్స్లో చేరిన సమయంలో.. అక్కడి రోగుల ఇబ్బందిని గమనించి వాటర్ కూలర్స్, డిస్పెన్సింగ్ యూనిట్స్ దానం చేశారు. కాగా అనారోగ్య కారణాల కారణంగా రెండోసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టలేనని ప్రధాని మోదీకి జైట్లీ లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
అనుష్క భావోద్వేగం.. విరాట్పై ముద్దుల వర్షం
ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్లాగా ఉన్న ఢిల్లీ మైదానానికి కొత్తగా అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చారు. అలాగే ఒక స్టాండ్కు విరాట్ కోహ్లి పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్లిఫ్టింగ్ హాల్లో జరిగాయి. గురువారం నాటి కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్జైట్లీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫిరోజ్ షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా మారుస్తున్నట్టుగా డీడీసీఏ ప్రకటించింది. దీంతో కోట్లా మైదానం ఇకమీదట అరుణ్ జైట్లీ స్టేడియంగా కీర్తి గడించనుంది. కాగా క్రికెట్లో విశిష్ట సేవలందించినందుకుగానూ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని స్పెషల్ స్టాండ్కు విరాట్ కోహ్లిగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. విరాట్.. తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా దేశం కోసం ఆట ఆడటానికి సిద్ధమయ్యాడని.. అంతటి ధైర్యశాలి, గొప్ప మనిషి క్రికెట్ ప్రపంచంలో మరొకరు లేరని చెప్తూ అరుణ్ జైట్లీ అతన్ని కీర్తించేవారని పేర్కొన్నారు. దీంతో ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విరూష్కలు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో అనుష్క ఉబికి వస్తున్న కన్నీరును దిగమింగుకుంటూ విరాట్ గొప్పతనానికి అతని చేతిపై ముద్దుల వర్షం కురిపించింది. కాసేపటి వరకు అనుష్క శర్మ సాధారణ స్థితికి రాలేకపోయింది. దీంతో విరాట్ తనని నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు దిగులు కూడా దరి చేరకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: విరుష్కల ఫోటో వైరల్) View this post on Instagram Cute! @anushkasharma and @virat.kohli caught in an adorable moment during an event in Delhi. . . Follow for more Updates @filmymantramedia Inquiries @murtaza . . #bollywoodactress #Bollywood #viratkohli #anushkasharma #virushka #love #kiss #together #sports #bollywood #hollywood #game #cricket #filmymantramedia #filmymantra A post shared by Filmymantra Media (@filmymantramedia) on Sep 12, 2019 at 8:14pm PDT -
ఫిరోజ్ షా కాదు ఇక..
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మారకార్థం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానానికి ‘అరుణ్ జైట్లీ స్టేడియం’అని అధికారికంగా నామకరణం చేశారు. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన నూతన నామకరణ మహోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారథి విరాట్ కోహ్లి అతడి సతీమణి అనుష్క శర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన అతిరథులు అరుణ్ జైట్లీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జైట్లీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు అరుణ్ జైట్లీ సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించారు. డీడీసీఏతో పాటు బీసీసీఐలో పలు బాధ్యతలు, హోదాలను నిర్వహించారు. అయన అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే ఢిల్లీ క్రికెట్లో అనేక మార్పులు వచ్చాయి. దీంతో జైట్లీ మరణాంతరం ఆయన గుర్తుగా ఫిరోజ్ షా కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టాలని డీడీసీఏ నిర్ణయించింది. అయితే గ్రౌండ్కు మాత్రం పాత పేరునే కొనసాగించాలనే ఆలోచనలో ఉంది. కాగా, అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే తాము ఈ స్థాయికి వచ్చామని వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లి, అశిష్ నెహ్రా వంటి క్రికెటర్లు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
అరుణ్ జైట్లీ స్టేడియంగా ఫిరోజ్ షా..
ఢిల్లీ: ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్మృతి చిహ్నంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం పేరును మార్చనున్నారు. ఈ మేరకు ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో ఫిరోజ్షా కోట్లా స్టేడియాన్ని అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజులు హాజరుకానున్నారు. డీడీసీఏ అధ్యక్షుడిగా జైట్లీ సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. దీనిలో భాగంగా డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ మాట్లాడుతూ.. అరుణ్ జైట్లీ మద్దతు, ప్రోత్సాహంతోనే ఢిల్లీకి చెందిన పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో విశేషమైన గుర్తింపు సాధించారన్నారు. జైట్లీ డీడీసీఏ పగ్గాలు చేపట్టిన సమయంలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను పునరుద్ధరించారని, ప్రపంచ స్థాయి డ్రెస్సింగ్ రూమ్ల నిర్మించారన్నారు. డీడీసీఏకి జైట్లీ చేసిన సేవలు వెలకట్టలేనివని ఆయన పేర్కొన్నారు. -
జైట్లీ నివాసానికి ప్రధాని మోదీ..!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ దివంగత నేత అరుణ్జైట్లీ కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ పరామర్శించారు. ఢిల్లీలోని జైట్లీ నివాసానికి వెళ్లిన మోదీ... ఆయన భార్య సంగీత, కుమారుడు రోహన్, కుమార్తె సొనాలిలను ఓదార్చారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీతో ఉన్నారు. విదేశీ పర్యటన కారణంగా జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని హాజరుకాలేకపోయారు. మరణవార్త తెలిసిన వెంటనే జైట్లీ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే జైట్లీ నివాసానికి వెళ్లారు. బీజేపీ సీనియర్ నేతగా, గత కేబినెట్లో ఆర్థిక, రక్షణమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన అరుణ్జైట్లీతో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది. -
సోనియాకు అరుణ్ జైట్లీ ఇచ్చిన చివరి గిఫ్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న రాయ్బరేలి నియోజకవర్గానికి ఓ బహుమతిని ఇచ్చాడు. తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి 200 సోలార్ విద్యుత్ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడం కోసం రాయ్ బరేలీ జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై బీజేపీ నాయకుడు హీరో బాజ్పాయ్ మాట్లాడుతూ.. ‘జైట్లీ చనిపోయే కొద్ది రోజుల ముందు ఆగస్టు 17న రాయ్బరేలీ జిల్లా కలెక్టర్కు ఈ సిఫారసులు అందాయి’ అని పేర్కొన్నారు. ఆయన ఈ లేఖ జూలై 30న, అంటే ఆస్పత్రిలో చేరడానికి ముందు రాసినట్టు ఉంది. కాగా తనకు జైట్లీ నుంచి సిఫారసులు అందినట్టు రాయ్బరేలీ జిల్లా కలెక్టర్ నేహ శర్మ తెలిపారు. ఎంపీలాడ్స్ నిధుల కింద ఎంపీలు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.5 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంటుంది. (చదవండి : జైట్లీకి కన్నీటి వీడ్కోలు) గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) ఈ నెల 24న ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు జరిగాయి. -
జైట్లీకి కన్నీటి వీడ్కోలు
న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న జైట్లీ(66) శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం యమునా తీరంలోని నిగమ్బోధ్ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన అంత్యక్రియల్లో వేలాది మంది పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని కైలాస్ కాలనీలోని స్వగృహం నుంచి దీన్దయాళ్ మార్గ్లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు అక్కడే అభిమానుల సందర్శనార్థం ఉంచారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్ష్వర్థన్, ప్రకాశ్ జవడేకర్, పీయూష్ గోయెల్, మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, యోగా గురువు బాబా రాందేవ్ తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు. అరుణ్ జైట్లీతో సన్నిహిత సంబంధాలున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించే సమయంలో ఉద్వేగానికి లోనయ్యారు. చేతులు జోడించి కొన్ని నిమిషాలపాటు పార్థివ దేహం వద్ద మౌనంగా నిలుచుండి పోయారు. మధ్యాహ్నం ప్రత్యేక శకటంలో జైట్లీ పార్థివ దేహాన్ని నిగమ్బోధ్ శ్మశాన వాటికకు తీసుకువచ్చారు. అంతిమయాత్రలో ఉప రాష్ట్రపతి వెంకయ్య, లోక్సభ స్పీకర్ బిర్లా, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా, కపిల్ సిబల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులుసహా అశేష సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రాహ్మణులు వేద మంత్రాలు పఠిస్తుండగా జైట్లీ కుమారుడు రోహన్ చితికి నిప్పంటించారు. సంతాప సూచకంగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ..జైట్లీకి ఉద్వేగపూరిత నివాళులర్పించిన విషయం తెలిసిందే. బ్రాండెడ్ వస్తువులపై మక్కువ కుర్తా పైజామాతో అందరికీ ఆత్మీయుడిగా కనిపించే అరుణ్ జైట్లీకి లండన్లో తయారయ్యే షర్టులు, జాన్ కాబ్ షూస్ వంటి బ్రాండెడ్ వస్తువులంటే విపరీతమైన మక్కువనే విషయం చాలా మందికి తెలియదు. రాజకీయ వేత్తగా, ప్రముఖ లాయర్గా అందరికీ సుపరిచితుడైన జైట్లీకి బ్రాండెడ్ వాచీలు, పెన్నులు, శాలువాలు, షర్టులు, ఇంకా షూలు సేకరించడం హాబీ. ఆయన వాడే వాటిల్లో ప్రఖ్యాత పటేక్ ఫిలిప్స్(వాచీలు), మాంట్ బ్లాంక్ (పెన్నులు) ఉన్నాయి. జైట్లీ అభిరుచులపై కుంకుమ్ చద్దా రాసిన ‘ది మారిగోల్డ్ స్టోరీ’ పుస్తకంలోని అరుణ్జైట్లీ: ది పైడ్ పైపర్ అనే చాప్టర్లో వివరంగా ఉంది. ‘చాలా మంది భారతీయులకు ఒమెగా వాచీలకు మించి తెలియని రోజుల్లోనే జైట్లీ చాలా ఖరీదైన పటేక్ ఫిలిప్స్ వాచీలను కొనేవారు. మాంట్ బ్లాంక్ పెన్నులు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి మోడల్నూ కొనేవారు. ఇంకా జమవార్ షాల్స్ను సేకరించేవారు. ఆయన తన కుమారుడికి కొని పెట్టిన మొదటి షూ జత ఇటాలియన్ బ్రాండ్ సల్వటోర్ ఫెర్రాగమో’ అని చద్దా పేర్కొన్నారు. అలాగే, ఆయన వ్యక్తిగత జీవితంలోనూ తనకంటూ కొన్ని నియమాలను విధించుకున్నారు. లాయర్గా తను తీసుకునే ఫీజు కాకుండా క్లర్కులకు ‘మున్షియానా’(ఫీజు)కూడా అందేలా చూసేవారు. ఈ విధానం ఆయన తోటి వారికి నచ్చకపోయినా అరుణ్ తన విధానానికే కట్టుబడి ఉన్నారు’ అని జైట్లీ సతీమణి సంగీత తెలిపారని చద్దా తన పుస్తకంలో పేర్కొన్నారు. అధికారిక పర్యటనల్లోనూ వెంట ఉండే వారి ఖర్చులు తనే భరించేవారని ఆమె తెలిపారన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పర్యటనల సందర్భంగా రాకపోకల కోసం విదేశీ కంపెనీల ప్రతినిధులు కార్లు, ఇతర వాహనాలను సమకూరుస్తామన్నా అంగీకరించేవారు కాదని పేర్కొన్నారు. -
ముగిసిన జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 66 సంవత్సరాల అరుణ్జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నసంగతి తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్తో బాధపడుతున్నారు. -
జైట్లీ భార్యకు సోనియా భావోద్వేగ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చివరి వరకు ధైర్యం కోల్పోకుండా మృత్యువుతో పోరాడి అరుణ్ జైట్లీ పోరాట పటిమను ప్రదర్శించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆమె జైట్లీ భార్య సంగీతా జైట్లీకి సంతాప లేఖ రాశారు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను అని పేర్కొన్నారు. ‘జైట్లీ మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన స్వభావంతో పార్టీలకతీతంగా మిత్రులు, అభిమానుల్ని సంపాదించుకున్నారు. కేంద్ర మంత్రి, సుప్రీం కోర్టు న్యాయవాది, ప్రతిపక్ష నేత ఇలా ఏ పదవిలో ఉన్నా.. ఆయన గొప్ప వాగ్ధాటి, విజ్ఞతను ప్రదర్శించారు. ఇంకా దేశానికి ఎంతో చేయాల్సి ఉన్న తరుణంలో, చిన్న వయసులో మరణించడం జీర్ణించుకోలేని విషయం. ఈ సమయంలో మాటలు ఓదార్పును చేకూర్చలేవని తెలుసు. ఈ కష్టకాలంలో మీ బాధను పంచుకోవడానికి నేను ఉన్నాననే భరోసా మాత్రం ఇవ్వగలను. దేశం గొప్ప ప్రజానాయకుణ్ని కోల్పోయింది. పార్టీలకతీతంగా అందరూ అభిమానించే గొప్ప నేతని కోల్పోయాం. అరుణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని సోనియా గాంధీ తన సంతాప సందేశాన్ని సంగీతాకు పంపారు. తీవ్ర అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత అరుణ్ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
కొనసాగుతున్న జైట్లీ అంతిమయాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ అంతిమయాత్ర కొనసాగుతోంది. ఆదివారం స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి జైట్లీ భౌతికకాయాన్ని తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు. మరికాసేపట్లో ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్లో జైట్లీ పార్థీవదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. అరుణ్ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అరుణ్జైట్లీ అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఈ నెల 9వ తేదీ నుంచి ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న జైట్లీ.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మధ్యాహ్నం 12గంటల 7 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్తో జైట్లీ బాధపడుతున్నారు. -
జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ: క్రికెట్ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్ కోహ్లి, ధావన్, ఇషాంత్ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
అందరివాడు
రాజకీయాల్లో అందరి మనసులూ గెలవటమంటే అంత సులభమేమీ కాదు. పార్టీలు కత్తులు దూసుకుంటూ.. వ్యక్తిగత వైషమ్యాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో కూడా అరుణ్ జైట్లీ అంటే అజాత శత్రువే. భారతీయ జనతా పార్టీకి దాదాపు మూడు దశాబ్దాలు సేవలందించిన అరుణ్ జైట్లీ... తన వాక్చాతుర్యంతో, అపార ప్రతిభాపాటవాలతో అందరి మనసులూ చూరగొన్నారు. ఒక న్యాయవాదిగా పార్టీలకతీతంగా ఎవరి తరఫునైనా వాదించే విలక్షణత్వం, ప్రత్యర్థుల్ని విమర్శించడంలో కనబరిచే హేతుబద్ధత ఇవన్నీ జైట్లీకి రాజకీయాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాయి. అందుకే ప్రధానిగా ఎవరున్నా బీజేపీలో అరుణ్జైట్లీ స్థానం ప్రత్యేకమే. అందుకే కావచ్చు! కాంగ్రెస్లోనూ ఆయనకు వీరాభిమానులున్నారు. వాదనలో పదునెక్కువ గోధ్రా మతఘర్షణల్లో మోదీ తరపున, సొహ్రాబుద్దీన్, ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసుల్లో కూడా జైట్లీ వాదించారు. సోనియా, రాహుల్ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు, చిదంబరం ఇరుక్కకున్న కేసులు, ఇంకా ఎన్నో ప్రత్యేక కేసుల్లో అవి తప్పా, ఒప్పా అన్నది పక్కన పెడితే కోర్టుల్లో ఆయన వాదనా పటిమకు ప్రత్యర్థులు కూడా ముగ్ధులయ్యేవారు. ప్రఖ్యాత లాయర్ రామ్జెఠ్మలానీ వంటి వారి ప్రశంసలు అందుకున్నారు. తెరవెనుక వ్యూహకర్త జైట్లీ మంచి వ్యూహకర్త. అమిత్ షా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందు ఎక్కడ ఎన్నికలు జరిగినా జైట్లీ పేరే వినిపించేది. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా డజనుకిపైగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథాన నడిపించారు. గోధ్రా ఘర్షణల సమయంలో గుజరాత్ పార్టీ ఇన్చార్జ్గా ఉన్న జైట్లీ.. మోదీకి అత్యంత అండగా నిలిచి ఎన్నికల్లో పార్టీని గెలుపుతీరాలకు చేర్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక జైట్లీ కృషి కూడా ఉంది. ఆ ఎన్నికల వ్యూహకర్తల్లో జైట్లీ కూడా ఒకరు. ఒక్కసారి కూడా లోక్సభకు ఎన్నిక కాలేదు... ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ నెగ్గలేదు. ఒక్కసారీ లోక్సభకు ఎన్నిక కాలేదు. అమృత్సర్ నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ను ఎదుర్కోలేక ఓడిపోయారు. అనారోగ్య కారణాలతో 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ అధిష్టానం రాజ్యసభకు పంపి ఆయన సేవలను వినియోగించుకుంది. పార్టీ అధికార ప్రతినిధిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా సైతం జైట్లీ కొనసాగారు. మోదీకి ప్రధాన మద్దతుదారు వాజపేయి హయాంలోనే జైట్లీ అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహించారు. న్యాయశాఖ, సమాచార శాఖ, వాణిజ్యం కార్పొరేట్ వ్యవహారాల శాఖలపై తనదైన ముద్రవేశారు. మోదీ ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో బీజేపీలో దిగ్గజ నాయకులు కొందరు వ్యతిరేకించి అడ్వాణీ వెంట నడిచారు. కానీ జైట్లీ అలా కాదు. గుజరాత్ సీఎంగా మోదీ నియామకం సమయంలో... గోద్రా ఘర్షణల సమయంలోనూ మోదీ వెంటే ఉన్నారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. మోదీ ఆర్థిక నిర్ణయాలకు అండగా ఉండి ప్రత్యర్థుల నోరు మూయించారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. తర్వాత అనారోగ్య కారణాలతో మీడియా ముందుకు రాకపోయినా సొంతగా బ్లాగు నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ పోస్టులు పెట్టేవారు. మోదీ సర్కార్లో ట్రబుల్ షూటర్గా పేరుపొందారు. 2016లో పార్లమెంట్లో ప్రధాని మోదీతో.. క్రికెట్ అంటే ప్రాణం న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల వ్యూహకర్తగా అనూహ్యమైన విజయాలు సాధించిన అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే ప్రాణం. చిన్నతనంలో క్రికెట్ బాగా ఆడేవారు. బీజేపీలో చేరాక బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ క్రికెట్ అధ్యక్షుడిగా పదమూడేళ్లపాటు ఉన్న జైట్లీ రాజధానిలో క్రికెట్ స్టేడియం నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి కృషి చేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లో జైట్లీ అవకతవకలకి పాల్పడ్డారని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణు చేయడంతో ఆయనను కోర్టుకు లాగారు. జైట్లీ వాదనా పటిమతో ఆఖరికి కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మోదీ, షాలకు కుడిభుజం జైట్లీ
అపార అనుభవానికి సౌహార్ద్రత తోడైతే అది అరుణ్ జైట్లీ. అందుకే పదవులు ఆయన్ను వెదుక్కుంటూ వచ్చాయి గానీ, పదవుల కోసం ఆయన పోటీ పడలేదు. ఎక్కడ సమస్య వచ్చినా దాన్ని సునాయాసంగా పరిష్కరించడంలో అరుణ్ జైట్లీ అగ్రగణ్యుడు. వాజపేయి, అద్వానీల తర్వాత పార్టీలో యువతకు జైట్లీయే మార్గదర్శకుడు. పార్లమెంటులోనైనా, పార్టీ కార్యక్రమాల్లో అయినా, బహిరంగసభల్లోనైనా ఆయన చేసే ఉపన్యాసాలు నభూతో నభవిష్యతి. ఆయనొక విజ్ఞానభాండాగారమని ఆ ఉపన్యాసాలు చాటి చెబుతాయి. అరుణ్ జైట్లీ ఐదక్షరాలు... దేశ రాజకీయానికి సరికొత్త భాష్యాన్ని చెప్పిన ఘనాపాటి. అందరూ రాజకీయాలు చేస్తారు. ఆయన కూడా చేస్తారు. అయితే ఆయన మిగతా వారందరికీ భిన్నమైన వ్యక్తి. ఎవరినీ కూడా తనకు పోటీ అనుకోరు. రావాల్సింది వస్తుంది... వచ్చేదాన్ని ఎవరూ ఆపలేరన్న సిద్ధాంతమే ఆయన రాజకీయం. దేశంలోని దిగ్గజ నాయకులు ఆయనకు సహచరులు. తనకు తెలిసింది అందరికీ చెప్పడం... దేశ అభివృద్ధి, పార్టీ లక్ష్యాలపైనే ఆయన దృష్టింతా ఉండేది. తనతో సమాన వయసున్నవారితోనూ సఖ్యతతో మెలగడం ఒక్క జైట్లీ దగ్గరే మనం చూడగలం. సుష్మా స్వరాజ్, అనంతకుమార్, వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్, మనోహర్ పారికర్, మోదీ... ఇలా అందరితోనూ ఆయన సత్సంబంధాలు కలిగి ఉండేవారు. కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు నెరిపారు. సమస్యలు వచ్చినప్పుడు జైట్లీ స్పందించే తీరు ఆయా రాష్ట్రాల సీఎంలను ఆయనకు ప్రీతిపాత్రులను చేసింది. అపార అనుభవాన్ని జోడించి రాజకీయాల్లో రాణించిన అతికొద్దిమంది నాయకుల్లో జైట్లీ ఒకరు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి తర్ఫీదు పొందిన ఆణిముత్యాల్లో జైట్లీ ఒకరు. విద్యార్థి నాయకుడిగా, ఏబీవీపీ ఢిల్లీ అధ్యక్షుడిగా, న్యాయవాదిగా న్యాయవాదిగా సొలిసిటర్ జనరల్గా ఆయన దేశానికి పరిచయమయ్యారు. అనేక అంశాలపై స్పందించే తీరు జైట్లీకి మిగతా వారికి మధ్య తేడా ఏంటో ఇట్టే తెలియజేసేది. ఎమర్జెన్సీ సమ యంలో జైలుకెళ్లి ప్రభుత్వ విధానాలపై పోరాటం చేశారు. చిన్న వయసులోనే సొలిసిటర్ జనరల్గా ఎంపికై సంచలనం సృష్టించారు. జనసంఘ్ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత బీజేపీలో అతి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. జైట్లీ బహు ముఖ ప్రజాశాలి. కాగితాలు చూడకుండానే ప్రపంచంలోని కీలక అంశాలపై ధారాళంగా ఉపన్యసించగల దిట్ట ఆయన. భారత ప్రతిపక్షనేతగా, సీనియర్ పార్లమెంటేరియన్గా ఉత్తమ పార్లమెంటేరియన్గా, కేంద్ర రక్షణ మంత్రి, కార్పొరేట్ ఎఫైర్స్ మినిస్టర్గా న్యాయశాఖ మంత్రిగా, అదేవిధంగా సమాచారశాఖ మంత్రిగా చివరిగా ఆర్థిక శాఖ మంత్రిగా దేశానికి సమర్థవంతమైన నాయకత్వం వహించారు. తన వ్యక్తిత్వంతో ఆహర్యంతో ప్రతిపక్ష నేతలను కూడా ఆకర్షించిన మహానేత జైట్లీ. అటల్ బిహారి వాజ్పేయి తర్వాత అంతటి చతురత ఉన్న నేత ఒక్క అరుణ్ జైట్లీ అని చెప్పొచ్చు. రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నేతల్లో ఒకరు. ఎప్పుడూ ఫలానా పదవి కావాలని ఆరాటపడలేదు. ఎప్పుడూ పదవులు వెదుక్కుంటూ వచ్చాయి తప్పించి ఆయన పదవులను ఎప్పుడూ కోరుకోలేదు. మాజీ ప్రధాని వాజ్పేయి నాయకత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. యూపీఏ 1, యూపీఏ 2లో ప్రతిపక్ష నేతగా దేశానికి దిశానిర్దేశం చేశారు. బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వచ్చిన సంక్షోభాలను నివారించి... ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు. పార్టీలో వాజ్పేయి, అద్వానీ తర్వాత ముఖ్యనేతగా ఎదిగారు. ట్రబుల్షూటర్గా జైట్లీని పార్టీ నేతలు పిలుచుకుంటారు. వాజ్పేయి తర్వాత పార్టీలో యువతకు మార్గనిర్దేశకుడిగా మారారు. మరీ ముఖ్యంగా మీడియాతో అనేక మంది సీనియర్ జర్నలిస్టులతో సత్సంబంధాలు నెరిపేవారు. ఆయా అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కలిగించేవారు. పార్టీ కార్యాలయంలో, పార్లమెంట్లో, బహిరంగ సభల్లో ఆయన చేసే ఉపన్యాసాలు న భూతో న భవిష్యతి. ఆయా అంశాలపై ఆయన స్పందించే తీరు చూస్తే ఆయననో విజ్ఞాన భాండాగారంగా చెప్పు కోవాల్సిందే. అటల్ తర్వాత దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీతో జైట్లీకి ఎంతో సన్నిహిత సంబంధాలున్నాయి. 1996 నుంచే మోదీ, జైట్లీ అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. గుజరాత్ రాజకీయాల్లో ఇన్చార్జిగా పనిచేసిన సమయంలో మోదీతో జైట్లీ అనేక విషయాలపై సుదీర్ఘంగా చర్చించేవారు. నాటి నుంచే నరేంద్రమోదీకి కుడిభుజంగా జైట్లీ నిలిచారు. అందరూ అమిత్ షాను మోదీకి కుడిభుజం అనుకుంటారు కానీ, అమిత్ షాకి, మోదీకి కూడా జైట్లీ కుడి భుజంగా వ్యవహరించారు. మరీ ముఖ్యంగా జైట్లీగారితో నా అనుబంధం 26 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఎప్పుడు కన్పించినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. పార్టీ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాతో చర్చించేవారు. అలాంటి ధీశాలిని కోల్పోవడం యావత్ భారత్ దేశానికి తీరని లోటు. సీనియర్ నాయకుడిగా అనేక విషయాల్లో జైట్లీ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కరణల గురించి చాలా మంది చెప్పుకుంటారు కానీ, దేశానికి అసలు సిసలు సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి జైట్లీ. ఇక జైట్లీకి క్రికెట్ అంటే అమితంగా ఇష్టం. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు సుదీర్ఘకాలం నాయకత్వం వహించారు. అనేక అంశాలపై నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేలా మాట్లాడటం ఒక్క జైట్లీకే సాధ్యం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరం. పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
సంస్కరణల సారథి
దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణల అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన కేసులాగే కనిపించింది. దాన్ని గెలిచేవరకు వదలకూడదన్న పట్టుదలతో రోజుకు 16 గంటలు పనిచేస్తూ చివరకు కేసు గెలిపించారు. ఈ క్రమంలో తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టారు. అరుణ్జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎకానమీలో రెండు అతిపెద్ద కుదుపులు సంభవించాయి. 2016లో ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు ఎకానమీని స్తంభింపజేసింది. దీంతో దాదాపు రెండు త్రైమాసికాల పాటు జీడీపీ ఒక్కసారిగా కుంచించుకుపోయింది. షాక్ తిన్న ఎకానమీని పట్టాలెక్కించి తిరిగి జీడీపీని గాడిన పెట్టడంలో జైట్లీది కీలక పాత్ర. ఒకపక్క ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరోపక్క నిర్ణయ పర్యవసానాలను ఎదుర్కొంటూ ఆయన అత్యంత సమర్ధవంతంగా ఎకానమీని నడిపించారని ఎకనమిస్టులు ప్రశంసిస్తారు. నోట్ల రద్దు తర్వాత ఏడాది జీఎస్టీ అమలు చేయడం ద్వారా అప్పటివరకు ఉన్న పన్ను వ్యవస్థ మొత్తాన్ని కదలించారు. నోట్ల రద్దుతో సతమతమై కుదుటపడుతున్న ఆర్థిక వ్యవస్థకు జీఎస్టీ మరో షాక్లాగా తగిలింది. దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా ఆలోచనల్లోనే ఉంటూ వచ్చిన ఒకే దేశం, ఒకే పన్ను వ్యవస్థను జైట్లీ సాకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ‘‘పాత భారతం ఆర్థికంగా ముక్కలుగా కనిపిస్తోంది, కొత్త భారతం ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్గా మారుతుంది’’ అన్నారు. ఇండియా ఎకానమీలో అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారు. కేవలం సంస్కరణను ప్రవేశపెట్టడం కాకుండా, ఎప్పటికప్పుడు దాని అమలును సమీక్షిస్తూ, అవసరమైన మార్పులు చేస్తూ జైట్లీ జీఎస్టీని సానుకూలంగా మార్చారు. రాజకీయంగా కూడా జీఎస్టీ పట్ల దాదాపు ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన విజయంగా నిపుణులు అభివర్ణిస్తారు. ఎగవేతదారులకు చెక్ ఈ రెండు సంస్కరణలతో పాటు జైట్లీ హయాంలో తీసుకువచ్చిన మరో ముఖ్యమైన సంస్కరణ దివాలా చట్టం ఏర్పాటు చేయడం. ఈ చట్టంతో క్రెడిట్ కల్చర్లో మంచి మార్పులు వచ్చాయి. రుణదాతలకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎగవేతలంటే భయపడే స్థితి ఏర్పడింది. ముఖ్యంగా క్రోనీ క్యాపిటలిజం నిర్మూలనకు ఇది సమర్ధవంతంగా పనిచేసిందని ప్రముఖ ఎకనమిస్టులు కొనియాడారు. ఆర్బీఐ, ద్రవ్యపరపతి సమీక్ష అంశాలపై జైట్లీకి స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేంద్రబ్యాంకుకు మరింత స్వయం ప్రతిపత్తి ఉండాలని, ద్రవ్యోల్బణం కట్టడే సమీక్షా సమావేశ ప్రధాన అజెండా కావాలని ఆయన అభిప్రాయపడేవారు. ఆయన మరణం పట్ల అటు రాజకీయనాయకులతో పాటు ఇటు కార్పొరేట్ వర్గాలు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. ఆర్థిక సంస్కరణలు సమర్ధవంతంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా కార్పొరేట్ ప్రపంచం జైట్లీని కొనియాడుతోంది. దేశాభివృద్ధికి విశేష కృషి: కోవింద్ జైట్లీ మరణం తీవ్రవిచారకరం. ఆయనో న్యాయవాది, గొప్ప పార్లమెంటేరియన్, సమర్థుడైన మంత్రి. ఈ దేశ పురోగతి కోసం ఆయన ఎంతో కృషిచేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. విలువైన మిత్రుడు: వెంకయ్య జైట్లీ లేని లోటు పూడ్చలేనిది. ఆయన నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను కోల్పోవడం వ్యక్తిగతంగా నాకు నష్టమే. పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి మరువలేనిది. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. స్నేహితుడిని కోల్పోయా: మోదీ జైట్లీ మృతితో ఒక విలువైన స్నేహితుడిని కోల్పోయానంటూ ప్రధాని మోదీ ఉద్వేగానికి గురయ్యారు. బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి భారత సంతతి ప్రజలతో జరిగిన భేటీలో మాట్లాడుతూ.. ‘దేశం కోసం నిరంతరం సేవ చేసిన అత్యున్నత మేధో సంపత్తి కలిగిన దిగ్గజ రాజకీయ నేత అరుణ్ జైట్లీ. నాకు విలువైన మిత్రుడు. ఆయన లేడనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకున్నా. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అరుణ్ జైట్లీ ఎన్నో మంత్రిత్వ శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కొద్ది రోజుల క్రితమే నా సొదరి, మాజీ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మనల్ని విడిచి పోయారు. ఆ బాధ మరవకముందే.. నా ప్రియ మిత్రుడు జైట్లీ కూడా లేరనే వార్త రావడం విచారకరం’ అంటూ మోదీ సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ సేవలు చిరస్మరణీయం: కేసీఆర్ జైట్లీ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘జైట్లీ మరణం తీరని లోటు. దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అంటూ కేసీఆర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మేధావి, స్నేహశీలి: జగన్ అరుణ్ జైట్లీ ఇకలేరనే వార్తతో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘జైట్లీ మరణవార్తపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. ఆయన ఓ మంచి మేధావి, స్నేహశీలి, చాలా అంశాలపై స్పష్టత కలిగిన వ్యక్తి. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేం’అని జగన్ ట్వీట్ చేశారు. కార్పొరేట్ ప్రపంచం నివాళి న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల దేశ వ్యాపార వర్గాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన్ను నిజమైన సంస్కరణవాదిగా కార్పొరేట్ వర్గాలు కొనియాడాయి. జైట్లీ ఒక డైనమిక్ పార్లమెంటేరియన్ అని, వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడంలో ఆయన నేర్పరి అని, న్యూ ఇండియా అవతరణలో ఆయన ఆలోచనలు అత్యంత కీలకపాత్ర పోషించాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిత్తల్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ కొనియాడారు. జైట్లీ మరణం దేశం పూడ్చుకోలేని లోటని వేదంతా చైర్మన్ అనిల్ అగర్వాల్, సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్సోమానీ, జేఎస్డబ్లు్య గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ తదితరులు జైట్లీ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. –సాక్షి, బిజినెస్ వెబ్ విభాగం -
జైట్లీ అస్తమయం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత, స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణకు ఆద్యుడు అరుణ్ జైట్లీ (66) ఇకలేరు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఏయిమ్స్లో శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు కన్నుమూశారు. బీజేపీ అగ్రనేతగా.. కష్టకాలంలో బీజేపీని అదుకున్న మూలస్తంభాల్లో ఒకరిగా అభిమానుల గుండెల్లో ఆయన స్థానం చెరగనిది. సుష్మాస్వరాజ్ వంటి మహానేత హఠాన్మరణాన్ని (ఆగస్టు 6న) మరవక ముందే.. అదేతరానికి చెందిన జైట్లీ వంటి మరో రాజకీయ ప్రముఖుడిని కోల్పోవడం దేశానికి మరీ ముఖ్యంగా బీజేపీకి పెద్దలోటు. ఆగస్టు 9న శ్వాస ఇబ్బందులతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్సపొందుతూ.. శనివారం తుదిశ్వాస విడిచారని ఏయిమ్స్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణ్ జైట్లీ మృతి బీజేపీకి తీరని శోకాన్ని మిగిల్చింది. జైట్లీ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ ప్రముఖులు, బీజేపీయేతర పార్టీల నేతలు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలకు ఆయన లోటు పూడ్చలేనిదన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో జైట్లీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగుతాయి. పార్టీలకతీతంగా అభిమానం పొంది.. రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనలో జైట్లీ చొరవను ప్రశంసించకుండా ఉండలేం. స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్ను సంస్కరణ అయిన జీఎస్టీ విషయంలో అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఏకాభిప్రాయంతో అద్భుతమైన చట్టానికి రూపకల్పన చేశారు. నరేంద్ర మోదీ తొలి ఐదేళ్ల ప్రభుత్వంలో జైట్లీది క్రియాశీలక పాత్ర. కీలక వ్యూహకర్తగా ఆయన వ్యవహరించిన తీరు అందరికీ గుర్తే. ఆర్థిక శాఖతోపాటు రక్షణ, కార్పొరేట్ వ్యవహారాలు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వంటి కీలక బాధ్యతలను ఆయన సమర్థంగా నిర్వర్తించారు. ఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలై.. బీజేపీలో ఉన్నతస్థానానికి చేరినా.. కరడుగట్టిన హిందుత్వ రాజకీయాల జోలికి ఆయనెప్పుడూ వెళ్లలేదు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనంటే ఎనలేని గౌరవాభిమానాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందడం, ఆ తర్వాత ప్రభుత్వం సమర్థవంతంగా నడవడం వెనక కూడా జైట్లీ కృషి చాలా ఉంది. రాజకీయాల్లో ఉంటూ.. న్యాయవాదిగా పలు ముఖ్యమైన కేసుల్లో తనముద్ర వేశారు. ప్రముఖ కంపెనీలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా ఆయన పనిచేశారు. బీజేపీలో ఆయనో ట్రబుల్ షూటర్గా పేరు సంపాదించారు. విషాదంలో బీజేపీ శ్రేణులు... సుష్మాస్వరాజ్ మృతి నుంచి తేరుకోకముందే మరో అగ్రనేత జైట్లీని కోల్పోవడంతో బీజేపీ శ్రేణులు నిర్వేదంలో (విషాదం) మునిగిపోయాయి. జైట్లీ ఇకలేరనే వార్త తెలియగానే కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిమ్స్ వద్దకు చేరుకున్నారు. భౌతికకాయం జైట్లీ ఇంటికి చేరాక అక్కడికి కూడా భారీగా అభిమానులు చేరుకున్నారు. బీజేపీలో కొత్తతరం నేతలకు స్ఫూర్తిగా నిలిచే జైట్లీ... 2019 ఎన్నికల సమయంలో ఆరోగ్యం సహకరించక బహిరంగ సభలకు వెళ్లకపోయినా.. పార్టీ కార్యాలయం నుంచే ప్రెస్మీట్ల ద్వారా విపక్షాల ఎత్తులను చిత్తు చేస్తూ.. పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు. ప్రభుత్వం, పాలన సమర్థవంతంగా మందుకెళ్లడంలోనూ కీలకంగా వ్యవహరించారు. పార్టీ ట్రబుల్ షూటర్: అడ్వాణీ ‘అందరినీ కలుపుకుని పోయేవాడిగా.. పార్టీలకు అతీతంగా జైట్లీ అందరి మదిలో ఉంటారు. జైట్లీ భోజన ప్రియుడు. మంచి రెస్టారెంట్ అనిపిస్తే.. అక్కడోసారి భోజనం చేయండని సూచించేవాడు. ప్రతి దీపావళికి కుటుంబసమేతంగా ఇంటికొచ్చి శుభాకాంక్షలు చెప్పేవాడు’ అని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్కే అడ్వాణీ గద్గదస్వరంతో జైట్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, ఇతర విపక్ష నేతలు కూడా జైట్లీ మృతిపై ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, జైట్లీల మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. గతేడాది నుంచే అనారోగ్యంతో.. 2014లో ఆయన బరువు తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. గతేడాది మే 14న ఆయన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం చాలా వేగంగా క్షీణించింది. దీంతో ఆయన విశ్రాంతి తీసుకునేందుకే ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో మృదు కణజాల కేన్సర్తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీంతో 2019 ఎన్నికల్లో పోటీపై విముఖత చూపించటమే కాక... భారీ విజయం సాధించిన తర్వాత కేబినెట్లో తనకు చోటు వద్దని కరాఖండిగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో పార్టీ పక్షనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖుల నివాళి దక్షిణ ఢిల్లీలోని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. అక్కడే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్షవర్ధన్, జితేంద్ర సింగ్, ఎస్ జైశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు తదితరులు జైట్లీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, రాజీవ్ శుక్లా కూడా ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతోపాటు వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మరణవార్త విని బాధపడ్డాను: సీజేఐ ‘దేశం ఓ ఉన్నతమైన సీనియర్ లాయర్, గొప్ప నేతను కోల్పోయింది. ఆయన మరణ వార్త వినగానే బాధపడ్డాను. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు. న్యాయవాదిగా ప్రస్థానం జైట్లీది న్యాయవాద కుటుంబం. న్యూఢిల్లీలో డిసెంబర్ 28, 1952లో జన్మించారు. ఆయన తండ్రి ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులున్న న్యాయవాది మహరాజ్ కిషన్ జైట్లీ. తల్లి రతన్ ప్రభ సామాజిక కార్యకర్త. చిన్నప్పటి నుంచి చర్చాగోష్టుల్లో పాల్గొనటం అంటే జైట్లీకి చాలా ఇష్టం. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ చేశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకుడిగా పాల్గొని ఆ ఉద్యమాన్ని ఉరకలెత్తించారు. దాదాపు 19 నెలలు జైల్లో ఉన్నారు కూడా. అప్పట్లో ఏబీవీపీ యువమోర్చా కన్వీనర్ బాధ్యతలు నిర్వహించేవారు. 1977లో ఏబీవీపీ అ«ఖిల భారత కార్యదర్శిగా ఉన్నారు. 1980లో బీజేపీలో చేరారు. పార్టీ తరఫున ఎన్నో కేసులు వాదించారు. బోఫోర్స్ వంటి కుంభకోణాలను వెలికితీయడంలో జైట్లీ పాత్ర కీలకం. కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా, జనతాదళ్ నేత శరద్యాదవ్ వంటి వారు కూడా జైట్లీ క్లయింట్లే. న్యాయపరమైన అంశాలపై పుస్తకాలు కూడా రాశారాయన. జైట్లీ భార్య సంగీత. ఆయనకు కుమారుడు రోహన్, కుమార్తె సొనాలీ. పిల్లలిద్దరూ న్యాయవాద వృత్తిలోనే ఉన్నారు. జైట్లీ పార్థివ దేహం వద్ద అమిత్ షా నివాళి, జైట్లీ భార్య సంగీతను ఓదారుస్తున్న సోనియా 2001లో వాజ్పేయితో.. 2004లో కలకత్తా హైకోర్టులో లాయర్గా.. 1974లో ఢిల్లీ వర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా.. -
జైట్లీ మరణం.. గంభీర్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఆగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని విచారం వ్యక్తం చేస్తోంది. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ పలువురు రాజీకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే బీసీసీఐతో పాటు టీమిండియా తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ జైట్లీ మరణంపై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నాన్న నీకు మాట్లాడాలని చెప్తారు. నాన్నలాంటి వారు నిన్ను అందరి ముందు ప్రసంగించాలని సూచిస్తారు. తండ్రి నీకు నడక నేర్పిస్తారు. తండ్రిలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. నాన్న నీకు పేరు పెడతాడు. నాన్న సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా తండ్రి సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది’ అంటూ భావోద్వేగ సందేశాన్ని గంభీర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. (చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!) ‘అరుణ్ జైట్లీ గారు మరణించారన్న వార్త విని షాకయ్యాను. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనది. నా లాంటి ఎంతో మంది ఆటగాళ్లను ప్రోత్సహించేవారు. 2006లో నా తండ్రి చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఓదార్చారు. నాలో ధైర్యాన్ని నింపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’అంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, ధావన్, కోహ్లి వంటి ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించే జైట్లీ వారికి సరైన అవకాశాలు ఇచ్చేందుకు పాటు పడేవారు. అంతేకాకుండా ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి తగిన కృషి చేశారు. చదవండి: అపర చాణక్యుడు.. ట్రబుల్ షూటర్! అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం -
నల్ల రిబ్బన్లతో టీమిండియా..
అంటిగ్వా: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి మైదానంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి, మాజీ డీడీసీఏ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ మరణానికి సంతాపంగా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన జైట్లీకి క్రికెట్తోనూ మంచి అనుబంధం ఉంది. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం(1999-2013) పని చేసిన జైట్లీ.. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా తన సేవలందించారు. ఢిల్లీ క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. ఆటగాళ్ల సమస్యలను, వారికి మౌలిక వసతులను కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, తదితరులు టీమిండియా తరుపున ఆడారు. ఇప్పటికే అరుణ్ జైట్లీ మృతి పట్ల తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. -
ఆయన రాజకీయాల్లో ఆల్ రౌండర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తీవ్ర సంతాపం ప్రకటించారు. నాయకులుగా అందరూ ఎదుగుతారని, అయితే నాయకుడిగా ఎదిగి సంస్థగా మారిన వ్యక్తి జైట్లీ అని ప్రశంసించారు. అందరికీ అందుబాటులో ఉండే స్వభావం జైట్లీదని, రాజకీయాల్లో హాస్యరసం పూయించడం ఆయన ప్రత్యేకత అని రాంమాధవ్ గుర్తు చేసుకున్నారు. శనివారం హైదరాబాద్లో రాంమాధవ్ మాట్లాడుతూ..నెల రోజుల వ్యవధిలోనే పెద్ద నాయకులను బీజేపీ కోల్పోయిందని అన్నారు. జైట్లీ పొలిటికల్ ఆల్ రౌండర్ అని, అంచెలంచెలుగా ఎదిగి పార్టీలో ఉన్నత పదవులు అందుకున్నారన్నారు. ఆయన ప్రతిభ, కష్టపడే తత్వం అత్యంత యోగ్యుడిగా మార్చిందన్నారు. ఆర్థిక, రక్షణ మంత్రిత్వ శాఖలను అవలీలగా నిర్వర్తించేవారని ప్రశంసలు కురిపించారు. న్యాయశాఖలోనూ జైట్లీ నిపుణులని, పార్టీలో న్యాయ సలహాలు ఆయనే ఇచ్చేవారన్నారు. అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం రాత్రి ఒంటి గంట అయినా జైట్లీ బడ్జెట్పై కసరత్తు చేసేవారని రాంమాధవ్ గుర్తు చేసుకున్నారు. కశ్మీర్లో పొత్తులపై కూడా అరుణ్ జైట్లీ అభిప్రాయం తీసుకోమని ప్రధాని మోదీ చెప్పేవారన్నారు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో అభిమానం అని, బీజేపీకి జైట్లీ మంచి బ్యాట్స్మెన్ అన్నారు. ‘విపక్షాల వికెట్లు తీయడంలో మంచి బౌలర్..సమస్యలను పరిష్కరించడంలో మంచి ఫీల్డర్’ అని వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటేనే అధికారం కోసం అని, అయితే మానవీయత కోసం అనే వ్యక్తి జైట్లీ అని రాంమాధవ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. -
జైట్లీ ఎనలేని కృషి చేశారు: యూఎస్ ఎంబసీ
న్యూఢిల్లీ : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ మరణం పట్ల భారత్లోని అమెరికా ఎంబసీ సంతాపం వ్యక్తం చేసింది. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ను మెరుగుపరిచే దిశగా అదే విధంగా అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం వంటి చిరస్మరణీయ సేవలు అందించారని జైట్లీని కొనియాడింది. ఈ మేరకు..‘ అమెరికా- భారత్ల మధ్య ఆర్థిక విషయాల్లో సత్సంబంధాలకై అరుణ్ జైట్లీ ఎనలేని కృషి చేశారు. ఆయన మరణం పట్ల చింతిస్తున్నాం. జైట్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు అదే విధంగా భారత దేశ ప్రజలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాం’ అని ట్వీట్ చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఈ రోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర నాయకులంతా జైట్లీ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. US Embassy: Minister Jaitley recognized the importance of US-India relationship & worked to improve economic ties between our countries. US Mission in India extends our deepest condolences to former Minister Jaitley’s family& many friends, as well as to all the citizens of India https://t.co/MuUWE87KqI — ANI (@ANI) August 24, 2019 -
అరుణ్ జైట్లీకి ప్రముఖుల నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఎయిమ్స్లో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ భౌతికకాయానికి ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు హర్షవర్థన్, జైశంకర్ తదితరులు కైలాశ్ కాలనీలోని జైట్లీ నివాసానికి తరలి వచ్చి... ఆయన పార్థివదేహానికి అంజలి ఘటించారు. అరుణ్ జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం అలాగే కాంగ్రెస్ నేత జ్యోతిరాధిత్య సింధియా, ఆయన కుటుంబసభ్యులు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా శనివారం సాయంత్రం జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరుగుతాయి. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ (యూఏఈ) పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జైట్లీ మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులను ...ప్రధాని ఫోన్లో పరామర్శించారు. -
జైట్లీ సేవలు చిరస్మరణీయం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూయడంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్. కే లక్ష్మణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి, దేశానికి, న్యాయ వ్యవస్థకు అరుణ్ జైట్లీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమంలో జైట్లీ కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. అంతేకాక తెలంగాణ ఉద్యమంలో పార్టీ, ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడిగా తన గళాన్ని గట్టిగా వినిపించారని, రాజ్యసభలో తెలంగాణ విభజన బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు పలు విలువైన సూచనలు, సలహాలు జైట్లీ ఇచ్చారని లక్ష్మణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ మృతి పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరపున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. -
అరుణ్ జైట్లీ: క్రికెట్తో ఎనలేని అనుబంధం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే జైట్లీకి క్రికెట్తో ఎనలేని బంధం ఏర్పడింది. బీసీసీఐతో ఉన్న సత్ససంబంధాలతో ప్రతిభ ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను టీమిండియా తరుపున ఆడించే ప్రయత్నం చేశారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వారు. ఇక ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆరుణ్ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్తో పాటు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, హర్ష బోగ్లే, తదితర ఆటగాళ్లు అరుణ్ జైట్లీ మరణానికి ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం అరుదైన ఫోటో ట్వీట్ చేసిన కపిల్ సిబల్ -
అపర చాణక్యుడు.. ట్రబుల్ షూటర్!
బీజేపీకి ట్రబుల్ షూటర్ అనదగ్గ నాయకుడు, అపర రాజకీయ చాణక్యుడు అరుణ్ జైట్లీ.. తన మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో బీజేపీకి ఏ కష్టమొచ్చినా నేనున్నాంటూ జైట్లీ ట్రబుల్ షూటర్లా వ్యవహరించారు. వ్యూహకర్తగా తెరవెనుక ఉండి పార్టీని సంక్షోభ సమయాల్లో గట్టెక్కించారు. గతంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన జైట్లీ.. తన వాగ్ధాటితో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టించారు. దేశంలోనే పేరొందిన న్యాయవాదిగా ఘనత సొంతం చేసుకున్న జైట్లీ నిశిత దృష్టికి, పదునైన విమర్శలకు చిక్కకుండా పలు బిల్లులను రాజ్యసభలో ఆమోదించుకోవడం నాటి యూపీఏకు సర్కారుకు కత్తిమీద సాములా ఉండేది. వరుస కుంభకోణాలపై యూపీఏ సర్కారును దునుమాడిన జైట్లీ మన్మోహన్ సర్కారు పతనంలో తనవంతు పాత్ర పోషించారు. అనంతరం నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలిహయాంలో అత్యంత కీలక మంత్రిగా ఉండి.. మోదీ సర్కారు నిలదొక్కుకోవడంలోనూ కీలక పాత్ర పోషించారు. న్యాయవాదిగా ప్రస్థానం.. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన జైట్లీ.. ఇటు పాలిటిక్స్లోనే కాదు.. అటు లీగల్ సర్కిల్లోనే ప్రముఖుడిగా పేరొందారు. దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా పేరొందిన జైట్లీని రాజకీయాలు సహజంగానే ఆకర్షించాయి. 1974లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (డీయూఎస్యూ) అధ్యక్షుడిగా గెలుపొందడంతో రాజకీయ రంగంలో ఆయన ప్రవేశానికి మార్గం సుగమం అయింది. అనంతరం ఎమర్జెన్సీ సమయంలోనూ నాటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైట్లీ పనిచేశారు. 1990లో దేశ రాజకీయ సామాజిక వాతావరణం విపరీతంగా మార్పులకు లోనవుతున్న సమయం. ఒకవైపు మండల్ రాజకీయాలు ఉత్తరాది రాష్ట్రాలను కుదిపేస్తుండగా.. మరోవైపు బాబ్రీ మసీదు కూల్చివేత ఒక చీకటి అధ్యాయంగా దేశ మౌలిక పునాదులను పేకలిస్తుందా? అన్నంతగా కల్లోల పరిస్థితి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థలో సమూల సంస్కరణల కోసం అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న సమయం. ఇలాంటి సమయంలో జైట్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. బీజేపీలో క్రమంగా ఎదుగుతూ వచ్చారు. అటల్ బిహారీ వాజపేయి, ఎల్కే అద్వానీ తర్వాతిస్థానం జైట్లీదే అన్నంతగా ఆయన తెరపైకి వచ్చారు. పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా జైట్లీ తనను తాను నిరూపించుకున్నారు. 2003లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును కూల్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటివరకు బిజిలీ, సడక్, పానీ ఎన్నికల నినాదాలుగా ఉండేవి. కానీ జైట్లీ అభివృద్ధి అంశాన్ని ఎన్నికల నినాదంగా మార్చి బీజేపీకి విజయాన్ని అందించారు. పెద్దల సభలో గర్జించిన గళం బీజేపీలో కీలక నేతగా, ప్రఖ్యాత న్యాయవాదిగా అప్పటికే పేరు తెచ్చుకున్న జైట్లీ.. 1999లో తొలిసారి వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రిగా, డిజిన్వెస్ట్మెంట్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2000 సంవత్సరంలో కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొంది.. కీలక లా, సామాజిక న్యాయం, కంపెనీ వ్యవహారాల శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు. కేంద్ర కేబినెట్లో కంటే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా జైట్లీ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 2004లో వాజపేయి ప్రభుత్వం అనూహ్యంగా ఓడిపోవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష గళంగా జైట్లీ అవతరించారు. అదే ఊపులో 2009లో ఆయన పెద్దలసభలో ప్రతిపక్ష నేత పదవిని నిర్వర్తించి.. నాటి యూపీఏ సర్కారుకు చుక్కలు చూపించారు. మన్మోహన్ సర్కారును సభలో ఏకిపారేస్తూ.. తన వాగ్ధాటితో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. కేంద్రాన్ని అనేకసార్లు జైట్లీ ఇరకాటంలో పెట్టారు. మన్మోహన్ సర్కారు పతనంలో ప్రతిపక్ష నేతగా తనవంతు పాత్రను జైట్లీ అత్యంత సమర్థంగా పోషించారు. ఎన్నికల్లో గెలువనప్పటికీ..! 2014లో మోదీ ప్రభంజనంతో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. అయితే, మోదీ హవా కూడా జైట్లీని ఎన్నికల సమరంలో ఒడ్డున పడేయలేకపోయింది. అమృతసర్లో పోటీ చేసిన జైట్లీ.. కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే, ఈ ఓటమి.. బీజేపీలోని ఆయన చరిష్మాను, విశ్వసనీయతను చెదరగొట్టలేకపోయింది. నరేంద్రమోదీకి అత్యంత నమ్మకస్తుడిగా ఆయన కేబినెట్లో జైట్లీ కీలక పదవులు పోషించారు. ఎన్డీయే తొలి హయాంలో కీలకమైన ఆర్థిక, రక్షణ మంత్విత్వ శాఖలను జైట్లీ నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు నిత్యం వెంటాడటం ఆయనను బాగా ఇబ్బందిపెట్టింది. తరచూ ఆస్పత్రులకు వెళ్తూనే.. ఎన్డీయే తొలి హయాంలో కీలక వ్యక్తిగా, ఢిల్లీ పవర్ సర్కిల్లోని చిక్కులను మోదీ అర్థం చేసుకోవడంలో అండగా నిలిచిన నేతగా జైట్లీ వ్యవహరించారు. అనారోగ్య సమస్యలు తీవ్రం కావడంతో 2019 ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే జైట్లీ పలు అంశాల్లో కాంగ్రెస్ వైఖరిని చీల్చిచెండాడుతూ బీజేపీకి చివరివరకు నైతిక, భావజాల మద్దతును అందించారు. ఇటీవల ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ జైట్లీ సోషల్ మీడియాలోనే ఘాటైన విమర్శలు చేశారు. రాజకీయాలే కాదు న్యాయవ్యవస్థలోనూ జైట్లీ తనదైన ముద్ర వేశారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్లోనూ అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ తన పట్టు నిలుపుకున్నారు. మోదీ హయాంలో భారత క్రికెట్లోనూ ఆయన ఆధిపత్యం కొనసాగింది. భావజాలపరంగా రైట్ వింగ్ రాజకీయాలను అనుసరించినప్పటికీ జైట్లీ అన్ని రాజకీయ పార్టీల్లోనూ మంచి స్నేహితులు ఉన్నారు. పాత్రికేయులతో నిత్యం స్నేహపూరితంగా ఉండే జైట్లీ.. బీజేపీ అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కేలా చేస్తున్నారని పలు సందర్భాల్లో పార్టీ నేతలే అనుమానించేవారు. అయితే, జర్నలిస్టులతో మాత్రం ఆయన సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఎడిటర్లకు కనుక ప్రధానమంత్రిని ఎన్నుకునే అవకాశమొస్తే.. కచ్చితంగా జైట్లీనే ఎన్నుకునే వారని పాత్రికేయ వర్గాలు చెప్పుకునేవి. చివరిక్షణం వరకు రాజకీయాల్లో, న్యాయవ్యవస్థలో తనదైన ముద్రను వేసిన జైట్లీ.. శనివారం శాశ్వతంగా ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకున్నారు. -
రేపు అరుణ్ జైట్లీ అంత్యక్రియలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న జైట్లీ మరణించిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని కైలాష్ కాలనీలోని నివాసానికి తరలించారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సందర్శనార్థం రేపు ఉదయం వరకూ నివాసంలోనే జైట్లీ పార్థివదేహాన్ని ఉంచుతారు. అనంతరం ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పార్టీ శ్రేణుల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంచుతారు. రేపు సాయంత్రం నిగమ్బోధ్ ఘాట్లో జైట్లీ అంత్యక్రియలు నిర్వహిస్తారు. అనారోగ్య కారణాలతో ఈ నెల 9న జైట్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!
సాక్షి, వెబ్డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1 హయాంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ దాదాపు 20 రోజుల వ్యవధిలో మరణించడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఎన్నికల హామీలో భాగంగా జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ సర్కారు రద్దు చేసిన మరుసటి రోజే చిన్నమ్మ కన్నుమూయగా... జైట్లీ ఈరోజు మధ్యాహ్నం(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో విదేశాంగ మంత్రిగా సుష్మ జాతికి చేసిన సేవలను, ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ దేశ ఆర్థిక వ్యవస్థలో పలు కీలక మార్పులకు సాక్షిగా ఉన్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ బీజేపీ నాయకులు ఉద్వేగానికి లోనవుతున్నారు. వీరిద్దరి అస్తమయం పార్టీ పరంగానే గాకుండా వ్యక్తిగతంగా కూడా తమకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ అనారోగ్య కారణాల రీత్యా ఆరు పదుల వయస్సులోనే కన్నుమూయడం వారిని మరింత విషాదంలోకి నెట్టింది. ‘అమ్మ’గా అభిమానం చూరగొన్నారు.. గత ఐదేళ్లలో భారతదేశ దౌత్య సంబంధాలను మెరుగుపరచడంలో విదేశాంగ మంత్రిగా సుష్మ ప్రముఖ పాత్ర పోషించారు. 2014లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ దాదాపు 90 దేశాల్లో పర్యటించారు. వివిధ దేశాలతో సత్సంబంధాలు నెలకొనడంలో ఈ పర్యటనలు ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే ఇవన్నీ సజావుగా సాగడానికి సుష్మ చతురత, దౌత్యనీతి ముఖ్య కారణాలు అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక 2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాల్సి వచ్చినపుడు ఆశువుగా ఉపన్యాసం ఇస్తానని మోదీ ప్రకటించగా.. కాగితం మీద రాసుకుని చదివితేనే చెప్పాలనుకున్న విషయం స్పష్టంగా ప్రజల్లోకి వెళ్తుందని చిన్నమ్మ చెప్పడంతో మోదీ ఆమె సలహాను పాటించారు. సుష్మ మాట అంటే ఆయనకు అంత నమ్మకం. ఇక విదేశాంగ మంత్రిగా సమస్యల్లో ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులకు సుష్మ అండగా నిలిచారు. ఉపాధి కోసం వలసవెళ్లి బందీలైన వారికి ఒకే ఒక ట్వీట్తో తక్షణ విముక్తి కల్పించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేగాకుండా ఎన్నికలకు ముందు పుల్వామా ఉగ్రదాడి కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేగిన సమయంలోనూ సుష్మ కీలకంగా వ్యవహరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడంలో ఆమె సఫలీకృతులయ్యారు. రష్యాతో పాటు పాక్ మిత్రదేశం అయిన చైనాతో కూడా చర్చలు జరిపి పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్కు మద్దతు కూడగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇక విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ కేవలం తన శాఖకే పరిమితమైపోకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, న్యాయశాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నారై బాధిత భార్యల కోసం చక్కటి పరిష్కార విధానాలను రూపొందించారు. ఎన్నారై భర్తలపై స్వదేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భార్యలు చేసే ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిశీలించి, ఆగడాల భర్తలను పట్టుకోవడం కోసం తన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఈ లక్షణాలన్నీ వెరసి దేశ ప్రజలకు ఆమెను ప్రియమైన మంత్రిగా చేయడంతో పాటు ఆపదలో ఆదుకునే సూపర్ మామ్గా కీర్తిని తెచ్చిపెట్టాయి. అంతేగాక ప్రఖ్యాత ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ఆమెను భారతదేశపు ‘బెస్ట్ లవ్డ్ పొలిటీషియన్’ అని కీర్తించింది. ఇవన్నీ సుష్మ వ్యక్తిగతంగా పేరు ప్రతిష్టలు పొందడమేగాక నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని చూరగొనేలా చేశాయి. ఆయన హయాంలోనే కీలక సంస్కరణలు వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీ మోదీ కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం చేపట్టింది. అదే విధంగా అరుణ్ జైట్లీ హయాంలోనే సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు కూడా. కేవలం విత్త మంత్రిగానే గాకుండా ప్రముఖ న్యాయవాదిగా కూడా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో మోదీ సర్కారుకు న్యాయ సలహాలు ఇచ్చారు. బీజేపీ ట్రబుల్షూటర్గా గుర్తింపు పొందిన ఆయన... ప్రత్యర్థి పార్టీల విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టడంలో దిట్టగా ప్రసిద్ధికెక్కారు. రఫేల్ ఒప్పందంపై అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారును విమర్శించిన సమయంలోనూ జైట్లీ తనదైన శైలిలో వాటిని తిప్పికొట్టారు. మోదీకి నమ్మిన బంటుగా ప్రాచుర్యం పొందిన జైట్లీ తన విశేషానుభవాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురైన చిక్కుప్రశ్నలను సులువుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించారు. ఇక కార్పోరేట్ వర్గాల్లో కలకలం రేపిన ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచర్ తీరుపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. అంతేగాకుండా మోదీకి అనుకూలంగా సమర్థవంతంగా తన వాదనలు వినిపించేవారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ట్విటర్ ద్వారా తన సందేశాలను పోస్ట్ చేస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేవారు. ఈ క్రమంలో ఆయన మరణం మోదీకి తీరని లోటు అని బీజేపీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. -
క్రికెటర్గా అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతికి సంతాపం తెలుపుతూ.. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను ట్వీట్ చేశారు కపిల్ సిబల్. ‘క్రికెట్లో మేమిద్దరం’ అనే క్యాప్షన్తో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫోటోతో పాటు.. ‘అరుణ్ జైట్లీ మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నా పాత స్నేహితుడు.. ప్రియమైన సహోద్యోగి. రాజకీయాల్లో గానీ, దేశ ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు కలకాలం నిలిచి ఉంటాయి. అరుణ్ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడ్డారు’ అంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. Very sorry to learn that Arun Jaitley is no more . An old friend and a dear colleague will be remembered for his seminal contributions to the polity and as FM of India . As Leader of Opposition he was without match . He always stood steadfastly for his friends and for his party . — Kapil Sibal (@KapilSibal) August 24, 2019 అంతేకాక అరుణ్ జైట్లీతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కపిల్ సిబల్. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. అరుణ్ జైట్లీ క్రికెట్కు వీరాభిమాని అనే సంగతి అందరికి తెలిసిందే. ఓ దశాబ్దం పాటు ఆయన ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జైట్లీ తీవ్రంగా కృషి చేశారు. అయితే క్రికెట్ నిర్వహకుడిగా అరుణ్ జైట్లీ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. -
‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్మీడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ - ఆశా భోంస్లే ‘20 ఏళ్ల క్రితం అరుణ్ జైట్లీని కలిశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనను ఇష్టపడుతూనే ఉన్నాను. ఆయన మరణం మన దేశానికి తీవ్ర నష్టం. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం జైట్లీ జీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.’ - అనిల్ కపూర్ ‘అరుణ్ జైట్లీ చాలా గొప్ప వ్యక్తి. లోధి గార్డెన్స్లో మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఆయనను కలిసి పలకరించే అవకాశం లభించేది. మీరు లేని లోటు తీర్చలేనిది.’ - శేఖర్ కపూర్ ‘అరుణ్ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. డైనమిక్ లీడర్, ప్రతి విషయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడప్పుడు ఆయన నన్ను కలవడానికి వచ్చే వారు. మేము చాలా సేపు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాంపం తెలియజేస్తున్నాను.’ - లతా మంగేష్కర్ ‘అరుణ్ జైట్లీ మరణించారని విని ఎంతో బాధపడ్డాను. ఆయన గొప్ప దార్శనీకుడు. ఆయనతో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ - అజయ్ దేవగన్ ‘అరుణ్జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ - రితేశ్ దేశ్ముఖ్ -
జైట్లీ లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీ మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఆయన...జైట్లీ మరణవార్త వినగానే హుటాహుటీన ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జైట్లీ లేని లోటు దేశానికి తీర్చలేనిది. నాకు అత్యంత సన్నిహితుడు. ఆయన లేని లోటు నాకు వ్యక్తిగత నష్టం. అనేక పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంలో జైట్లీ సిద్ధహస్తుడు. జీఎస్టీ లాంటి సంస్కరణలు విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. అత్యుత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు అందుకున్నారు. నీతి నిజాయితీ, విలువలకు కట్టుబడి రాజకీయ జీవితాన్ని కొనసాగించారు.’ అని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. I am deeply shocked to learn about the demise of Shri Arun Jaitley,a long time dear friend and one of my closest associates. His death is an irreparable loss to the nation and a personal loss to me. I have no words to express my grief. — VicePresidentOfIndia (@VPSecretariat) August 24, 2019 మరోవైపు జైట్లీ మరణంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు తిరుపతిలోని పలు కార్యక్రమాలు రద్దు చేసుకుని ఢిల్లీ పయనం అయ్యారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం -
గొప్ప స్నేహితుడిని కోల్పోయా: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ మృతిపట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. ‘‘జైట్లీ ఇకలేరనే వార్త నన్ను ఎంతో బాధకు గురిచేసింది. గొప్ప వ్యక్తుల్లో జైట్లీ ఒకరు. ఎంతో కాలంగా ఇద్దరం కలిసి ప్రజాసేవలో ఉన్నాం. జైట్లీ రాజకీయ జీవితంలో ఎన్నో అత్యన్నత పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారు. సమస్యను వెంటనే అర్థం చేసుకుని పరిష్కరించగల సమర్థవంతమైన వ్యక్తి జైట్లీ. అత్యయిక స్థితిలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పాటిపడిన వ్యక్తి. దేశానికి, పార్టీకి ఆయన చేసిన సేవ ఎనలేదని. జైట్లీ గొప్ప రాజకీయ దిగ్గజం. వర్ణించలేని మేథోసంపత్తి ఆయన సొంతం. దేశ చరిత్ర, న్యాయశాస్త్రం, పరిపాలన, ప్రజా విధానం వంటి అంశాలపై ఆయనకున్న పట్టు వర్ణించలేదని. సమర్థవంతమైన నేతను కోల్పోయాం. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్విటర్లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయా: అమిత్ షా అరుణ్జైట్లీ మృతిపట్ల కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సొంత కుటుంబ సభ్యుడిని కోల్పోయానని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జైట్లీనే తనకు మార్గదర్శి అని గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ పర్యటనలోఉన్న అమిత్ షా జైట్లీ మరణ వార్త వినగానే హుటాహుటిన ఢిల్లీకి బయలు దేరారు. చదవండి: వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి.. -
అరుణ్ జైట్లీ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారని, విలువలకు కట్టుబడి ఉన్నారని కొనియాడారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ట్వీట్ చేశారు. జైట్లీ మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి సాక్షి, హైదరాబాద్ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జైట్లీ ఆత్మకి శాంతి కలగాలి : గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సాక్షి, అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు అరుణ్ జైట్లీ మృతిపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ సంతాపం తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ జైట్లీ కన్నుమూయడంపై గవర్నర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుణ్ జైట్లీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలన్నారు. సంబంధిత వార్తలు : అరుణ్ జైట్లీ అస్తమయం వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి.. -
వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతితో బీజేపీ శ్రేణులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ ఆగస్ట్ 9న ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరి.. చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. న్యాయవాది వృత్తిలో దిట్టగా పేరొందిన జైట్లీ అనేక సందర్భాల్లో బీజేపీకి న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు. ముఖ్యంగా తొలిసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహించారు. ఆయన మృతిపట్ల బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నమ్మిన బంటు.. విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టగల సమర్థమైన నాయకుడు అరుణ్ జైట్లీ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా అందరికి సుపరిచితులైన జైట్లీ.. కీలకమైన అనేక కేసులను వాదించిన చరిత్ర గల న్యాయకోవిదుడు. బీజేపీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మిన బంటు. మోదీ కేబినెట్లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టిన సమర్థుడైన నేత. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. కేంద్రమంత్రి, రాజ్యసభ ప్రతిపక్షనేత, క్యాబినెట్ హోదా వంటి అనేక అత్యున్నత పదవులను అధిరోహించారు. 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జైట్లీ.. అనతికాలంలోనే బీజేపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్సభ ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఎన్నికల్లో ఓటమితో రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వ్యవహించారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించడంలో జైట్లీ దిట్ట. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ లీగల్ సెల్కు వ్యూహకర్తగా కూడా వ్యవహరించారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను జైట్లీ సమర్థవంతంగా పోషించారు. విపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఇరకాటం పెట్టడంలో జైట్లీ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రత్యర్థిపై వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన జైట్లీ.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. రాజకీయ ప్రస్థానం.. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. న్యాయవాదిగా అనుభవం ఉండటంతో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖమంత్రిగా ఆయన సేవలందించారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి.. కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు చైర్మన్కు ఉన్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం చెలరేగాయి. దీంతో కేజ్రీవాల్పై జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావావేసి కోర్టుముందు నిల్చోబెట్టారు.. ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. కొచ్చర్ వీడియోకాన్ సంస్థకు అక్రమంగా నిధులను మళ్లించారని జైట్లీ ఆరోపించారు. కుటుంబ నేపథ్యం.. అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్త ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం గుజరాత్లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. జమ్మూ కశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిదాల్ లాల్ కుమార్తె సంగీతను 1982లో వివాహం చేసుకున్నారు. పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ. ఇద్దరూ కూడా లాయర్లే కావడం విశేషం. కిడ్నీ సంబందిత వ్యాధితో బాధపడుతున్న జైట్లీ అమెరికాలో శస్త్ర చికిత్స కూడా తీసుకున్నారు. దాని కారణంగానే 2019 ఓటాన్ ఎకౌంట్ బడ్జెన్ను ప్రవేశపెట్టలేక పోయారు. మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, పార్టీ కార్యాకలపాలకు జైట్లీ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్య కారణంగా చికిత్స పొందుతూ మృతి చెందారు. -
అరుణ్ జైట్లీ అస్తమయం
సాక్షి, న్యూఢిల్లీ : గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్లో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. 1952, డిసెంబర్ 28న న్యూఢిల్లీలో జైట్లీ జన్మించారు. ఆయనకు భార్య సంగీత, కుమారుడు రోహన్, కూతురు సోనాలీ ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 12.07 నిముషాలకు అరుణ్ జైట్లీ మరణించారని ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. (చదవండి : వకీలు నుంచి విత్తమంత్రిగా ఎదిగి..) విద్యార్థి సంఘం నాయకుడిగా.. ఢిల్లీ వర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. మోదీ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జైట్లీ హయాంలోనే నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి సంస్కరణలను కేంద్రం తీసుకొచ్చింది. ఆయన మంత్రిగా ఉన్న సమయంలోనే సాధారణ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ను విలీనం చేశారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ.. అమెరికాలోనూ దీర్ఘకాలంపాటు చికిత్స తీసుకున్నారు. గతేడాది కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. -
మరింత విషమంగా జైట్లీ ఆరోగ్యం..!
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్యం మరింత విషమించింది. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. బీజేపీ సీనియర్ నేత ఉమాభారతి శనివారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని జైట్లీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈనెల 9న జైట్లీ ఎయిమ్స్తో చేరగా.. 20వ తేదీ నుంచి వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. -
ఎయిమ్స్లో జైట్లీని పరామర్శించిన అద్వానీ
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66)ని పార్టీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ సోమవారం పరామర్శించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఈ నెల 9న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు ఆయనను పరామర్శిస్తున్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జితేంద్ర సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఎయిమ్స్లో జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఈనెల 10 నుంచి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంతో పలువురు ప్రముఖ నేతలు ఆయన ఆరోగ్య పరస్థితిని వాకబు చేసేందుకు ఎయిమ్స్కు తరలివస్తున్నారు. కాగా, నరేంద్ర మోదీ తొలి సర్కార్లో ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్ సిస్టంపై ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శనివారం జైట్లీని పరామర్శించారు. కాంగ్రెస్కు చెందిన అభిషేక్ సింఘ్వీ, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధనోవా ఆసుపత్రికి వచ్చారు. శ్వాసకోస సంబంధిత అనారోగ్యంతో ఈ నెల 9న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 తర్వాత ఆయన ఆరోగ్యం గురించి ఎయిమ్స్ ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. ఇప్పటికే రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా జైట్లీని పరామర్శించారు. ఎయిమ్స్ నుంచి వెలువడుతున్న పొగ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం.. ఎయిమ్స్లో శనివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. 34 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. ప్రమాద సమయంలో ఎయిమ్స్లో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు విఘాతం కలిగిందని రోగుల బంధువులు అన్నారు. మంటలు చెలరేగిన పై అంతస్తులో ఉన్న కొందరు రోగులను వేరే భవనానికి తరలించారు. టీచింగ్ భవనంలో విద్యుత్ సంబంధిత పనులు జరుతుగున్న మైక్రోబయాలజీలోని వైరాలజీ యూనిట్లో మంటలు ప్రారంభం అయినట్లు అధికారులు గుర్తించారు. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9న ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు శనివారం జైట్లీని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వీ ‘జైట్లీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మంజిందర్ ఎస్ సిర్సా కూడా జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైట్లీ.. తనకు మెంటర్ వంటి వారని, అంతే కాకుండా 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆగస్టు 9 రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. -
జైట్లీ పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9 నుంచి ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా, శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించారు. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్లు కూడా ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ఆయన ఆగస్టు 9న ఉదయం ఎయిమ్స్లో చేరారు. ఆ రోజు రాత్రి నుంచి ఆయనను వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని అదే రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలేవీ బయటకు రాలేదు. -
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, న్యూఢిల్లీ : కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటూ ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 9న ఆస్పత్రిలో చేరిన జైట్లీకి సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఎయిమ్స్లో చేరినప్పటి నుంచి జైట్లీ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం ఉదయం జైట్లీని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వాకబు చేశారు. కాగా నరేంద్ర మోదీ తొలి సర్కార్లో పలు కీలక శాఖలు నిర్వహించిన 66 సంవత్సరాల జైట్లీ అనారోగ్య కారణాలతో 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయని సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికాలో ఉండటంతో పీయూష్ గోయల్ ఆయన స్ధానంలో తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం తన ఆరోగ్య పరిస్థితి సహకరించనందున తాను ప్రభుత్వంలో, క్యాబినెట్లో ఎలాంటి బాధ్యత నిర్వహించలేనని అరుణ్ జైట్లీ ప్రధానికి లేఖ రాశారు. -
జైట్లీ కుటుంబసభ్యులకు వెంకయ్య పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ: తీవ్ర అస్వస్థతకు గురై ఎయిమ్స్లో చేరిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అరుణ్ జైట్లీని శనివారం ఉదయం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. ఇవాళ ఉదయం ఎయిమ్స్కు వెళ్లిన ఆయన ...జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. చికిత్సకు అరుణ్ జైట్లీ శరీరం స్పందిస్తోందని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జైట్లీ కుటుంబసభ్యులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి సెక్రటేరియెట్ కార్యాలయం ట్వీట్ చేసింది. కాగా జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఆయనను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. గతేడాది మే నెలలో జైట్లీకి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. చదవండి: అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత The doctors informed the Vice President that Shri Jaitley is responding to the treatment and his condition is stable. The Vice President also met Shri Jaitley’s family members who were present. #ArunJaitley — VicePresidentOfIndia (@VPSecretariat) August 10, 2019 Hon’ble Vice President, Shri Venkaiah Naidu Visited AIIMS & enquired about the health of Shri Arun Jaitley with the team of doctors attending on the former Union Finance Minister. #ArunJaitley — VicePresidentOfIndia (@VPSecretariat) August 10, 2019 -
అరుణ్ జైట్లీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో ఉదయం ఆయన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. వెంటనే ఐసీయూలో చేర్చుకున్న వైద్యులు చికిత్స ప్రారంభించారు. హృదయం, మూత్రపిండాలు తదితర పలు విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు చికిత్స అందించారు. జైట్లీ అస్వస్థత వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా ఎయిమ్స్కు వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం ఎయిమ్స్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది. ‘ప్రస్తుతం జైట్లీ గుండె స్థిరంగా కొట్టుకుంటోంది. కీలక అవయవాలకు రక్త ప్రసరణ బావుంది. ఆయనను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం’ అని ఎయిమ్స్ ఆ ప్రకటనలో పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తదితరులు ఆసుపత్రికి వచ్చి జైట్లీ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన జైట్లీ.. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ప్రభుత్వానికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో, విమర్శలను తిప్పికొట్టడంలో జైట్లీ ఎంతో క్రియాశీలకంగా ఉండేవారు. గతేడాది మే నెలలో ఆయనకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఎంతోకాలంగా ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగానే ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లోనూ జైట్లీ పోటీ చేయలేదు. -
ఆసుపత్రిలో అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎయిమ్స్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు వైద్యులతో మాట్లాడి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. తాజాగా ఎయిమ్స్ వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఆరుణ్ జైట్లీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రిగా ఉన్నపుడే అరుణ్ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం, అనారోగ్యం కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి విదితమే. -
‘చారిత్రక తప్పిదాన్ని సవరించారు’
న్యూఢిల్లీ: కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. చారిత్రక తప్పిదాన్ని నేడు సవరించారన్నారు. జమ్మూకశ్మీర్ విభజనపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ.. చారిత్రక తప్పిదాన్ని సవరించిన ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాను అభినందిస్తున్నాను అన్నారు. ఇక మీదట మహోన్నత భారత్ దిశగా పయనించబోతున్నాం అంటూ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది అద్భుతమైన రోజు. జమ్మూకశ్మీర్ను భారత్లో పూర్తిగా విలీనం చేయాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి ఎంతో మంది అమరుల త్యాగాలు ఫలించాయి. సమగ్ర భారతదేశం కోసం ఏడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఇక తెరపడింది. జీవితంలో అసలు ఇలాంటి పరిణామం వస్తుందని ఊహించామా’ అని రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, 35ఏ రద్దు, జమ్మూకశ్మీర్ను రెండు ప్రాంతాలుగా విభజిస్తూ అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
రెండేళ్ల జీఎస్టీ : సింగిల్ స్లాబ్ అసాధ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ఒక దేశం ఒక పన్ను అంటూ బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తుల సేవల పన్ను (జీఎస్టీ ) రెండవ వార్షికోత్సవం సందర్భంగా మాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టూ ఇయర్స్ ఆఫ్టర్ జీఎస్టీ’ పేరుతో తన బ్లాగ్లో పోస్ట్ చేశారు. జీఎస్టీ విధానంలో ఒక స్లాబ్ వుండటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. భారత్ లాంటి దేశాల్లో ఒకే పన్ను శ్లాబు విధానాన్ని అమలు చేయడం అసాధ్యమన్నారు. అఇయతే భవిష్యత్తులో శ్లాబుల సంఖ్య రెండుకు తగ్గే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నూతన పన్ను విధానం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరవాత ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, దేశంలోని 20 రాష్ట్రాలు ఈ రెండేళ్లలో 14 శాతం అధిక రాబడి సాధించాయన్నారు జైట్లీ పేర్కొన్నారు. ఆదాయం మరింత పెరిగితే ప్రస్తుతం ఉన్న 12శాతం, 18శాతం శ్లాబులను కలిపేసే వెసులుబాటు ఉంటుందన్నారు. కాగా జూన్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లు లక్షకోట్ల రూపాయల మార్క్ దిగువకు చేరాయి. -
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు. తగ్గుతున్న బాండ్ల రాబడులు... మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 347 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ర్యాలీ నెలే! ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
మంత్రివర్గంలోకి తీసుకోవద్దు జైట్లీ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించవద్దని మోదీని కోరారు. తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నానని జైట్లీ వివరించారు. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కూడా జైట్లీ దూరంగా ఉన్నారు. కాగా కాన్సర్తో బాధపడుతున్న జైట్లీ జనవరిలో న్యూయార్క్లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్ గోయల్ జైట్లీ స్థానంలో బాధ్యతలను నిర్వహించారు. ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్ను కూడా గోయల్ ప్రవేశపెట్టారు. జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్లో ఉండే అవకాశాలు లేవని ఇదివరకే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్లో చేరారు. ఎన్నికల అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. జైట్లీ తప్పుకోవడంతో నూతన మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా బీజేపీలో సీనియర్ నేత అయిన జైట్లీ.. మంత్రివర్గంలో లేకపోవడం లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణిడిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా జైట్లీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీలోనే కాదు ప్రధాని మోదీకి జైట్లీ అత్యంత సన్నిహితుడు. ఆర్థిక మంత్రిగానే కాకుండా న్యాయవాది కావడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎన్నో కేసుల్లో లీగల్ సలహాదారుడిగా జైట్లీ వ్యవహరించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు రాజ్యాంగ సవరణ చేయకుండా.. కేవలం పార్లమెంట్ ఆమోదంతో చట్టాన్ని రూపొందించవచ్చని జైట్లీ చేసిన సూచన బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపకల్పనలో కూడా జైట్లీ పాత్ర ఎంతో ఉంది. -
జైట్లీ అనారోగ్యంపై అవన్నీ వదంతులే
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు అబద్ధం, నిరాధారాలని కేంద్రం కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని మీడియాను కోరింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం, తదితర కీలక పరిణామాల నేపథ్యంలో అరుణ్ జైట్లీ బయటకు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను ప్రభుత్వ ప్రతినిధి సితాన్షు కర్ ట్విట్టర్లో ఖండించారు. ‘కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఒక వర్గం మీడియాలో వస్తున్న కథనాలు అసత్యం, నిరాధారాలు. ఇలాంటి వదంతులకు మీడియా దూరంగా ఉండాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, జైట్లీని సంప్రదించేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్లో ఉండే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్లో చేరారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయినప్పటికీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. ‘నా మిత్రుడు జైట్లీ అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ వదంతులు. శనివారం సాయంత్రమే ఆయన్ను కలిశాను. ఆయన కోలుకుంటున్నారు. తన మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులతో శుక్రవారం జైట్లీ తన నివాసంలో సమావేశం నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి. -
ఎన్డీయేది అద్భుత విజయం: జైట్లీ
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే అద్భుత విజయం సాధించిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం వ్యాఖ్యానించారు. వారసత్వపాలన, రాచరిక పాలన, కులాల ఆధారిత రాజకీయాలను ప్రజలు ఈ ఎన్నికల్లో తిరస్కరించారని అన్నారు. పూర్తి మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం చేపడుతుందని ఆయన చెప్పారు. అసత్య ప్రచారాలతో ప్రభుత్వంపై విపక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైనట్టుగానే ఫలితాలు సాధించామని తెలిపారు. ‘అద్భుత విజయాన్ని అందించిన సందర్భంగా ప్రధాని మోదీకి, ఎన్డీ యే, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నాను’అని ఆయన చెప్పారు. ఈవీఎంలను అనుమానించడం, వీవీ పాట్ల లెక్కింపునకు డిమాండ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని చులకన చేసేందుకు యత్నించిన విపక్షాలను దుయ్యబట్టారు. విజయానికి తోడ్పాటునందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
మళ్లీ బీజేపీ గెలిస్తే..ఆర్థికమంత్రి ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టనుందంటూ ఎగ్జిట్ పోల్ అంచనాలు భారీగా నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ ఏర్పడితే ఆర్థికమంత్రిగా ఎవరు ఉంటారు? అనారోగ్య సమస్యలతో ఇటీవల ఇబ్బందులు పాలైన ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన పదవిని నిలబెట్టుకుంటారా? ఈ ప్రశ్నలు ఆర్థిక, వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మోదీ కాబినెట్లో కీలకమైన నాయకుడు, న్యాయవాది, ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీకే మళ్లీ ఆర్థికమంత్రి పగ్గాలు అప్పగించే అవకాశం వుందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా, అనుకోని పరిస్థితుల్లో రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ (54)కు ఆర్థికమంత్రిత్వ శాఖ బాధ్యతలిచ్చే అవకాశం ఉందని మరికొందరు భావిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు జైట్లీ స్థానంలో తాత్కాలిక ఆర్థికమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన ఆయనకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని అంచనా. ప్రధానమంత్రి కార్యాలయం ద్వారానే కీలక నిర్ణయాలుంటాయి గనుక, ఆర్థికమంత్రి ఎవరనే పట్టింపు పెద్దగా ఉండదని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నావిస్ అభిప్రాయపడ్డారు. ఎన్డీఏ లేదా ఎన్డీయేతర ప్రభుత్వమా అనేదే స్టాక్మార్కెట్లకు కీలకమన్నారు. మరోవైపు ఆర్థికమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టినా..కత్తిమీద సామేనని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి సంవత్సరాల్లో తక్కువ చమురు ధరలు పెరగడంతో, 2018 చివరి నాటికి వృద్ధిరేటు 6.6 శాతానికి పడిపోయింది. ఇంకా గ్రామీణ వినియోగ డిమాండ్ తగ్గుముఖం పట్టడం, పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్గా మారాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికలు ఏడుదశల్లో పూర్తి చేసుకుంది. ఈ నెల 23, గురువారం వెలువడనున్న ఈ ఫలితాలపై స్వర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
‘వారి పేర్లు చెబితే ఓట్లు రాలవు’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ బీజేపీలో నూతనోత్తేజం నింపాయి. కుటుంబం నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి పతనం తప్పదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీ, నెహ్రూ కుటుంబ కార్డు ఎంతోకాలం పనిచేయదని తేటతెల్లమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఆ కుటుంబం లేకపోతే వారి సభలకు జనాలు కరువవుతారని, ఆ కుటుంబాన్ని ముందు నిలిపితే మాత్రం ఓట్లు రావని జైట్లీ ఎద్దేవా చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజల ఆలోచనాసరళికి అద్దం పడతాయని, మే 23న వెల్లడయ్యే ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్పై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 2014లో వెల్లడైన ఫలితాలే 2019లోనూ పునరావృతం కానున్నాయని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశం లేదని, ప్రజలు విస్పష్ట తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. అనైతిక కూటములతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది వారికి తెలుసునని వ్యాఖ్యానించారు. ప్రజలు సామర్ధ్యం చూసి ఓటేస్తారని, కుటుంబ పేర్లను చూసి కాదని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార సరళిని సమర్ధిస్తూ జైట్లీ పేర్కొన్నారు. -
మాయావతిపై విరుచుకుపడ్డ అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నా రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మాయావతి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగిన మాయావతి ప్రజా జీవితానికి అనర్హురాలని జైట్లీ ఘాటుగా సమాధానమిచ్చారు. ఈ మేరకు జైట్లీ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా మోదీని చూసి బీజేపీ మహిళా నేతలు వణుకుతున్నారంటూ మాయావతి విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన భార్యకు దూరంగా ఉంటున్న ప్రధాని మోదీ...తమ భర్తల నుంచి ఎక్కడ దూరం చేస్తారేమోనని అని బీజేపీ మహిళా నేతలు భయపడుతున్నారని మోదీపై ఆమె వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం విదితమే. కాగా దళిత మహిళకు జరిగిన అన్యాయంపై స్పందించని మోదీ.. పార్టీలోని మహిళా నేతలకు ఎలా గౌరవం ఇస్తారని మాయావతి ప్రశ్నలు సంధించారు. మోదీ ప్రభుత్వం పనికిమాలిన రాజకీయాలు చేస్తుందని, రాజకీయాల్లో లబ్ధి పొందేందుకే అల్వార్ ఘటనపై మోదీ స్పందించడం లేదని మాయావతి పేర్కొన్నారు. మరోవైపు నరేంద్ర మోదీ కూడా మాయవతిపై విరుచుకుపడ్డారు. రాజస్తాన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాయావతి మద్దతు ఉపసంహరించుకోవాలని ప్రధాని సవాల్ విసిరారు. ఇక అల్వార్ గ్యాంగ్రేప్ ఘటనపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రాజస్తాన్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ, అత్యాచార ఘటనను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటనకు కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలని అన్నారు. కాగా భర్తతో కలిసి ప్రయాణం చేస్తున్న ఓ దళిత మహిళపై గత నెల 26న అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి...దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. -
ఐఎన్ఎస్ విరాట్లో వారసుల జల్సా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత నావికా దళ ఆస్తులను గాంధీ కుటుంబం దుర్వినియోగం చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ను తమ కుటుంబం విహారం కోసం వాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించిన మరుసటి రోజే ఇదే అంశంపై జైట్లీ ట్వీట్ చేశారు. పనిమంతులు (కామ్దార్) దేశ నావికా సంపత్తిని ఉగ్రవాదులపై దాడులు చేసేందుకు ఉపయోగిస్తే వారసులు (నామ్దార్) వాటిని కుటుంబ సభ్యులతో జల్సా చేసేందుకు వ్యక్తిగత విహారానికి వాడుకుంటారని జైట్లీ ట్వీట్ చేశారు. అంతకుముందు భోఫోర్స్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ రాజీవ్ గాంధీని ప్రధాని మోదీ అవినీతిలో నెంబర్ వన్ అని వ్యాఖ్యానించడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. -
మసూద్ వ్యవహారం మా ఘనతే : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ను ప్రశంసించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి, ఉగ్రవాదంపై రాజీలేని పోరుతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్లో భారత వైమానిక దాడుల వంటి పరిణామాల అనంతరం చైనా వైఖరిలో వచ్చిన మార్పులు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. మసూద్ అజర్ వ్యవహారంలో విపక్షాల తీరును జైట్లీ తప్పుపట్టారు. దేశం విజయం సాధిస్తే అది భారతీయులందరి విజయంగా పరిగణించాలని అన్నారు. ఇది భారతీయులందరూ గర్వించదగిన పరిణామం అయితే, విపక్షంలో కొందరు ఈ దౌత్యవిజయంలో పాలుపంచుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటామని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘డిగ్రీ లేకుండానే ఎం.ఫిల్ చేశాడా?!’
న్యూఢిల్లీ : ఓ వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా స్మృతి ఇరానీ గురించిన చర్చే నడుస్తోంది. స్మృతి డిగ్రీ పూర్తి చేయలేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే గతంలో సమర్పించిన నివేదికలో మాత్రం ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారాన్ని పొందుపర్చారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్మృతి ఇరానీ నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. స్మృతి ఇరానీకి మద్దతిస్తూ ఆమె తరఫున వకల్తా పుచ్చుకున్నారు. స్మృతి ఇరానీ డిగ్రీ చేయలేదు సరే.. మరి మీ నాయకుడు మాస్టర్స్ చేయకుండానే ఎం.ఫిల్ పూర్తి చేశాడు. దీనికి ఏం సమాధానం చెప్తారంటూ అరుణ్ జైట్లీ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే స్మృతి ఇరానీ తన ఎన్నికల అఫిడవిట్లో డిగ్రీ పూర్తి చేయలేదని పేర్కొనడంతో, ఇంతకాలం ఆమె విద్యార్హతలపై తలెత్తిన వివాదం కొలిక్కి వచ్చింది. ఇన్నాళ్ల నుంచి తన డిగ్రీ పూర్తి అయ్యిందని స్మృతి చేసిన వాదనలు తప్పుగా నిరూపణ అయ్యాయి. దాంతో కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది.. ఎన్నికల కమిషన్ స్మృతి ఇరానీ నామినేషన్ని తిరస్కరించాలంటూ డిమాండ్ చేశారు. స్మృతి ఇరానీ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. -
ఐటీ దాడులు కక్షపూరితం కాదు : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి సాధారణ చర్యలనైనా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా పరిగణించడం పరిపాటైందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఐటీ దాడులపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై చట్టబద్ధమైన చర్యలు చేపట్టడం రాజకీయ కక్షసాధింపు ఎంతమాత్రం కాదని జైట్లీ బుధవారం ఫేస్బుక్ పోస్ట్లో పేర్కొన్నారు. అవినీతికి పాల్పడి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారంటూ సమర్ధించుకోవడం సరైంది కాదని దుయ్యబట్టారు. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టే ఎలాంటి చర్యనైనా రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొనడం విపక్షాలకే చెల్లిందని విమర్శించారు. కర్నాటక, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవల పలువురు ప్రముఖులపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్లో సీఎం కమల్నాధ్ సంబంధీకులపై జరిగిన దాడుల్లో రూ 150 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయని అధికారులు వెల్లడించారు. -
జీఎస్టీ వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2018–19) వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈకాలంలో సగటున నెలకు 9.2 శాతం వృద్ధి రేటును సాధించి రూ.98,114 కోట్లుగా నమోదైనట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. ఈఏడాది మార్చిలో అత్యధికంగా రూ.1.06 లక్షల కోట్లు వసూళ్లు అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. తయారీ, వినియోగం గణనీయంగా పెరుగుతుందనడానికి ఇది సంకేతమని అన్నారయన. అనేక వస్తు, సేవలపై రేట్లు భారీగా తగ్గినప్పటికీ.. పండుగల సీజన్, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ఏప్రిల్, అక్టోబర్, జనవరి, మార్చి నెలల్లో లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం లక్ష్యం విషయానికి వస్తే.. కేంద్ర జీఎస్టీ 6.10 లక్షల కోట్లు, పరిహార సెస్ రూ.1.01 లక్షల కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,000 కోట్లు. మార్చిలో భారీ రిటర్న్స్... జీఎస్టీ అమల్లోకి వచ్చిన జూలై 1, 2017 నుంచి ఇప్పటి వరకు మునుపెన్నటూ లేని విధంగా ఒక్క మార్చిలోనే 75.95 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మార్చి నెల్లో కేంద్ర జీఎస్టీ రూ.20,353 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.50,418 కోట్లు, సెస్ రూ.8,286 కోట్లు వసూలు కాగా.. మొత్తం కలిపి రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు నెలకొంది. -
జైట్లీకి ఎకానమీ గురించి ఏమీ తెలీదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. గత ఐదేళ్లలో చేపట్టిన నిర్ధిష్ట ఆర్థిక విధానాలు, నిర్ణయాలు తనను మెప్పించలేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా, దాన్ని అమలుపరిచిన తీరు సరిగా లేదని పెదవివిరిచారు. జీఎస్టీ అమల్లో ఉన్నా ఇప్పటికీ చాలా పన్నులున్నాయని, వాటిపై స్పష్టత కొరవడిందని అన్నారు. జైట్లీకి ఎకనమిక్స్ అంటే తెలియదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రితో తనకున్న అనుబంధం గురించి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రహ్మణ్య స్వామిని అడగ్గా.. జైట్లీ తనకు తెలియదంటూ అసలు జైట్లీ, చిదంబరంలు ఆర్ధికవేత్తలు కాదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన మన్మోహన్ సింగ్ మాత్రం ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఎకనమిక్స్ తెలియకుండా ఆర్థిక మంత్రులు అయిన వాళ్లున్నారని జైట్లీ, చిదంబరంలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ తిరిగి అధికార పగ్గాలు చేపడతారని సుబ్రహ్మణ్య స్వామి ధీమా వ్యక్తం చేశారు. మోదీ బ్రాండ్ కంటే తాము నమ్మే హిందుత్వ, జాతీయతావాదం వంటి అంశాలే బీజేపీని విజయతీరాలకు చేర్చుతాయని చెప్పుకొచ్చారు. 2014లోనూ మోదీ బ్రాండ్ లేదని, అది కేవలం మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు. కాగా ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. -
‘భారత్లో ఉండాలా.. లేదా అనేది నిర్ణయించుకుంటాం’
కశ్మీర్ : జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ని భారత్తో కలిపి ఉంచుతున్న వంతెనని, దానిని తొలగిస్తే భారత్లో అంతర్భాగంగా ఉండాలా, వద్దా అనే అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. ఇటీవల అరుణ్ జైట్లీ ఆర్టికల్ 35ఏ కొనసాగింపుపై పునరాలోచించాలంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా మెహబూబా ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఉన్న కశ్మీర్ భారత్తో కలిసి ఉందంటే.. దానికి కేవలం ఆర్టికల్ 370నే కారణమని తెలిపారు. దాన్ని తొలగిస్తే.. భారత్తో కశ్మీర్ కలిసి ఉండే విషయంలో పునరాలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆర్టికల్ 370 జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగ బద్ధంగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోంది. కాగా గతంలో కూడా మెహబూబా ముఫ్తీ ఆర్టికల్ 35ఏ, అలాగే ఆర్టికల్ 370 తొలగింపు అంశంపై సీరియస్గానే స్పందించారు. గత సంవత్సరం కూడా ఆర్టికల్ 35ఏను తొలగిస్తే కశ్మీర్లో జాతీయ జెండా పట్టుకునేవారు కూడా ఉండరని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 35 ఏ జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో నివసించే శాశ్వత నివాసితులకు సంబంధించిన విశేష అధికారాలు కల్పించింది. -
గోయల్.. ‘జెట్’ దిగెన్!
ముంబై: కొన్ని నెలలుగా కొనసాగుతున్న జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి పరిష్కారం దొరికింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యలను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్కు బ్యాంకులు తక్షణమే రూ.1,500 కోట్ల మేర నిధులను అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ చైర్మన్ పదవి నుంచి, కంపెనీ బోర్డు నుంచి నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితాగోయల్ తప్పుకున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ రూపొందించిన పరిష్కార ప్రణాళికలో భాగమే ఇది. ఈ ప్రణాళికకు సోమవారం అత్యవసరంగా సమావేశమైన జెట్ ఎయిర్వేస్ బోర్డు ఆమోదం తెలిపింది. మధ్యంతర నిధుల సాయం పొందడమే ఈ సమావేశం ప్రధాన ఎజెండాగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా జెట్ ఎయిర్వేస్కు చెందిన 80కు పైగా విమానాలు సర్వీసులు నడపలేని పరిస్థితుల్లో నిలిచిపోయిన విషయం విదితమే. నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్, ఎతిహాద్ ఎయిర్వేస్ పీజేఎస్సీ నామినీ డైరెక్టర్ కెవిన్ నైట్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి వైదొలిగారు. కంపెనీలో ఎతిహాద్కు 24 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. డెట్ ఇనుస్ట్రుమెంట్ల జారీ ద్వారా బ్యాంకులు రూ.1,500 కోట్లు అందించనున్నాయి. జెట్ ఎయిర్వేస్ బ్యాంకులకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలను చెల్లించాల్సి ఉంది. దీంతో 11.4 కోట్ల షేర్లను బ్యాంకులకు జారీ చేయడం ద్వారా రుణాన్ని ఈక్విటీగా కంపెనీ మార్చనున్నది. దీంతో బ్యాంకులకు సంస్థలో నియంత్రిత వాటా 51 శాతం లభిస్తుంది. ప్రమోటర్ నరేష్ గోయల్ వాటా ప్రస్తుతమున్న 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గుతుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణకు మధ్యంతర మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మెకెన్సీ అండ్ కో సహకారంతో బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణ కింద ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రమోటర్లకు చెందిన ఇద్దరు నామినీలు, ఎతిహాద్ ఎయిర్వేస్ తరఫున ఒక నామినీ జెట్ ఎయిర్వేస్ బోర్డులో కొనసాగుతారని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఉద్యోగుల్లో ఆందోళన మరోవైపు జనవరి నుంచి ఉద్యోగులకు జెట్ ఎయిర్వేస్ వేతనాలను చెల్లించడం లేదు. డిసెంబర్ నెలకు సంబంధించి కూడా కేవలం 12.5 శాతం వేతనాలనే చెల్లించింది. దీంతో పైలట్లు, ఇంజనీర్లు, ఇతర కీలక విధుల్లోని ఉద్యోగులు ఇతర విమానయాన సంస్థల్లో ఉపాధి వెతుక్కుంటున్న పరిస్థితి ఉంది. ‘‘మాకు కూడా ఆర్థిక బాధ్యతలు ఉన్నాయి. ఎయిర్లైన్ ఒక్కసారిగా కుప్పకూలితే ఏమవుతుందన్న భయం ఉంది. మా బకాయిలు మార్చి 31 నాటికి చెల్లించాలి. అలాగే, మా కంపెనీకి సంబంధించి రోడ్మ్యాప్ సిద్ధం కావాలి’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వలైని పేర్కొన్నారు. విషాద దినం: అజయ్సింగ్ దేశ విమానయాన రంగానికి ఇదొక విషాద దినంగా స్పైస్జెట్ చీఫ్ అజయ్సింగ్ వ్యాఖ్యానించారు. నరేష్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాల్సి రావడంతో అజయ్సింగ్ ఇలా స్పందించారు. ప్రపంచస్థాయి ఎయిర్లైన్ సంస్థను ప్రారంభించి నరేష్ గోయల్, అనితా గోయల్ భారత్ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. విమానయాన సంస్థలను పోటీ పడలేకుండా చేస్తున్న నిర్మాణాత్మక సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు విధాన నిర్ణేతలకు ఇదొక మేల్కొలుపుగా అభివర్ణించారు. వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. షేరు పరుగు... గోయల్ వైదొలగిన వార్తలతో జెట్ షేరు 17 శాతానికి పైగా పెరిగింది. బీఎస్ఈలో చివరికి 12.69 శాతం లాభంతో రూ.254.50 వద్ద స్థిరపడింది. బ్యాంకుల నిర్ణయం పట్ల జైట్లీ సంతోషం న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ప్రభుత్వరంగ బ్యాంకులు తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులు స్వప్రయోజనాలతోపాటు, ప్రజా ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకున్నట్టు చెప్పారు. ‘‘మరిన్ని విమానాలు, ఎయిర్లైన్స్ భారత్కు అవసరం. లేదంటే చార్జీలు పెరిగిపోతాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ కార్యకలాపాలు కొనసాగే విధంగా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడే అవి తమ బకాయిలను వసూలు చేసుకోగలవు. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా’’ అని జైట్లీ పేర్కొన్నారు. మే నాటికి కొనుగోలుదారుల ఖరారు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ జెట్ ఎయిర్వేస్కు సంబంధించి కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులను మే చివరి నాటికి ఖరారు చేస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. ప్రమోటర్ అయిన నరేష్ గోయల్ సైతం త్వరలో జరిగే బిడ్డింగ్లో పాల్గొనేందుకు అర్హులేనని చెప్పారు. బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఈక్విటీగా మార్చడం వల్ల జెట్ ఎయిర్వేస్లో... ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులకు 51 శాతం వాటా ఉండనుంటే, నరేష్ గోయల్ వాటా ప్రస్తుత 50 శాతం నుంచి 25 శాతానికి దిగొస్తుంది. అలాగే, అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ వాటా 24 శాతం నుంచి 12 శాతానికి తగ్గుతుంది. జెట్ ఎయిర్వేస్ విక్రయానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియను జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. అయితే, మే 31 నాటికే ఇది ముగుస్తుందన్న ఆశాభావాన్ని రజనీష్ కుమార్ వ్యక్తం చేశారు. ‘‘ఎవరు రావాలన్నా జెట్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ఏప్రిల్ 9 నాటికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 30 నాటికి బిడ్డింగ్ ముగుస్తుంది. మే నాటికి ఇన్వెస్టర్ను ఖరారు చేస్తాం’’ అని రజనీష్ కుమార్ తెలిపారు. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్ లేదా ఎయిర్లైన్.. నరేష్ గోయల్ అయినా లేదా ఎతిహాద్ అయినా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. బిడ్డింగ్కు ఎవరికీ నిషేధం లేదని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్వేస్ను కాపాడడమే: గోయల్ జెట్లో పనిచేసే 22,000 మంది ఉద్యోగుల కుటుంబ ప్రయోజనాల కంటే తనకు ఏదీ పెద్ద త్యాగం కాదని కంపెనీ చైర్మన్, బోర్డు నుంచి తప్పుకున్న నరేష్ గోయల్ వ్యాఖ్యానించారు. 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్వేస్ను స్థాపించినది నరేష్ గోయల్. 1992 నుంచి కంపెనీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ‘‘నా కుటుంబంలోని 22,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యల కోసమే జెట్ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. నా కుటుంబం నాతో, నా వెనుకనే ఉన్నది. మీరు కూడా నా నిర్ణయానికి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. కొత్త అధ్యాయం ఇప్పుడే మొదలు జెట్ బోర్డు నుంచి తప్పుకున్న నేపథ్యంలో తమ ప్రయాణం ముగిసిపోలేదని, నూతన అధ్యాయం ఇప్పుడే మొదలైందన్నారు గోయల్. రుణ పునర్నిర్మాణ ప్రణాళిక ఆమోదంతో జెట్ బలమైన, స్థిరమైన ఆర్థిక మూలాలపై నిలబడుతుందన్న ఆశాభావాన్ని 22,000 మంది ఉద్యో గులకు రాసిన లేఖలో గోయల్ వ్యక్తం చేశారు. సంస్థకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందన్నారు. -
ఆర్బీఐ చీఫ్ ‘పాలసీ’ చర్చలు...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్దాస్ సోమవారం ఆర్థికమంత్రి అరుణ్జైట్లీతో సమావేశమయ్యారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ఏప్రిల్ 2 నుంచి 4వ తేదీ వరకూ జరగనున్న రానున్న ఆర్థిక సంవత్సరం (2019–2020) మొట్టమొదటి ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్ష తత్సంబంధ అంశాలపై వీరిరువురూ చర్చించినట్లు తెలుస్తోంది. ‘‘ఇది ఒక మర్యాదపూర్వక సమావేశం. ద్రవ్య విధాన సమీక్ష ముందు ఆర్థికమంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ సాంప్రదాయకంగా వస్తోంది’’ అని ఈ సమావేశం తరువాత దాస్ విలేకరులతో అన్నారు. ఏప్రిల్ 11 నుంచీ ఏడు దశల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జరగనున్న ఆర్బీఐ పరపతి సమీక్షా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) మరింత తగ్గుతుందా? లేదా అన్న అంశంపై ప్రస్తుతం అందరిదృష్టీ కేంద్రీకృతమైంది. అయితే ఈ దఫా రేటు తగ్గింపు ఉండకపోవచ్చని, ఇప్పటికే తగ్గించిన రేటు ప్రయోజనం కస్టమర్లకు అందడంపైనే ఆర్బీఐ ప్రస్తుతానికి దృష్టి సారించవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో ఆర్బీఐ గవర్నర్ ఇప్పటికే పలు దఫాల చర్చలు జరిపిన విషయం గమనార్హం. పేమెంట్స్ బ్యాంక్స్ చీఫ్లతో త్వరలో... కాగా ఆర్బీఐ గవర్నర్ ఈ వారం చివర్లో పేమెంట్స్ బ్యాంక్స్ చీఫ్లతో సమావేశం కానున్నారు. నీతీ ఆయోగ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఆర్థికరంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్న భాగస్వాములందరితో భేటీఅవుతున్నాను. సమస్యలను తెలుసుకుంటున్నాను. అభివృద్ధికి సంబంధించి వ్యవస్థలో లిక్విడిటీ(ద్రవ్య లభ్యత) సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నాను. ఇందులో భాగంగా బ్యాంకులు, కార్పొరేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమయ్యాను. ఈ వారంలో పేమెంట్ బ్యాంక్ చీఫ్లతో కూడా సమావేశం కానున్నాను’’ అని దాస్ పేర్కొన్నారు. ఆహార ధరలు పెరుగుతాయ్: గోల్డ్మన్ శాక్స్ కాగా ఆహార ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్ అంచనావేస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల స్పీడ్) 2017 ఏప్రిల్–2018 మార్చితో పోల్చితే 2018–19 ఇదే కాలంలో సగటున కేవలం 0.7 శాతం పెరిగిందని పేర్కొన్న గోల్డ్మన్ శాక్స్, 2019–20లో ఈ రేటు 2 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వాతావరణ ప్రతికూల పరిస్థితులు దీనికి ఒక కారణంగా విశ్లేషించింది. ప్రస్తుతం తమ ఉత్పత్తులకు తక్కువ ధర పలుకుతోందని రైతులు ఆందోళన చేస్తున్నారని, అధిక రిటర్న్ కోసం డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్న బ్రోకరేజ్ సంస్థ, ఆయా పరిణామాలు రానున్న కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు మ రో కారణమవుతుందనీ వివరించింది. రైతులకు తగి న ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం కూడా హామీ ఇస్తున్న విషయాన్ని తన నివేదికలో గోల్డ్మన్ శాక్స్ ప్రస్తావించింది. ద్రవ్య లభ్యత పరిస్థితి బాగుంది: గార్గ్ ఇదిలావుండగా, వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) పరిస్థితి బాగుందని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. కొత్త విధానం... రూపీ–డాలర్ మార్గం ద్వారా వ్యవస్థలోకి ఆర్బీఐ మరో రూ.35,000 కోట్లు ప్రవేశపెట్టడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇందుకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితికిగాను 5 బిలియన్ డాలర్లకు గురువారం వేలం జరగనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వ్యవస్థలో లిక్విడిటీ పరిస్థితులను ఆర్బీఐ ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. -
బీజేపీలో చేరిన గౌతమ్ గంభీర్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ (37) రాజకీయాల్లోకి ప్రవేశించారు. శుక్రవారం కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ నాయకత్వం నచ్చి బీజేపీలో చేరుతున్నానని, పార్టీ సభ్యుడిగా దేశ సంక్షేమం కోసం కృషి చేస్తానని గంభీర్ తెలిపారు. దేశానికి మంచి చేయడానికి, పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఇది మంచి వేదిక అని వెల్లడించారు. అనంతరం గంభీర్ బీజేపీ పార్టీ అధినేత అమిత్ షాను కలుసుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన గంభీర్ బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ కేడర్ విస్తరించిందని, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు. గంభీర్, 2011 ప్రపంచ కప్, 2007 టీ–20 ప్రపంచ కప్లను భారత్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. బిహార్లో మహాకూటమి సీట్ల ఖరారు పట్నా: వచ్చే లోక్సభ ఎన్నికలకుగాను బిహార్లో మహాకూటమి సీట్ల పంపిణీ ఖరారైంది. ఇందులోభాగంగా లోక్తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) అధ్యక్షుడు శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) గుర్తుపై పోటీ చేయనున్నారు. బిహార్లోని మొత్తం 40 లోక్సభ స్థానాలకు గాను 20 చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ, 9 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. మహా కూటమిలోకి కొత్తగా వచ్చి చేరిన ఉపేంద్ర కుష్వాహాకు చెందిన లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) 5, ముకేశ్ సాహ్నికి చెందిన వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 3 స్థానాల్లో పోటీ చేస్తాయి. మాజీ సీఎం జితేన్ రామ్ మాంఝికి చెందిన హిందుస్తా ఆవాల్ మోర్చా(హెచ్ఏఎం) మూడు చోట్ల నుంచి బరిలోకి దిగనుంది. ఆర్జేడీ తనకు దక్కిన 20 చోట్లలో ఒక సీటును సీపీఐ(ఎంఎల్)లిబరేషన్కు ఇచ్చేందుకు అంగీకరించింది. అదేవిధంగా, 11 సీట్లు ఇవ్వాలంటూ మొదట్నుంచీ పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కూడా రాజ్యసభ సీటు ఇచ్చే ఒప్పందంపై 9 స్థానాలకు దిగివచ్చింది. ఆర్ఎల్ఎస్పీకి మహాకూటమిలో చేరడంతో 5 సీట్లు దక్కాయి. బీఎస్పీ తొలి జాబితా లక్నో: బీఎస్పీ 11 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో జేడీఎస్ మాజీ నేత డేనిష్ అలీ పేరు ఉంది. జేడీఎస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అలీ గత వారమే బీఎస్పీలో చేరారు. రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లకుగాను ఎస్పీ– బీఎస్పీ– ఆర్ఎల్డీ కూటమిలో బీఎస్పీ 38 చోట్ల, ఎస్పీ 37, ఆర్ఎల్డీ 3 చోట్ల తమ అభ్యర్థులను పోటీకి ఉంచనున్నాయి. శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ఎంపీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కుటుంబంతో వచ్చి నామినేషన్ వేస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ మధురై నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వస్తున్న ట్రాన్జెండర్ భారతి కన్నమ్మ -
అంతా దుష్ప్రచారమని తేలింది
న్యూఢిల్లీ: హిందూ ఉగ్రవాదం, గోద్రా ఘటన, నీరవ్ మోదీ కేసులపై కొందరు చేసిన దుష్ప్రచారం ఒక్కరోజులోనే బట్టబయటైందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్నారు. బుధవారం సంఝౌతా ఎక్స్ప్రెస్లో పేలుడు కేసులో కింది కోర్టు యూపీఏ ప్రభుత్వం ఆపాదించిన హిందూ ఉగ్రవాదం అభియోగాన్ని కొట్టేసిందనీ, గోద్రా కేసులో మరో వ్యక్తిని దోషిగా తేల్చిందనీ, నీరవ్ మోదీ లండన్లో అరెస్టయ్యాడనీ, ఇవన్నీ ఒకే రోజు జరిగాయని జైట్లీ చెప్పారు. ‘నిజానికి, అబద్ధానికి ఉన్న ప్రాథమిక తేడా ఏంటంటే నిజం నిలిచి ఉంటుంది. అబద్ధం పడిపోతుంది. కొందరు చేసిన దుష్ప్రచారమంతా అబద్ధమని తేలింది. నిజం గెలిచింది’అని జైట్లీ తన బ్లాగ్ పోస్ట్లో పేర్కొన్నారు. -
చట్టాలతో చిట్టా పద్దులు
సాక్షి వెబ్ ప్రత్యేకం : విపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షాలను ముప్పితిప్పలు పెట్ట గల సమర్థమైన నాయకుడు అరుణ్ జైట్లీ. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా అందరికి సుపరిచితులైన జైట్లీ.. కీలకమైన అనేక కేసులను వాదించిన చరిత్ర గల న్యాయకోవిధుడు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకరైన అరుణ్ జైట్లీ... కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీకి నమ్మిన బంటు. మోదీ కేబినెట్లో అత్యంత కీలకమైన శాఖలు చేపట్టిన సమర్థుడైన నేత. న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. కేంద్రమంత్రి, రాజ్యసభ ప్రతిపక్షనేత, క్యాబినేట్ హోదా వంటి అనేక అత్యున్నత పదవులను జైట్లీ అధిరోహించారు. 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జైట్లీ.. అనతికాలంలోనే బీజేపీలో ముఖ్యనేతగా ఎదిగారు. మాజీ ప్రధాని వాజపేయి మంత్రివర్గంలో తొలిసారి కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ జైట్లీకి న్యాయవాద వృత్తిలో విశేష అనుభవం ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో జైట్లీ తొలుత రక్షణ శాఖ, ఆ తరువాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 లోక్సభ ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిథ్యం వ్యవహరిస్తున్నారు. కేంద్రమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సందించడంలో జైట్లీ దిట్ట. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా విశేష అనుభవం ఉండడంతో పార్టీ లీగల్ సెల్కు వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తారు. 2009 నుంచి 2014 మధ్య కాలంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకడి పాత్రను జైట్లీ సమర్థవంతంగా పోషించారు. విపక్ష హోదాలో ఉన్నప్పుడు అధికార పక్షంను ఇరకాట పెట్టడంలో జైట్లీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ప్రత్యర్థిపై వ్యహాలు రచించడంలో దిట్టగా పేరొందిన జైట్లీ.. ఈసారి పార్టీ గెలుపుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో వేచి చూడాలి. రాజకీయ ప్రస్థానం.. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అనేక పోరాటాలకు జైట్లీ నాయకత్వం వహించారు. అత్యవసర పరిస్థితి కాలంలో 19 నెలలు జైలుకు వెళ్ళారు. జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ (ఇప్పటి భారతీయ జనతా పార్టీ) లో చేరారు. న్యాయవాదిగా అనుభవం ఉండటంతో మాజీ ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ హయంలో అరుణ్ జైట్లీ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు. 1991 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తొలిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సమాచార శాఖమంత్రిగా ఆయన సేవలందించారు. పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా వ్యవహరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్సర్ నియోజకవర్గం నుంచి పోటీపడి... కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్కు చైర్మన్కు ఉన్న సమయంలో జైట్లీ అవినీతికి పాల్పడ్డారంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు అప్పట్లో పెద్ద దుమారం చెలరేగాయి. దీంతో కేజ్రీవాల్పై జైట్లీ ఢిల్లీ హైకోర్టులో పరవునష్టం దావావేసి కోర్టుముందు నిల్చోబెట్టారు.. ఐసీఐసీఐ మాజీ సీఈవో చందాకొచ్చర్పై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. కొచ్చర్ వీడియోకాన్ సంస్థకు అక్రమంగా నిధులను మళ్లించారని జైట్లీ ఆరోపించారు. కుటుంబ నేపథ్యం.. అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్త ఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం గుజరాత్లో స్థిరపడ్డారు. ఇతని తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. జమ్మూ కశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి గిరిదాల్ లాల్ కుమార్తె సంగీత జైట్లీని 1982లో వివాహం చేసుకున్నారు. పిల్లలు సోనాలీ జైట్లీ, రోహన్ జైట్లీ. ఇద్దరూ కూడా లాయర్లే కావడం విశేషం. కిడ్నీ సంబందిత వ్యాధితో భాదపడుతున్న జైట్లీ ఇటీవల అమెరికాలో శస్త్ర చికిత్స కూడా తీసుకున్నారు. దాని కారణంగానే 2019 ఓటాన్ ఎకౌంట్ బడ్జెన్ను ప్రవేశపెట్టలేక పోయారు. -సురేష్ అల్లిక -
జల విద్యుత్తుకు కొత్త ‘వెలుగు’!
న్యూఢిల్లీ: దేశంలో జల విద్యుదుత్పత్తిని మరింత పెంచేలా... ఈ రంగానికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు పునరుత్పాదక ఇంధన హోదా ఇవ్వడంతోపాటు, పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన రూ.31,500 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనల్లో రెండు థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్లు సహా జమ్మూకశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించతలపెట్టిన హైడ్రో ప్రాజెక్టు కూడా ఉంది. రుణ సమస్యల్లో చిక్కుకున్న ల్యాంకో గ్రూపునకు చెందిన 500 మెగావాట్ల తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును (సిక్కిం) ప్రభుత్వరంగ ఎన్హెచ్పీసీ కొనుగోలు చేసేందుకు కూడా కేంద్రం అనుమతించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను... సమావేశానంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు తెలిపారు. దేశంలో జలవిద్యుత్ను ప్రోత్సహించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. రెన్యువబుల్ ఎనర్జీ హోదా 25 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులకే ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు హోదా ఇస్తున్నారు. ఈ హోదా ఉంటే ఆర్థిక సహకారం, తక్కువ వడ్డీకి రుణాలు వంటి పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 25 మెగావాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం రెన్యువబుల్ ఎనర్జీ విభాగంలో సోలార్, పవన, 25 మెగావాట్ల వరకు జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టులు కలిపి 74 గిగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనికి అదనంగా 45 గిగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తోడు కానుంది. 2022 నాటికి 175 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. అయితే, భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులక్కూడా ఈ హోదాను కట్టబెట్టడంతో 2022 నాటికి 225 గిగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ విభాగంలో సాధించనుంది. ప్రాజెక్టుల జీవితకాలాన్ని 40 ఏళ్లకు పెంచుకుని, టారిఫ్ రేట్లు తగ్గించుకునేందుకు కూడా ప్రభుత్వ నిర్ణయాలు వీలు కల్పిస్తాయి. రుణాన్ని తిరిగి చెల్లించే కాల వ్యవధి 18 ఏళ్లకు పెరుగుతుంది. ప్రస్తుతం జలవిద్యుత్ టారిఫ్లు ఇతర వనరులతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో ఇకపై ఇవి క్రమబద్ధీకరణ చెందనున్నాయి. భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులు రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను డిస్కమ్లకు విక్రయించగలుగుతాయి. డిస్కమ్లు నిర్ణీత శాతం మేర రెన్యువబుల్ ఎనర్జీని కొనుగోలు చేయాలి. లేదంటే రెన్యువబుల్ ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 200 మెగావాట్ల వరకు ఒక్కో మెగావాట్కు రూ.1.5 కోట్లు, అంతకుమించితే ఒక్కో మెగావాట్కు రూ.కోటి మేర నిధుల సాయానికి కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ల్యాంకో తీస్తా ప్రాజెక్టు ఎన్హెచ్పీసీకి ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ను ఎన్హెచ్పీసీ కొనుగోలు చేసేందుకు సీసీఈఏ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సిక్కింలోని తీస్తా స్టేజ్–6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై ఎన్హెచ్పీసీ రూ.5,748 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఇందులో ల్యాంకో తీస్తా హైడ్రో ప్రాజెక్టు కొనుగోలుకు రూ.907 కోట్లు వ్యయం చేయనుంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనుల పూర్తికి గాను రూ.3,863 కోట్లను ఖర్చు చేయనుంది. 125 మెగావాట్ల నాలుగు యూనిట్లతో కూడిన (500 మెగావాట్లు) ఈ ప్రాజెక్టులో ఏటా 2,400 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. జమ్మూకశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఉన్న చీనాబ్ నదిపై చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ 624 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి రూ.4,287 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా సీసీఈఏ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఎన్హెచ్పీసీ రూ.630 కోట్ల పెట్టుబడులతో వాటా తీసుకోనుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పునాదిరాయి వేసిన విషయం గమనార్హం. థర్మల్ ప్రాజెక్టులు బిహార్లోని బుక్సర్లో ఒక్కోటి 660 మెగావాట్ల రెండు యూనిట్లను రూ.10,439 కోట్లతో ప్రభుత్వరంగ ఎస్జేవీఎన్ అనుబంధ కంపెనీ ఎస్జేవీఎన్ థర్మల్ ప్రైవేటు లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు ఆ ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మార్పులకు కారణమవుతుందని సీసీఈఏ పేర్కొంది. 2023–24 నుంచి ఈ ప్రాజెక్టు పనిచేయడం ఆరంభమవుతుంది. అలాగే, ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో 660 మెగావాట్ల రెండు సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను రూ.11,089 కోట్ల వ్యయ అంచనాలతో ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వాటాల అమ్మకంపై అంతిమ అధికారం కమిటీకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంపై నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు గాను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి అధికారాలను కట్టబెడుతూ సీసీఈఏ నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు విక్రయించాలి, ధర, ఎంత మొత్తం షేర్లను విక్రయించాలన్న నిర్ణయాలను ఈ యంత్రాంగం తీసుకోనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఈ ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) 2017లో ఏర్పాటైంది. ఇందులో రవాణా మంత్రి, సంబంధిత కంపెనీపై అధికారాలున్న శాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు. కేవలం నియమ, నిబంధనలనే ఈ కమిటీ ఇప్పటి వరకు నిర్ణయిస్తుండేది. సీసీఈఏ తాజా నిర్ణయంతో ఇకపై ప్రభుత్వరంగ సంస్థను ఎంత ధరకు విక్రయించాలి, ఎన్ని వాటాలను విక్రయించాలన్న నిర్ణయాలను కూడా ఏఎం తీసుకోనుంది. దీంతో వేగంగా విక్రయం సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ ఆలోచన. పవన్హన్స్, ఎయిర్ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, బీఈఎంఎల్, స్కూటర్స్ ఇండియా, భారత్ పంప్స్ కంప్రెషర్స్, సెయిల్కు చెందిన పలు యూనిట్లలో వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.