అప్పులబాధతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Published Sat, Sep 12 2015 6:53 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

కొత్తూరు (మహబూబ్‌నగర్) : అప్పులబాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సత్యనారయణ(37) తనకున్న ఎకరం భూమితోపాటు గ్రామానికి చెందిన మరో రైతుకు చెందిన ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక గుళికల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement