
61 రోజులు చేపల వేట నిషేధం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సముద్ర తీర ప్రాంతాల్లో 61 రోజల పాటు చేపల వేటను నిషేధిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా తూర్పు తీర ప్రాంతంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేటను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిషేధించిన సమయంలో చేపల వేటకు వెళ్లే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.