
మీరు నేను చేసే శిల్పాలను, కళాకృతులను చూసి, అనుభవ పూర్వకంగా మీరే వాటి గురించి తెలుసుకోండి అంటున్నాడు ఆర్టిస్ట్ హర్షా దురుగడ్డ. కళా ప్రదర్శనల్లో సాధారణంగా చిత్రాలను, శిల్పాలను ముట్టుకోవద్దు అనే సూచనలే ఉంటాయి. ఇందుకు భిన్నంగా హర్షా ‘దయచేసి టచ్ చేయండి’ అని చెబుతున్నాడు. కలప, లోహం, ఫ్లైవుడ్ తదితర సంప్రదాయ ముడి పదార్థాలను మిల్లింగ్, చెక్కడం ద్వారా ఈ కళాకృతులను తయారు చేశారు హర్ష. కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో డిసెంబర్ 7న, సాయంత్రం 6 గంటలకు ‘ఫ్రాగ్మెంట్స్ ఇన్ మోషన్’ పేరుతో ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది.