బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత | Himachal Pradesh Governor Bandaru Dattatreya Falls sick | Sakshi
Sakshi News home page

బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత

Mar 9 2020 2:02 PM | Updated on Mar 9 2020 2:12 PM

Himachal Pradesh Governor Bandaru Dattatreya Falls sick - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ శ్రీనివాస్‌రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్‌ చెక్‌అప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు. (హిమాచల్‌ గవర్నర్‌గా దత్తాత్రేయ)

చదవండి: ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: దత్తాత్రేయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement