hospitalized
-
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత
-
ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ
దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది. మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
మెక్డొనాల్డ్స్లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్డొనాల్డ్స్లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్డొనాల్డ్స్లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
కన్నడ నటుడు దర్శన్కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్పూర్లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు.स्वास्थ्य संबंधित परेशानियों की वजह से आज वीर भूमि भोगनाडीह में आयोजित "मांझी परगना महासम्मेलन" में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शामिल रहूंगा।डॉक्टरों के अनुसार चिंता की कोई खास बात नहीं है। मैं शीघ्र पुर्णतः स्वस्थ होकर, आप सभी के बीच वापस आऊंगा। जोहार ! pic.twitter.com/rUrCzCd7lK— Champai Soren (@ChampaiSoren) October 6, 2024‘‘చంపయ్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్ సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్ బెయిల్పై విడుదలైన తర్వాత చంపయ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్ సోరెన్ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం' -
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
కోల్కతా: టీఎంసీ సీనియర్నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్మెంట్ రూ.లక్ష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ సాయిబాబా హోటల్లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది. కలుషిత బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురైయ్యారు. శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు.ఖమ్మంలో..ఖమ్మం నగరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఒక హోటల్లో వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్లో కల్తిని గుర్తించారు.వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్లో ఫంగస్ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నఇలాంటి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్పత్రి నుంచి అజిత్ డిశ్చార్జ్
ప్రముఖ నటుడు అజిత్ గురువారం ఆస్పత్రిలో చేరడంతో ఆయన గురించి రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అజిత్కు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. త్వరలో మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం విదేశాలకు పయనం కానున్న నేపథ్యంలో ఇదంతా రెగ్యులర్ చెకప్లో భాగం అంటూ అజిత్ కార్యనిర్వాహకుడు పేర్కొనడంతో అభిమానుల మనసులు కుదుటపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే అజిత్ చెవి కింద భాగంలో పల్జ్ అనే చిన్న బుడుపు ఏర్పడింది. దానివల్ల ఎలాంటి బాధ లేకపోయినా వైద్యులు చిన్న శస్త్ర చికిత్స చేసి, దాన్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో అజిత్ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం అజర్బైజాన్కు బయలు దేరనున్నట్లు సమాచారం. కాగా అజిత్ ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి తన ఎక్స్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహోదరుడు, నటుడు అజిత్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్ వేదికగా ప్రియాంక వెల్లడించారు. ‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024 ఇదీ చదవండి: కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు షాక్ -
మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..
ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్కి చెందిన లూసీ వైల్డ్ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు. అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్ మందులతో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే.. ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్ డ్రమ్కి సమస్య ఏర్పడవచ్చు ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
ఆస్పత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు..పుతిన్తో సమావేశం తర్వాతే..
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ. ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్ స్క్వేర్లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది. ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..) -
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. (ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి) -
ఆస్పత్రిలో ప్రముఖ సింగర్.. కుమారుడు చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్స్టాలో పంచుకున్నారు. తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) పాపోన్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాం. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు. ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు. ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా. నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు! నేను ఇప్పుడు చాలా బాగున్నా.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!) కాగా.. పాపోన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ఓం మంత్ర అనే పాట పాడి బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సాంగ్స్ ఆలపించారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Papon (@paponmusic) -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్కు చెంది ఓ గ్లోబో న్యూస్పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
Heeraben Modi: తల్లి చెంతకు నరేంద్ర మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ దగ్గరకు వెళ్లారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్లోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు కూడా. అయితే.. తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు వెళ్లిన ఆయన.. సుమారు గంటపాటు తల్లితో గడిపారు. ఆరోగ్యంగా ఉండమని, అధైర్య పడొద్దని ఆమెకు సూచించారాయన. గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వఘేలా, కౌశిక్ జైన్ సైతం ఆస్పత్రికి వెళ్లారు. 99 ఏళ్ల హీరాబెన్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి తల్లి దగ్గరకు వెళ్లిపోవడం తగ్గినట్లు.. తరచూ ఆయన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ బాధపడడం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయన ఆమె దగ్గరకు వెళ్లారు. అంతేకాదు తన తల్లి వందవ పుట్టినరోజు కోసం ‘మదర్’ అనే బ్లాగ్ను సైతం ఆయన రాశారు. మరోవైపు నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం మైసూర్(కర్ణాటక) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ఫ గాయాలు అయ్యాయి. -
దిగ్గజం పీలే పరిస్థితి విషమం.. వార్తలను ఖండించిన కూతురు
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం హల్చల్ చేయడంతో పీలే కూతురు కెలీ నాసిమెంటో వార్తలను ఖండించింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ హాస్పిటల్లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. "మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తాను" అని నాసిమెంటో ఇన్స్టాలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్ బ్రెజిల్ తన కథనంలో పేర్కొంది. ఇక ఆల్టైమ్ గ్రేట్ ఫుట్బాలర్స్లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్లలో 77 గోల్స్ చేశాడు. -
పిడుగుపాటుకు ఒంటికి అతుక్కున్న స్వర్ణం
ఆదిలాబాద్ రూరల్: పిడుగుపాటుకు మృతి చెందడం.. గాయపడటం సాధారణం. కానీ పిడుగుపాటు వేడికి ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగి పోయి ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమెను ఆస్పత్రిపాల్జేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ పిడుగు పడింది. సమీపంలోనే వ్యవ సాయ పనుల్లో శ్వేత నిమగ్నమై ఉండగా.. పిడుగు పడింది. దీంతో వెలువడిన వేడిమికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. వెంటనే స్థానికులు ఆమెను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప ఆస్పత్రిలో చేరారు. భర్త మాధవన్తో గొడవ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఇంటికే ఆమె పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ కావడంతో చర్చ బయలుదేరింది. భర్త మాధవన్ – దీపల మధ్య ఇప్పటికే పలు మార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భర్తతో గొడవ కారణంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఆమె భర్త మాధవన్ దీనిని ఖండించారు. తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొనడం గమనార్హం. చదవండి: (అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు.. మైక్రోసాఫ్ట్లో 47 లక్షల వేతనం) -
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం
ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ఫోర్స్ బుధవారం అమృత్సర్లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదీ చదవండి: పంజాబ్ ఎన్కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా.. -
జోష్లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్.. అండగా నిలబడిన క్రికెట్ బోర్డు
గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్ బోర్డు(క్రికెట్ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది. కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్మెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్లు, 4 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్పై దాడి.. పరిస్థితి విషమం -
యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్పై దాడి.. పరిస్థితి విషమం
సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది. కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్లు, 4 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘 He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4 — Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022 -
విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..
కురుపాం/విజయనగరం ఫోర్ట్: రాత్రి 10 గంటల వరకు అందరూ ఒక్కచోటే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు... 8వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించారు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కట్ల పాము రూపంలో మృత్యువు గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి గదిలోకి ప్రవేశించింది. వరుసగా నిద్రపోతున్న విద్యార్థుల్లో ముగ్గురిని కాటేసింది. విద్యార్థులు వెంటనే మేల్కొన్నారు. పామును గమనించారు. కేకలు వేయడంతో మిగిలిన విద్యార్థులు కర్రతో దానిని హతమార్చారు. వసతిగృహ సిబ్బంది సహాయంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నా ఒక విద్యార్థి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలో ఉన్న మహా త్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్కుమార్, సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడు పేటకు చెందిన వంగపండు నవీన్లతో పాటు మరో 9 మంది వసతిగృహం డార్మిటరీ గదిలో నిద్రపోతున్నారు. అర్ధారాత్రి తర్వాత కట్లపాము వరుసగా నిద్రపోతున్న రంజిత్కుమార్, వంశీ, నవీన్ల ముక్కు, కంటి, వీపుమీద కాటేసింది. వారు వసతిగృహంలో ఉన్న ప్రిన్సిపాల్ బిర్లంగి సీతరామ్, ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేశారు. వసతిగృహ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనంపై కురు పాం సీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్కుమార్ (13) మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. మహాశివరాత్రికి ఇంటికి వచ్చావు.. అందరితో కలిసి సరదాగా గడిపావు.. పామునోట పడేందుకే వసతిగృహానికి వెళ్లావా అంటూ రంజిత్కుమార్ తల్లి సన్యాసమ్మ విలపిస్తున్న తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. నా ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకున్నాను.. నాకు దేవుడు అన్యాయం చేశాడు.. మంచి వాళ్లనే తీసుకుపోతాడంటూ బోరున విలపిస్తోంది. విద్యార్థి తండ్రి కృష్ణ ఆస్పత్రి వద్దే కుప్పకూలిపోయారు. రంజిత్ మృతితో వసతిగృహంతో పాటు స్వగ్రామం దళాయిపేటలో విషాదం అలముకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా: కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేలా సేవలందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి మృతి బాధాకరం పాముకాటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఒక విద్యార్థి మృతిచెందడం బాధాకరమన్నారు. రంజిత్కుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. పాముకరిచిందని విద్యార్థులు తెలిపిన వెంటనే ప్రిన్సిపాల్ స్పందించారన్నారు. విద్యార్థులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బీసీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిందని, అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సదుపాయాలతో కూడిన శాశ్వత వసతి కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు. -
ఆస్పత్రి పాలైన బోల్సోనారో.. కోలుకోవద్దంటూ నెటిజనుల ఆగ్రహం!
సావో పాలో: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు తద్వారా బ్రెజిల్లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్ మీడియాలో కోరుకుంటుండడం గమనార్హం. - Comecei a passar mal após o almoço de domingo. - Cheguei ao hospital às 03h00 de hoje. - Me colocaram sonda nasogástrica. - Mais exames serão feitos para possível cirurgia de obstrução interna na região abdominal. pic.twitter.com/NPgv6HwoHj — Jair M. Bolsonaro (@jairbolsonaro) January 3, 2022 సంబంధిత వార్త: బోల్సోనారో ఓ ‘రక్తపిశాచి’ అంటూనే.. నిరసనకారుల ఘోర తప్పిదం -
వేకువన పెళ్లి.. సాయంత్రం ప్రమాదం.. అదృష్టవశాత్తు..
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): సోమవారం వేకువన పెళ్లి చేసుకున్న ఓ జంట అదే రోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు గాయాలతో ఇరువురూ బయట పడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో అదే గ్రామం వెలమ తోటకు చెందిన జి.శంకరరావు, టెక్కలి మండలం తలగాంకు చెందిన ఢిల్లీశ్వరి(స్వప్న)కు సోమవారం వేకువన 4 గంటలకు వివాహమైంది. వివాహం అనంతరం అత్తవారింటిలో అడుగు పెట్టేందుకు నూతన వధూవరులు కారులో వచ్చారు. ఈ కార్యక్రమం అయ్యాక తిరుగు ప్రయాణంలో గట్లపాడు సమీపంలోని జాతీయ రహదారిపై ముందున్న లారీని అధిగమించే ప్రయత్నంలో కారు మరో లారీని ఢీ కొట్టింది. దీంతో కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వధూవరులకు గాయాలు కాగా.. వరుడు శంకరరావుకు బలమైన దెబ్బలు తగిలాయి. వీరితో పాటు పెళ్లి కుమార్తె మేనత్త జ్యోతి, డ్రైవర్ బాలాజీలు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బీఎస్ఎఫ్ జవాను మాధవరావు అటుగా వెళ్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆయన కారు నుంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు. వధూవరుల వద్ద ఉన్న ఆభరణాలను జాగ్రత్త చేసి వారికి అప్పగించారు. క్షతగాత్రులు ప్రస్తుతం నరసన్నపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: Karimnagar: బ్యూటీషియన్ అదృశ్యం -
ఆసుపత్రిలో చేరిన దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్
Pele Hospitalized For Treatment Of Colon Tumor: గత కొంతకాలంగా కోలన్ ట్యూమర్తో బాధపడుతున్న బ్రెజిల్ దిగ్గజ ఫుట్బాలర్ పీలే(81) ఆసుపత్రిలో చేరాడు. సంవత్సర కాలంగా పీలే పెద్ద పేగు కణితి సమస్యతో బాధపడుతున్నట్లు ఆయన కుమార్తె పేర్కొంది. త్వరలోనే పీలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీలే ఈ ఏడాది సెప్టెంబర్లో కణితి తొలగింపుకు సంబంధించిన శస్త్రచికిత్సను చేయించుకున్నారు. ఆ సమయంలో ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇదిలా ఉంటే, మూడు ప్రపంచ కప్లు సాధించిన ఏకైక ఫుట్బాలర్గా పీలే పేరిట చెక్కు చెదరని రికార్డు నమోదైవుంది. 1958, 1962, 1970 ప్రపంచకప్ల్లో పీలే బ్రెజిల్ను ప్రపంచ ఛాంపియన్గా నిలిపాడు. బ్రెజిల్ తరఫున 92 మ్యాచులు ఆడిన పీలే 77 గోల్స్ చేశాడు. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది. చదవండి: లెజెండ్స్ క్రికెట్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా అమితాబ్.. -
ఆస్పత్రిలో చేరిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. విశ్రాంతి లేకుండా పోరాడుతూ ఆ నొప్పిని..
ముంబై: మెడనొప్పి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం తెలిపారు. గత రెండేళ్లుగా కోవిడ్–19పై విశ్రాంతి లేకుండా పోరాడుతూ మెడ నొప్పిని పట్టించుకోలేదని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరైన చికిత్స కోసం, వైద్యులు రెండు–మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించడంతో ఆస్పత్రిలో చేరుతున్నానని చెప్పారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఏ ఆస్పత్రిలో చేరుతున్నారనే విషయాన్ని ప్రకటనలో సీఎం వెల్లడించలేదు. చదవండి: (దావూద్ అనుచరుడితో ఫడ్నవీస్కు లింకు) -
కాటేసిన పాముతో ఆస్పత్రికి.. అది చూసి డాక్టర్లు షాక్
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి కూతురు సంచనశ్రీ (5) మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆటలాడుతుండగా చిన్న సైజు కట్ల పాము కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికెళ్లారు. పామును వైద్యులకు చూపించడంతో అక్కడివారు భయపడ్డారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు. చదవండి: (ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి..) -
ఆ ఇంజక్షన్ ఖరీదు పదహారు కోట్లు.. ఇస్తేనే ప్రాణం నిలబడేది ?
వయస్సు పదహారు నెలల పసితనం... సమస్య అంతు చిక్కని వ్యాధి.. పరిష్కారం రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్. ఇప్పుడు కావాల్సింది మనందరి సహకారం. అవును 16 నెలల పాలబుగ్గల ఆయాన్ష్ బతకాలంటే మనవంతు సాయం తప్పనిసరిగా మారింది. పన్నెండేళ్లకు వందన, మదన్ దంపతులకు పెళ్లై చాలా ఏళ్లైనా పిల్లలు కలగలేదు. టీసీఎస్ ఉద్యోగిగా పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేని ఆ కుటుంబానికి సంతాన లేమి ఒక్కటే తిరని లోటుగా మారింది. పండండి బిడ్డ కోసం తిరగని ఆస్పత్రి లేదు మొక్కని దేవుడు లేడు. చివరికి వారి మొర ఆలకించి పన్నెండేళ్ల తర్వాత వారికి మగ బిడ్డ కలిగాడు. ఆ బిడ్డకు ఆయాన్ష్గా పేరు పెట్టుకుని ఆ పిల్లాడే లోకంగా .. అతని ఆలనా పాలానే జీవితంగా వందన బతుకుతోంది. గుండె పగిలే నిజం ఏడాది గడిచిన తర్వాత కూడా తల్లి పాలు తాగడానికి ఊపిరి తీసుకోవడానికి ఆయాన్ష్ ఇబ్బంది పడేవాడు. అనుమానం వచ్చిన ఆ దంపతులు వెంటనే వైద్యులను సంప్రదిస్తే గుండె పగిలే నిజం తెలిసింది. ఆయాన్ష్ను పరీక్షించిన డాక్టర్లు.. స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. పది వేల మంది పిల్లలలో ఒక్కరికి ఈ తరహా సమస్య వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డవారు సరిగా కూర్చోలేరు, నిలబడలేరు. ఎప్పుడూ నేలపైనే పడుకుని ఉంటారు. అలాగే వదిలేస్తే వేగంగా మృత్యువుకి చేరువ అవుతారు. రూ. 16 కోట్లు స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్ఎంఏ) చికిత్సకు ఔషధాలు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేవు. వైద్యులు అంతా గాలించగా కేవలం అమెరికాలోనే జోల్జెన్స్మా అనే ఔషధం అందుబాటులో ఉన్నట్టుగా తేలింది. ఆ ఇంజక్షన్ ధర 2.14 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల పదహారు కోట్ల రూపాయాలు. అంత ఖరీదైన మందు కొనే స్థోమత వందనా మదన్ దంపతులకే కాదు మన దేశంలో ఏ మధ్య తరగతి కుటుంబానికి కూడా ఉండదు. (Advertorial) చేయిచేయి కలుపుదాం ఓవైపు కన్న కొడుకును కబళిస్తున్న వ్యాధి, మరోవైపు చికిత్సకు అవసరమైన డబ్బు సర్థుబాటు చేయలేక ఆ తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. ఆయాన్ష్ మరణానికి చేరువ అవుతున్నారు. వారి ఇబ్బందిని చూసి బాలుడి చికిత్సకు అవసరమైన ఔషధం కొనేందుకు ఫండ్ రైజింగ్ సంస్థ కెట్టో ప్రయత్నాలు ప్రారంభించింది. సోనూసూద్, ఫర్హాన్ అక్తర్ వంటి సినీ ప్రముఖులను, కొందరు వ్యాపారవేత్తలను సంప్రదించింది. కొంత వరకు డబ్బు సమకూరింది. అయితే కావాల్సిన మొత్తం రూ. 16 కావడంతో ఇంకా సాయం కావాల్సిన అవసరం ఉంది. మనం చేసే చిన్న సాయం చిన్నారి ఆయాన్ష్ ఈ అందమైన లోకాన్ని చూసే అవకాశం కల్పిస్తుంది. ఆయాన్కి సాయం చేయాలనుకునే వారు కింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి -
10 రోజులుగా ఎక్కిళ్లు.. ఆస్పత్రి పాలైన అధ్యక్షుడు
బ్రసీలియా: జైర్ బోల్సోనారోను 10 రోజులుగా వెక్కిళ్లు వేధించసాగాయి. ఆయన పేగులో సమస్య తలెత్తిందని.. ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స అవసరమని బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బోల్సోనారోను పరీక్షల కోసం సావో పాలోలోని విలా నోవా స్టార్ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కార్యాలయం బుధవారం పేర్కొంది. ఈ ఘటనపై బోల్సోనారో కుమారుడు ఫ్లావియో మాట్లాడుతూ.. తన తండ్రి బోల్సోనారోను బ్రసిలియాలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా బోల్సోనారో సావో పాలో ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. ఆస్పత్రిలో బెడ్పై పడుకుని పడుకుని, సెన్సార్లు, కేబుళ్లు అమర్చి చికిత్స అందిస్తున్న ఫోటోను పేస్బుక్లో "ప్రతి ఒక్కరి మద్దతు, ప్రార్థనలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అంటూ పోస్ట్ చేశారు. కాగా జైర్ బోల్సోనారో 2018లో ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై కత్తితో దాడి చేశారు. ఇక కరోనా మహమ్మారి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. కేసులు, మరణాలు పెరగడానికి కారకుడు అవుతున్నాడంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొవాగ్జిన్ డీల్కు సంబంధించి ముడుపుల ఆరోపణలపై, ముఖ్యంగా ఆ ఆరోపణల్లో అధ్యక్షుడు జైర్ బొల్సొనారో కార్యాలయం పాత్రపై ప్రత్యేక దృష్టి పెట్టి దర్యాప్తు చేయాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు, బ్రెజిల్ అత్యున్నత విచారణ&దర్యాప్తు బృందాలను ఆదేశించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఖండించారు. అయితే ఇటీవలి జరిగిన ఎన్నికల్లో అతనిపై జనాదరణ తగ్గిపోతోంది. దీంతో ఇది వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇక జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు బ్రెజిల్లో 5,35,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ యాదవ్
లక్నో: సమాజ్వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ గురువారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనను గురుగ్రామ్లోని మెదంత ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యానికి గురైన ములాయం సింగ్ యాదవ్ని ఆస్పత్రిలో చేర్చి అన్ని పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: నేను ములాయం సింగ్ -
కరోనా: ఆసుపత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్
ముంబై: క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరు రోజుల తర్వాత సచిన్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్నిసచిన్ స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. "అందరికి నమస్కారం.. నేను బాగానే ఉన్నా.. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఇంటికి తిరిగి వస్తాను. నాకోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచకప్ సాధించి ఈరోజుతో సరిగ్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా భారతీయులందరికీ, నా తోటి ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.'' అంటూ తెలిపాడు. కాగా సచిన్కు మార్చి 27న కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించడంతో అప్పటినుంచి హోం ఐసోలేషన్లో ఉన్నాడు. సచిన్ కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సరీస్లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. సచిన్తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే టీమిండియా రెండవ ప్రపంచకప్ సాధించి నేటికి 10 సంవత్సరాలు పూర్తి కావడంతో సినీ నటుడు ఫర్హాన్ అక్తర్ సచిన్ ఫోటోను షేర్ చేస్తూ ఒక కామెంట్ చేశాడు. ''మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. మ్యాన్ ఆఫ్ ది సిరీస్.. మ్యాన్ ఆఫ్ ది టీమ్.. అన్ని సచినే కావడం విశేషం. నిజంగా ఈరోజు ఎన్నటికి చరిత్రలో మిగిలిపోతుంది. ''అని కామెంట్ చేశాడు. చదవండి: సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్ Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone. Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup 🇮🇳 win. — Sachin Tendulkar (@sachin_rt) April 2, 2021 Man of the match. Man of the series. Man of the team. What a day this was..!! #10YearsOf2011WC 🏆🇮🇳 pic.twitter.com/UmwGoFktH4 — Farhan Akhtar (@FarOutAkhtar) April 2, 2021 -
ముక్కు, నోరు మూసుకుని తుమ్మాడు.. ఆపై
తుమ్మేటప్పుడు ఆటోమెటిక్గా కళ్లు వాటంతటవే మూతపడతాయి. ఇక ఏదైనా శుభకార్యాల సమయంలో తుమ్ము వస్తే.. బలవంతంగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం.. లేదంటే తిట్లు పడతాయి కాబట్టి. అలా బలవంతంగా తుమ్ము ఆపుకుంటే కళ్లలోకి నీళ్లు వస్తాయి. అలాంటిది తుమ్ము వచ్చేటప్పుడు ముక్కు, నోరు మూసుకుంటే.. ఏం జరుగుతుంది?. ఇదిగో ఇలాంటి అనుమానామే ఓ వ్యక్తికి వచ్చింది. దాంతో ఓ సారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరి అపసోపాలు పడుతున్నాడు. మరి అతడి ప్రయోగంలో ఎలాంటి ఫలితం ఇచ్చిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఎందుకు అనిపించిందో ఏమో కానీ ఓ 34 ఏళ్ల వ్యక్తి తుమ్మును ఆపాలనుకున్నాడు. దాంతో తుమ్ము వస్తుండగా ముక్కు, నోరు ఒకే సారి మూసుకున్నాడు. ఈ క్రమంలో ఎముక విరిగిపోయిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చింది. అతడి వాయిస్ మారిపోయింది. గొంతులో నొప్పి.. మింగడంలో ఇబ్బంది పడ్డాడు. బాధ భరించలేక ఆస్పత్రికి వెళ్లాడు. దాంతో వైద్యులు అతడి మెడను స్కాన్ చేయగా అక్కడ ఉన్న ఎముకలు పక్కకు కదిలి విరగడంతోపాటు లోతైన కణజాలం, కండరాల లోపల గాలి బుడగలు వచ్చినట్లు వైద్యులు కనుగొన్నారు. (చదవండి: తుమ్మినందుకు చితక్కొట్టారు..) గాలి నిండిన కణజాలానికి వ్యతిరేకంగా గుండె కొట్టుకున్నప్పుడు కూడా ఎముకల పగుళ్లు ఏర్పడుతున్నందున వైద్యులు అతని మృధువైన మెడ కణజాలం, ఛాతీని స్కాన్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతానికైతే అతడు కోలుకుంటున్నాడు. ఇక మీదట ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయవద్దని వైద్యులు అతడిని హెచ్చరిస్తున్నారు. -
ఆసుపత్రిలో చేరిన బిగ్బాస్ కంటెస్టెంట్
ఢిల్లీ : హిందీ బిగ్బాస్ సీజన్ 13 ఫేమ్, మోడల్, పంజాబీ సింగర్ హిమాన్షి ఖురానా నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. కాగా నాలుగు రోజులుగా హోం ఐసోలేషన్లో ఉంటున్న హిమాన్షి ఆరోగ్య పరిస్థితి గురువారం కాస్త సీరియస్ అయింది . ఆమె 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని.. ఆక్సిజన్ లెవెల్ కూడా దారుణంగా పడిపోవడంతో అప్రమత్తమై లుదియానాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడిందని తెలిపారు.ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతోనే ఆమెకు ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి : అహ్మద్ పటేల్కు కరోనా పాజిటివ్) కాగా వ్యవసాయ బిల్లలకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో రైతులకు మద్దతుగా హిమాన్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ఆందోళనల్లో పాల్గొన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. మనమంతా రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె తెలిపారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న తర్వాత తిరిగి షూటింగ్కు వెళ్లడానికి ముందు ముందుజాగ్రత్త చర్యగా కరోనా పరీక్ష చేయించుకోగా ..హిమాన్షికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తనను కలిసిన అందరూ దయచేసి కరోనా పరీక్ష చేయించుకోవాలని కూడా హిమాన్షి కోరారు. హిమాన్షి ఆరోగ్య విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.కాగా పంజాబీ మ్యూజిక్ పాటల ద్వారా హిమాన్షి ఖురానా మంచి పాపులారిటీ సంపాదించారు. బిగ్బాస్ సీజన్ 13లో హిమాన్షి ఖురానా నటుడు అసీమ్ రియాజ్తో మంచి రిలేషిన్షిప్ ఏర్పరచుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా షోలో రీఎంట్రీ ఇచ్చిన హిమాన్షికి రియాజ్ లవ్ ప్రొపోజ్ చేయడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించారు. -
సెల్ఫీ వీడియో: ఆసుపత్రిలో పృథ్వీరాజ్
-
నటుడు పృథ్వీరాజ్కు తీవ్ర అనారోగ్యం
'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ' డైలాగ్తో తెలుగు ప్రేక్షకుల మోముపై నవ్వులు పూయించిన హాస్య నటుడు పృథ్వీరాజ్ ఆస్పత్రిపాలయ్యారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆయన శ్వాస తీసుకోడానికి, మాట్లాడటానికి కూడా తీవ్రంగా కష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియోలో పృథ్వీ పది రోజుల నుంచి తీవ్రమైన జలుబు, అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. అన్నిరకాల పరీక్షలు చేయించుకున్నానని, వాటిలో కోవిడ్ నెగెటివ్ వచ్చిందన్నారు. (ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా) అయితే డాక్టర్లు పదిహేను రోజులు క్వారంటైన్ కేంద్రంలో ఉండమన్నారని, వారి సలహా మేరకు నిన్న అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరానని చెప్పుకొచ్చారు. త్వరగా కోలుకునేందుకు ఎదురు చూస్తున్నానన్నారు. ఇందుకోసం అందరి ఆశీస్సులు, వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదాలు తనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతూ వీడియో ముగించారు. కాగా తనదైన కామెడీతో సినిమాల్లో బిజీగా ఉండే పృథ్వీరాజ్ గతేడాది పూర్తిగా రాజకీయాల్లో మమేకమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆయన ఎస్వీబీసీ(శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) చైర్మన్గా నియమితులైనప్పటికీ అనివార్య కారణాల వల్ల కొంతకాలానికి ఆ పదవికి రాజీనామా చేశారు. (కష్టకాలంలో.. కరోనా పరుపు) -
కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్లైన్ వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్వుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్లైన్ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. (చదవండి: సీనియర్ నటికి కరోనా పాజిటివ్!) సమలతకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్యకాలంలో సుమలతను కలిసినందున ఆయనకు కూడా కరోనా వచ్చి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ వెంకటేష్కు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్లైన్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ రాజవీర మడకారి నాయక అనే పిరియాడికల్ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాతో హీరో తండ్రి మృతి) -
ములాయం త్వరగా కోలుకోవాలి
లక్నో : సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఉదర సంబంధిత సమస్యలతో రెండు రోజుల క్రొతమే ఆసుపత్రి పాలైన ములాయం..సోమవారం తెల్లవారుజామున మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత ఐదు రోజుల్లోనే రెండు సార్లు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ములాయం సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అంతకుముందు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ , ములాయం సోదరుడు శివపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘ములాయం ఆరోగ్యం గురించి చాలామంది శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు..ప్రస్తుతం దేవుని దయ వల్ల ములాయంసింగ్ ఆరోగ్యం బాగానే ఉంది. దీర్ఘకాలం ఆయన జీవించాలని దేవుడిని ప్రార్థించండి" అంటూ కోరారు. श्री मुलायम सिंह यादव जी के अस्वस्थ होने का समाचार मिला। मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वे उन्हें शीघ्र ही पूर्ण स्वस्थ करें। — Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 10, 2020 -
ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. కుడుపు నొప్పి కారణంగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆయన్ని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. 80 ఏళ్ల ములాయం సింగ్ కడుపునొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ములాయం సింగ్ కుమారుడు, ఎస్పీ ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు గురువారం ఆయన్ని చూడటానికి హాస్పిటల్కి వెళ్లారని రాజేంద్ర చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామనేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బిగ్బాస్-2 నటికి మళ్లీ అనారోగ్యం
హిందీ బిగ్బాస్ పార్టిసిపెంట్, ప్రముఖ డ్యాన్సర్, నటి సంభావనా సేథ్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త అవినాష్ ద్వివేది ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మే 4 న అనారోగ్యం కారణంగా సంభావనను ఆసుపత్రిలో చేర్పించగా, ఈరోజు డిశ్చార్జ్ కావడంతో ఇంటికి తీసుకువచ్చా. కానీ మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే హాస్పిటల్కి తరలించాం. అని పేర్కొన్నారు. బిగ్బాస్-2 తో పాటు బిగ్బాస్-8లోనూ పాల్గొన్న సంభావనా అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. ప్రముఖ డాన్సర్గా వెలుగొందుతూనే సంభావనా సేథ్ ఎంటర్టైన్మెంట్ అనే యూట్యూబ్ ఛానెల్నూ నిర్వహిస్తుంది. ప్రస్తుతం సంభావనా హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అయితే అనారోగ్యానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) on May 4, 2020 at 11:16pm PDT -
కేజీబీవీ విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, కేశంపేట : పాడైన కూరగాయలతో చేసిన వంటల కారణంగా ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. పాటిగడ్డలోని కస్తూర్బా పాఠశాలలో శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని పాటిగడ్డ కస్తూర్బా పాఠశాలలో 262 మంది చదువుకుంటున్నారు. వీరికి నిత్యం మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నిర్వాహకులు మాత్రం తమ ఇష్టానుసారం వండిపెడుతన్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కూరగాయలతో వంటలు చేస్తున్నారు. ఈ భోజనం తిన్న బాలికలు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు స్కూల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. వాష్బేషిన్ల వద్ద నాచు పేరుకుపోయింది. మూత్రశాలలు కంపు కొడుతున్నాయి. పాఠశాల లోపల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ విషయమై కేజీబీవీ ప్రత్యేక అధికారి గౌసియాను అడగగా.. ఉదయం విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఆయాలు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. దీంతో మూత్రశాలలను శుభ్రం చేయలేదన్నారు. నాయకుల సందర్శన.. విద్యార్థులు ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకున్న పలు కుల సంఘాల నాయకులు కేజీబీవీని సందర్శించారు. వంటలు, కిచెన్, బాత్రూంలను పరిశీలించారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మెనూ పాటించడం లేదని, బాత్రూంలను శుభ్రం చేయడం లేదని విద్యార్థులు వీరికి వివరించారు. ఇదిలా ఉండగా బాలికలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం అందించిన వాటర్ ఫిల్టర్ నిరుపయోగంగా ఉంది. నిత్యం కేశంపేట, సంతాపూర్ నుంచి ఫిల్టర్ వాటర్ తెస్తున్నారు. -
బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్ చెక్అప్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు. (హిమాచల్ గవర్నర్గా దత్తాత్రేయ) చదవండి: ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: దత్తాత్రేయ -
ములాయంకు తీవ్ర అస్వస్థత; ముంబైకి తరలింపు
ముంబయి : సమాజ్వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన గత కొంత కాలంగా ఉదర సంబంధిత వ్యాదితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ములాయంను ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ములాయంను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా తర్వాతే ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ చేసేది సాయంత్రంలోగా వెల్లడిస్తామని వైద్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత
-
ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని జానకి
మైసూరు : ప్రఖ్యాత గాయని, గాన కోకిల ఎస్ జానకి (81) ఆసుపత్రిలో చేరారు. మైసూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువుల ఇంట్లో ఉండగా కాలుజారి పడిపోవడంతో ఆమె కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందట. నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
ఇక్కడ అన్నం తింటే ఆస్పత్రి పాలే!
సాక్షి, నూజివీడు : శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులకు అందించే భోజనం నాసిరకంగా ఉండటం, పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వారిలో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులందరం అనారోగ్యానికి గురవుతున్నామని, భోజనంలో పురుగులు, ఈగలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ శ్రీకాకుళం ట్రిపుల్ఐటీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. ఉదయం అల్పాహారం కూడా తినకుండా మెస్ వద్దనే 8 గంటల నుంచి ఆందోళన చేశారు. నూజివీడు ట్రిపుల్ఐటీ క్యాంపస్లోనే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీని నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అనూష కేటరర్స్ నిర్వహించే డైనింగ్హాల్–7లో భోజనం చేస్తున్నారు. అయితే వారం రోజులుగా భోజనంతో పాటు, ఉదయం పూట అల్పాహారం కూడా అధ్వానంగా ఉండటమే కాకుండా ఈగలు, పురుగులు ఉంటున్నాయి. దీనిపై విద్యార్థులు ఆఫీస్ సిబ్బందికి పలుమార్లు తెలిపినప్పటికీ ఎవరి నుంచి స్పందన లేకపోవడమే కాకుండా భోజనం విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో చివరకు చేసేదేమీ లేక విద్యార్థులందరూ కలిసి అల్పాహారం కూడా చేయకుండా ధర్నాకు దిగారు. వందల మంది బాధితులు.. కడుపులో నొప్పి, వాంతులు, గ్యాస్ట్రబుల్లో సమస్యలతో ఈనెల 25న 120మంది విద్యార్థులు క్యాంపస్లోనే ఉన్న ఆస్పత్రిలో వైద్యచికిత్స చేయించుకున్నారు. వీరిలో 21 మందికి సెలైన్లను కూడా పెట్టారు. అలాగే 26న మరో 108 మందికి వైద్యచికిత్స చేసి 22 మందికి సెలైన్లను పెట్టారు. ఇంత జరుగుతున్నా డైరెక్టర్గాని, వైస్చాన్సలర్ గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈనెల 18వ నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజుకు 60 నుంచి 90 మంది వరకు ఆస్పత్రికి వెళ్లి వైద్యచికిత్స పొందుతున్నారు. ఆ సంఖ్య 25, 26 తేదీలలో పెరిగింది. నాసిరకంగా అల్పాహారం.. అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, చపాతి, పులిహోర పెడతారని, ఇడ్లీ ఏమీ బాగోదని, చపాతి పిండి పిండిగా ఉంటుందని, రాత్రిపూట అన్నం మిగిలిపోతే దానిని తరువాత రోజు ఉదయం పులిహోరగా చేసి పెడుతున్నారని ఆరోపించారు. అపరిశుభ్రంగా ఉండడంతో పురుగులు, ఈగలు ఉంటున్నాయని విద్యార్థులు వాపోయారు. మెస్లపై ఏమాత్రం పర్యవేక్షణ లేని, మెస్ కమిటీలను నియమించినా కమిటీ సభ్యులు పరిశీలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మంచినీరు కూడా సరిగా లేకపోవడంతో పాటు మంచినీటి ట్యాంకులను శుభ్రం చేస్తున్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఆహారాన్ని పరిశీలించిన వీసీ విద్యార్థుల ఆందోళనతో ఆర్జీయూకేటీ వైస్ఛాన్సలర్ వేగేశ్న రామచంద్రరాజు మధ్యాహ్నం 12గంటలకు శ్రీకాకుళం ట్రిపుల్ఐటీకి చేరుకున్నారు. సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెస్లను, పరిసరాలను, తయారు చేస్తున్న ఆహార పదార్థాలను, భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెస్ల నిర్వహణను మెరుగుపరుస్తామని, వీటిని పర్యవేక్షించడానికి కమిటీలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను కూడా భాగస్వాములం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. -
39మంది విద్యార్ధులకు అస్వస్ధత
-
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
సన్నీలియోన్కి అస్వస్థత
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి సన్నీలియోన్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరాఖండ్లోని రామ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉదయం పాపులర్ టీవీ రియాల్టీ షో అయిన ఎంటీవీ స్ప్లిట్స్ విల్లే సీజన్-11 షూటింగ్ జరుగుతుంది. ఆ సమయంలో సన్నిలియోన్కు హటాత్తుగా కడుపు నొప్పి రావడంతో హూటాహుటినా ఉత్తరాఖండ్ లోని కాషీపూర్ లో ఉన్న బ్రిజేష్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగ ఉందని వైద్యులు వెల్లడించారు. శనివారం ఉదయం ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని సన్నీ మేనేజర్ తెలిపారు. షూటింగ్లో సన్నీతోపాటు తన కో-హోస్ట్, స్నేహితుడు రాన్విజయ్ సింగ్ సింఘా ఉన్నారు. -
ఆందోళనకరంగా ఆనం వివేకా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వివేకాకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వివేకానందరెడ్డిని పరామర్శించారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్ ఆసుపత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాస్కర్రావు మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారం క్రితం ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని చెప్పారు. -
అయ్యో..రామ!
శ్రీరామనవమి వేడుకల్లోఅపశ్రుతి చోటుచేసుకుంది. ఎ.కొండూరు మండలం చైతన్య నగర్, మత్రియాతండాకు చెంన గిరిజ నులు కలుషిత పానకం తాగి అస్వస్థతకు గుర య్యారు. ఎ.కొండూరులో సోమవారం నిర్వహించిన సీతారామకల్యాణోత్సంలో పానకం తాగడం వల్ల వీరంతా అనారోగ్యానికి గురయ్యారు. మొత్తం 215 మంది బాధితులు తిరువూరు, మైలవరం, నూజివీడు, విజయవాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తిరువూరు/ఎ.కొండూరు: కొండూరు మండలంలోని మత్రియా తండా, చైతన్య నగర్ తండాకు చెందిన మహిళలు, యువకులు, చిన్నారులు మంగళవారం ఉదయం నుంచి విపరీతమైన జ్వరం, వాంతులు, విరేచనాలతో కళ్లు తిరిగి కింద పడిపోతుండటంతో స్థానికులు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు సమాచారమిచ్చారు. మండల అధికారులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అత్యవసర వైద్యసేవలందిస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం బాధితులను ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తిరువూరు, మైలవరం, నూజివీడు ప్రభుత్వాసుపత్రులకు 108 వాహనాల్లో తరలించారు. తిరువూరు ఏరియా ఆసుపత్రిలో 83 మంది, మైలవరంలో 73 మంది, నూజివీడులో 35మంది, ఆంధ్రా ఆసుపత్రిలో 25 మందిని చేర్పించారు. మైలవరం ప్రభుత్వాసుపత్రి నుంచి బి.సీత, సతి, కౌసిలి, సొని, తావిర్యాలను మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. మొత్తంలో బాధితులు 215 మంది ఉండగా వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కడగని డ్రమ్ములో కలిపినపానకంతోనే ప్రమాదం? శ్రీరామనవమి వేడుకల్లో భక్తులకు పంపిణీ చేసేందుకు తయారు చేసిన పానకం సేవించిన కారణంగానే మత్రియాతండా గిరిజనులు అస్వస్థతకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. మామిడి తోటలకు పిచికారీ చేసిన మందుల డ్రమ్ముల్లోనే పానకం కలపడంతో కలుషితమై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. గిరిజనుల అస్వస్థతకు కారణమైన పానకం, ప్రసాదం నమూనాలను పరీక్షల నిమిత్తం విజయవాడ పంపించారు. తక్షణ వైద్యసేవలకు కలెక్టర్ ఆదేశం.... కలుషిత పానకం, ప్రసాదం తిని అస్వస్థతకు గురైన మత్రియాతండా, చైతన్యనగర్ గిరిజనులకు తక్షణ వైద్యసేవలందించాలని కలెక్టర్ లక్ష్మీకాంతం వైద్యాధికారుల్ని ఆదేశించారు. ఏకొండూరు అడ్డరోడ్డులో గిరిజనుల్ని పరామర్శించిన కలెక్టర్ దగ్గరుండి వైద్య సహాయ చర్యలను పర్యవేక్షించారు. మైలవరం, తిరువూరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు క్షేమంగా ఇళ్లకు చేరే వరకు వైద్యసేవల్లో ఎటువంటి లోపం లేకుండా చూడాలని సూచించారు. జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్ జ్మోతిర్మయి, జిల్లా ఆసుపత్రి ఎపిడమాలజిస్టు ఎ.నాగేశ్వరరావు వైద్యసేవలను పర్యవేక్షించారు. పులిహోర, పానకం కారణంగానే గిరిజనులు అస్వస్థతకు గురయ్యారని తహసీల్దార్ సురేష్కుమార్, అదనపు డీఎంఅండ్హెచ్వో శాస్త్రి కలెక్టరుకు వివరించారు. నలుగురు విద్యార్థులకు అస్వస్థత... మైలవరం: పిల్లల మీద ప్రేమతో చైతన్య తండా వాసులు మైలవరం గిరిజన సంక్షేమ వసతి గృహంలో చదువుకుంటున్న తమ పిల్లలకు ప్రసాదం, పానకం తీసుకువచ్చి తినిపించడంతో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందించారు. కలెక్టర్ లక్ష్మీకాంతం హుటాహుటిన మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా వైద్యులకు సూచించారు. ప్రభుత్వ అసుపత్రిలో సౌకర్యాలు లేమితో పాటు కరెంట్ కూడా లేకపోవడం గమనించిన కలెక్టర్ లక్ష్మీకాంతం ఎలక్ట్రిసిటీ ఆధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
దశాబ్ధాల పాటు వెండితెర మీద ఎన్నో అద్భుతపాత్రల్లో నటించిన మెప్పించిన అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో బంధువులు బెంగళూరులోని సిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పూర్తి చికిత్సకు తగిన ఏర్పాట్లు లేకపోవటంతో వైధ్యుల సూచన మేరకు విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. 1949 జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించిన జయంతి, దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోను కలిపి 500 చిత్రాలకు పైగా నటించారు. -
ప్రముఖ సినీ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
-
అమితాబచ్చన్కు అస్వస్థత
సాక్షి, జోధ్పూర్ : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన జోధ్పూర్లోని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బిగ్ బీకి చికిత్స అందిచడానికి ముంబయి నుంచి జోధ్పూర్కి ప్రత్యేక వైద్య బృందం వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయకిగా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
అస్వస్థతకు గురైన సీఎం.. అపోలోలో చికిత్స
సాక్షి, చెన్నై: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అస్వస్థతకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున అస్వస్థతకు గురికావడంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం విజయన్కు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే విజయన్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఎలాంటి బులిటెన్ విడుదల చేయలేదు. కాగా, ఆహారం దొంగిలించాడనే కోపంతో గతనెలలో ఆదివాసీ యువకుడు మధు చిందకి అనే యువకుడిని కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అత్తపడిలో బియ్యం దొంగిలించినందుకు ఓ గుంపు ఎగబడి మధును దారుణంగా కొట్టి చంపింది. ఈ నేపథ్యంలో అతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు విజయన్ శుక్రవారం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో శనివారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. -
ఆ వార్తలను నమ్మకండి : స్టార్ హీరో
సాక్షి, చెన్నై : తన ఆరోగ్య విషయంలో వస్తున్న వార్తలపై స్టార్ హీరో విశాల్ స్పందించాడు. తాను ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ట్విట్టర్లో తెలియజేశాడు. ‘నేను ఫిట్గానే ఉన్నానని అందరికీ తెలియజేస్తున్నా. మైగ్రేన్ సమస్య కోసం చికిత్స తీసుకోవటానికి వచ్చా. అది ముగిసిపోయింది కూడా . కంగారుపడాల్సిన అవసరం లేదు. మార్చి మొదటి వారంలో ఇండియాకు వచ్చేస్తా. వదంతులు నమ్మకండి’ అని ఈ ఉదయం విశాల్ ఓ ట్వీట్ చేశాడు. కాగా, అవన్ ఇవన్(తెలుగులో వాడు-వీడు) చిత్రీకరణ సమయంలో విశాల్కు తలనొప్పి ప్రారంభమైంది. దీనికి తోడు తుప్పరివాలన్(డిటెక్టివ్) సమయంలో గాయపడటంతో కీళ్లనొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో విశాల్ చికిత్సల అమెరికా వెళ్లి ఆస్పత్రిలో చేరాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఇక సినిమాల పరంగా చూసుకుంటే విశాల్ నటించిన ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) విడుదలకు సిద్ధంగా ఉండగా.. సండైకోళి–2(పందెం కోడి-2) షూటింగ్ జరుపుకుంటోంది. Rumours making rounds that I am admitted in hospital.Wanted to let all my friends,fans and well wishers know that I am fit as a fiddle.The retreat I came for to take care of my migraine will get over in few days & I will be back in the grind by the Ist week of March. C U Soon, GB — Vishal (@VishalKOfficial) 27 February 2018 -
ట్రంప్ కోడలిపై పౌడర్.. రంగంలోకి ఎఫ్బీఐ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోడలిపై పౌడర్ దాడి చోటు చేసుకుంది. తన ఇంటికి వచ్చిన ఓ కవర్ను ఆమె ఓపెన్ చేయగా.. అందులోంచి పౌడర్ ఆమెపై పడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఇంటికి సోమవారం ఓ కవర్ వచ్చింది. దానిని ఆయన భార్య వానెస్సా ఓపెన్చేయగా.. అందులోంచి పౌడర్ పడింది. విపరీతమైన దగ్గు, తలతిరగటం లక్షణాలు కనిపించటంతో వెంటనే ఆమె ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ఆమెతోపాటు మరో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చివరకు వారికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అది మాములు పౌడర్ అని తేల్చేశారు. మోడల్ అయిన వానెస్సా, జూనియర్ ట్రంప్ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. తన భార్య, పిల్లలు క్షేమంగా ఉన్నట్లు ట్రంప్.జూ తన ట్విట్టర్లో తెలియజేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు రహస్య నిఘా విభాగం, ఎఫ్బీఐలు రంగంలోకి దిగాయి. కాగా, రెండేళ్ల క్రితం ట్రంప్ మరో తనయుడు ఎరిక్కు కూడా ఇలాంటి పార్సల్ ఒకటి వచ్చి కంగారు పుట్టించింది. 2001లో ఇలాగే ఆంత్రాక్స్ పౌడర్ను పార్సల్ పంపి పలువురు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. యూఎస్ సెనేటర్లకు, వార్తా సంస్థలకు పార్సళ్లను పంపంటంతో ఐదుగురు మృతి చెందారు. -
అమితాబ్కు మళ్లీ అస్వస్థత
సాక్షి, ముంబై : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (75) మళ్లీ ఆస్పత్రి పాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. గత కొంతకాలంగా ఆయన జీర్ణాశయ సమస్యలతోపాటు మెడ, వెన్నెముక నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వెన్నెముక కింది భాగంలో నొప్పిగా ఎక్కువ కావటంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ‘‘లుంబార్ (నడుము కింది భాగం) ప్రాంతంలో నొప్పిగా ఉన్నట్టు అమితాబ్ చెప్పారు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఆపై డిశ్చార్జ్ చేశాం’’ అని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక సినిమాలపరంగా అమితాబ్ ప్రస్తుతం ‘102 నాటౌట్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత మరో సీనియర్ నటుడు రిషి కపూర్ తో ఆయన స్క్రీన్ పంచుకున్నారు. ఇందులో రిషి అమితాబ్కు కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఓ గుజరాతీ నాటిక ఆధారంగా రూపొందుతోంది. మే నెలలో ‘102 నాటౌట్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు. ఈ విషయాన్ని సర్ గంగా రామ్ ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఆమె కోలుకోవటంతో సాయంత్రం 4 గంటలకు ఆమెను ఇంటికి పంపించి వేసినట్లు గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డా.డీఎస్ రానా ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 70 ఏళ్ల సోనియాకు కడుపు నొప్పి రాగా, ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సిమ్లా నుంచి ఆమెను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సోనియా పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పటం తెలిసిందే. ఆమెను విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు సమాచారం. -
ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత
వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం అల్పాహారం తీసుకున్న విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతుండటంతో వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
100 మంది విద్యార్థినులకు అస్వస్థత
ఆసిఫాబాద్: కుమ్రంభీ ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఉన్న కస్తూర్భా బాలికల పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయింది. దీంతో 100 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తిన్న తరువాత పిల్లలకు వాంతులు, కడుపునొప్పి ప్రారంభమయ్యాయి. బాధితులను కౌటాల, సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. పాఠశాలకు చేరుకున్న డీఈవో విచారణ చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. -
కేంద్రమంత్రి మేనకాగాంధీకి అస్వస్థత
లక్నో : కేంద్రమంత్రి మేనకా గాంధీ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. యూపీ పర్యటనలో ఉన్న ఆమె అస్వస్థతకు గురి కావడంలో పిలిబిత్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మేనకా గాంధీ ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీ తరలించనున్నట్లు సమాచారం. కాగా మేనకా గాంధీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం వల్ల ఆస్పత్రిలో చేరిన వార్తలను అధికారులు కొట్టిపారేశారు. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఏర్పడ్డాయని, దీంతో ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
20 మంది నిట్ విద్యార్థినులకు అస్వస్థత
వరంగల్: వరంగల్ నిట్లో కలుషిత ఆహారం తిని 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అస్వస్థతకు గురైన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రోహిణి ఆస్పత్రికి తరలించారు. 20 మంది నిట్ విద్యార్థినులు రెండు రోజుల క్రితం క్షిద్ర అనే హోటల్లో చికెన్ బిర్యాని తిన్నారు. దీంతోనే వారికి ఫుడ్పాయిజన్ అయి వుంటుందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. -
కస్తూర్బా విద్యార్థినుల అస్వస్థత
సిద్దిపేటలో ఏడుగురికి చికిత్స సాయంత్రానికి కోలుకున్న విద్యార్థినులు నీరు, ఆహారం కలుషితమే కారణం నంగునూరు : నంగునూరు మండలం నర్మేటలోని కేజీబీవీలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఏడుగురిని సిద్దిపేట ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విద్యార్థినుల కథనం ప్రకారం... నర్మేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మంగళవారం రాత్రి భోజనం చేసిన తర్వాత కొందరు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిని పరీక్షించిన పాఠశాల ఏఎన్ఎం వారికి మందులు అందజేశారు. విరేచనాలు తగ్గకపోవడంతో బుధవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఎస్ఓ హమీదా తీవ్రంగా నీరసించిన మానస, అరుంధతి, అంజలి, రేణుక, జ్యోతి, స్వాతి, రమ్యలను 108 అంబులెన్స్లో సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫ్లూయిడ్ ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో ఎంసీహెచ్కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. సాయంత్రం విద్యార్థులు కోలుకోవడంతో వారు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. కస్తూర్బా విద్యాలయంలో మంచినీటి సమస్య ఉండడంతో పిల్లలు బోరు నీటిని తాగుతున్నారని చెప్పారు. అలాగే నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మెనూ పాటించడం లేదని పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించినా స్పందన లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన భోజనాన్ని అందించాలని కోరుతున్నారు. -
చో రామస్వామికి తీవ్ర అస్వస్థత
చెన్నై: సీనియర్ నటుడు, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు చో రామస్వామి మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థాని క అపో ఆస్పత్రిలో చేర్చి న ఆయనకు వైద్యులు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. చో రామస్వామి గత ఏడాది పాటు అనారోగ్యంతో బాధ పడుతూ వైద్య చికిత్సలు పొందుతున్నారు. గత ఏడాది జూన్ మూడో తేదీన అనారోగ్యానికి గురవడంలో స్థానిక గ్రీమ్స్ రోడ్డులో గల అపోలో ఆస్పత్రిలో చేరారు. వైద్య చికిత్సలనంతరం ఆరోగ్యం మెరుగుపడడంతో తిరిగి ఇంటికి చేరుకున్నారు.అయితే అదేనెల 19వ తేదీన అనారోగ్యం కారణంగా మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. తీవ్ర చికిత్స అనంతరం కోలుకు న్న చో రామస్వామి బుధవారం తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు అత్యవసరచికిత్స అందిస్తున్నారు. -
ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత
రాజవొమ్మంగి: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం అమీనాబాద్ కాలనీలోని గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఎడమవైపు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను పాఠశాల సిబ్బంది రాజవొమ్మంగి ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజుల క్రితం ఇలాంటి లక్షణాలతోనే 7వ తరగతి విద్యార్థిని దుర్గాజ్యోతి (13) మృతి చెందింది. తాజా పరిణామంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. -
కలుషితాహారం తిని 10 మందికి అస్వస్థత
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో కలుషితాహారం తిని 10 మంది అస్వస్థతకు గురయ్యారు. విజయదశమి సందర్భంగా గౌరారం పంచాయితిలోని గుట్టకింది తండాలో మంగళవారం రాత్రి తండావాసులు విందు ఏర్పాటుచేసుకున్నారు. విందులో మాంసాహారాన్ని కూడా తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి10 మందికి తీవ్రంగా వాంతులు, విరోచనాలు కావడంతో నీరసించిపోయారు. దీంతో వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. -
50 మంది విద్యార్థులకు విషజ్వరాలు
మైదుకూరు: వైఎస్ఆర్ జిల్లాలో అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థులకు విషజ్వరాలు సోకడంతో ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంట ఆశ్రమ హాస్టల్కు చెందిన 50 మంది విద్యార్థులు గత కొన్నిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించగా.. విషజ్వరాలు సోకాయని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
కలుషితాహారంతో బాలికలకు అస్వస్థత
రాజంపేట : ఆహారం వికటించి 15 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 300 మంది బాలికలు ఉండే ఈ వసతి గృహంలో బుధవారం మధ్యాహ్నం తిన్న ఆహారంతో రాత్రి కొందరికి వాంతులు, విరేచనలు మొదలయ్యాయి. వారిని రాజంపేటలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, గురువారం ఉదయం వరకు కూడా తమను చూసేందుకు వైద్యులు రాలేదని బాలికలు చెబుతున్నారు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్లో శుక్రవారం రాత్రి భోజనం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అర్థరాత్రి తర్వాత విద్యార్థులంతా వాంతులతో బాధపడుతుండటంతో హుటాహుటిన అందరినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వసతి గృహంలో రాత్రి పెట్టిన పెరుగన్నం కలుషితం కావటమే కారణమని వైద్యులు తెలిపారు. -
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రమాదం
గాజువాక (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీకవ్వడంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన గురువారం స్టీల్ప్లాంట్లోని ఎస్ఎమ్ఎస్(స్టీల్ మెల్ట్ షాప్)-1లో జరిగింది. ఎస్ఎమ్ఎస్-1లోని ఎల్బీ-పేలోకి కోకో వెన్ ద్వారా గ్యాస్ సరఫరా కావడంతో ఫైర్ అవుతుంది. అయితే ప్రమాదవశాత్తు ఆ గ్యాస్ లీకైంది. అది విష వాయువు కావడంతో అక్కడే విధుల్లో ఉన్న భాస్కర్రావు, రామారావు, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే స్టీల్ప్లాంట్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి వైజాగ్లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. -
కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత
ప్రొద్దుటూరు: కలుషితాహారం తిని ఐదుగురు విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కేంద్రంలోని జరిగింది. వివరాలు.. వైఎస్సార్ యూనివర్సీటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు గురువారం రాత్రి తిన్న ఆహారం వికటించడంతో కడుపునొప్పి, వాంతులతో 5 మంది విద్యార్థులు అస్వస్తతకు గురయ్యారు. దీంతో వీరిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు శుక్రవారం తెల్లవారుజామున తెలిపారు. -
కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత
కోడుమూరు(కర్నూలు): ఉడికి ఉడకని కిచిడి తిని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఆమడగుంట్ల బీసీ హాస్టల్లో సోమవారం జరిగింది. హాస్టల్లో ఉదయం వండిన కిచిడి సరిగా ఉడకకపోవడంతో.. విద్యార్థులకు కడుపు నొప్పి మొదలైంది. దీంతో అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్ధుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
మణిరత్నంకు ఛాతినొప్పి, ఆస్పత్రికి తరలింపు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంకు మంగళవారం రాత్రి ఛాతినొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అంతకుమించి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. మణిరత్నంకు గతంలో కూడా ఓ సారి ఛాతినొప్పి రావడంతో చికిత్స పొందారు. మణిరత్నం పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. రోజా, దళపతి, ముంబై వంటి చిత్రాలతో ప్రత్యేకతను చాటుకున్నారు. 1995లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రదానం చేశారు. మణిరత్నం నటి సుహాసినిని వివాహం చేసుకున్నారు. -
విద్యుద్ఘాతంతో ఇద్దరి పరిస్థితి విషమం
మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా): ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు విద్యుద్ఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని ఎత్బార్పల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎత్బార్పల్లి గ్రామానికి చెందిన మల్లాని ఈశ్వరమ్మ(55) సోమవారం ఉదయం ఊరి పక్కన పొలాల్లోకి బహిర్భూమికి వెళ్లింది. అయితే ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పొలాల్లోని విద్యుత్ స్తంభాలు ఒరిగి విద్యుత్ తీగలు కిందికి వేలాడాయి. పొలాల్లోకి వెళ్లిన ఈశ్వరమ్మ వేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో తీగలు ఆమె తలకు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో ఆమె పెద్దగా అరిచి కింద పడిపోయింది. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు ఒక్కసారిగా పొలాల్లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ(21) అనే యువకుడు అందరికంటే ముందుగా పరుగెత్తుకుంటూ వెళ్లాడు. వేలాడుతున్న విద్యుత్ తీగలు అతని తలకు తగలడంతో అతడూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇద్దరికి తీవ్రంగా కాలిన గాయాలు కావడంతో గ్రామస్తులు వారిని వెంటనే స్థానిక భాస్కర ఆసుపత్రికి తరలించారు. ఈశ్వరమ్మ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 అంబులెన్స్లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ ప్రస్తుతం భాస్కర ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారిని ఆదుకోవాలని గ్రామస్తులు విద్యుత్ అధికారులను కోరారు. -
ఎపిలో ఒకే రోజు పలుచోట్ల విద్యార్ధులకు అస్వస్థత
-
ఐరన్ మాత్రలు వికటించి విద్యార్ధుల అస్వస్ధత