హోంగార్డు ఆత్మహత్య
సిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్లో అనుముల సంతోష్(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈ మధ్యాహ్నం తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.