కరీంనగర్: ఒక గుర్తుతెలియని దుండగుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎమ్ను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదవరిఖనిలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు.. గుర్తు తెలియని దుండగుడు ఐఓసీ ఏటీఎమ్లో దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎమ్ నుంచి డబ్బు రాకపోవడంతో దానిని ధ్వంసం చేశాడు. కాగా, నిందితుడు అప్రమత్తం అవుతాడని, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన బ్యాంక్ మేనేజర్ సంజయ్కుమార్ శనివారం పోలీసులను సంప్రదించి వివరాలు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
(గోదావరిఖని)
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎమ్ ధ్వంసం
Published Sat, Feb 21 2015 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement