ATM
-
EPFO: క్షణాల్లో ఈపీఎఫ్వో విత్డ్రా
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఇప్పటికే ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈపీఫ్ఓవో సంస్థ ఈపీఎఫ్వో అకౌంట్లలో పలు కీలక మార్పులు చేపట్టింది. ఈపీఎఫ్వో క్లయిమ్, వివరాలను చేర్చడం, తొలగించడం, ఎగ్జిట్ అవ్వడాన్ని సులభతరం చేసింది.తాజాగా, ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్పే,గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్ల ద్వారా ఈపీఎఫ్వో విత్ర్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. ప్రస్తుతం ఈపీఎఫ్వో సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి ఈ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరుపుతుంది. సాధ్యసాధ్యాలను బట్టి సౌకర్యాన్ని ఈ ఏడాది మే, లేదా జూన్ నాటికి ప్రారంభించే యోచనలో ఈపీఎఫ్వో ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో పాటు ఈపీఎఫ్వో3.0లో ఏటీఎం ద్వారా ఈపీఎఫ్వో విత్డ్రా చేసుకునే వెసులు బాటు ఈ ఏడాది జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.ఉద్యోగులకు లభించే ప్రయోజనాలుయూపీఐ ద్వారా ఈపీఎఫ్వో విత్ డ్రా వల్ల ఉద్యోగలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో డబ్బుల్ని తక్షణమే పొందవచ్చు. పారదర్శకతతో పాటు ఈపీవోఎఫ్వో విత్ డ్రా ప్రక్రియ మరింత సజావుగా జరగనుంది.ఈపీఎఫ్వో 3.0 ప్రారంభంఈపీఎఫ్వో 3.0 అమల్లోకి వస్తే, సభ్యులు తమ పొదుపులను సాధారణ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులను ఉపసంహరించుకోవడం మరింత సులభం అవుతుంది. -
ఏటీఎం నగదు ఉపసంహరణ మరింత భారం
ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరించేవారికి త్వరలో ఛార్జీలు పెంచనున్నాయి. ఏటీఎం లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ఇది ఏటీఎం ద్వారా చేసే నగదు ఉపసంహరణలను మరింత ఖరీదైనవిగా చేస్తుంది. ఐదు లావాదేవీల ఉచిత పరిమితి ముగిసిన తర్వాత చేసే నగదు లావాదేవీలకు గరిష్ట రుసుమును రూ.21 నుంచి రూ.22కు పెంచాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిఫారసు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏటీఎం ద్వారా చేసే నగదు లావాదేవీలకు ఇంటర్ చేంజ్ ఫీజు(ఇతర బ్యాంకు ఏటీఎం ద్వారా చేసే లావాదేవీలు) రూ.17 నుంచి రూ.19కి, నగదు రహిత లావాదేవీలకు రూ.6 నుంచి రూ.7కు పెరగవచ్చని సమాచారం.పెరుగుదల ఎందుకు?ద్రవ్యోల్బణం, అధిక రుణ వ్యయాలు, రవాణా, నగదు భర్తీకి సంబంధించిన ఖర్చుల కారణంగా బ్యాంకులు ఛార్జీలు పెంచుతున్నాయి. ఏటీఎం ఆపరేటర్లకు, ముఖ్యంగా మెట్రోయేతర ప్రాంతాల్లో నిర్వహణ ఖర్చులను భరించడానికి, ఏటీఎం సేవల సుస్థిరతకు సాయపడడానికి ఈ పెంపు అవసరమని బ్యాంకులు భావిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఇంటర్ చేంజ్ ఫీజులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు.ఇదీ చదవండి: ప్రభుత్వ డివైజ్ల్లో ఏఐ టూల్స్ నిషేధం!వినియోగదారులపై ప్రభావంఈ సిఫార్సులను ఆర్బీఐ ఆమోదిస్తే వినియోగదారులు ఉచిత పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలకు చెల్లించే ఫీజు పెరుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి తరచూ నగదు ఉపసంహరించుకునే వారిపై ఇది ప్రభావం చూపుతుంది. ప్రతిపాదిత ఫీజుల పెంపు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ కమిటీ ఏర్పాటు చేసింది. దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ పెరుగుదలకు మద్దతు ఇస్తున్నాయి. -
టాటా కంపెనీ కొనుగోలుకు ఆర్బీఐ ఆమోదం
టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్ (టీసీపీఎస్ఎల్)ను భారత్లోని ఆస్ట్రేలియాకు చెందిన ఫిన్టెక్ కంపెనీకి విక్రయించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం లభించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫైండీ ఆధ్వర్యంలోని భారతీయ అనుబంధ సంస్థ ట్రాన్సాక్షన్ సొల్యూషన్స్ ఇంటర్నేషనల్ (టీఎస్ఐ)కు టీసీపీఎస్ఎల్ను విక్రయించే ప్రణాళికలను ఆర్బీఐ ముందుంచారు. దాంతో తాజాగా వాటిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. రూ.330 కోట్ల విలువైన ఈ డీల్ వల్ల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఆర్థిక సేవలు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.నవంబర్ 2024లో ప్రకటించిన ఈ కొనుగోలు టీసీపీఎస్ఎల్ వైట్ లేబుల్ ఏటీఎం(నాన్ బ్యాంకింగ్ నిర్వహకులు ద్వారా నడిచే ఏటీఎం) ప్లాట్ఫామ్, ఇండికాష్ ఏటీఎంల నెట్వర్క్ను ఉపయోగించుకోవడానికి ఫైండీకి వీలు కల్పిస్తుంది. టీఎస్ఐ ప్రస్తుతం 7,500కు పైగా బ్రౌన్ లేబుల్ ఏటీఎం(స్పాన్సర్ బ్యాంకులకు చెందిన ఏటీఎంలు)లను నిర్వహిస్తుంది. 10,000 కంటే ఎక్కువ వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాక్ ఎండ్ కార్యకలాపాలు అందిస్తోంది. ఈ కొనుగోలుతో ఫైండీ 4,600 ఆపరేషనల్ ఇండికాష్ ఏటీఎంలను తీసుకుంటుంది. మరో 3,000 ఏటీఎం పొందేందుకు ఫైండీకి అవకాశం లభిస్తుంది.ఇదీ చదవండి: జోరందుకున్న తయారీ రంగంఫైండీ సీఈఓ దీపక్ వర్మ మాట్లాడుతూ భారత్లో ఆర్థిక సేవలను విస్తరించేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందన్నారు. ఈ ఏటీఎంలను కంపెనీ ప్రస్తుత నెట్వర్క్తో అనుసంధానించడంతో బ్యాంకింగ్ సేవలులేని మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. -
ఆప్ ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకుంది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిని ఆప్ అడ్డుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ పురోగతి కోసం ఢిల్లీని రాజకీయ ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. మోదీ శుక్రవారం నాడిక్కడ ద్వారకలో ప్రచారసభలో మాట్లాడారు. ఢిల్లీ పురోభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకోవాల్సిందిగా ప్రజలను కోరారు. అధునాతన ఢిల్లీకి బీజేపీ కట్టుబడి ఉందనడానికి ఇటీవల ప్రారంభించిన యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉదాహరణ అన్నారు. వేరే రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్ ఢిల్లీ వనరులను ఖాళీ చేసిందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీని ఏటీఎం కార్డు లాగా వాడుకుంటోందన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం గిరిజన రాష్ట్రపతిని అవమానించిందన్నారు. ఆప్ ప్రభుత్వం తమ సమయమంతా ఇతర రాష్ట్రాలతో పేచీలకే వెచి్చస్తోందని మండిపడ్డారు. కేంద్రంతోనూ, ఉత్తరప్రదేశ్, హరియాణాలతో నిత్యం కలహిస్తోందన్నారు. దాంతో ఢిల్లీ అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే అభివృద్ధిలో ఢిల్లీ వెనుకబడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కలహాలలో మునిగితేలే ప్రభుత్వం కంటే సమన్వయంతో ముందుకు సాగే ప్రభుత్వం ఢిల్లీకి అవసరమన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే ప్రభుత్వం కావాలన్నారు. బీజేపీని గెలిపిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అన్నా హజారే ఉద్యమాన్ని అపహస్యం చేస్తూ ఆప్ సర్కార్ అవినీతిలో మునిగిపోయిందని, ప్రజలకు ద్రోహం చేసిందని మోదీ అన్నారు. ఢిల్లీ బడ్జెట్లో ఆప్ 20 శాతమే అభివృద్ధిపై ఖర్చు పెడుతోందని, మౌలికసదుపాయాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా సొంత ప్రచారానికి నిధులు వెచి్చస్తోందని పేర్కొన్నారు. అద్దాల మేడలో నివసించే వాళ్లు పేదల ఇళ్ల గురించి పట్టించుకోరని, ఆప్ మధ్యతరగతికి వ్యతిరేకమని మోదీ అన్నారు. ఆప్ అక్రమాలను తవ్వితీస్తాం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆప్ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తామని మోదీ హామీ ఇచ్చారు. కాగ్ నివేదికను ఢిల్లీ సర్కారు తొక్కిపెట్టాలని చూసిందని ఆరోపించారు. మద్యం పాలసీతో సహా ఆప్ విధానాలను కాగ్ తప్పుపట్టిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కాగ్ నివేదికను ప్రవేశపెడతామని మోదీ అన్నారు.ఢిల్లీ అభివృద్ధికి శాయశక్తులా బీజేపీ సర్కారు కృషి చేస్తుందన్నారు. దోపిడి, అబద్ధాల నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు. ఢిల్లీ ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తన కల అని, ఆప్ దీనిని అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా ఆప్ అడ్డుకుంటోందని, తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందేలా చూస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ పేర్కొన్నారు. -
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా.. ఎప్పటినుంచంటే?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు గొప్ప వార్తను అందించింది. ప్రభుత్వం ప్రకారం.. పీఎఫ్ కొత్త విధానం వచ్చే జూన్ నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానం ప్రకారం.. ఏటీఎం (ATM) నుండి పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు కొత్త యాప్, ఇతర ఏర్పాట్లు ఉంటాయి.ఈపీఎఫ్వో కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ EPFO 3.0 ఈ సంవత్సరం ప్రారంభమవుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రక్రియలో మానవ జోక్యం ఉండదు. అంటే ఏ అధికారి క్లియరెన్స్ లేకుండానే పీఎఫ్ నుంచి డబ్బు విత్డ్రా అవుతుంది. ఈ సిస్టమ్ సభ్యులు తమ క్లెయిమ్లను ఒకే క్లిక్తో సెటిల్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డ్ సర్వీస్ఈపీఎఫ్ఓ 3.0 కింద సభ్యులందరికీ ఏటీఎం కార్డులు ఇస్తారు.ఈ కార్డ్ ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా మొత్తాన్ని సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో ఈ సర్వీస్ సహాయపడుతుంది. వెబ్సైట్, సిస్టమ్లో ప్రాథమిక మెరుగుదలలు ఈ నెలలోపు పూర్తవుతాయని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. దీని తరువాత, ఈపీఎఫ్ఓ 3.0 దశలవారీగా అమలవుతుంది.కొత్త మొబైల్ యాప్ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ యాప్, ఇతర డిజిటల్ సేవలు కూడా ఈపీఎఫ్ఓ 3.0 కింద ప్రారంభమవుతాయి. 2025 జూన్ నాటికి కొత్త యాప్, ఏటీఎం కార్డ్, అధునాతన సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెస్తామని.. దీంతోపాటు 12 శాతం కంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోందని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. ఉద్యోగులు తమ పొదుపు ప్రణాళికలకు అనుగుణంగా పీఎఫ్కి డబ్బు జమ చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగి సమ్మతితో ఈ మొత్తాన్ని పెన్షన్గా మార్చే ప్రతిపాదన కూడా ఉంది.ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశండిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సేవలను సరళంగా, వేగంగా, పారదర్శకంగా చేయడమే ఈపీఎఫ్ఓ 3.0 ఉద్దేశం. ఈ చొరవ సభ్యుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక నిర్వహణను కూడా మెరుగుపరుస్తుంది. ఈపీఎఫ్ఓ కొత్త చొరవ కోట్లాది మంది ఉద్యోగులకు సురక్షితమైన పీఎఫ్ నిర్వహణ అవకాశాన్ని కల్పిస్తుంది. -
కర్ణాటకలో దొంగల బీభత్సం
-
ఏటీఎం కార్డు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ.. దాదాపు 'ఏటీఎం' (ATM) కార్డు (డెబిట్ కార్డు) ఉంటుంది. ఏటీఎం అనేది కేవలం డబ్బు విత్డ్రా చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ఇతర కార్యకలాపాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు.ఫండ్ ట్రాన్స్ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.చెక్బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్బుక్ (Checkbook) వస్తుంది.బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్వర్క్కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్సైట్లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి..? ఆర్బీఐ రూల్స్ తెలుసా..?
-
ఏటీఎంను ధ్వంసం చేసి.. చివరికి..
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని ఓ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి విఫలయత్నం చేశాడు. ఏటీఎంలోని సీసీ పుటేజీల ఆధారంగా గుర్తుతెలియని దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.దొంగతనానికి యత్నించిన వ్యక్తి సీసీ పుటేజీ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సదరు వ్యక్తిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఏటీఎం పై కప్పును తొలగించి అందులోంచి డబ్బులు తీయడానికి విఫలయత్నం చేశాడు. గంట సేపు ప్రయత్నించి వెళ్లిపోయాడు. క్లూస్ టీం పోలీసులు రంగంలోకి దిగి నిందితుని వేలిముద్రలు సేకరించారు. సీసీ పుటేజీ ఆధారంగా సదరు వ్యక్తిని గుర్తించి సమాచారం ఇవ్వాలని ఎస్సై రమాకాంత్ కోరారు. -
ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో చోరీ
కూడేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం సెంటర్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా, కూడేరు మండలంలో చోటుచేసుకుంది. ఏటీఎంను పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, అందులోని రూ.18,41,300 నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కూడేరులో దళితవాడకు ఎదురుగా అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన అనంతపురం సాయినగర్లోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖ ఏటీఎం సెంటర్ ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కట్టర్తో ఏటీఎంను కట్ చేశారు. మిషన్లో ఉంచిన నగదు చోరీ చేశారు. అదే సమయంలో మిషన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి పైభాగం కాలిపోయింది. శబ్దం కూడా రావడంతో స్థానికుడొకరు బయటకు వచ్చి చూడగా.. ఏటీఎం సెంటర్ నుంచి కొందరు కార్లో వెళ్లిపోవడం, సెంటర్లో నుంచి పొగ రావడం గమనించాడు. కొంత సమయం తర్వాత విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. సీఐ శివరాముడు ఏటీఎం సెంటరును పరిశీలించారు. చోరీ జరిగిందని నిర్ధారించుకుని సమాచారాన్ని బ్యాంకు అధికారులకు అందించారు. సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించారు. నగదు నిల్వ, విత్డ్రాలకు సంబంధించి ప్రధాన కార్యాలయం నుంచి డేటా తీసుకున్నారు. రూ.18,41,300 చోరీకి గురైనట్టు పోలీసులకు తెలిపారు. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ భారత్ అప్గ్రేడబుల్ ఏటీఎం మెషీన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఏటీఎంలను ఎప్పుడైనా నగదు రీసైక్లింగ్ మెషిన్ (CRM)కి అప్గ్రేడ్ చేయవచ్చు. ఇది దేశంలోనే మొదటి అప్గ్రేడబుల్ ఏటీఎం అని హిటాచీ సంస్థ పేర్కొంది.' మేక్ ఇన్ ఇండియా ' చొరవ కింద తయారు చేసిన ఈ ఏటీఎంలు బ్యాంకులకు మెరుగైన సౌలభ్యాన్ని, సామర్థ్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దేశంలో పనిచేస్తున్న 2,64,000 ఏటీఎంలు/సీఆర్ఎంలలో, హిటాచీ 76,000కు పైగా నిర్వహిస్తోంది. రాబోయే ఎనిమిదేళ్లలో దాదాపు 1,00,000 అప్గ్రేడబుల్ ఏటీఎంల మార్కెట్ను కంపెనీ అంచనా వేసింది.ఏంటీ సీఆర్ఎం మెషీన్లు?సీఆర్ఎం మెషీన్లు అంటే క్యాష్ రీసైక్లింగ్ మెషీన్. దీని ద్వారా నగదు డిపాజిట్, విత్డ్రా రెండు సేవలనూ పొందవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఈ నగదు రీసైక్లింగ్ మెషీన్ల ద్వారా తమ శాఖల వద్ద రౌండ్-ది-క్లాక్ నగదు ఉపసంహరణ, డిపాజిట్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఆఫ్సైట్ ప్రదేశాల్లో బ్యాంకులు సాధారణంగా ఏటీఎంల ద్వారా 24 గంటలూ నగదు ఉపసంహరణ సేవలను మాత్రమే అందిస్తాయి. ఇలాంటి చోట్ల అప్గ్రేడబుల్ ఏటీఎంలను ఏర్పాటు చేసుకుంటే బ్యాంకులు తమ వారి వ్యాపార అవసరాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిపాజిట్, విత్ డ్రా సేవలు విస్తరించడానికి బ్యాంకులకు వీలు కలుగుతుంది. -
ATM మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆసక్తి రేకెత్తిస్తున్న హరీశ్ శంకర్ ‘ఏటీఎం’ టీజర్
బిగ్బాస్ ఫేం వీజే సన్నీ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సిరీస్కి కథ అందించారు. దోపిడీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్కు సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 20న ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ‘ఏటీఎం’టీజర్ని హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్గా ఉంటుంది. ఈ సీరీస్లో దొంగలు రొటీన్గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం`అని అన్నారు. ‘పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు` అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న వీజే సన్నీ ATM, ఎప్పుడంటే?
బిగ్బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే కదా! అయితే ఇదంతా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ ప్రమోషన్స్లో భాగమేనని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. చివరకు వారు అనుకుందే నిజమైంది. వీజే సన్నీ ఏటీఎమ్ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో సుబ్బరాజు, దివి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హరీష్ శంకర్ అందించిన కథను చంద్రమోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏటీఎమ్: పైసల్తో ఆట అనే వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి తెలుగు, తమిళ భాషల్లో జీ5లో ప్రసారం కానుందని ప్రకటించింది చిత్రయూనిట్. A heist that will make you relook at your way of life & startle you to your very core.#ATMOnZee5 - The game of money, #PaisalThoAata, STARTS SOON@VJSunnyOfficial @actorsubbaraju @RoielShree @ravirajdance @KrishnaBurugula @DiviActor@harish2you @chandramohan_c @DilRajuProdctns pic.twitter.com/rKkoheUOQ2 — ZEE5 Telugu (@ZEE5Telugu) January 6, 2023 చదవండి: పంత్ ఉన్న ఆస్పత్రి ఫోటో షేర్ చేసిన నటి -
దొంగతనం చేస్తూ దొరికిపోయిన సన్నీ
-
గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది!
న్యూఢిల్లీ: గతంలో బ్యాంకులోని మన నగదుని తీసుకోవాలంటే.. అయితే బ్యాంకుకు వెళ్లాలి లేదా ఏటీం( ATM) మెషిన్కు వెళ్లి డెబిట్ కార్డ్తో కావాల్సినంత డబ్బులను డ్రా చేసుకోవాలి. కానీ నేటి డిజిటల్ యుగంలో, మీరు డెబిట్ కార్డ్ లేకుండా కూడా ఏటీఎం మెషీన్ నుంచి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం మీకు మీ మొబైల్ మాత్రమే అవసరం. చాలా రోజుల నుంచి ఈ బ్యాంకింగ్ సర్వీస్ నడుస్తోంది. అసలు ఇలాంటి సర్వీస్ ఒకటి ఉందని చాలా మందికి కూడా తెలియదు. డబ్బులు డ్రా చేసేందుకు.. ఏటీఎం అక్కర్లేదు ఇప్పటికే చాలా బ్యాంకులు తమ కస్టమర్లకు కార్డు లేకుండానే డబ్బు తీసుకునే వెసులుబాటును కల్పిస్తున్నప్పటికీ.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తన పరిధిని మరింత పెంచింది. ఈ సౌకర్యం కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) ఉపయోగించనుంది. డెబిట్ కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవాలంటే, మీరు తప్పనిసరిగా స్మార్ట్ఫోన్ని కలిగి ఉండాలి. మీ స్మార్ట్ఫోన్లో భీం(BHIM), పేటీఎం (Paytm), గూగుల్పే (GPay), ఫోన్పే (PhonePe) మొదలైన యాప్లను ఉపయోగించి ద్వారా డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా ఫాలో అయితే సరిపోతుంది.. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి కార్డ్ లేకుండా డబ్బు విత్డ్రా చేసుకునే ఆప్షన్ను ఎంచుకోండి. మీరు యూపీఐ ద్వారా గుర్తింపును అందించే ఎంపికను చూస్తారు. ఆ తర్వాత మీ మొబైల్లో యూపీఐ యాప్ని ఓపెన్ చేసి, మీ ముందు కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేయండి. ఇక్కడి నుంచి ప్రక్రియ మునుపటి మాదిరిగానే ఉంటుంది. మీకు కావలసిన డబ్బును ఎంటర్ చేయండి ఆ తర్వాత విత్డ్రా చేసుకోండి. కార్డ్ లెస్ క్యాష్.. ప్రయోజనాలు ఇవే కార్డు లేకుండా నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం కార్డు స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్ వంటి మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, మీరు కార్డును మీ వద్ద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మీ స్మార్ట్ఫోన్ ఈ పనులన్నింటినీ చేస్తుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ఓరి దేవుడా! ఏకంగా ఏటీఎం యంత్రాన్నే...
సాక్షి, బనశంకరి: ఏటీఎం కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకుని కంటైనర్లో ఉడాయించారు. ఈ ఘటన బెళ్లందూరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హరళూరు రోడ్డు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం కేంద్రంలోకి ఈనెల 10న అర్ధరాత్రి 2.30 సమయంలో చొరబడిన దుండగులు ఏటీఎం యంత్రాన్ని పెకలించి వాహనంలో తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం గమనించిన బ్యాంక్ అధికారులు ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించి బెళ్లందూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చేపట్టామని డీసీపీ గిరీష్ తెలిపారు. ట్రక్తో వచ్చిన దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి అక్కడ ఉన్న సీసీ కెమెరాకు రంగు స్ప్రే చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని పెకిలించి కంటైనర్లో పెట్టుకుని ఉడాయించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో నమోదైనట్లు తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్కు నిప్పు) -
ఇండియాలోనే ఫస్ట్ గోల్డ్ ATM .. ఎలా పని చేస్తుందో చూస్తే షాక్ అవుతారు..
-
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
హైదరాబాద్లో గోల్డ్ ఏటీఎం వచ్చేసింది.. దేశంలోనే తొలిసారి
సనత్నగర్: నగదు ఉపసంహరణ, జమకు ఉపయోగించే ఏటీఎంల తరహాలోనే డెబిట్, క్రెడిట్ కార్డులతో బంగారం విత్డ్రా చేసుకునేందుకు వీలుగా దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్లో గల ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటైన ఈ ఏటీఎంను శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి గోల్డ్ ఏటీఎం నిదర్శనమన్నారు. బంగారాన్ని తీసుకునేందుకు దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను నగరంలో ప్రారంభించడాన్ని ఆమె అభినందించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఈ గోల్డ్ ఏటీఎంలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ తరహా ఏటీఎంలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకివస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గోల్డ్ సిక్కా సంస్థ సీఈఓ సయ్యద్ తరుజ్ మాట్లాడుతూ...ఈ గోల్డ్ ఏటీఎం ద్వారా 99.99% నాణ్యత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలను విత్ డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు తాము జారీ చేసే ప్రీపెయిడ్ కార్డులనూ ఉపయోగించవచ్చన్నా రు. ఒక్కో మిషన్లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన ఐదు కేజీల పసిడిని లోడ్ చేయవచ్చన్నారు. భారత్లో గోల్డ్ మార్కెట్ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్ తీసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే మరిన్ని గోల్డ్ ఏటీఎంల ఏర్పాటు... త్వరలోనే ఎయిర్పోర్ట్, పాతబస్తీలో మూడు ఏటీఎంలు, సికింద్రాబాద్, అబిడ్స్లతో పాటు పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్లలో కూడా గోల్డ్ ఏటీఎంలను ప్రారంభించనున్నామని చెప్పారు. రానున్న రెండేళ్లల్లో దేశవ్యాప్తంగా 3,000 యంత్రాలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వివరించారు. కార్యక్రమంలో వ్యాపార వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి, దర్శకుడు నరసింహారావు, టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, అక్రితి గ్రూప్ చైర్మన్ డాక్టర్ కుల్దీప్ రైజాదా, తెలంగాణ జియో సీఈఓ కేసీ రెడ్డి, గోల్డ్ సిక్కా సంస్థ చైర్పర్సన్ అంబిక బుర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్!
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమల్లోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవన్నీ తరచూ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి, కొన్ని కొత్తవి వస్తుంటాయి. అయితే వీటిలో కొన్నింటిపై మాత్రం సామన్యులు అప్రమత్తంగా ఉండాలండోయ్. ఎందుకంటే అవి వారి నగదుపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ డిసెంబరు 1 నుంచి అమలులోకి వచ్చే రూల్స్పై ఓ లుక్కేద్దాం.. LPG Gas Cylinder Price: ప్రతీ నెల ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరల్ని అంతర్జాతీయ పరిణమాలను అనుసరించి సవరిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్కొసారి సిలిండర్ ధరలనేవి పెరగడం, తగ్గడం సహజమే. కొన్ని ధరలు స్థిరంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సారి డిసెంబర్ 1కి సంబంధించిన ధరల్ని ఆయిల్ కంపెనీలు తాజా సమాచారాన్ని తెలపాల్సి ఉంది. Railway time table: చలికాలం వాతావరణ పరిస్థితులు, పొగమంచు కారణంగా, రైళ్ల టైమ్ టేబుల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అవి డిసెంబర్ 1నుంచి అమలులోకి రానుంది. 13,000 ప్యాసింజర్ రైళ్లు, 7,000 గూడ్స్ రైళ్లు, 30 రాజధాని రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్లో మార్పులు ఉన్నాయి. ATM withdraw: డిసెంబర్ 1 నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కస్టమర్లు కోసం పీఎన్బీ ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసే ప్రక్రియ మారనుంది. ఇది మనుపటిలా కాకుండా ఇందులో కాస్త మార్పులను జత చేశారు. కస్టమర్లు తమ డెబిట్ కార్డ్ నుంచి డబ్బులను విత్డ్రా చేయాలంటే ఇకపై వన్ టైమ్ పాస్వర్డ్ (OTP) అవసరం. ఏటీఎం మెషీన్లో మీ డెబిట్ కార్డ్ను చొప్పించిన తర్వాత, ఖాతాదారులు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీని అందుకుంటారు. అలా వచ్చిన OTPని నమోదు చేసిన తర్వాత, మీ ఏటీఎం పిన్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. PNB KYC: పంజాబ్ నేషనల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు డిసెంబర్ 12 లోగా కేవైసీ అప్డేట్ చేసుకోవాలి సూచించింది. ఇది చేయకపోతే కస్టమర్ల అకౌంట్పై ఆంక్షలు తప్పవని పీఎన్బీ హెచ్చరించింది. Hero Moto Corp: హీరో బైక్ లేదా స్కూటర్ కొనాలనుకునేవారు ఇది షాకిచ్చే వార్త అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో పోలిస్తే ఈ డిసెంబర్ నుంచి హీరో బైక్ను కొనాలంటే కాస్త ఎక్కువ ఖర్చు చేయక తప్పదు. కంపెనీ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరల్ని రూ.1,500 వరకు పెంచింది. పెరిగిన ధరలు డిసెంబర్ 7 నుంచే అమలులోకి రానున్నాయి. Digital Rupee: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రీటైల్ పైలట్ ప్రాజెక్ట్ను డిసెంబర్ 1న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్లోజ్డ్ యూజర్ గ్రూప్ అనగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో, కేవలం ఎంపిక చేసిన వ్యాపారులు, కస్టమర్లు మాత్రమే ఈ పైలట్ ప్రాజెక్ట్లో ఉంటారు. చదవండి: ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్బై, కేటీఆర్ రియాక్షన్ -
ఫోన్పే వాడుతున్నారా? అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు గురించి తెలుసా!
ఫోన్పే(Phone Pay) .. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటి నుంచి ఈ పేరు బాగా పాపలర్ అయిపోయింది. పర్సలో మనీ లేకపోయినా పర్లేదు ఫోన్లో ఫోన్పే ఉంటే చాలు అనుకునేంతగా ప్రజాదారణ పొందింది ఈ యాప్. ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్డ్ కస్టమర్లతో పలు సేవలు అందిస్తూ భారత్లో దూసుకుపోతుంది ఫోన్పే. ఎప్పటికప్పడు కొత్త సేవలో కస్టమర్లను ఆకట్టుకుంటూ వారి సంఖ్యను పెంచుకుంటున్న ఈ యాప్ తాజాగా మరో సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త సేవల మీ కోసం.. ఇది వరకు ఫోన్పే ఉపయోగించాలంటే తప్పనిసరిగా మన డెబిట్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే డెబిట్ కార్డు అవసరం లేకుండా సరికొత్త సేవలను ఫోన్పే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో వినియోగదారుడు కేవలం ఆధార్ కార్డు ఉపయోగించి యూపీఐ సేవలు పొందవచ్చని ఫోన్ పే తెలిపింది. ఇకపై ఫోన్ పేలో మీ డెబిట్ కార్డ్ అవసరం లేకుండా కేవలం మీ ఆధార్ కార్డ్ ద్వారా ఫోన్పేలో మీ యూపీఐ (UPI)ని సెటప్ చేయాలనుకుంటే, సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి. ►ముందుగా ప్లేస్టోర్ (PlayStore) లేదా యాప్ స్టోర్( App Store) నుంచి ఫోన్పేని డౌన్లోడ్ చేసుకోండి. ►ఆపై ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్ని యాడ్ చేయండి, తర్వాత OTP వస్తుంది దాని ఎంటర్ చేయండి. ►ఇప్పుడు మై మనీ పేజీకి వెళ్లి, ఆపై పేమెంట్స్ మెతడ్స్ (payments method)పై క్లిక్ చేయండి. ►తర్వాత మీ బ్యాంక్ని ఎంచుకోని, 'Add New Bank Account'పై క్లిక్ చేయండి. ► మీ బ్యాంక్ని సెలక్ట్ చేసుకుని, మీ ఫోన్ నంబర్ని ధృవీకరించాల్సి ఉంటుంది. ►దీంతో ఫోన్పే మీ ఖాతా వివరాలను యాక్సెస్ పొందుతుంది, వీటితో పాటు మీ అకౌంట్ యూపీఐకి లింక్ అవుతుంది. ►తర్వాత మీ డెబిట్/ఏటీఎం కార్డ్ వివరాలను నమోదు చేయవచ్చు లేదా ఆధార్ కార్డ్ ఎంపికను ఎంచుకోవచ్చు. ►మీ ఆధార్లోని చివరి ఆరు అంకెలను నమోదు చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు OTP వస్తుంది. ► OTPని ఎంటర్ చేసి ఆపై మీ యూపీఐ పిన్ నెంబర్ సెట్ చేసుకోవడంతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: వణుకుతున్న ఉద్యోగులు.. డిసెంబర్ నాటికి మాంద్యంలోకి ఆ దేశాలు! -
ఏటీఎం ఉపయోగిస్తే చార్జీల మోత
-
బెంగళూరులో ఇడ్లీ ఏటీఎం మిషన్ ...
-
వాట్ యాన్ ఐడియా! ఇడ్లీ ఏటీఎం మిషన్...హాయిగా లాగించేయి గురు!
ఏటీఎం మెషిన్లో డబ్బులు తీసుకోవడం, డిపాజిట్ చేయడం వరకు మనకు తెలుసు ఔనా!. ఇక నుంచి టిఫిన్స్కి సంబంధించిన ఏటీఎంలు కూడా రానున్నాయండి. ఔను! ప్రస్తుతం ఇడ్లీ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చారు బెంగళూరుకి చెందిన యువ స్టార్ట్ అప్పర్లు. వివరాల్లోకెళ్తే...ఇక నుంచి మహా నగరాల్లోకి ఇడ్లీ ఆటోమేటిడ్ మేకింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ సరికొత్త రోబోటిక్ మిషన్ని బెంగళూరుకి చెందిన ఎంట్రప్రెన్యూర్స్ శరణ్ హిరేమత్, సురేష్ చంద్రశేఖరన్ రూపొందించారు. మన ఏటీఎం మిషన్లానే 24x7 సేవలందిస్తుంది. చాలా ఫ్రెష్గా వేడివేడి ఇడ్లీలను అందిస్తుంది. ఒక్కషాట్లో 72 ఇడ్లీలను కేవలం 12 నిమిషాల్లో అందిస్తుంది. అంతేకాదండోయ్ బయట హోటల్స్ రెస్టారెంట్స్ మాదిరిగా టిఫిన్ తోపాటు చట్నీ, కారప్పొడి, సాంబర్తో సహా అందిస్తోంది. ఐతే మనం ఈ మిషన్ వద్దకు వచ్చి మెనులో మనకు నచ్చిన టిఫిన్ని సెలక్ట్ చేసుకుని దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి బిల్ పే చేస్తే...55 సెకండ్లలో మన ఆర్డర్ ప్యాక్ చేసి మన ముందు ఉంటుంది. ఈ ఆలోచన హిరేమత్కి 2016లో ఒక రోజు తన కూతురు అనారోగ్యం బారిన పడినప్పుడూ వచ్చినట్లు చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి తన కూతురుకి వేడి వేడి ఇడ్లీ దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నాడు. అప్పుడే తనకు ఏ సమయంలోనైనా వేడివేడిగా ఫ్రెష్గా లభించాలే ఆహారం అందించాలని నిర్ణయించుకుని ఈ ఆటోమెటిష్ మిషన్ని తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మిషన్లో ఇడ్లీ, వడ అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సౌత్ ఇండియన్స్ వంటకాలకి సంబంధించిన తొలి అల్పాహర ఆటోమెటిక్ మిషన్ అని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఏటీఎం ప్రస్తుతం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్లను విస్తరింప చేయడమే కాకుండా ఈ ఏటీఎంలో జ్యూస్, రైస్, దోశ వంటి వాటిని కూడా అందించే ఏర్పాటు చేయాలనకుంటున్నట్లు తెలిపాడు. (చదవండి: వృద్ధురాలి కంటి నుంచి ఏకంగా 23 కాంటాక్ట్ లెన్స్ తీసిన వైద్యులు) -
క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?
ఇటీవల కాలంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఈ డిజిటల్ చెల్లింపుల కంటే లిక్విడ్ క్యాష్తో మన అవసరాల్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో డెబిట్ కార్డుతో డబ్బుల్ని డ్రా చేస్తుంటాం. మరి క్రెడిట్ కార్డుతో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకునే సదుపాయం ఉంది కదా. డబ్బుల్ని డ్రా చేయొచ్చా? డ్రా చేస్తే ఏమవుతుంది? ఆర్ధిక నిపుణులు ఏం చెబుతున్నారు. ఏటీఎంలో డెబిట్ కార్డును ఎలా ఉపయోగిస్తామో.. క్రెడిట్ కార్డును కూడా అలాగే వినియోగించుకోవచ్చు. అయితే, క్రెడిట్ కార్డుల విషయంలో ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకుంటే కొన్ని అదనపు ఛార్జీలు బ్యాంకులకు కట్టాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఆర్ధికంగా అంత మంచి పద్దతి కాదని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మీరు మీ క్రెడిట్ కార్డ్తో ఏటీఎం నుండి నగదును విత్డ్రా చేస్తే.. సదరు విత్ డ్రాల్ పై సర్వీస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణంగా మీరు ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదు పై చెల్లించాలి. మొత్తంగా ఆ అదనపు ఛార్జీలు 2.5% నుండి 3% వరకు ఉంటాయి. ఈ ఛార్జీలు మీ నెక్ట్స్ క్రెడిట్ కార్డు బిల్ జనరేట్ స్టేట్మెంట్లో యాడ్ అవుతాయి. వడ్డీ సాధారణంగా డెబిట్ కార్డుతో నెలకు 5 సార్లు ఉచితంగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్తో అలా కాదు. బ్యాంకులు అందించే క్రెడిట్ కార్డుతో ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేస్తే భారీగా వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసిన నెంబర్ను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ప్రారంభ వడ్డీ నెలకు 3.5% వరకు ఉండవచ్చు. సిబిల్ స్కోర్ తగ్గుతుందా? క్రెడిట్ కార్డ్ని ఉపయోగించి డబ్బుల్ని డ్రా చేసుకుంటే ఆ ప్రభావం నేరుగా క్రెడిట్ కార్డు స్కోర్పై ప్రభావితం చూపదు. అయినప్పటికీ, అధిక ఛార్జీల కారణంగా మీరు కనీస బకాయిని చెల్లించడంలో విఫలం కావచ్చు. మీ క్రెడిట్ కార్డ్ వినియోగం పెరుగుతుంది. ఇది మీ క్రెడిట్ స్కోర్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రయోజనాలు, డీల్స్ రెస్టారెంట్లు, దుకాణాలలో చెల్లించడానికి మీ క్రెడిట్ కార్డ్ని స్వైప్ చేసినప్పుడు, బ్యాంకులు మీకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. కానీ, మీరు నగదు ఉపసంహరించుకోవడానికి మీ క్రెడిట్ కార్డ్ని ఉపయోగించినప్పుడు ఈ అదనపు ప్రయోజనాల్ని పొందలేం. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో తప్పా క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేయొద్దని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఏటీఎం వద్దే బండరాయిలా నుంచొన్న వ్యక్తి... తీరా దగ్గరికెళ్తే...
ఏటీఎం వద్ద డబ్బులు డ్రా చేసుకోవడం లేదా డిపాజిట్ చేయడం వంటివి సర్వ సాధారణం. ఐతే ఎవరైన మనకంటే ముందు డబ్బులు తీసుకుంటుంటే కాసేపు ఆగుతాం జౌనా! పాపం అలానే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏటీఎం వద్ద డబ్బులు తీసుకుంటున్నాడు కదా అని ఆగుతారు. గంటలు గంటలు గడిచిపోతాయే కానీ ఎంతసేపటికి కదలడు. ఇక విసిగిపోయి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తట్టగా ఆవ్యక్తిని చూసి ఒక్కసారిగా అక్కడ ఉన్న జనాలంతా షాక్ అయిపోతారు. అసలేం జరిగిందంటే...యూకేలోని టెస్కో క్యాష్ పాయింట్ సమీపంలో ఉన్న ఏటీఎం వద్ద ఒక వ్యక్తి నుంచుని ఉంటాడు. ఎంతకీ ఒక పట్టాన కదలడు. ఒకపక్క జనాలంతా క్యూలో నుంచుని అలానే ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఎంతసేపు ఇలా అని కోపంతో దగ్గరకు వచ్చి చేత్తో తడతాడు. అయినా కదలడు. దీంతో అనుమానంతో దగ్గరకు వచ్చి చూస్తే అది బొమ్మ. దీంతో వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుతారు. అబ్బా టైం వేస్ట్ చేశామే గానీ అసలు ఎందుకు కదలకుండా అలా ఉన్నాడని గమనించ లేకపోయామే అనుకున్నారు వారంతా. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తె వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి. Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK — UB1UB2 Southall (@UB1UB2) September 30, 2022 (చదవండి: Viral Video: జలపాతానికే రంగులు వేసే స్టంట్...పర్యావరణ అధికారులు ఫైర్) -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎంల ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వీటి ద్వారా కస్టమర్ ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.10,000 నగదు స్వీకరించవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్నకు చెందిన బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని బ్యాంక్లకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. ఖాతా నిల్వ తెలుసుకోవచ్చు. ద్వితీయ శ్రేణి నగరాలు, ఉప పట్టణ ప్రాంతాల్లో దశలవారీగా దేశవ్యాప్తంగా 2023 మార్చి నాటికి 1.5 లక్షల మైక్రో ఏటీఎంలను అందుబాటులోకి తేనున్నట్టు బుధవారం బ్యాంక్ ప్రకటించింది. ఏటీఎంలు తక్కువగా ఉండి, నగదు అవసరాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని పరిచయం చేస్తామని వెల్లడించింది. మైక్రో ఏటీఎం లావాదేవీలు జరిపేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్తో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానమైంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న వినియోగదార్లను శక్తివంతం చేసేందుకే ఈ కార్యక్రమానికి శ్రీ కారం చుట్టామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీవోవో అనంతనారాయణన్ తెలిపారు. చదవండి: స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
కలకలం.. ఏటీఎం నుంచి నకిలీ నోటు!
గుత్తి(అనంతపురం జిల్లా): స్థానిక ప్రధాన ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి నకిలీ రూ.500 బయటపడింది. వివరాలు.. గుత్తిలోని లచ్చానపల్లి రోడ్డులో నివాసముంటున్న సీఆర్పీఎఫ్ విశ్రాంత జవాన్ కిష్టప్ప బుధవారం ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎం కేంద్రం నుంచి రూ.9,500 డ్రా చేశాడు. అందులో ఓ నకిలీ రూ.500 నోటు వచ్చింది. విషయాన్ని వెంటనే ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై ఎస్బీఐ అధికారులు స్పందించలేదని, ఏటీఎం కేంద్రంలో డబ్బు డిపాజిట్టు విషయం తమ పరిధిలో కాదని వారు పేర్కొన్నట్లు వివరించాడు. చదవండి: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్ ఫాదర్’ -
ఈ బ్యాంకింగ్ సేవలు ఫ్రీ కాదండోయ్.. లిమిట్ దాటితే బాదుడే!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతీ ఒకరికి ఉంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇటీవల కాలంలో బ్యాంక్ సంస్థలు ఆన్లైన్, ఆఫ్లైన్లో తమ సేవలను అందిస్తున్నాయి. అయితే నగదు లావాదేవీల ఎస్ఎంఎస్(SMS), ఐఎంపీఎస్(IMPS) ఫండ్ బదిలీ, చెక్ క్లియరెన్స్ , ఏటీఎం విత్డ్రాల్ ఇలా ఏ సౌకర్యం పూర్తిగా ఉచితం కాదు. అన్ని సేవలకు, బ్యాంక్ నిబంధనల అనుసరించి తమ కస్టమర్ల నుంచి కొంత ఛార్జీని వసూలు చేస్తుంది. ఇది తెలియక మన జేబులో పైసలు చార్జీల రూపంలో బ్యాంక్లకు కడుతున్నాం. ఓసారి ఆ సేవల గురించి తెలసుకుందాం. నగదు లావాదేవీ బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరు నగదు లావాదేవీలు చేయడం సహజం. అయితే ఈ లావాదేవీని నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే చేయవచ్చు. మీరు నిర్ణీత పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే, దానికి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ ప్రతి బ్యాంకుకు దాని నిబంధనల ప్రకారం మారుతూ ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులో 20 నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ను నిర్దిష్ట పరిమితి వరకు నిర్వహించాలి. మీ ఖాతాలో అంత కంటే తక్కువ మొత్తం ఉన్నట్లయితే, కనీస బ్యాలెన్స్ లేని కారణంగా ఛార్జ్ చెల్లించాలి. అన్ని బ్యాంకుల్లో మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్, దానిని నిర్వహించనందుకు ఛార్జీల పరిమితి భిన్నంగా ఉంటాయి. ఐఎంపీఎస్ ఛార్జీలు అన్ని బ్యాంకులు నెఫ్ట్( NEFT), ఆర్టీజీఎస్( RTGS) లావాదేవీలను కస్టమర్లకు ఉచితంగా అందిస్తాయి. అయితే చాలా బ్యాంకులు ఇప్పటికీ ఐఎంపీఎస్( IMPS ) లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీ రూ.1 నుంచి రూ.25 వరకు ఉంటుంది. లక్ష వరకు ఓకే మీ చెక్కు రూ. 1 లక్ష వరకు ఉంటే, మీరు బ్యాంకుకు ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ఎక్కువ మొత్తం ఉంటే క్లియరెన్స్ ఛార్జీని చెల్లించాలి. మరోవైపు, చెక్కుల విషయంలోనూ పరిమితి సంఖ్య వరకు ఉచితంగా ఇస్తారు. అంతకు మించి చెక్కుల కావాలంటే వాటికోసం మీరు ధర చెల్లించాలి. ఏటీఎం లావాదేవీ ఏటీఎం (ATM) నుంచి నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం కూడా నిర్ణీత సమయం వరకు మాత్రమే ఉచితంగా లభిస్తుంది. పేర్కొన్న సంఖ్య కంటే ఎక్కువ లావాదేవీల జరిపితే అప్పటి నుంచి చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో బ్యాంకు వసూలు చేసే మొత్తం వేర్వేరుగా ఉంటుంది. ఇందుకు చాలా బ్యాంకులు రూ.20-50 వరకు వసూలు చేస్తున్నాయి. ఎస్ఎంఎస్ కూడా ఫ్రీ కాదండోయ్ మీ ఖాతాలో డబ్బు క్రెడిట్ అయినప్పుడు లేదా డెబిట్ అయినప్పుడు బ్యాంక్ మీకు ఎస్ఎంఎస్ పంపుతుంది. దీనికి బ్యాంకులు కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. కానీ చాలా మందికి దీని గురించి తెలియదు ఎందుకంటే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. డెబిట్ కార్డు పోతే.. పైసలే మీరు మీ డెబిట్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, మీరు మరొక కార్డును పొందడానికి ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీ రూ. 50 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. ఒక్కో బ్యాంకు ఒక్కో ఛార్జీలను నిర్దేశించింది. చదవండి: టైం వచ్చింది వెళ్దాం.. ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ చేస్తున్న ఎయిరిండియా -
అలర్ట్: ఏటీఎం కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్!
ఏటీఎం కార్డ్ వినియోగదారులకు బ్యాంకులు భారీ షాకిచ్చాయి. ఏటీఎం విత్ డ్రా పై అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం సెంటర్లలో బ్యాంకులు విధించిన 5 ఫ్రీ ట్రాన్సాక్షన్ల కంటే ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేసుకుంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. ఈ తరుణంలో ఏటీఎంలలో పరిమితికి మించిన ప్రతీ విత్ డ్రాల్పై 17 రూపాయలు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై 6 రూపాయలు అదనంగా బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఏటీఎం ఇన్స్టాలేషన్, మెయింటెన్స్ ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతినెల ఏటీఎం సెంటర్ల నుంచి 5 సార్ల లోపు డబ్బుల్ని డ్రా చేస్తే..అందుకు అదనపు చెల్లింపులు చెల్లించే అవకాశం లేదు. అయితే తాజాగా ఆ ఐదు సార్లు దాటితే అదనపు రుసుము వసూలు చేసుకోవచ్చని ఆర్బీఐ.. బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీంతో కస్టమర్ల నుంచి ఏటీఎం లావాదేవీలపై రుసుమును వసూలు చేసేందుకు సిద్ధ మయ్యాయి. గతేడాది జూన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాది జూన్లో నెలవారీ అదనపు ట్రాన్సాక్షన్లపై రూ.21 వసూలు చేసుకోవచ్చని బ్యాంకులకు చెప్పింది. దీంతో ఈ ఏడాది జనవరి 1నుంచి ఏటీఎంలో అదనపు విత్ డ్రాపై రూ.21వసూలు చేస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్బీఐ ఏటీఎంలో మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల నుంచి బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది. బ్యాంకులు సైతం ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. ఆగస్ట్ 1 నుంచి ఏటీఎం మనీ విత్ డ్రాపై అదనపు రుసుములు వసూలు చేయడం ప్రారంభించాయి. ఎన్ని ట్రాన్సాక్షన్లకు ఉచితం ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పరిమిత సంఖ్యలో ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వినియోగదారులు ప్రతి నెలా వారి (ఉదాహరణకు ఏ బ్యాంక్ ఏంటీఎం ఉంటే ఆ బ్యాంక్) ఏటీఎంలో 5 ఫ్రీ ట్రాన్సాక్షన్లు, ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్ది అయి ఉండి మీరు బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు 3 ఫ్రీ ట్రాన్సాక్షన్లకు అనుమతి ఇస్తున్నాయి. ఇక నాన్ మెట్రో కేంద్రాల్లోని కస్టమర్లు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. చదవండి👉 ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
ఏటీఎంను బద్దలు కొట్టిన వ్యక్తి.. డబ్బులు రాలేదని కోపంతో..
శ్రీకాకుళం (పొందూరు): డబ్బులు రాలేదనే కోపంతో ఏకంగా ఏటీఎం మిషన్నే బద్దలు కొట్టాడో వ్యక్తి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరులో సోమవారం జరిగింది. ఎస్ఐ లక్ష్మణరావు చెప్పిన వివరాలు మేరకు.. బూర్జ మండలానికి చెందిన పైడి సత్యనారాయణ నగదు కోసం సోమవారం పొందూరు బస్టాండ్లోని టాటా ఏటీఎంకు వెళ్లారు. తన ఏటీఎం కార్డును ఉపయోగించి డబ్బు డ్రా చేసే ప్రయత్నం చేయగా నగదు రాలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సత్యనారాయణ ఏటీఎం మిషన్ను బద్దలు కొట్టాడు. పోలీసులకు దీనిపై సమాచారం అందింది. వెంటనే వారు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏటీఎం అనుకుని ఎంత పని చేశారు.. చూసుకోవాలి కదా !
మైసూరు: లక్షల్లో డబ్బులు ఉన్న ఏటీఎం యంత్రం అనుకుని దొంగలు పాస్బుక్ను ప్రింట్ చేసే యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఈ తికమక సంఘటన మైసూరు నగరంలోని లష్కర్ మహల్లాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో చోటు చేసుకుంది. దొంగలు చోరీ చేసే హడావుడిలో ఏటీఎం యంత్రం అనుకుని పాస్బుక్ ప్రింటింగ్ యంత్రాన్ని పెకలించుకుని తీసుకెళ్లారు. సిబ్బంది ఏటీఎంను రెండురోజుల పాటు మూసి ఉంచారు. గురువారం ఉదయం తెరిచి చూసిన సెక్యూరిటీ గార్డు ఆ యంత్రం లేకపోవడం చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. కాగా, మండ్య, మైసూరు ప్రాంతాల్లో తరచూ ఏటీఎంలను దొంగలు ఎత్తుకెళ్లడం గమనార్హం. చదవండి: Hyderabad: ఎవరికైనా చెబితే చంపేస్తా.! -
ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!
ATM was dispensing extra cash: మహారాష్ట్రాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మెషీన్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం వంద రూపాయల(రూ.100) నోట్లను మిత్రమే ఉంచుతారు.. ఐతే ఒక అతను రూ.500లు డ్రా చేద్దామని వెళ్తే ఏకంగా రూ.500ల నోట్లు ఐదు వచ్చాయి. అంటే అతను రూ.500లు డ్రా చేస్తే ఏటీఏం మెషీన్ ప్రకారం వంద రూపాయల(రూ.100) నోట్లు ఐదు రావడానికి బదులు ఐదు ఐదువందల రూపాయల(రూ.500) నోటులే వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు అతను మళ్లీ ఇంకోసారి ఇలానే డబ్బలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన నాగ్పూర్కి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఖపర్ఖేడా పట్టణంలో ఒక ప్రైవేట్ ఏటీఎం మెషీన్లో చోటు చేసుకుంది. ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో జనాలు ఆ ఏటీఎం మిషీన్ వద్దకు క్యూ కట్టారు. ఐతే సదరు బ్యాక్ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏటీఎం మిషీన్ని మూసేంతవరకు ఈ తంతు జరిగింది. ఏటీఎంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ ఏటీఎంని రూ.100/-ల డినామానేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్దేశిస్తే...బదులుగా అనుకోకుండా పొరపాటున రూ.500/- డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్కి ఎదురైన చేదు అనుభవం) -
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!
ఏటీఏం కార్డ్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో ఏటీఎం కార్డ్తో పనిలేకుండా యూపీఐ పేమెంట్ ద్వారా ఏటీఏం సెంటర్లో ఈజీగా డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం ప్రస్తుతం ట్రయల్ వెర్షన్లో ఉండగా త్వరలో అందరికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. దేశంలో యూపీఐ పేమెంట్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా కారణంగా మునుపెన్నడూ లేని విధంగా యూజర్లు క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్పై మొగ్గు చూపుతున్నారు. వైరస్ వ్యాప్తితో పాటు బ్యాంక్కు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటు నుంచి ఆన్లైన్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేయడంతో యూజర్లు యూపీఏ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏటీఎం సెంటర్లలో జరిగే నేరాల్ని అరికడుతూ...యూపీఏ పేమెంట్స్ను మరింత పెంచేలా ఎన్సీఆర్ కార్పొరేషన్ అనే సాఫ్ట్వేర్ సంస్థ తొలిసారి యూపీఐ నెట్వర్క్ ఫ్లాట్ ఫామ్స్తో కలిసి ఇంటర్ ఆపరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రాల్(ఐసీసీడబ్ల్యూ) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొని రానుంది. ఈ ఫ్లాట్ ఫామ్తో యూజర్లు కార్డ్ లేకుండా ఏటీఎం సెంటర్లలో గూగుల్పే, పేటీఎం, ఫోన్తో పే పాటు ఇతర యూపీఐ పేమెంట్స్తో మనీ విత్ డ్రాల్ చేసుకునే సౌకర్యం ఉంటుందని ఎన్సీఆర్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. కార్డ్ లెస్ మనీ విత్ డ్రాల్ జరగాలంటే..సంబంధిత బ్యాంక్లకు చెందిన ఏటీఎంలలో ఈ కొత్త యూపీఏ పేమెంట్ సదుపాయం ఉండాలని చెప్పారు. కార్డ్ లేకుండా ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా ఎలా చేయాలంటే? ►ముందుగా ఏటీఎం మెషిన్లో విత్ డ్రా క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి ►వెంటనే మీకు యూపీఐ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్పై ట్యాప్ చేయాలి ►అలా ట్యాప్ చేస్తే ఏటీఎం స్క్రీన్పై క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది ►ఆ కోడ్ను మీ యూపీఐ పేమెంట్(ఉదాహరణకు గూగుల్ పే) ను స్కాన్ చేసుకోవాలి ►స్కాన్ చేస్తే మీరు మనీ ఎంత డ్రా చేయాలనుకుంటున్నాని అడుగుతుంది. మీ అవసరాన్ని బట్టి మనీ డ్రా చేసుకోవచ్చు. ప్రస్తుతం లిమిట్ రూ.5వేల వరకు ఉండనుందని తెలుస్తోంది. ►మీకు ఎంత క్యాష్ కావాలో..నెంబర్ (ఉదాహరణకు రూ.2వేలు) ఎంట్రీ చేసిన తర్వాత హింట్ ప్రాసెస్ బటన్ క్లిష్ చేస్తే మనీ విత్ డ్రా అవుతుంది. డీఫాల్డ్గా మీ యూపీఐ అకౌంట్ క్లోజ్ అవుతుంది. చదవండి👉వాటిని దాటేయనున్న డిజిటల్ వాలెట్లు -
వాటర్ ఏటీఎం.. ఎనీ టైం మూసుడే
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకని మూడేళ్ల క్రితం నగరవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంల పేరిట కియోస్క్లను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ.. అవి పనిచేయకున్నా.. పత్తాలేకుండా పోయినా పట్టించుకోలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ వేసవి రావడంతో 60 ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఏజెన్సీలు శుద్ధమైన నీటిని 24 గంటల పాటు తక్కువ ధరకు అందజేయాలనే తలంపుతో గతంలో వీటిని ఏర్పాటు చేశారు. కొద్దిరోజులు మాత్రం పనిచేసిన ఇవి క్రమేపీ పనిచేయడం మానేశాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా తెరవలేదని చెబుతున్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నారు. రోజుకు 5వేల నుంచి 10వేల లీటర్ల తాగునీటిని పంపిణీ చేసే, ఈ అంశంలో తగిన అనుభవమున్న సంస్థలను ఈసారి పిలుస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కియోస్క్ ఇన్స్టలేషన్, విద్యుత్ చార్జీలు, ట్రేడ్లైసెన్స్ తదితరాలన్నీ ఏజెన్సీ బాధ్యతే అని చెప్పారు. అంతేకాదు.. కేటాయించిన స్థలానికి లీజు ధర కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండరు దక్కించుకునే సంస్థలకు మూడేళ్ల వరకు సదరు స్థలాల్ని లీజుకిస్తామని, పనితీరును బట్టి అనంతరం పొడిగింపు ఉంటుందని తెలిపారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, నిర్వహణ చేయని వాటిపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో ఏర్పాట్లకు ఉత్సాహం చూపుతున్న సంస్థలు.. అనంతరం చేతులెత్తేస్తున్నాయి. దాని బదులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే వాటర్బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని, కియోస్క్లలో పనిచేసే వారికి మాత్రం వేతనాలు చెల్లించడమో లేక మరో ప్రత్యామ్నాయమో చూపితే మేలనే అభిప్రాయాలున్నాయి. లేదా సీఎస్సార్ కింద నిర్వహణను కార్పొరేట్ సంస్థలకిచ్చినా ఉపయోగముంటుందని చెబుతున్నవారు కూడా ఉన్నారు. వాటర్ కియోస్క్లు, లూకేఫ్ల ఏర్పాటు పేరిట విలువైన స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు లీజు కివ్వడం అవి లీజుఅద్దెలు చెల్లించకున్నా, ఒప్పందానికనుగుణంగా పనులు చేయకున్నా చర్యలు లేకపోవడంతో ఇలాంటి విధానాల వల్ల ప్రభుత్వ స్థలాలు.. ముఖ్యంగా ఫుట్పాత్లు వంటివి సైతం అన్యాక్రాంతమై ఇతర వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జోన్కు 10 చొప్పున.. జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో జోన్కు పది చొప్పున మొత్తం 60 వాటర్ కియోస్క్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వాటి టెండరు పూర్తయి.. ఇన్స్టలేషన్.. తదితర కార్యక్రమాలు ముగిసి అందుబాటులోకి వచ్చేప్పటికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఈలోగా వేసవి ముగిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. టెండరు పొందే సంస్థలకు 300 చదరపు అడుగుల స్థలాన్ని జీహెచ్ఎంసీ కేటాయిస్తుంది. టెండరు ద్వారా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థలు ప్రజలు శుద్ధమైన, చల్లని నీటిని దిగువ ధరలకు అందజేయాలి. (చదవండి: హైదరాబాద్ డాక్టర్కు బ్రిటిష్ అత్యున్నత అవార్డు) -
అనూహ్య నిర్ణయం! ఏటీఎంలు అన్నీ బంద్..!
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రిప్టోకరెన్సీలు బిట్కాయిన్, ఈథిరియం, డోజీకాయిన్ విలువ గణనీయంగా పెరిగాయి. దీంతో ఆయా క్రిప్టోకరెన్సీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ కూడా అమాంతం పెరిగాయి. ఇదిలా ఉండగా బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ఏటీఎంలపై యుకే ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చట్ట విరుద్దమైనవే..! యూకేలోని క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లకు ఆ దేశ ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) గట్టి షాక్ను ఇచ్చింది. క్రిప్టో ఎక్సేఛేంజ్స్పై కొత్త ఉత్తర్వులను జారీ చేసింది. క్రిప్టో ఏటీఎం ఆపరేటర్లు వారి మెషీన్లు క్లోజ్ చేయాలని ఆదేశించింది. లేదంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కొత్త రూల్స్ ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్ సర్వీసులు అందించే క్రిప్టో కరెన్సీ ఏటీఎంలు అన్నీ ఎఫ్సీఏ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్రిప్టో ఏటీఎంలు అన్నీ యూకే మనీ ల్యాండరింగ్ నిబంధనలకు అనుగుణంగానే పని చేయాల్సి ఉంటుంది. చట్టవిరుద్దంగా క్రిప్టో కరెన్సీ ఏటీఎం సర్వీసులు అందిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలను జారీ చేసింది. క్రిప్టో లావాదేవీలు సులువు..! యుకేతో పాటుగా పలు దేశాల్లో ఇన్వెస్టర్లకు సులవుగా క్రిప్టోలను కొనుగోలు లేదా సేల్ చేసేందుకుగాను క్రిప్టో ఎటీఎంలను ఎక్సేఛేంజ్స్ ఏర్పాటుచేశాయి. ఇవి సాధారణ ఎటీఎం వలె కన్పిస్తాయి. ప్రజలు తమ బ్యాంక్ కార్డ్లను ఉపయోగించి బిట్కాయిన్ వంటి క్రిప్టో-కరెన్సీ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.కాగా యుకేలోని క్రిప్టో-కరెన్సీ సేవలను అందించే ఏ కంపెనీకి క్రిప్టో-ATMని ఆపరేట్ చేయడానికి లైసెన్స్ లేదు. క్రిప్టో ఏటీఎం డైరెక్టరీ కాయిన్ ఎటీఎం రాడార్ ప్రకారం..యుకేలో సుమారుగా 81 ఫంక్షనల్ క్రిప్టో ఎటీఎంలు ఉన్నాయి.ఎఫ్సీఏ నిర్ణయంతో ఆ దేశ క్రిప్టో ఇన్వెస్టర్లకు కొత్త చిక్కులను తెచ్చిపెట్టనుంది. చదవండి: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్ నిర్ణయం..! కారణం అదేనట..? -
బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు. (చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..) -
ఏటీఎం మిషన్లో వేయాల్సిన నగదుతో జంప్!... దంపతులను బురిడీ కొట్టించినదొంగ!
మాండ్య : మండ్య జిల్లా మద్దూరు పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన దంపతులను ఓ ఘరానా మోసగాడు వంచించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మహదేవయ్య, మమత దంపతులు ఈనెల 2న తన కుమారుడు ఉన్నత చదువుల కోసం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ. 50 వేలు తీసుకుని మద్దూరులోని కెనరా బ్యాంక్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బ్యాంకులో వినియోగదారులు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మిషన్లో వేయాలని సూచించారు. వారి వెనుకాలే ఓ వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ ఉద్యోగి తరహాలో వారి వద్దకు వచ్చాడు. నగదు ఏటీఎం మిషన్లో తమ ఖాతాలో డిపాజిట్ చేయాలని కోరారు. మోసగాడు వారిని చూపు మళ్లించి నగదు తన జేబులో పెట్టుకుని, ఖాతాలో వేసినట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో దంపతులు కుమారుడికి ఫోన్ చేసి నగదు వేశామని చెప్పారు. తనకు ఇంకా నగదు పడలేదని చెప్పడంతో బ్యాంకు సిబ్బందితో విచారించారు. సర్వర్ సమస్య ఉంటుందని, వారం రోజుల్లో నగదు పడుతుందని చెప్పారు. వారం రోజులు గడచినా నగదు జమ కాకపోవడంతో అనుమానించిన సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆర్బీకేల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామస్థాయిలో రైతులకు బ్యాంకింగ్ సేవలందించాలన్న లక్ష్యంతో ఇప్పటికే బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా.. ప్రతీ రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే)లో ఏటీఎంను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకొక ఆర్బీకేలో వీటిని ఏర్పాటుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలుండగా, ప్రస్తుతం 9,160 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అందుబాటులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 6,708 మంది మాత్రమే ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారు. మిగిలిన వారి సేవలకూ చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుతం బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా రూ.25వేల వరకు పరిమిత నగదు ఉపసంహరణ.. కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడం.. పంట రుణాల మంజూరు.. పాడి, మత్స్యకారులకు కేసీసీ కార్డుల జారీ, డిపాజిట్ల సేకరణ, రుణాల రికవరీ వంటి సేవలందిస్తున్నారు. తాజాగా.. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ఆర్బీకేల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన చేయగా బ్యాంకర్లు అందుకు ముందుకొచ్చారు. జిల్లాకొకటి చొప్పున ఆర్బీకేలతో పాటు గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలను ఏర్పాటుచేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకుల్లేని గ్రామాల్లో ఏర్పాటుచేయనున్నారు. చివరిగా.. మిగిలిన ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాలోŠల్ స్థానికంగా ఉండే డిమాండ్ను బట్టి దశల వారీగా ఏర్పాటుచేస్తారు. రైతుల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడం.. మొబైల్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించడం, పేపర్లు లేని ఆర్థిక లావాదేవీల (పేపర్ లెస్)ను ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్నారు. మరోవైపు.. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఆర్బీకేల ద్వారా రైతు సంబంధిత బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకర్లు కసరత్తు చేస్తున్నారు. జిల్లాకొకటి ఏర్పాటుచేస్తున్నాం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్బీకేలు, గ్రామ–వార్డు సచివాలయాల్లో ఏటీఎంలు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం. అందుకు బ్యాంకర్లందరూ ముందుకొస్తున్నారు. తొలుత ఆర్బీకేలు, సచివాలయాల్లో జిల్లాకొకటి చొప్పున ఏర్పాటుచేస్తున్నాం. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన చోట్ల ఏర్పాటుచేస్తాం. – వి. బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ -
ATM History: మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారంటే..
కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్డ్రా కొత్త రూల్స్ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్జాక్షన్స్ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అలియాస్ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా? ►1987లో హెచ్ఎస్బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. ►ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ►మార్చ్ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97, 970 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ►2021, మార్చ్ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి. ► ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్లు వినిపిస్తుంటాయి. ► పేటెంట్ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. ►అయితే బ్రిటన్ ఆవిష్కరణకర్త జాన్ షెపెర్డ్ బారోన్ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు. ►1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ►1967లో నార్త్ లండన్లోని ‘బార్క్లేస్ బ్యాంక్’ ఎన్ఫీల్డ్ టౌన్ బ్రాంచ్ బయట జూన్ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు. ►విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. ►ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. \ ►అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్), కెనడాలో ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషిన్(ABM), బ్రిటిష్ నేలపై క్యాష్ పాయింట్, క్యాష్ మెషిన్, హోల్ ఇన్ ది వాల్ అని కూడా పిలుస్తుంటారు. ►క్యాష్లైన్, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్, క్యాష్ డిస్పెన్సర్, క్యాష్ కార్నర్, బ్యాంకోమాట్ అని పిలుస్తారు. ►ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఆధీనంలో ఉండని వాటిని వైట్ లేబుల్ ఏటీఎంలు అని పిలుస్తారు. ►2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్ వెల్లడించింది. ►అయితే క్యాష్లెస్ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. ► ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్ లోన్ మెషిన్ అనే డివైజ్ జపాన్లో ప్రాచుర్యంలో ఉండేది. ►ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. ►క్రూయిజ్ షిప్స్, యూఎస్ నేవీ షిప్స్లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ►ఈమధ్యకాలంలో సోలార్ పవర్డ్ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. ► ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్ ఖున్జెరబ్ పాస్లో ఉంది. సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్లోనూ పని చేస్తుంది. ►సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. -సాక్షి, వెబ్స్పెషల్ -
ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లు హ్యాక్!!
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసులు గడచిన రెండేళ్లలో మూడు ‘ఏటీఎం గ్యాంగు’ల్ని పట్టుకున్నారు. హరియాణా– రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన వీరంతా డబ్బు డ్రా చేసిన సమయంలో మెషీన్ను ఆపేసి కథ నడిపారు. ఢిల్లీకి చెందిన ఓ గ్యాంగ్ మాత్రం వీటిని తలదన్నేలా వ్యవహరించింది. ఏకంగా 200కు పైగా ఏటీఎం మెషీన్లను హ్యాక్ చేసి పని కానిచ్చింది. అయిదుగురిని పట్టుకున్న ఘజియాబాద్ పోలీసులు ఈ ముఠాకు సాంకేతిక సహకారం హైదరాబాద్కు చెందిన కమల్ అందించినట్లు గుర్తించారు. దీంతో ఇతడి కోసం గాలిస్తూ ఓ ప్రత్యేక బృందాన్ని సిటీకి పంపారు. నలుగురు సభ్యులతో ముఠా.. ఉత్తరప్రదేశ్లోని బాండ జిల్లాకు చెందిన షానవాజ్ అలీ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) పూర్తి చేసి ఢిల్లీలో స్థిరపడ్డాడు. ఇతడికి 2015లో పశ్చిమ బెంగాల్లోని సిలిగురికి చెందిన జమీర్ షేక్తో పరిచయమైంది. అప్పట్లో నలుగురు సభ్యులతో ఓ ముఠాను కలిగి ఉన్న జమీర్ ఉత్తరాఖండ్తో పాటు యూపీ, గుజరాత్, మహారాష్ట్రల్లో ఏటీఎంలను హ్యాక్ చేయడం ద్వారా తెరిచి అందులోని డబ్బు కాజేశారు. షానవాజ్ అయిదో మెంబర్ అయ్యాడు. అప్పట్లో హ్యాకింగ్కు అవసరమైన కోడ్ను వీరికి జార్ఖండ్లోని జామ్తారకు చెందిన వారు అందించారు. ఉత్తరాఖండ్లో వరుసపెట్టి నేరాలు చేసిన ఈ ముఠాను ఆ ఏడాది సెప్టెంబర్లో స్పెషల్ టాస్క్ఫోర్స్ పట్టుకుంది. ఈ కేసులో బెయిల్ పొంది బయటకు వచ్చిన షానవాజ్ తానే గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో ముంబైకి చెందిన జమీర్ షేక్ (కోడింగ్ డిప్లొమా చదివాడు), సాగిర్, మహ్మద్ ఉమర్, మెహ్రాజ్ (బీసీఏ గ్రాడ్యుయేట్) సభ్యులుగా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఏర్పాటు ఈ ముఠా కొత్త ఏటీఎంనూ హ్యాక్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి హైదరాబాద్ వాసి కమల్ను ఏర్పాటు చేసుకుంది. ఇతగాడు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అక్కడి ఓ పబ్లో వీరికి పరిచయమయ్యాడు. కమల్ డార్క్ నెట్ నుంచి ఏటీఎం మెషీన్ల హ్యాకింగ్ మాల్వేర్ సమకూర్చుకున్నాడు. దీన్ని యూఎస్బీ డ్రైవ్లో వేసి షానవాజ్కు అందించాడు. ఈ డ్రైవ్ను మిషన్కు అనుసంధానించే ముఠా అందులోకి మాల్వేర్ పంపేది. దీని ప్రభావంతో ఆ మెషీన్ ప్రధాన సర్వర్తో సంబంధాలు కోల్పోయేది. అదే సమయంలో ఈ మాల్ వేర్ ఓ కోడ్ను సృష్టించి కమల్ పొందుపరిచిన మెయిల్ ఐడీకి చేరవేసేది. హైదరాబాద్లోనే ఉండి దాన్ని అధ్యయనం చేసే ఇతగాడు పాస్వర్డ్గా మార్చి షానవాజ్ గ్యాంగ్కు ఫోన్లో చెప్పేవాడు. దీన్ని ఎంటర్ చేయడం ద్వారా ముఠా మెషీనన్ రీబూట్ అయ్యేలా చేస్తారు. ఆ సమయంలో డబ్బు డ్రా చేయడంతో అది ఖాతాదారుడి లెక్కల్లోకి రాదు. ఈ పంథాలో షానవాజ్ గ్యాంగ్ ఢిల్లీ, యూపీ, ఘజియాబాద్ల్లో కొన్నాళ్లుగా 200 ఏటీఎంలను కొల్లగొట్టింది. ఇలా కాజేసినదాంట్లో కమల్కు 5% ముట్టేది. వీరి కోసం ఘజియాబాద్ పోలీసులు 5 నెలల క్రితం స్వాట్ టీమ్ను రంగంలోకి దింపారు. హైదరాబాద్లో ఉన్నాడని.. మూడు నెలల క్రితం నోయిడాలో వీరికి చిక్కిన షానవాజ్ లంచం ఎర చూపి తిప్పించుకున్నాడు. రూ.20 లక్షల నగదుతో పాటు ఎస్యూవీ వాహనాన్ని స్వాట్ టీమ్కు ఇచ్చాడు. ఆ తర్వాత తన ముఠాతో కలిసి కొన్ని నేరాలు చేశాడు. గత నెల ఆఖరి వారంలో ఘజియాబాద్ సైబర్ సెల్ పోలీసులు షానవాజ్ సహా అయిదుగురిని పట్టుకున్నారు. వీరి విచారణలోనే నోయిడా ఉదంతం బయటపడింది. దీంతో స్వాట్ టీమ్కు చెందిన ఇద్దరిని ఘజియాబాద్ పోలీసులు విధుల నుంచి తొలగించారు. షానవాజ్ను లోతుగా విచారించిన సైబర్ సెల్ కమల్ వ్యవహారం గుర్తించింది. అతడు హైదరాబాద్లో ఉన్నాడని తేలడంతో ప్రత్యేక బృందాన్ని పంపింది. ఈ ముఠా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఈ పంథాలో ఏటీఎంల నుంచి డబ్బు డ్రా చేసినట్లు వెల్లడైంది. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
రూ.500 డ్రా చేస్తే రూ.1100 ఇస్తున్న ఎటిఎం
-
ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
కరోనా కారణంగా ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్లలో జరిగే సైబర్ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T — State Bank of India (@TheOfficialSBI) October 24, 2021 ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్ ►ఏటీఎం సెంటర్లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఏటీఏం సెంటర్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం మెషీన్లో డెబిట్ కార్డ్ ఇన్ సర్ట్ చేసిన తరువాత కార్డ్ పిన్, విత్ డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. ►ఆ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్ డ్రాల్కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్ డ్రాల్ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
-
ఏటీఎం సెంటర్లో యువతి.. సడన్గా ఏమైందో అలా ప్రవర్తించింది!
ఇటీవల సోషల్మీడియోలో వీడియోల హవా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించినవి నెట్టింట ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ఇక కొన్ని వీడియోలైతే అందులోని ఫన్నీ కంటెంట్తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి ఎటీఎం సెంటర్లో చిందేసిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏటీఎం సెంటర్లోకి డబ్బులు విత్డ్రా కోసం మాస్క్ ధరించి ఓ యువతి వచ్చింది. అయితే అందరిలా డబ్బు తీసుకుని వెళ్లలేదు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ అక్కడ ఆ యువతి డ్యాన్స్ వేయడం ప్రారంభించి, మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. కాసేపు గ్యాప్ ఇచ్చి డబ్బులు విత్డ్రా పెట్టింది. ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు రాగానే లెక్కపెట్టుకుని మరోసారి డ్యాన్స్ దులిపేసింది. చివరగా, ఏటీఎం కేంద్రం నుంచి వెళ్తూ తలవంచి నమస్కారం చేసి వెళ్లిపోయింది. అయితే ఆ యువతి అలా ఎందుకు ప్రవర్తించిందో వివరాలు తెలియదు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే యూజర్ ‘ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి’ అని టైటిల్ పెట్టి నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారి 12 లక్షల వ్యూస్ని సొంతం చేసుకుంది. దీన్ని చూసి.. తన జీవితంలో తొలి సాలరీ అందుకుందేమో, అందుకే అలా చేసిందని కొందరు కామెంట్ చేయగా, డ్యాన్స్ ఇరగదీసిందని మరికొందరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. ఏటీఎంలలో నగదు లేకుంటే జరిమానా
ముంబై: మనం బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు ఏం చేస్తాయి. అడిషనల్ ఛార్జీలను వసూలు చేస్తాయి.ఇప్పుడు బ్యాంకులు నిర్వహిస్తున్న ఏటీఎంలలో నగదు అందుబాటులోకి లేదంటే ఆర్బీఐ భారీ ఎత్తున జరిమానా విధించేందుకు సిద్ధపడింది. నగదు ఉండని ఖాళీ ఏటీఎంలతో ప్రజలకు ఎదురవుతున్న అవస్థలను పరిష్కరించడంపై రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించింది. ఇకపై ఒక నెలలో మొత్తం 10 గంటలకు మించి ఏటీఎంలలో నగదు అందుబాటులో లేకుంటే బ్యాంకులకు జరిమానా విధించనుంది. ఈ నిబంధన ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (డబ్ల్యూఎల్ఏవో) ఎప్పటికప్పుడు ఏటీఎంలలో నగదు లభ్యతను పర్యవేక్షించి, సమయానికి భర్తీ చేసేలా తమ యంత్రాంగాలను పటిష్టం చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణిస్తామని, జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఒక నెలలో పది గంటలకు మించి ఏ ఏటీఎంలోనైనా నగదు లేకపోతే, ఒక్కో ఏటీఎంకు రూ. 10,000 చొప్పున పెనాల్టీ ఉంటుంది. వైట్ లేబుల్ ఏటీఎంల విషయంలో సదరు ఏటీఎంలకు సంబంధించిన నగదు అవసరాలు తీర్చే బ్యాంకులే జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని డబ్ల్యూఎల్ఏవో నుంచి వసూలు చేసుకోవచ్చు. 2021 జూన్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 2,13,766 ఏటీఎంలు ఉన్నాయి. చదవండి: ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా -
మంది సొమ్మే కదా మనకేంటి!
సాక్షి,హైదరాబాద్: ఏటీఎంలో నింపే డబ్బు బ్యాంకులది.. అంటే ప్రజల సొమ్ము. నిర్వహణలో మాత్రం అటు బ్యాంకులు, ఇటు కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా లోపభూయిష్టంగా మారిన ఏటీఎంలు అక్రమార్కులకు, నేరగాళ్లకు కల్పతరువులుగా మారుతున్నాయి. నగరంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలే దీనికి నిదర్శనం. కస్టోడియన్లు రూ.14.69 కోట్లు కాజేసిన కేసులు గడిచిన కొన్నేళ్లల్లో సిటీలో నమోదయ్యాయి. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు రూ.23.32 లక్షలు కాజేశారంటూ ఇటీవల సీసీఎస్ పోలీసులు రిజిస్టర్ చేసిన కేసు వీటిలో తాజాది. ఔట్ సోర్సింగ్ చేతుల్లో నగదు భర్తీ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ ఏటీఎంల్లో నగదును నింపే బాధ్యతల్ని స్వయంగా పర్యవేక్షించట్లేదు. ఈ కాంట్రాక్టుల్ని హైదరాబాద్, ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా నడిచే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఈ పని చేయడానికి ఆయా సంస్థలు అనేక మందిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. వీరిలో కస్టోడియన్లుగా పిలిచే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. బ్యాంకులకు చెందిన నగదు భద్రపరిచే కేంద్రాల నుంచి రూ.కోట్లను తమ సంస్థల వాహనాల్లో తరలించే టీమ్ సభ్యులకు ఈ కస్టోడియన్లు నేతృత్వం వహిస్తారు. ఆ మొత్తాన్ని తీసుకువెళ్లి ఆయా బ్యాంకుల ఏటీఎం సెంటర్లలోని మిషన్లలో పెడుతుంటారు. ఇంతటి వ్యవహారాలతో నడిపే కీలక బాధ్యతల్ని బ్యాంకులు కాంట్రాక్టు ద్వారా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తున్నాయి. సాంకేతికతకు ఆమడదూరం... ఏ ఏటీఎం కేంద్రంలో ఎప్పుడు, ఎంత నిపారన్నది కాంట్రాక్టులు నిర్వహిస్తున్న సంస్థల్లో కస్టోడియన్లు పని చేసే ఉద్యోగులు రికార్డుల్లో రాసిందే బ్యాంకులకు ఆధారం. ఈ తరహా ఉద్యోగుల కార్యకలాపాలపై ఏమాత్రం నిఘా సైతం ఉంచట్లేదు. కస్టోడియన్తో కూడిన ఓ బృందం బ్యాంక్ నుంచి సదరు వాహనంలో ఎంత మొత్తం తీసుకుని బయలుదేరుతోంది, తిరిగి ఎంత మొత్తం తీసుకువస్తోంది అనే అంశాలు కేవలం మాన్యువల్గానే పుస్తకాల్లోనో, వీరు ఫీడ్ చేస్తే కంప్యూటర్లోనో నమోదవుతున్నాయి. ఏటీఎం సెంటర్లో ఎంత డబ్బు పెట్టారనే దానికి సైతం ఈ లెక్కలే ఆధారం. అంతే తప్ప ఓ మిషన్లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిట్ చేశారనేది లెక్కించడానికి సాంకేతికంగా ఎలాంటి మెకానిజం ఇప్పటి వరకు ఆయా సంస్థలు, బ్యాంకులు అందిపుచ్చుకోలేదు. ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపిన కస్టోడియన్లు మళ్లీ వెళ్లి ఏటీఎంలను ఓపెన్ చేసినా గుర్తించే పరిజ్ఞానం బ్యాంకుల వద్ద ఉండట్లేదు. ఈ కారణంగానే ఏటీఎంల్లో అవసరమైనంతా డిపాజిట్ చేశామంటూ చెబుతున్న కస్టోడియన్లు గోల్మాల్కు పాల్పడుతూ రూ.లక్షలు, రూ.కోట్లు కాజేసే వరకు సంస్థలు గుర్తించలేకపోతున్నాయి. ఓల్డేజ్ సెక్యూరిటీ గార్డ్లు.. ఏటీఎంల భద్రత విషయంలోనూ లోపాలున్నాయి. ఇక్కడ విధుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. కూకట్పల్లిలోని పటేల్కుంట పార్క్ వద్ద ఈ ఏడాది ఏప్రిల్ 29న చోటు చేసుకున్న ఏటీఎం సొమ్ము దోపిడీ కేసు దీనికి ఉదాహరణ. దాదాపు ప్రతి సెక్యూరిటీ గార్డు, గన్మె న్ ‘ఓల్డేజ్’లోనే ఉంటున్నారు. పది ఏటీఎం కేంద్రాలను పరిశీలిస్తే వాటిలో ఆరు ఏడింటిలో వృద్ధులే సెక్యూరిటీ గార్డులుగా ఉంటున్నారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదును కాజేసిన కస్టోడియన్ల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. నగరంలో రూ.14.69 కోట్ల మేర కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ప్రజాధనం దుండగుల పాలవుతున్నా ఆయా బ్యాంకులు మాత్రం పట్టించుకోవట్లేదు. -
డెబిట్కార్డు లేకుండా డబ్బులను ఇలా విత్ డ్రా చేయండి..!
సాధారణంగా ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించాల్సిందే. కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేకుండానే నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా తన ఖాతాదారులకు ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఖాతాదారులు సురక్షితంగా డెబిట్ కార్డు లేకుండానే ఎటీఎం నుంచి నగదును విత్ డ్రా చేసుకోవచ్చును. తన ఖాతాదారులకు కార్డ్లెస్ క్యాష్ను అన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడానికి 24/7 సేవలను అందిస్తుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ట్వీటర్లో పేర్కొంది. ఏటీఎమ్లో కార్డ్లెస్ క్యాష్ను ఇలా విత్ డ్రా చేయండి..! మీకు దగ్గరలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎమ్ దగ్గరకు వెళ్లండి. మీకు ఏటీఎమ్ మిషన్పై చూపిస్తోన్న కార్డ్లెస్ క్యాష్ ఆప్షన్ను సెలక్ట్ చేయండి. తరువాత మీకు నచ్చిన భాషను ఎంచుకోండి. మీ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. మీ నంబర్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ పంపినట్లు మెసేజ్ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. మీకు తొమ్మిది అంకెల ఆర్డర్ ఐడీ వస్తుంది. తరువాత ట్రాన్సక్షన్ అమౌంట్ను ఎంటర్చేయాలి. వివరాలను ధృవీకరించిన తర్వాత ఏటీఎమ్ నుంచి నగదు చెల్లించబడుతుంది. Forgot your ATM Card? Don’t worry, HDFC Bank Cardless Cash is #DigitallyYours with 24X7 service to withdraw cash at all HDFC Bank ATMs. Enjoy instant and secure mode of cash withdrawals without ATM / Debit Card. To know more, visit: https://t.co/foq6Uq144f pic.twitter.com/xIJK6YI7do — HDFC Bank (@HDFC_Bank) July 29, 2021 -
ఏటీఎం పేల్చి రూ.28 లక్షలు చోరీ
సాక్షి ముంబై: పుణే జిల్లాలో ఓ ఏటీఎంను కొందరు దుండగులు పేల్చేశారు. అందులోని సుమారు రూ.28 లక్షలు చోరీ చేశారు. స్థానికంగా తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలకు గురిచేసిన ఈ ఘటన వివరాలిలాఉన్నాయి.. పుణే జిల్లా చాకణ్ మహాలుంగే భాంబోలి ప్రధాన కుడలిలో హిటాచి కంపెనీ ఏటీఎం ఉంది. ప్రధాన పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ఈ ఏటీఎంను బుధవారం తెల్లవారుజాము 2.30 గంటలకు కొందరు దుండగులు పేలుడు పదార్థాలను వినియోగించి ధ్వసం చేశారు. అందులోని సుమారు 28 లక్షల రూపాయలు దొంగిలించి పరారయ్యారు. ఈ తరహాలో ఏటీఎం చోరీ చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారిగా పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఈ పేలుడు కోసం వినియోగించిన పదార్థాలను నక్సలైటులు ఎక్కువగా వినియోగిస్తుంటారని ప్రాథమికం గా భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఘటనలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. -
ఆగస్టు 1 నుంచి పెరగనున్న ఏటీఎం ఛార్జీలు
ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం, ఖాతాదారులు తమ హోమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీల చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసే నగదు లావాదేవిపై ఇంటర్ ఛేంజ్ ఫీజ్ వర్తించనుంది. మెట్రో నగరాలలో ఉచిత లావాదేవీల సంఖ్య 3గా ఉంటే మెట్రో యేతర నగరాల్లో 5గా ఉంది. 2019 జూన్ లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా ఈ మార్పులను చేశారు. ఏటీఎం లావాదేవీల ఇంటర్ చేంజ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించి ఏటీఎం ఛార్జీలు, ఫీజుల మొత్తం పరిధిని సమీక్షించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. మార్చి 31 నాటికి, దేశంలో 115,605 ఆన్ సైట్ ఏటీఎంలు, 97,970 ఆఫ్ సైట్ టెల్లర్ యంత్రాలు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. -
ఆ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా..ఏటీఎం రేషన్!
చండీగఢ్: దేశంలో తొలిసారిగా రేషన్ ఏటీఎంను ప్రయోగాత్మకంగా హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పైలట్ ప్రాజక్ట్ను గరుగ్రామ్లోని ఫరూక్నగర్లో హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రేషన్ ఏటీఎం ఐదు నుంచి ఏడు నిమిషాల లోపు 70 కిలోల వరకు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదల చేస్తుందన్నారు. కాగా ఈ మెషిన్ టచ్స్క్రీన్ ద్వారా పని చేస్తుందని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం ఈ ఏటీఎం మెషీన్లో బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుందని, దీని ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ జరగగానే, లబ్ధిదారునికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి ఆటోమెటిక్గా సంచుల్లో నింపేస్తుందని ఆయన అన్నారు. దీని వలన ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరుకులు అందుతాయని, ఈ ప్రాజెక్ట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఇదేనంటూ వెల్లడించారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ ధాన్యం పంపిణీ యంత్రంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి రేషన్ ఏటీఎం కాగా.. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫరూకనగర్లో విజయవంతంగా నిర్వహించిన అనంతరం యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం క్రింద వీటిని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మెషిన్ కారణంగా పంపిణీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు కనుక రేషన్ సరుకుల కొరతను కూడా ఇది తగ్గించనుందని తెలిపారు. ఈ ఏటీఎంలో రేషన్ సరుకులు.. గోధుమలు, ధాన్యం, చిరుధాన్యాలు సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. కాగా ప్రస్తుతం ఫరూక్నగర్లో ప్రారంభించిన ఏటీఎంలో గోధుమలు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
అమాయకులు, వృద్ధులే వారి టార్గెట్
రాంగోపాల్పేట్: ఏటీఎంకు వెళ్లిన అమాయకులను, వృద్ధులను టార్గెట్ చేసి వారి ఏటీఎం కార్డును స్కిమ్మింగ్, క్లోనింగ్ చేసి నగదును తస్కరిస్తున్న ఐదుగురు అంతర్రాష్ట ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్, డీఐ వీరయ్య, ఎస్సైలు శ్రీను, యుగందర్రెడ్డిలు వివరాలు వెల్లడించారు. బీహార్లోని నవాడా జిల్లాకు చెందిన పురుషోత్తం కుమార్ (20), అదే ప్రాంతానికి చెందిన రవికాంత్కుమార్ (19)లు పాట్నాలో సేప్టీ మేనేజ్మెంట్ విద్యను అభ్యసిస్తున్నారు. నవాడా జిల్లాకు చెందిన నితీష్కుమార్ (19) ఢిల్లీ లోని ఓ రేషన్ షాపులో పనిచేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన పికు కుమార్ (23) భూపాల్లో బీఈ చదువుతున్నాడు. అదే జిల్లాకు చెందిన నిరంజన్కుమార్ (32) చిరు వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఐదుగురు స్నేహితులు కాగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో పురుషోత్తం కుమార్ ఏటీఎం కార్డులను క్లోనింగ్ చేసి వాటి ద్వారా నగదును తస్కరించాలని పథకం పన్ని కార్డుల్లోని డేటాను రైడ్, రీడ్ చేసే డెఫ్టన్ ఎంఎస్ఆర్ ఎక్స్6 మిషన్ను ఒక యాప్ను తయారు చేశారు. తమ పథకాన్ని అమలు పరిచేందుకు ఐదుగురు గ్యాంగ్ సభ్యులు కొద్ది రోజుల క్రితం నగరానికి వచ్చారు. ఏటీఎంలోకి డబ్బు డ్రా చేసేందుకు వెళ్లిన వ్యక్తి ఏదైనా కంగారు పడితే వెంటనే సహాయం చేసినట్లు నటిస్తారు. కార్డు తీసుకుని రివర్స్లో మిషన్లో పెట్టి అతని దృష్టిని ఏటీఎం స్క్రీన్ నుంచి మరల్చి తమ దగ్గర ఉన్న డెఫ్టన్ ఎంఎస్ఆర్ ఎక్స్ 6 మిషన్లో కార్డును ఉంచి క్షణాల్లో అందులో ఉన్న డేటాను తస్కరిస్తారు. ఆ డేటా మొత్తం వీళ్ల వద్ద ఉన్న యాప్లో నిక్షిప్తం అవుతుంది. అటు తర్వాత వీళ్ల దగ్గర ఉన్న మరో డూప్లికేట్ కార్డులోకి ఈ డేటాను మొత్తం తరలిస్తారు. ఏటీఎంలో ఉన్న వ్యక్తి లావాదేవీలు నిర్వహించుకునే సమయంలో పిన్ నంబర్ను గుర్తు పెట్టుకుంటారు. అటు తర్వాత తమ వద్ద ఉన్న డూప్లికేట్ కార్డు ద్వారా నగదును డ్రా చేస్తారు. ఇలాగే ఉత్తర్ఖండ్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి శుభం కుమార్ గౌర్, అతని స్నేహితుడు ఆకాష్కుమార్లు రైల్వే ట్రాక్ టెస్టింగ్ విధులకు వచ్చి రెజిమెంటల్బజార్లోని పంచవటి రెసిడెన్సీలో ఉంటున్నారు. జూన్ 26వ తేదీన ఆకాష్ రెజిమెంటల్బజార్ చాంద్ దర్గా ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంకు ఏటీఎంకు వెళ్లి రూ.25 వేల నగదును డ్రా చేశారు. అటు తర్వాత ఆకాష్ ఖాతా నుంచి 28వ తేదీన రూ.10వేలు, రూ.5,500 నగదు రెండుమార్లు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు తన ఖాతా నుంచి నగదును తస్కరించినట్లు గుర్తించిన ఆయన గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు ఇలాగే పలు ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి రూ.5లక్షల వరకు తస్కరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి నుంచి 2.85 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, కార్డు డేటా చోరి చేసే మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. -
జూలై ఒకటి నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్!
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై ఒకటి నుంచి కొత్త నిబందనలను అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబందనలను ప్రతి ఖాతాదారుడు తెలుసుకోవాలి అని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ ను కోరింది. ఎటిఎమ్ నుంచి నగదు విత్ డ్రా, బ్రాంచీ నుంచి నగదు విత్ డ్రా, చెక్ బుక్ వంటి అంశాలకు సంబంధించిన చార్జీల విషయంలో మార్పులు చేసినట్లు పేర్కొంది. ఈ కొత్త రూల్స్ కేవలం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడి) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. జూలై ఒకటి నుంచి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఎటిఎమ్ ద్వారా నెలలో నాలుగు సార్లకు మించి ఎక్కువ సార్లు నగదు విత్ డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి లావాదేవిపై రూ.15 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, బ్యాంక్ బ్రాంచుకు వెళ్లి నెలలో నాలగు సార్లకు మించి డబ్బులు తీసుకుంటే కూడా అదే చార్జీలు పడతాయి. ఇక బీఎస్ బీడి ఖాతాదారులకు ఎస్బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత మరో 10 చెక్ లీవ్స్ కావాలంటే రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్టీ అదనం. ఇక 25 చెక్ లీవ్స్కు అయితే రూ.75 చార్జీ ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 కట్టాలి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ ఈ రూల్స్ సీనియర్ సిటిజన్స్ కి వర్తించవు. చదవండి: కొత్త ఇళ్లు కొనేవారికి కేంద్రం గుడ్ న్యూస్! -
రూ.2 వేల నోట్లు జిరాక్స్ తీసి భార్య ఖాతాలో డిపాజిట్
సాక్షి, చెన్నై : ఎస్బీఐ ఏటీఎం డిపాజిట్ మెషిన్లలోని సాంకేతిక లోపాన్ని ఆసరాగా చేసుకుని హర్యానా ముఠా రాష్ట్రంలో హైటెక్ చేతివాటాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. దీని గురించి ప్రజలు మరిచిపోక ముందే ఓ వ్యక్తి ఏకంగా రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి తన భార్య ఖాతాలోకి బ్యాంక్ ఆఫ్ బొరడా ఏటీఎం డిపాజిట్ మెషన్ ద్వారా డిపాజిట్ చేశాడు. పుదుకోటై జిల్లా అరంతాంగిలోని బ్యాంక్ ఆఫ్ బొరడా డిపాజిట్ మెషిన్ను తనిఖీ చేయగా రూ.2 వేలు జిరాక్స్ నోట్లు డిపాజిట్ చేసి ఉండడం వెలుగు చూసింది. సీసీ పుటేజీ ఆధారంగా అరంతాంగికి చెందిన శరవణన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను తన భార్య రేవతి ఖాతాలో రూ.2 వేలు జిరాక్స్ నోట్లతో రూ.60 వేలు డిపాజిట్ చేసినట్టు అంగీకరించాడు. అనంతరం మరో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నట్టు పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి శరవణన్, రవిచంద్రన్ను అరెస్టు చేశారు. చదవండి: బిట్ కాయిన్స్ పేరుతో రూ.60 లక్షలు స్వాహా -
ఈ బ్యాంకుల్లో అపరిమిత ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్..!
ముంబై: ఎటీఎం లావాదేవీలపై బ్యాంకులు ఇంటర్ఛేంజ్ ఫీజు వసూలు చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్యాంకు ఖాతాదారులపై మరింత భారం పడనుంది. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ ట్రాన్సాక్షన్ పరిమితి దాటితే ట్రాన్సాక్షన్ ఫీజును వసూలు చేయనున్నాయి. పరిమితికి మించి లావాదేవీలు జరిపితే ఒక్కో లావాదేవీకి రూ. 20 నుంచి రూ.21 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు 2022 జనవరి 1, నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకు ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎం నుంచి 5 ఉచిత ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చును. ఇతర బ్యాంకు ఏటీఎంలో మెట్రో నగరాల్లో 3 సార్లు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను నిర్వహించవచ్చును. కాగా కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల కోసం అపరిమిత ఎటీఎం లావాదేవీలు జరుపుకోవచ్చునని ప్రకటించాయి. ఇండస్ఇండ్, ఐడీబీఐ వంటి ప్రైవేటు బ్యాంకులు ఈ ఆఫర్ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన వాటికి పూర్తిగా అపరిమిత ఉచిత ఎటీఎం లావాదేవీలను జరుపుకోవచ్చును. కాగా ఐడీబీఐ బ్యాంక్ ఆర్బీఐ నిర్దేశించిన కనీస ఉచిత పరిమితులకు అనుగుణంగా ఉచిత ఎటీఎం లావాదేవీలను అందిస్తుంది. బ్యాంక్ తన స్వంత ఎటిఎంలలో 5 ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంక్ ఎటిఎంలలో, ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో మూడు ఉచిత లావాదేవీలను కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జోర్టీ చాకో పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ తన బ్యాంకు ఖాతాదారులకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంక్ ఏటీఎం నుంచైనా అపరిమిత ఉచిత ఏటీఎం లావాదేవీలను అందిస్తోందని ఇండస్ఇండ్ బ్యాంక్ తన వెబ్సైట్ పేర్కొంది. సేవింగ్స్ ఖాతాలో రూ.25వేల కంటే ఎక్కువ సగటు బ్యాలెన్స్ నిర్వహిస్తోన్న అకౌంట్ హోల్డర్లకు సిటీ బ్యాంకు కూడా అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తోంది. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు రూ.1 లక్ష కంటే ఎక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్న వారికి ఏ ఏటీఎంలోనైనా అపరిమిత ఉచిత ట్రాన్సాక్షన్ ఇవ్వనుంది. చదవండి: గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్! -
వచ్చే నెలనుంచి ఎస్బీఐ కొత్త నిబంధనలు అమలు
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం, మనీ విత్ డ్రా నియమ నిబంధనల్ని మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త నిబంధనలు జులై నెల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎస్బీఐ వినియోగదారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్ బీడీ) అకౌంట్లకు కొత్త ఛార్జీల అమలుతో పాటు ఏటీఎం విత్ డ్రాల్ ఛార్జీలు, చెక్బుక్లు ఆర్థికేతర టాన్సాక్షన్లపై ఈ కొత్త నిబంధనల్ని విధించనున్నారు. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే ఏమిటి? ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే అదనపు ఛార్జీలు, మినిమం బ్యాలెన్స్ లేకుండా జీరో బ్యాలెన్స్ పై అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. పేదలకు అండగా నిలిచేలా ఎస్బీఐ ఈ అకౌంట్ ను అందుబాటులోకి తెచ్చింది. సంబంధిత వ్యక్తి కేవైసీ వివరాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్ తో పాటు ఏటీఎం కార్డ్ ను ఉచితంగా పొందవచ్చు. వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లు ప్రతి నెలా ఏటీఎంలు, బ్యాంక్ శాఖలతో సహా నాలుగుసార్లు ఉచితంగా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉచిత విత్ డ్రా పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి బ్యాంక్ రూ.15 ప్లస్ జీఎస్టీని విధిస్తుంది. అయితే ఈ బీఎస్ బీడీ అకౌంట్ హోల్డర్లకు ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ బుక్స్ ను బ్యాంక్ అందిస్తుంది. ఆ తరువాత నుంచి అందించే చెక్కులపై ఎస్బీఐ నిర్ధిష్ట మొత్తాన్ని వసూలు చేస్తుంది. 10 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .40 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 25 చెక్ బుక్ లకు బ్యాంక్ రూ .75 తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. 10 ఎమర్జెన్సీ చెక్ బుక్ లకు రూ.50తో పాటు జీఎస్టీ వసూలు చేయనుంది. సీనియర్ సిటిజన్లకు చెక్ బుక్ లకు సంబంధించి కొత్త స్వరీస్ ఛార్జీల నుండి మినహాయింపు ఉంటుంది. అకౌంట్ హోల్డర్ హోం బ్రాంచ్ లేదంటే ఇతర బ్రాంచ్ లలో ఆర్థికేతర లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించరు. అంతేకాదు మనీ విత్ డ్రాల్ పరిమితిని పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. "ఈ మహమ్మారి కారణంగా వినియోగదారులకు అండగా నిలిచేందుకు మనీ విత్ డ్రాల్ ను పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బీ ఐ ట్వీట్ లో పేర్కొంది. కాగా, ఇటీవల ఎస్ బీ ఐ చెక్ ద్వారా రోజుకు 1లక్ష నగదును డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్తో పాటు విత్ డ్రాల్ ఫాం ద్వారా ప్రతిరోజు రూ.25,000 వేలు డ్రా చేసుకోవచ్చు. చెక్ ద్వారా మనీ విత్ డ్రాల్ ను నెలకు రూ.50,000గా నిర్ణయించింది. చదవండి : ఎస్బీఐ ఖాతాదారులకు ఊరట -
ఎస్బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కస్టమర్లకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడం, చెక్బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ తన వెబ్సైట్లో పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్టీ చెల్లించాలి. 10 చెక్స్తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ బ్రాంచ్లల్లో ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు. చదవండి: ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి -
కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని.. చివరికి జైలు పాలయ్యారు
హైదరాబాద్: ఇటీవల నగరంలో కూకట్ పల్లి ఏటీఏం సెంటర్ వద్ద కాల్పులు జరిపిన ఏ1, ఏ2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సైబరాబాద్ సీపీ వారిని మీడియా ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ‘‘ పొట్టకూటి కోసం బీహార్కు చెందిన ఏ1 నిందితుడు అజిత్ కుమార్, ఏ2 నిందితుడు ముఖేష్ కుమార్లు 2011లో నగరానికి వచ్చారు. నగరంలోని దుండిగల్ ప్రాంతంలో ప్యాకేజీ అండ్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలు పని చేసిన వీళ్లిద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. తొలిసారి ఏ1 నిందితుడు అజిత్ కుమార్ దుండిగల్లోని ఓ ఏటీఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ జైలు పాలయ్యాడు. విడుదల అనంతరం నేరాల్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. అడ్డదార్లలో డబ్బులు సంపాదించి జల్సాలు చేసేవాడు. దొంగతనాలు చేస్తూ పోలీసుల కన్నుగప్పి తప్పించుకునేవాడు. చిన్నాచితకా దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులు సరిపోవడం లేదని ఈ సారి ఏకంగా ఏటీఎంలలో డబ్బులు నింపే వాహనాల్ని టార్గెట్ చేశాడు. అందుకు ముఖేష్ కుమార్ సపోర్ట్ తీసుకున్నాడు. బీహార్ నుంచి ముఖేష్తో నాటు తుపాకి తెప్పించుకుని ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం చోరీకి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏప్రిల్ 29న కూకట్ పల్లి ఏటీఎం సెంటర్ చోరీకి పాల్పడ్డారు నిందితులు. ఏటీఎం నుంచి డబ్బుల్ని దొంగిలించేందుకు ఏటీఎం సెంటర్లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ అలీ బేగ్పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో ఏటీఎం డోర్లపై థంబ్ ప్రింట్స్ ఆధారంగా పాతనేరస్తులపై కన్నేశారు. అయితే కూకట్ పల్లి ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న నిందితుల చేతిగుర్తులు.. గతంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితుల చేతి గుర్తులు ఒకేలా ఉండడంతో అజిత్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో నిందితులు గుండపోచంపల్లి ప్రాంతానికి చెందిన ఓ గదిలో తలదాచుకున్నారన్న సమాచారంతో దాడులు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులు కలిసి సైబరాబాద్ లిమిట్స్లో ఐదు నేరాలు చేశారు. వారి వద్ద నుండి రూ. 6,31,000/- నగదు, ఒక పిస్తోల్, ఒక మ్యాగజైన్, పల్సర్ బైక్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. ఏటీఎం సెక్యూరిటీగా పెద్ద వయస్సు ఉన్నవారు విధులు నిర్వహించడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. ఇదే విషయంపై ఆర్బీఐతో మాట్లాడుతున్నాం. సెక్యూరిటీల వద్ద యువకులు విధులు నిర్వహిస్తే ఇలాంటి దారుణాలు జరగవు’’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
వైరల్ వీడియో: శానిటైజర్ దొంగిలించిన వ్యక్తి
-
‘‘నీపై కోప్పడాలో.. జాలి పడాలో తెలీడం లేదు’’
దొంగతనం అనగానే బంగారం, డబ్బు, విలువైన వస్తువులను చోరీ చేయడం గుర్తుకు వస్తాయి. కానీ కొందరు కక్కుర్తి వ్యక్తులు చేసే చోరీలు చూస్తే వారిపై జాలి పడాలో లేక కోప్పడాలో అర్థం కాదు. ఓ వ్యక్తి చేసిన దొంగతనం చూస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇంతకు ఆ వ్యక్తి చేసిన దొంగతనం ఏంటయ్యా అంటే.. ఏటీఎం సెంటర్లో ఉన్న శానిటైజర్ డబ్బాను తస్కరించాడు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. ఏటీఎంలో డబ్బులు తీయడానికి వెళ్లిన ఓ కస్టమర్.. అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్ను దొంగిలించాడు. కరోనా కట్టడిలో భాగంగా ప్రస్తుతం శానిటైజర్, మాస్క్ వినియోగం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఆఫీసుల ముందర శానిటైజర్లను ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి డబ్బులు తీసుకోవడం కోసం ఏటీఎం సెంటర్కి వెళ్లాడు. కాసేపు అక్కడే ఉన్న ఆ వ్యక్తి.. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం గమనించి వెంటనే శానిటైజర్ బాటిల్ను తన బ్యాగులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడే ఏటీఎం సెంటర్లోని సీసీ కెమెరాల్లో ఈ తతంగమంతా రికార్డవ్వడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. సదరు వ్యక్తిని నెటిజనులు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. నీ కక్కుర్తి తగలడా.. ఓ ఇరవై రూపాయలు పెట్టి శానిటైజర్ కొనుక్కోలేవా అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్ -
కూకట్పల్లి ఏటీఎం: కాల్పులకు తెగబడ్డది ఆ ముఠానే!
సాక్షి, హైదరాబాద్: బిహార్ నుంచి వలస కూలీలుగా వచ్చారు.. ఇక్కడ దోపిడీ దొంగల అవతారం ఎత్తారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలని నేరబాట పట్టారు. ఏటీఎం వద్ద కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడింది బిహార్ ముఠానేనని పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి విజయ్నగర్ కాలనీలోని ఏటీ ఎం కేంద్రం వద్ద దుండగులు గురువారం ఓ సెక్యూరిటీ గార్డ్ను చంపి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఇద్దరు నిందితుల్లో ఒకరిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు. మరో నిందితుడు ఆయుధం, డబ్బు తో రైలులో పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. బిహార్కు చెందిన ఇద్దరు యువకులు జీడిమెట్ల–చందానగర్ మధ్య ప్రాంతంలో నివసిస్తూ కొద్దిరోజులు దినసరి కూలీలుగా పనిచేశారు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పూనుకున్నారు. గతంలోనూ నాటు తుపాకీతో బెదిరించి.. నిందితులు కొన్నాళ్ల క్రితం తమ స్వస్థలంలో ఓ నాటు పిస్టల్ ఖరీదు చేసుకుని వచ్చారు. జీడిమెట్ల అయోధ్యనగర్ చౌరస్తాలో ఉన్న లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ సంస్థను టార్గెట్ చేశారు. గత నెల 16న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తన దుకాణం మూసేందుకు సిద్ధమైన యజమాని రవికుమార్ రూ.1.95 లక్షలను తన బ్యాగ్లో పెట్టుకున్నారు. అదే సమయంలో హెల్మెట్, మాస్క్ ధరించిన ఇద్దరు దుండ గులు ఆ దుకాణంలోకి ప్రవేశించి రవికుమార్కు తుపాకీ గురిపెట్టి, అరిస్తే చంపేస్తామంటూ బెదిరించారు. ఆయన వద్ద నగదు ఉన్న బ్యాగ్తోపాటు సెల్ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ నేరం చేసిన తర్వాత నిందితులు కొన్ని రోజులు మిన్నకుండిపోయారు. ఏటీఎం కేంద్రాలు ధ్వంసం చేయలేమనే.. ఆపై కూకట్పల్లి ప్రాంతంలోని ఏటీఎం కేంద్రాలపై గురిపెట్టారు. వాటిని ధ్వంసం చేసి డబ్బు దోచుకోవడం సాధ్యం కాదని భావించి, డబ్బు నింపడానికి వచ్చే వాహనాన్ని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ వాహనాలు వచ్చే సమయాలు, రూట్లతోపాటు నేరం చేసిన తర్వాత పారిపోయేందుకు వీలున్న ప్రాంతాలను రెక్కీ ద్వారా విజయ్నగర్ కాలనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. జీడిమెట్లలో నేరం చేయడానికి తమకు పరిచయస్తుడైన వ్యక్తి నుంచి యాక్టివా వాహనం తీసుకున్నారు. కానీ, విజయ్నగర్కాలనీలో నేరం కోసం మాత్రం బైక్ ఉండాలని భావించారు. బాలానగర్ జోన్ పరిధి నుంచి ఓ పల్సర్ వాహనాన్ని చోరీ చేసి దాని నంబర్ ప్లేట్ తీసేసి వినియోగించారు. విజయ్నగర్ కాలనీలో చోరీ చేసి కేపీహెచ్బీ వైపు పారిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. గ్లాస్డోర్పై వేలిముద్రల సహాయంతో... ఇద్దరిలో ఓ నిందితుడు వాహనాన్ని తీసుకుని లిం గంపల్లి వరకు వెళ్లాడు. అక్కడే ద్విచక్ర వాహనాన్ని వదిలేసి డబ్బు, తుపాకీతో రైలులో మహారాష్ట్రకు పారిపోయాడు. ఏటీఎం కేంద్రంలోని గ్లాస్ డోర్పై నిందితుల వేలిముద్రలు దొరికాయి. ఇవి దుండిగల్లో సేకరించిన వేలిముద్రలతో సరిపోలాయి. అలా అనుమానితులను గుర్తించి సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన పోలీసులు బాలానగర్లోని ఒక నిందితుడిని గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాలో మరికొందరు ఉండి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన నేరంలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని, ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన కస్టోడియన్ శ్రీనివాస్ను చికిత్స అనంతరం వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును నేరుగా కమిషనర్ వీసీ సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ఈటల కథ క్లైమాక్స్కు.. ఏం జరగబోతోంది..? హైదరాబాద్: ఆడపిల్ల పుట్టిందని ఆటోలో వదిలేశారా? -
హైదరాబాద్: కూకట్పల్లిలో కాల్పుల కలకలం
-
కూకట్పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు
సాక్షి, హైదరాబాద్/భాగ్యనగర్కాలనీ: అది కూకట్ పల్లిలోని విజయ్నగర్ కాలనీ... గురువారం మిట్ట మధ్యాహ్నం... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏటీ ఎం మిషన్లలో నగదు నింపే రైటర్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉద్యోగులు టార్గె ట్గా ఈ ఫైరింగ్ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీగార్డు అక్కడికక్కడే చనిపోగా.. మరో కస్టోడియన్కు తీవ్ర గాయాల య్యాయి. రూ.11 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగుల చేతికి రూ.5 లక్షలు చిక్కాయి. నిందితులు రెక్కీ చేసిన తర్వాతే ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. రైటర్ సేఫ్గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. హైదరా బాద్లో ఆయా ఏటీఎం కేంద్రాలు ఉన్న మార్గాలను రూట్లుగా విభజించి రోజూ కస్టోడియన్లతో డబ్బు పంపిస్తుంది. ప్రతి వ్యాన్కు ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. వీటిలో ఓ బృందం రోజూ హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన ఏటీఎం మిషన్లలో నగదు నింపుతూ ఉంటుంది. ఆ సంస్థకు చెందిన వ్యాన్(ఏపీ36వై9150)లో డ్రైవర్ కృష్ణ, పటాన్చెరుకు చెందిన కస్టోడి యన్లు చింతల శ్రీనివాస్(33), ఎ.నవీన్ లతోపాటు సెక్యూరిటీగా విధులు నిర్వర్తి స్తున్న బోరబండ వాసి అయిన సీఆర్ పీఎఫ్ మాజీ కానిస్టేబుల్ మీర్జా సుభాన్ అలీ బేగ్ (74) నగదుతో బయలుదేరారు. ఆ సమయంలో సదరు వ్యాన్లో మొత్తం రూ.2.7 కోట్లు ఉన్నాయి. బేగంపేట నుంచి బయలుదేరిన ఈ టీమ్ కూకట్పల్లిలోని ఏటీఎం మిషన్లలో రూ.12 లక్షలు నింపింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కూకట్పల్లిలోని విజయ్నగర్కాలనీకి చేరుకుంది. అక్కడ ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంలో రూ.11 లక్షలు నింపేందుకు వచ్చారు. డ్రైవర్ కృష్ణ వాహనంలోనే ఉండగా, ఇద్దరు కస్టోడియన్లు, సెక్యూరిటీ గార్డు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లారు. మిగిలిన మొత్తం వ్యాన్లోనే ఉంది. సెక్యూరిటీ గార్డు అలీబేగ్ తన తుపాకీతో బయటే వేచి ఉండగా, మిగిలిన ఇద్దరూ లోపలకు వెళ్లి నగదు నింపడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు నల్ల రంగు పల్సర్ వాహనంపై జగద్గిరిగుట్ట వైపు నుంచి దూసుకువచ్చారు. వీరి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం ఆగడంతోనే వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి మీర్జాపై నాటు పిస్టల్తో ఓ రౌండ్ కాల్పులు జరిపాడు. తూటా ఎడమ వైపు గుండె కింది భాగంలో కడుపులోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. లోపలకు వెళ్లిన దుండగులు మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వీటిలో ఒక తూటా శ్రీనివాస్ మోకాలులోంచి దూసుకుపోగా, మరోటి అక్కడే ఉన్న అద్దానికి తగిలింది. అదే సమయంలో అక్కడ ఉన్న రూ.5 లక్షలను చేజిక్కించుకున్న ఇరువురూ క్షణాల్లో ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు నవీన్, కృష్ణ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అప్రమత్తమై దుండగులపై రాళ్లు విసిరినా తప్పించుకుని కేపీహెచ్బీ కాలనీ వైపు పారిపోయారు. వారి తుపాకీకి సంబంధించిన మ్యాగజీన్ అక్కడే పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు తూటాలకు సంబంధించిన ఖాళీ క్యాట్రిడ్జ్లు, నిందితులు వదిలి వెళ్లిన హెల్మెట్ను స్వాధీనం చేసుకున్నారు. మూడో తూటాకు సంబంధించినది అక్కడ లభించలేదు. పక్క ప్లాన్ ప్రకారమే... క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్లు ఘటనాస్థలానికి చేరుకొని, నిందితులకు చెందినవిగా అనుమానిస్తున్న వేలిముద్రలను సేకరించాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించి అనుమానితుల ఫొటోలు సేకరించారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. ఈ నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ వాహనం కదలికలపై రెక్కీ చేసిన తర్వాతే, గురువారం దాన్ని వెంబడిస్తూ వచ్చి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట నుంచి ఘటనాస్థలి వరకు ఉన్న సీసీ కెమెరాల్లో గత 15 రోజులుగా రికార్డు అయిన ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఫోన్ లొకేషన్స్ను సాంకేతికంగా ఆరా తీస్తున్నారు. బీహార్ లేదా రాజస్థాన్ ముఠాలపై అనుమానం... ఇది బీహార్ లేదా రాజస్థాన్కు చెందిన ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఈ ముఠాకు చెందినవారు మరికొందరు ఉండి ఉంటారని, నేరం చేసిన తర్వాత వాళ్లు పరారై ఉంటారని భావిస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ వైపు వెళ్లిన దుండగులు మళ్లీ కూకట్పల్లి ప్రధాన రహదారి ఎక్కలేదని అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ను పరిశీలించినా వారి కదలికలు కనిపించపోవడం గమనార్హం. అయితే దుండగులు తమ వాహనం వదిలేసిగానీ, దుస్తులు మార్చుకుని గానీ ఉంటారనే అంశాన్నీ కొట్టి పారేయలేమని చెప్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన అనుమానితుల ఫొటోలను బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ పోలీసులకు పంపారు. రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. చదవండి: ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత? వాడిని చంపేయండి.. వదలొద్దు! -
ఏటీఎం: కార్డు లేకుండానే నగదు విత్ డ్రా
గతంలో బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలంటే సదురు బ్యాంకు శాఖకు వెళ్లి నగదును తీసుకునేవాళ్లం. ఇక ఏటీఎం మిషన్ వచ్చాక బ్యాంకుకు వెళ్లకుండానే కార్డులు ద్వారా డబ్బులు విత్ డ్రా చేస్తున్నాం. ప్రస్తుతం అభివృద్ధి చెందిన టెక్నాలజీ వల్ల త్వరలో ఏటీఎం కార్డు అవసరం లేకుండానే గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా ఏటీఎం కేంద్రాలలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు కావాల్సిన మొత్తాన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని మీరు ఉపయోగించడానికి ఇంకెంతో సమయం ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్(ఎటిఎం) తయారుచేసే ఎన్సీఆర్ కార్పొరేషన్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యుపీఐ) ప్లాట్ఫాంతో కలిసి మొట్టమొదటి సారిగా ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా(ఐసిసిడబ్ల్యు) సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొనిరావడానికి సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్సీఆర్తో చేతులు కలిపింది. క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా సదుపాయాన్ని బ్యాంక్ ఇప్పటికే 1,500 ఏటీఎంలను అప్గ్రేడ్ చేసింది. ఈ ఏటీఎంలలో ఎటువంటి కార్డు అవసరం లేకుండానే స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు డ్రా చేయొచ్చు. "మొబైల్ ఫోన్లో ఉన్న యుపీఐ యాప్ ద్వారా ఎటిఎమ్ లో ఉన్న క్యూఆర్ కోడ్ క్యాష్ విత్ డ్రా చేయవచ్చు, దీని కోసం ఎటువంటి కార్డులు అవసరం లేదు" అని ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & ఎన్సీఆర్ కార్పొరేషన్లో సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు నవ్రోజ్ దస్తూర్ పీటీఐకి చెప్పారు. ఎలా పని చేస్తుంది ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు తమ మొబైల్ లోని యుపీఐ ఎనేబుల్ చేసిన బీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్స్ ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఎటువంటి కార్డ్స్ కూడా అవసరం లేదు. మొదట ఏటీఎం స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఎంతమొత్తం డ్రా చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ ఎంటర్ చేయాలి. అంతే యూపీఐ యాప్లో ప్రాసెస్ పూర్తి కాగానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. ప్రస్తుతం, పరీక్ష దశలో ఉంది కాబట్టి రూ.5వేలకు డ్రా మించి విత్ డ్రా చేయలేరు. ఇది సురక్షితమేనా? భద్రతా విషయంలో ఇది ఇంకా అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కార్డు అవసరం లేదు కాబట్టి కార్డుతో జరిగే మోసాలు అరికట్టవచ్చు. ఇక ఈ లావాదేవీ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి లావాదేవీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటర్పెరబుల్ కార్డ్లెస్ క్యాష్ విత్ డ్రా సేవలను అన్ని బ్యాంకుల యూజర్లకు అందుబాటులోకి తీసుకోని రావడానికి ఎన్సీఆర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు నవ్రోజ్ దస్తూర్ తెలిపారు. చదవండి: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూప్ డీల్ గడువు పొడగింపు రైల్వే ప్రయాణికులకు తీపికబురు -
జాతీయ రహదారుల వెంట ప్రపంచ స్థాయి సౌకర్యాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ప్రయాణీకుల సౌకర్యం కోసం దేశంలోని జాతీయ రహదారుల వెంట ఆధునిక వసతులను కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 22 రాష్ట్రాల్లో హైవే మార్గాలలో 600కు పైగా ప్రాంతాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అభివృద్ధి చేయనుంది. వీటిలో 130 ప్రాంతాల్లో 2021-22లో అభివృద్ధి చేయాలని లక్ష్యించినట్లు. ఇప్పటికే 120 ప్రాంతాల్లో సౌకర్యాల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఎన్హెచ్లు, భవిష్యత్తులో రాబోయే రహదారులు, ఎక్స్ప్రెస్వే మార్గాలలో ప్రతి 30-50 కి.మీ.లకు ఈ సౌకర్యాలుంటాయని పేర్కొంది. పెట్రోల్ బంక్లు, ఎలక్ట్రిక్ చార్జీంగ్ సదుపాయాలు, ఫుడ్ కోర్ట్లు, రిటైల్ షాపులు, బ్యాంక్ ఏటీఎంలు, మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, క్లినిక్లు, స్థానిక హస్తకళల కోసం విలేజ్ హట్లు, ట్రక్ మరియు ట్రెయిలర్ పార్కింగ్, ఆటో వర్క్షాప్స్, దాబా, ట్రక్కర్ వసతి గృహాలు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏకు ఉన్న 3 వేల హెక్టార్ల స్థలంలో ఆయా వసతులను అభివృద్ధి చేస్తుంది. దీంతో ఆయా మార్గాలలో పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు, రిటైలర్లకు భారీ అవకాశాలు వస్తాయని, అలాగే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొంది. ప్రస్తుతం ఎన్హెచ్ఏఐ రహదారుల అభివృద్ధి, కార్యకలాపాల కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో రాబోయే కొత్తగా నిర్మించే/విస్తరించే జాతీయ రహదారి ప్రాజెక్ట్ల వెంట ఆధునిక వసతులు, లాజిస్టిక్ పార్క్లు తప్పనిసరిగా ఉంటాయని తెలిపింది. స్థలాల గుర్తింపు, ఆదాయ ప్రణాళికలు, స్థానిక అనుకూలతలు, సౌకర్యాల డిజైన్ రూపకల్పన వంటి అంశాలపై ఎన్హెచ్ఏఐ నిమగ్నమైంది. చదవండి: సూయజ్కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం -
రైతు దగ్గర రూ.82 వేలు కొట్టేసిన ఏటీఎం దొంగ!
ఖమ్మం: అవసర నిమిత్తం నగదు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్ కు వచ్చిన రైతు దగ్గర నుంచి మోసం 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నా కేటుగాడుని ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. రైతుకు డబ్బులు డ్రా చేయడం తెలవక పోవడంతో వెనుక ఉన్న వ్యక్తి నేను తిసిస్తాను అని చెప్పడంతో నమ్మి తన ఏటీఎం కార్డు ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ఎంతో తెలివిగా ఏటీఎం కార్డు మార్చి 82వేల రూపాయలను కేటుగాడు డ్రా చేసుకున్నాడు. అయితే, బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దొంగను పట్టుకున్నారు. పూర్తీ వివరాల్లోకి వెళ్లితే.. మహబూబాబాద్ జిల్లా పెరుమాళ్ళ సంకీస గ్రామానికి చెందిన బోబ్బ వెంకటరెడ్డి అనే రైతు పురుగు మందులు కొనుగోలు చేసేందుకు ఇటీవల ఖమ్మంకు వచ్చాడు. తన అవసరాల కోసం నగదు డ్రా చేసుకునేందుకు నగరంలోని గాంధీచౌక్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ వచ్చాడు. అక్కడ ఉన్న ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తున్న క్రమంలో డబ్బులు రాక పోవడంతో వెనుకనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి నేను ట్రై చేస్తానని చెప్పి డబ్బులు రావడం లేదని చెప్పి తన కార్డ్ కు బదులు వేరే ఏటీఎం కార్డ్ ఇచ్చి మోసం చేసి తన ఖాతా నుండి 82 వేల రూపాయిలు డ్రా చేసుకున్నట్లు బాధితుడు ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏటీఎం సెంటర్ సిసి ఫుటేజ్, మోసం చేసి రైతుకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ చిరునామా ప్రకారం పోలీసలు విచారణ చేపట్టారు. సిసి ఫుటేజ్ విజువల్స్ అనుమానం గల వ్యక్తి(కొండబోయిన నరసింహారావు) ఆదివారం అనుమానాస్పదంగా గాంధీచౌక్ పరిసరాలలో తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు చేసిన నేరం ఒప్ప్పుకున్నాడు. ఈ నేరంతో పాటు ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మూడు నేరాలు, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, ఇల్లందులో రెండు నేరాలు చేసినట్లు నిందితుడు అంగీకరించారు. అతనిని అరెస్టు చేసే సమయంలో అతని వద్ద ఉన్న 36,000/- రూపాయల నగదు, పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీన పర్చుకోని రిమాండ్ కు పంపారు. ఏటీఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారులు జాగ్రత్త లు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు డ్రా చేయడం తెలియకపోతే ఇంట్లొ సంబంధించిన వ్యక్తులను వెంట తీసుకొని ఏటీఎం సెంటర్ కి వెళ్లాలే తప్పితే గుర్తుతెలియని వ్యక్తుల సహకారం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చదవండి: మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్కు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో మేనేజర్గా వి.భాస్కర్రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు. -
ఏటీఎంలు ఎక్కడెక్కువో మీకు తెలుసా?
ఈ మధ్య మన దగ్గర ఏటీఎంల దొంగతనాలు ఎక్కువయ్యాయి కదా.. అసలు ఏటీఎం అంటే గుర్తుకొచ్చింది.. ఈ ప్రపంచానికే ఏటీఎం రాజధాని ఏమిటో మీకు తెలుసా? దక్షిణ కొరియా.. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. అక్కడ ప్రతి లక్ష మందికి 267 ఏటీఎంలు ఉన్నాయి. తర్వాతి స్థానంలో కెనడా ఉంది.. అమెరికాది నాలుగో స్థానం.. ఇంతకీ మన పరిస్థితి ఏంటనేగా మీ డౌటు.. ఇక్కడ ప్రతి లక్ష మందికి 21 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. చెప్పుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. క్యాష్లెస్ పేమెంట్స్ విషయంలోనూ దక్షిణ కొరియావాళ్లే ముందున్నారు.. వాళ్లు నగదు లావాదేవీలకు పెద్దగా మొగ్గు చూపడం లేదని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చింది.. అదే సమయంలో అక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఏటీఎంలు ఉండటం విశేషం.. -
పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్
సాక్షి, హైదరాబాద్: మొన్న ఆదిలాబాద్ నగరంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ కలకలం రేపింది. దొంగలు దర్జాగా ఏటీఎం సెంటర్లో జొరబడి ఏటీఎం యంత్రానికి తాడు కట్టి లాక్కెళ్లారు. రూ.7.5 లక్షలు ఎత్తుకెళ్లడంతో 3 బృందాలు ఈ దొంగల కోసం గాలిస్తున్నాయి. ఈ విషయం మరువక ముందే నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వట్టిపర్తిలో ఓ ఏటీఎంను చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. ఇదే సమయంలో దగ్గర్లోని వెలిమినేడు గ్రామంలో ని ఏటీఎంను కొల్లగొట్టి రూ.7.12 లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు చేసిన విధానం ఒకేలా ఉంది. ఇది హరియాణా రాష్ట్రానికి చెందిన మేవాట్ జిల్లాలోని ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జాతీయ రహదారులే అడ్డా.. మేవాట్లో కొన్ని మారుమూల ప్రాంతాల ప్రజలు నేటికీ చోరీలే వృత్తిగా జీవిస్తున్నారు. దేశంలోని అనేక ఏటీఎం చోరీల్లో వీరు నిందితులు. హరియాణా నుంచి తెలంగాణకు వచ్చే లారీల్లో వీరూ వస్తారు. రహస్యంగా గ్యాస్ కట్టర్లు, ఏటీఎంలు తెరిచేందుకు కావాల్సిన టూల్కిట్లను తెచ్చుకుంటారు. హైవేల పక్కన ఉన్న దాబాలే వీరికి ఆశ్రయం. అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. చూసేందుకు లారీ డ్రైవర్, క్లీనర్లలా కనిపించడంతో ఎవరికీ అనుమానం రాదు. అక్కడికి సమీపంలోని కాపలాలేని పాతతరం ఏటీఎంలు, జువెల్లరీ షాపుల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. రాత్రి ఒంటి గంట సమయంలో చోరీకి పాల్పడతారు. దీని కోసం చోరీ చేసిన వాహనాలనే వినియోగిస్తారు. ఏటీఎంలను ఎత్తుకెళ్లి, శివారు ప్రాంతా ల్లో గ్యాస్ కట్టర్లు, టూల్ కిట్ల సాయంతో వాటిని తొలచి డబ్బు తీసుకుంటారు. ఏటీఎం లోపలి భాగాల అమరికపై వీరికి అవగాహన ఉండటంతో క్షణాల్లో ఈ పనిపూర్తి చేస్తారు. చోరీ చేసిన వాహనాలతోనే రాష్ట్రం దాటుతారు. తరువాత జాతీయ రహదారి వెంట దొరికిన లారీల్లో చెక్కేస్తారు. దాబాల్లో బస నుంచి చోరీ చేసి తిరిగి వెళ్లేవరకూ రాష్ట్రానికి అధికారికంగా వచ్చినట్లు ఎక్కడా చిన్న క్లూ కూడా దొరక్కుండా జాగ్రత్తపడతారు. పాత ఏటీఎంలు, రసాయనాలు... ఆదిలాబాద్లోని ఎస్బీఐ, చిట్యాలలోని ఇండి క్యాష్ ఏటీఎంలు రెండూ పాత తరహావే. వీటిలో అలారం వ్యవస్థ ఉండదు. కొత్త ఏటీఎంలలో దాన్ని కొట్టినా, తట్టినా వెంటనే సమీపంలోని పోలీసులకు, కాల్సెంటర్లకు సందేశాలు వెళతాయి. ఈ భయంతో వారు ఆధునిక ఏటీఎంల జోలికి వెళ్లరు. ఊరికి దూరంగా, కాపలాలేని పాత తరం ఏటీఎంల ను చోరీకి ఎంచుకుంటారు. ఉదయం పూట రెక్కీకి వచ్చినపుడు సీసీ కెమెరాలకు నల్ల రంగు పూస్తారు. డబ్బు తీసుకుంటున్నట్లు నటించి ఏటీఎంలు సులువుగా ఊడివచ్చేలా అడుగుభాగాన కొన్ని రసాయనాలు పూస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది లిక్విడ్ నైట్రోజన్ అయి ఉండొచ్చని సందేహిస్తున్నారు. లిక్విడ్ నైట్రోజన్తో భారీ ఇనుపకడ్డీలనైనా సులువుగా విరగ్గొట్టేయవచ్చు. ఇదే సమయంలో కొన్ని రకాల స్ప్రేలూ వాడుతున్నారు. వాటిని చల్లగానే ఏటీఎం కేంద్రమంతా క్షణాల్లో పొగలు వ్యాపిస్తున్నాయి. ఈ విషయంపై క్లూస్టీం, ఫోరెన్సిక్ బృందాలు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. లారీల్లో వచ్చి విమానాల్లో ఉడాయిస్తారు.. ఈ తరహా నేరాలు గతంలో హైదరాబాద్లోనూ జరిగాయి. వనస్థలిపురం, హయత్నగర్లోనూ ఏటీఎంలు కొల్లగొట్టిన ఘటనలో రాచకొండ పోలీసులు ఆ పని చే సింది హరియాణాకు చెందిన మేవాట్ ము ఠాలుగా గుర్తించారు. వీరు చాలా తెలివైన దొంగలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ‘సీసీ కెమెరాలకు చిక్కరు. ముసుగులు ధరించడం, కెమెరాలకు రంగు పూయడం, పొగ వదలడం, ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్. చోరీ చేసిన వాహనాలతో రాష్ట్రం దాటుతారు. తర్వాత భోపాల్, నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడ నుంచి లారీలు లేదా విమానాల్లో సొంతూళ్లకు చేరతారు. వీరిని అరెస్టు చేసి తీసుకురావడంలో రాష్ట్ర పోలీసులకు గతంలో చాలా సవాళ్లు ఎదురయ్యా యి. ఊళ్లకు ఊళ్లే దొంగతనాలు జీవనాధారంగా బతుకుతుంటారు కాబట్టి, దొంగల అరెస్టు సమయంలో స్థానికులతో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాలి’అని వివరించారు. -
మాస్టర్ కార్డు వినియోగదారులకు శుభవార్త!
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏదైనా వస్తువును తాకాలంటే ఎక్కువ శాతం ప్రజలు భయపడుతున్నారు. దింతో నగదు చెల్లింపుల విషయంలో కూడా ప్రజలు డిజిటల్ చెల్లింపులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బ్యాంకులు కూడా ఎటిఎంలను తాకకుండానే నగదు ఉపసంహరణ చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకోని రాబోతున్నాయి. ప్రస్తుతం ఈ విధానం ఇంకా అందరికి అందుబాటులోకి రాకున్నప్పటికీ పరీక్ష దశలో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ కార్డ్, ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్తో సహాయంతో పూర్తి కాంటాక్ట్లెస్ నగదు ఉపసంహరణను విధానాన్ని తీసుకోని రాబోతుంది. మాస్టర్ కార్డు దారులు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి ఎటిఎం స్క్రీన్పై కనిపించే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బ్యాంక్ యాప్లో పిన్ను నమోదు చేయాలి. తర్వాత మీరు మొబైల్ లో ఎంటర్ చేసిన మొత్తాన్ని ఎటిఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం ఏటీఎంలలో మోసాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ మొదట బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ప్రారంభించింది. ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ తన నెట్వర్క్లోని అన్ని ఎటిఎంలకు దశలవారీగా ఈ 'కాంటాక్ట్లెస్' క్యూఆర్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది. చదవండి: సంచలనాలు సృష్టిస్తున్న షియోమీ భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు -
ఏటీఎంలో చోరీకీ యత్నించిన విద్యార్థులు
సాక్షి, శంషాబాద్: పట్టణంలోని యాక్సిస్ బ్యాంకుకు చెందిన ఏటీఎంలో దొంగతనం చేసేందుకు యత్నించిన ఇద్దరు మైనర్లను ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇంద్రానగర్ దొడ్డికి చెందిన 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు(14) చదువు మానేసీ ఖాళీగా ఉన్న మరో బాలుడు(16)తో కలిసి ఏటీఎం ధ్వంసం చేసి డబ్బులు కాజేయాలని పథకం వేశారు. ఇద్దరు కలిసి శనివారం అర్ధరాత్రి బస్టాండ్ సమీపంలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీంలోకి వెళ్లారు. ఏటీఎంకు సంబంధించిన కొన్ని వస్తువులను బయటికి తీసిన వెంటనే యాక్సిస్ బ్యాంకుకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు. గస్తీలో ఉన్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఇద్దరి అదుపులోకి తీసుకున్నారు. చోరికి యత్నించిన కారణంగా వారిని జువైనల్ హోంకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ. 200 కోట్లు- 2,000 ఉద్యోగాలు!
ముంబై, సాక్షి: ఏటీఎం నిర్వాహక కంపెనీ సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ తాజాగా రూ. 1,300 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. తొలి దశలో భాగంగా రూ. 180-200 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వైస్చైర్మన్ రాజీవ్ కౌల్ వెల్లడించారు. తద్వారా రూ. 2,000 మందికి ఉపాధి లభించనున్నట్లు అంచనా వేశారు. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. పీఈ దిగ్గజం బేరింగ్కు ప్రధాన వాటా కలిగిన కంపెనీ ఏడేళ్ల కాలంలో రూ. 1,300 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా ఏటీఎంల నిర్వహణ, క్యాష్ మేనేజ్మెంట్ బిజినెస్లను భారీగా పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. సీఎంఎస్ ఇన్ఫోలో.. బేరింగ్ పీఈ ఏషియాకు చెందిన సియాన్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కలిగి ఉంది. (మెడ్ప్లస్పై వార్బర్గ్ పింకస్ కన్ను!) కంపెనీ కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ నుంచి 3,000 ఏటీఎంల నిర్వహణకు సీఎంఎస్ ఇన్ఫో కాంట్రాక్టును పొందింది. దీనిలో భాగంగా స్థల ఎంపిక, ఏటీఎంల ఏర్పాటు, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులు, రోజువారీ నిర్వహణ చేపట్టవలసి ఉంటుంది. ఏడేళ్లపాటు అమల్లో ఉండే కాంట్రాక్టును మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలుంటుంది. ఈ ఏడాది మొదట్లో సెక్యూరిటీ మేనేజ్మెంట్ కంపెనీ లాజిక్యాష్ సొల్యూషన్స్ను సీఎంఎస్ ఇన్ఫో కొనుగోలు చేసింది. నిశా(ఎన్ఐఎస్ఏ) గ్రూప్ నుంచి సొంతం చేసుకున్న ఈ సంస్థ కారణంగా నిర్వహణలోని ఏటీఎంల సంఖ్య 62,000 నుంచి 72,000కు పెరిగినట్లు తెలుస్తోంది. (బ్యాంకింగ్: డిజిటల్ సేవల్లో సవాళ్లేంటి?) రోజుకి రూ. 5,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్కల్లా దేశీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో 1,13,981 ఆన్సైట్, 96,068 ఆఫ్సైట్ ఏటీఎంలున్నాయి. వీటికి అదనంగా బ్యాంకులు 3,27,620 మైక్రో ఏటీఎంలను సైతం కలిగి ఉన్నాయి. సీఎంఎస్ ఇన్ఫో సగటున రోజుకి రూ. 5,000 కోట్ల నగదును నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. కాగా.. ఏటీఎంల నిర్వహణలో దేశీయంగా ఏజీఎస్ ట్రాన్సాక్ట్, ఎస్ఐఎస్, రైటర్స్ కార్ప్ తదితర సంస్థలు సర్వీసులు అందిస్తున్నాయి. -
జైల్లో ఏటీఎం.. ఎక్కడంటే..!
పట్నా: ఏటీఎంలు వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని సగం తగ్గిపోయింది. లేదంటే బ్యాంకు టైమ్ లోపల వెళ్లి ఓచర్ రాసి డబ్బులు డ్రా చేయాలంటే ఓ రోజంతా పట్టేది. డబ్బులు అత్యవసరం ఉండి.. అదే రోజు బ్యాంకుకు సెలవు ఉంటే ఇక చెప్పలేం. ఈ కష్టాలన్నింటికి ఏటీఎంతో ఫుల్స్టాప్ పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. చేతిలో కార్డు ఉంటే చాలు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఖైదీల కోసం జైల్లో కూడా ఏంటీఎం ఏర్పాటు చేయబోతున్నారు. బిహార్లోని పూర్నియా సెంట్రల్ జైలు అధికారులు ఖైదీల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావించారు. ఖైదీలకు తమ అవసరాల నిమిత్తం డబ్బు కావాలంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వాల్సిందే. దీని వల్ల గేటు దగ్గర ఎక్కువ మంది గుమిగుడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!) ఈ సందర్భంగా పూర్నియా సెంట్రల్ జైలు సూపరిండెంట్ మాట్లాడుతూ.. ‘జైలు ప్రాగణంలో ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎస్బీఐకి లేఖ రాశాము. మరో రెండు వారాల్లో ఏటీఎం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 వందల మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సంబంధింత బ్యాంకుల నుంచి ఏటీఎం కార్డులు ఇప్పించాం. త్వరలోనే మిగతా వారికి కూడా అందిస్తాం అని తెలిపారు. ఇక జైలులో ఖైదీలు ప్రతి రోజు 4-8 గంటలు పని చేస్తుంటారు. ఇందుకు గాను వీరికి 52-103 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఖైదీల చేతికి ఇవ్వకుండా అకౌంట్లో జమ చేస్తారు. ఇక జైలులో లోపల కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ అవి అమల్లోకి వస్తే ఖైదీల వేతనం 112-156 రూపాయలకు పెరగనుంది. ఇక జైలులో ఖైదీలు తమ చేతిలో 500 రూపాయలు వరకు ఉంచుకోవచ్చు. (చదవండి: వామ్మో.. ఏటిఎం?) జనవరి 2019 వరకు, ఖైదీల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించేవారు. ప్రస్తుతం డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. జైలు గేటు వద్ద ఏటీఎం ఏర్పాటు చేస్తే.. ఖైదీలకు డబ్బులు ఇవ్వడానికి వచ్చే వారిని సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలు జైలులో పని చేసినందుకు లభించే వేతనం నుంచి తమకు అవసరమైన నూనె, సబ్బులు, పండ్లు, స్నాక్స్ వంటి రోజువారీ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకుంటారు అని అధికారులు తెలిపారు. -
వైరల్: జ్యూస్ షాప్గా మారిన ఏటీఎం
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఒక జ్యూస్ షాప్ యజమాని చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఆ యజమాని ఏటీఎంనే ఏకంగా జ్యూస్ షాప్గా మార్చేశాడు. సాధారణంగా ఏటీఎం లోపల ఒక వ్యక్తి ఉంటేనే మరో వ్యక్తిని లోనికి అనుమతించరు. అలాంటిది ఏటీఎం మిషన్ను ఒక మూలకు నెట్టి మరీ అతను లోపల కుర్చీలు వేసేశాడు. అంతేకాకుండా ఏటీఎంలో డబ్బలు విత్డ్రా చేసుకోవడానికి వచ్చిన వారిని కుర్చీలో కూర్చోండి అంటూ మర్యాదలు కూడా చేస్తున్నాడు. చాలా మంది అక్కడ కూర్చొని ఉండగానే కస్టమర్లు వారి ఏటీఎం లావాదేవీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని బట్టి ఏటీఎంలు ఎంత రిస్క్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మీ ఏటీఎం పిన్లను, ఓటీపీలను ఎవరికి తెలియనివ్వద్దు అంటూ బ్యాంకులు ప్రతిసారి మెసెజ్లు పంపుతూ హెచ్చరిస్తూనే ఉంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏటీఎంను జ్యూస్ షాప్గా మార్చడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు. ఇది పూర్తిగా బ్యాంక్ ఏటీఎం నిబంధనలకు విరుద్ధం. ఏటీఎం రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి లోపల ఉంటే మరో వ్యక్తి అక్కడ ఉండటానికి వీలు లేదు. సాధారణంగా ప్రతి ఏటీఎం దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అయితే ఈ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ ఎందుకు లేదో తెలియడం లేదు. అంతేకాకుండా బ్యాంకు అధికారులు ఎవరు కూడా దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఏటీఎంలో డబ్బులు పెట్టడానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఏదైనా సాంకేతిక లోపలు తలెత్తినప్పుడు అధికారులు అక్కడికి వచ్చే ఉంటారు. అప్పుడు కూడా వారు జ్యూస్ యజమానిని ఎందుకు హెచ్చరించలేదు? అసలు ఆ వ్యక్తిపై బ్యాంక్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ వీడియో చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండటంతో సదరు వ్యక్తిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. వైరల్: జ్యూ స్ షాప్గా మారిపోయిన ఏటీఎం Autoplay ONOFF చదవండి: ఇటలీని షేక్ చేస్తున్న ప్రభాస్ మేనియా -
మూతపడుతున్న ఎటిఎమ్లు
-
ఏటీఎం షట్డౌన్..
సాక్షి, హైదరాబాద్: బ్యాంక్ ఏటీఎంలు ఒక్కొక్కటిగా షట్డౌన్ అవుతున్నాయి. ప్రజలు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ వైపు మళ్లుతుండటంతో వీటి అవసరం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు కరోనా భయం వెంటాడుతుండటంతో ఆదరణ కూడా తగ్గింది. ఒకవైపు ఆన్లైన్ పేమెంట్లు, మరోవైపు కరోనా ప్రభావంతో ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏటీఎంలను తగ్గించుకోవడంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. క్రమంగా కస్టమర్లు డిజిటల్ మాధ్యమాల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు అలవాటు పడటంతో వీటి అవసరం చాలా వరకు తగ్గుతోంది. దీంతో దినసరి 200 స్వైపింగ్ లేని ప్రాంతాలను గుర్తించి ఏటీఎంలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. నగరంలో వివిధ బ్యాంకులకు సంబంధించి సుమారు 4 వేల ఏటీఎంలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 20 శాతానికి పైగా ఏటీఎంలను మూసివేసినట్టు సమాచారం. నగదు రహిత లావాదేవీలు... ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ భయంతో నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నాయి. పాలు బిల్లు నుంచి ఇంటి అద్దె వరకు డిజిటల్ రూపంలో చెల్లిస్తుండటంతో పెద్దగా నగదు అవసరం లేకుండా పోయింది. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఏటీఎంలు బోసిపోతున్నాయి. కరోనా భయంతో ఏటీఎంలకు వెళ్లి నగదు డ్రా చేసేందుకు నగర వాసులు వెనుకాడుతున్నారు. ఇంటి గుమ్మం ముందే బ్యాంకు ఖతాలోని నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు ఖాతాదారులకు ఉంది. ఇప్పటికే తపాలా శాఖ వివిధ బ్యాంకుల ఖాతాదారులకు ఇంటి ముంగిటకే నగదు సేవలు అందిస్తోంది. ఎస్బీఐ కూడా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. (చదవండి: ఓటుందో.. లేదో.. చెక్ చేసుకోండి) -
ఏటీఎంలో 15 లక్షల నగదు చోరీ
సాక్షి, జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. 15 లక్షల నగదును దుండగులు అపహరించారు. తెల్ల కారులో వచ్చిన ఇద్దరు దుండగులు ముఖాలకు మాస్కులు ధరించడంతోపాటు రుమాలును చుట్టుకుని ఏటీఎంలోకి ప్రవేశించారు. ఆ వెంటనే సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి, గ్యాస్ కట్టర్తో ఏటీఎం మిషన్ను కట్ చేశారు. ఏటీఎంలోని డబ్బును అపహరించి షట్టర్ను కిందికి దించి వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం బ్యాంకు సిబ్బంది ఏటీఎం షట్టర్ మూసి ఉండటాన్ని గమనించి షట్టర్ను తెరవగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బ్యాంకు మేనేజర్ దీపిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు.