అటవీ భూములను పరిరక్షించాలి | joint collector visits mrugavani national park | Sakshi
Sakshi News home page

అటవీ భూములను పరిరక్షించాలి

Published Fri, Apr 24 2015 7:56 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

అటవీ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి అన్నారు.

మొయినాబాద్ (రంగారెడ్డి జిల్లా) : అటవీ భూములు కబ్జాకు గురికాకుండా పరిరక్షించాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి అన్నారు. శుక్రవారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. మృగవని జాతీయపార్కు భూములకు సంబంధించిన రికార్డులను జేసీ పరిశీలించారు. అటవీశాఖ ఆధీనంలో ఉన్న మృగవని జాతీయ పార్కు భూములు కబ్జాకు గురవుతున్నాయని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందడంతో ఆ భూముల వివరాలను తెలుసుకునేందుకు ఆమె శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రికార్డులను పరిశీలించారు.
 

మండలంలోని చిలుకూరు రెవెన్యూలోని సర్వేనంబర్ 1లో 1,417 ఎకరాల 15 గుంటల భూమి అటవీశాఖ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ భూమికి సంబంధించి శనివారం నుంచి పూర్తిగా సర్వేచేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. ఆమె వెంట డీఎఫ్‌ఓ మోహన్, ఆర్డీఓ చంద్రమోహన్, తహసీల్దార్ పీఎల్.గంగాధర్, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అంబర్‌సింగ్, ఎఫ్‌ఆర్‌ఓ నజీబుద్దీన్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement