Ranga reddy
-
రంగారెడ్డి జిల్లా రామోజీ ఫిలిం సిటీ బాధితుల ఆందోళన
-
హైదరాబాద్ శివారులో భారీగా కోడి పందేలు.. టీడీపీ నేత అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో భారీఎత్తున కోడి పందేలు నిర్వహించారు. పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో కోళ్ల పందేల శిబిరంపై దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం నిర్వహించింది టీడీపీకి చెందిన శివకుమార్ వర్మగా గుర్తించారు. ఈ క్రమంలో కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. వీరిలో పది మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మిగతా వారంతా ఏపీకి చెందినవారే ఉన్నారు.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోలుకట్టాలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కోళ్ల పందేల శిబిరంపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్కుమార్రెడ్డి తమ 50 మంది సిబ్బందితో కోడి పందేల శిబిరానికి చేరుకున్నారు.అనంతరం, పోలీసులు వ్యవసాయ క్షేత్రంలోనికి వెళ్లేసరికి పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడంతో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రమంలో కోడి పందేల నిర్వాహకుడు టీడీపీకి చెందిన భూపతిరాజు శివకుమార్వర్మ, పందెంరాయుళ్లు ఎటూ పోకుండా పోలీసులు చుట్టుముట్టి వారిని నిర్బంధించారు. లోకేష్తో పాటు పలు సందర్బాల్లో ఫొటోలు దిగిన భూపతిరాజు. ఇక, ఆంధ్రప్రదేశ్కు చెందిన శివకుమార్ 64 మంది పందెం రాయుళ్లు, 80 కోళ్లతో కోడి పందేలు నిర్వహించారు. కోడి పందేళ్లను ఆడించడానికి బెట్టింగ్ రూ.30 లక్షలు పెట్టినట్టు సమాచారం. కోడి పందేలు ఆడుతున్న వారి నుంచి రూ.30 లక్షలు, 80 కోళ్లు, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కోడి పందేలలో పాల్గొన్న 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మొయినాబాద్ పోలీస్స్టేషన్కు తరలించారు. -
కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని మైలర్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్లాస్టిక్ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.దీంతో పోలీసులకు,ఫైర్ సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలువ్యాపించడంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగింది ప్లాస్టిక్ కంపెనీలో కావడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. -
రంగారెడ్డి కలెక్టరేట్లో మోహన్బాబు, మనోజ్ విచారణ
-
న్యూ ఇయర్ వేడుకల్లో బడంగ్పేట మేయర్ పారిజాత
రంగారెడ్డి: బడంగ్పేట మేయర్ శ్రీమతి చిగిరింత పారిజాత కొత్త సంవత్సర వేడుకల్లో సందడి చేశారు. మంగళవారం సాయంత్రం ఆల్మాస్గూడలో బోయపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు. మేయర్ పారిజాత సమక్షంలో జరిగిన వేడుకల్లో అసోషియేషన్ సభ్యులు హుషారుగా గడిపారు. పలువురికి సన్మానాలు చేసి ఆమె బహుమతులు అందజేశారు. అలాగే కాలనీ సమస్యలను పరిష్కరిస్తామని ఆమె అన్నారు. మరోవైపు కార్పొరేటర్ సాంరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన సేవల్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు ఎ. జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పి.కవిత, కోశాధికారి సీహెచ్ వినోబా చారి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలే టార్గెట్.. మైలార్దేవుపల్లిలో కూల్చివేతలు
రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక, హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన అధికారులు, హైడ్రా అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. తాజాగా మైలార్దేవుపల్లి పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. తాజాగా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీగూడలో కూల్చివేతలు ప్రారంభించింది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్పై ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగిస్తున్నారు. రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబ్బంది అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం, నలుగురు మృతి
-
రంగారెడ్డి: చేవెళ్లలో లారీ బీభత్సం.. పలువురు మృతి!
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన లారీ.. కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్లింది. దీంతో, పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆలూర్ స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముతున్న వారిపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. పది మందికిపైగా గాయపడినట్టు సమాచారం. ఇక, డ్రైవర్.. క్యాబిన్లో ఇరుక్కుపోయినట్టు తెలుస్తోంది. గాయపడిని వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘగనా స్థలంలో కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సీఎం రేవంత్ సంబంధిత జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
భూదాన్ భూములపై డీజీపీకి ఈడీ నివేదిక.. మరిన్ని కేసులు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూదాన్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విషయంలో ఈడీ అధికారులు.. డీజీపీకి నివేదిక సమర్పించారు. ఈ సందర్బంగా భూదాన్ వ్యవహారంపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అమోయ్ కుమార్తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని నివేదికలో ఈడీ సిఫారసు చేసింది.రాష్ట్రంలో భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి డీజీపీకి ఈడీ నివేదికను సమర్పించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్తో పాటు ఎంఆర్వో జ్యోతి, ఆర్డీవో వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ రిపోర్టులో వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా భూ బదాయింపుల్లో చోటుచేసుకున్న లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో పలు అక్రమాలు జరిగినా గతంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో అమోయ్ కుమార్తో పాటుగా మిగతా అధికారులపై కూడా కేసులో నమోదు చేసి విచారించాలని సిఫార్సు చేసింది. -
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాద్నగర్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. పేలుడు తీవ్రతకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వారందరూ యూపీ, బీహార్కు చెందిన వారని తెలుస్తోంది. ఇక గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు పేలుడుతో ఫ్యాక్టరీలో పైకప్పు కూలగా..గ్లాస్ ముక్కలు గుచ్చుకుని బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
-
Ranga Reddy: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
శంషాబాద్: ఆపరేషన్ చిరుత.. చిక్కేనా?
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు రోజుల క్రితం చొరబడిన చిరుతను బంధించడం కోసం అటవీ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత బోన్ వరకు వచ్చి వెళ్లిపోతుంది. దీంతో చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. మేకను ఎరగా వేసినా.. చిరుత బోనులోకి రావటం లేదు. ఒకే ప్రాంతంలో మూడు రోజుల నుంచి చిక్కకుండా చిరుత తిరుగుతోంది. చిరుత కోసం 4 రోజులుగా స్పెషల్ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ఎండకాల కావడంతో అడవిలో నీరు లభించకే చిరుతలు బయటకు వస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే చిరుతను పట్టుకుంటామని చెప్పారు. ఒంటరిగా పొలాలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. -
రూ.కోటి రూపాయాల కారుకు నిప్పు
రంగారెడ్డి: కొనుగోలు ముసుగులో స్పోర్ట్స్ కారుకు నిప్పంటించిన సంఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో శనివారం సాయంత్రం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్ అనే వ్యాపారి తన లంబోర్ఘిని కారు (డిఎల్ 09 సివి 3636) అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్కు చెప్పాడు. దీంతో కస్టమర్ ఉంటే చూడాలంటూ అయాన్ తన స్నేహితుడైన మొఘల్పురాకు చెందిన అమన్ హైదర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్హౌస్ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్ చెప్పడంతో, అయాన్ కారు తీసుకొచ్చి జల్పల్లి వద్ద అమన్కు ఇచ్చాడు. జల్పల్లి నుంచి అమన్ తన స్నేహితుడు హందాన్తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్పోర్ట్ రోడ్డు వైపు మళ్లి కారును ఆపారు. అనంతరం అహ్మద్, అతనితో పాటు మరికొంత మంది హోండా సిటీ, వ్యాగనార్ కార్లు, బైక్లపై అక్కడికి చేరుకున్నారు. నీరజ్ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్, అతని వెంట వచ్చిన వారు బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను ఒక్కసారిగా లంబోర్గిని కారుపై పోసి నిప్పంటించారు. ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకునేలోపే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. మహేశ్వరం ఏసీపీ పి.లక్ష్మీకాంత రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, ఎస్సై మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని కారును పరిశీలించారు. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉండవచ్చని తెలిపారు. -
బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
జన్వాడలో ఉద్రిక్తత: 144 సెక్షన్.. 21 మంది అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని జన్వాడ చర్చ్పై దాడి కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేసినట్టు మొకిలా పోలీసులు తెలిపారు. కాగా, వివరాల ప్రకారం.. జన్వాడలో రోడ్ వైడ్నింగ్ చేయాలని ఒక వర్గం పట్టుబట్టింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్ అధికారులు దీనికి ఒప్పుకోకపోవడంతో అక్కడున్న చర్చ్పై వారంతా దాడికి పాల్పడ్డారు. కాగా, చర్చ్ కూల్చివేతను మరో వర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేప్టటారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సీపీ తెలిపారు. అలాగే, జాన్వాడలో 144 సెక్షన్ కొనసాగుతోందన్నారు. ఈనెల 21వ తేదీ వరకు జన్వాడలో ఆంక్షలు అమలులో ఉంటాయని హెచ్చరించారు. -
మొయినాబాద్ యువతి కేసులో ట్విస్ట్.. ఎస్సై సస్పెండ్
సాక్షి, రంగారెడ్డి: మొయినాబాద్లో యువతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. బాకరం గ్రామ పరిధిలో సోమవారం మంటల్లో కాలిపోయిన యువతి మృతదేహం ఘటన హత్య కాదు.. ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతి చెందిన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్గా (22) గుర్తించారు. డిప్రెషన్, స్నేహితురాలితో ఎడబాటు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడైంది. జనవరి 8వ తేదీని ఇంటి నుంచి ఆటోలో సంఘటన స్థలానికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తానంత తానుగా పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. గతంలో రెండు మూడు సార్లు ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంట్లో గొడవపడి ఒకటి రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని.. అందుకే ఈసారి కూడా అలాగే వస్తుందని భావించి పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తలిదండ్రులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఘటన సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు మీడియా సమావేశంలో తెలిపే అవకాశం ఉంది. వెలుగులోకి కొత్త విషయాలు పోలీసుల విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన తరువాత సీసీ కెమెరాల పరిశీలించిన పోలీసులకు.. ఒక ఆటో అక్కడి పరిసరాలలో అనుమానాస్పదంగా తిరగడం కనిపించింది. దీంతో పోలీసులు ఆటో నడిపిన వ్యక్తిని గుర్తించి విచారించారు. వెయ్యి రూపాయలు ఇచ్చి డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ దగ్గర దింపమని యువతి కోరిందని.. తాను అలాగే అక్కడ దించేసి వెళ్లినట్లు ఆటో డ్రైవర్ పోలీసులతో చెప్పాడు. తరువాత ఎం జరిగిందో తెలియదని అన్నాడు. అయితే యువతి ఆత్మహత్యకు ఒక రోజు ముందే 5 లీటర్ల పెట్రోల్ తీసుకొని ఫ్రెండ్ ఇంట్లో పెట్టినట్లు తెలిసింది. ఘటన జరిగిన రోజు ఉదయం తన వెంట తెచ్చుకోని బలవన్మరణానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్తోపాటు చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ పోలీస్ స్టేషన్ పోలీసులతో కలిసి లో బృందాలుగా విడిపోయి ఈ కేసును ఛేదించాయి. పోలీసుల నిర్లక్ష్యం.. సీపీ ఆగ్రహం ఈ కేసులో హబీబ్ నగర్లో పోలీసుల నిర్లక్ష్యంపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్ కనిపించకుండా పోగా.. పదో తేదీనా యువతి సోదరుడు హబీబ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. దీంతో హైదరాబాద్ సీపీ స్వయంగా హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు వివరాలను పరిశీలించారు. కేసుపై విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హబీబ్ నగర్ పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేస్తామన్నారు. మళ్లీ ఇలాంటి పొరపాటు జరగకుండా చూస్తామని చెప్పారు. హబీబ్ నగర్ ఎస్సై సస్పెండ్ మొయినాబాద్ యువతి మృతి ఘటనపై సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీరియస్ అయ్యారు. ఘటనలో మిస్సింగ్ కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబుకు మోమో జారీ చేసినట్లు తెలిపారు. -
పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ సతీశ్ సస్పెండ్
రంగారెడ్డి: పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్గా కె.సతీశ్ బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు గడవక ముందే భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. 2004 బ్యాచ్కు చెందిన సతీశ్ 2023 జూన్ 14న పహాడీషరీఫ్ సీఐగా బాధ్యతలు చేపట్టారు. ఆరు మాసాల్లో స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల అంశం, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. కానీ అధికార పార్టీ రాష్ట్ర స్థాయి నేతకు సంబంధించిన భూ వివాదంలో తలదూర్చారనే ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. ఈ వివాదంలో ఇన్స్పెక్టర్ మాత్రమే ఉన్నారా...? మరెవరైనా ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారా అని స్థానికంగా చర్చలు సాగుతున్నాయి. ఏడాది గడవకుండానే.. రెండు నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహించాల్సిన ఎస్ఎహెచ్ఓలు పహాడీషరీఫ్ పీఎస్లో మాత్రం ఏడాది కూడా పనిచేయడం లేదు. రకరకాల కారణాలతో బదిలీలు, సస్పెండ్ అవుతున్నారు. ►2020 జూలై 23న సీఐగా బాధ్యతలు చేపట్టిన విష్ణువర్ధన్రెడ్డి ఏడాది తిరగకుండానే 2021 జూలై 15న అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ►2021 ఆగస్టు 4న బాధ్యతలు చేపట్టిన సి.వెంకటేశ్వర్లు 14 నెలలు పనిచేసి 2022 అక్టోబర్ 4న అకస్మాత్తుగా బదిలీ అయ్యారు. ► అక్టోబర్లో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ 2023 మార్చిలో రాజకీయ ఫిర్యాదులతో బదిలీ అయ్యారు. మూడు నెలల పాటు డీఐ కాశీ విశ్వనాథ్ ఇన్చార్జి ఎస్హెచ్ఓగా కొనసాగారు. ► 2023 జూన్ 14న బాధ్యతలు చేపట్టిన సతీశ్ ఆరు నెలలు గడవక ముందే భూ వివాదం ఆరోపణలతో 2024 జనవరి 7న సస్పెండ్ అయ్యారు. స్నేక్ గ్యాంగ్ ఉదంతం నుంచి స్నేక్ గ్యాంగ్ లాంటి ఉదంతంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిన పహాడీషరీఫ్ పీఎస్పై పోలీసు ఉన్నతాధికారుల ప్రత్యేక నిఘా ఉంటుంది. ఒకవైపు హత్యలు, హత్యాయత్నాల లాంటి నేరాలకు ఆస్కారం ఉండడం.. ఆపై నగర శివారు కావడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతున్న ఈ ఠాణా పరిధిలో విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదే. పై స్థాయి అధికారుల ఆదేశాల కోసం భూ వివాదాలలో తలదూర్చి స్థానిక పోలీసులు తమ మెడకు చుట్టుకున్న సందర్భాలు సైతం గతంలో వెలుగు చూశాయి. ఏదేమైనా తరచూ ఎస్హెచ్ఓలు మారుతుండడంతో నేరాల నివారణ, ఈ ప్రాంతంపై పట్టు సాధించడం కొత్తగా వచ్చిన అధికారులకు ఇబ్బందికరంగా మారుతోంది. -
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాళ్లదాడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి గురువారం నామినేషన్ వేసేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నియోజకవర్గంలో ఒకేసారి రెండు పార్టీలు భారీ ర్యాలీ చేపట్టాయి. ర్యాలీగా వెళుతున్న సమయంలో ఇరు పార్టీలు ఎదురుపడగా.. కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నేతలపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ నేతలపై విసురుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నేతలపై లాఠీచార్జ్ చేసి పరిస్థితి అదుపుచేసేందుకు యత్నించారు. -
స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది చిన్నారులు..
సాక్షి, వికారాబాద్: స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సు ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లిన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 40 మంది పిల్లలకు తృటిలో ప్రమాదం తప్పడంతో పేరెంట్స్, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వికారాబాద్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 40 మంది స్కూల్ పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్కు చెందిన మినీ బస్సు ప్రమాదానికి గురైంది. సుల్తాన్పూర్ వద్ద ఓ నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో నీటిలో ఉన్న బస్సులోకి నుంచి స్థానికులు.. విద్యార్థులను కాపాడారు. ఇక, సదరు బస్సును న్యూ బ్రిలియంట్ స్కూల్కు చెందిన వాహనంగా గుర్తించారు. కాగా, బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యాజమాన్యంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నివేదిక వచ్చేవరకు జీవో 111కు కట్టుబడి ఉంటాం -
రోజుకు 5,500 రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజుకు సగటున 5,500 వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా జరిగే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లతో పాటు ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కలిపి ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు (ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 20 వరకు) 9.5లక్షల వరకు లావాదేవీలు జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వ్యవసాయేతర లావాదేవీలు 5.26లక్షల పైచిలుకు కాగా, వ్యవసాయ భూముల లావాదేవీలు 4.23లక్షలు కావడం గమనార్హం. ఈ లావాదేవీలపై గత ఐదు నెలల (ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) కాలంలో రూ.7 వేల కోట్లు ఖజానాకు సమకూరింది. ఇందులో వ్యవసాయేర లావాదేవీల ద్వారా రూ.5000 కోట్ల వరకు రాగా, ధరణి పోర్టల్ ద్వారా రూ.1700 కోట్ల వరకు వచ్చి ఉంటుందని, ఇక సొసైటీలు, మ్యారేజీ రిజిస్ట్రేషన్లు, ఈసీ సర్టిఫికెట్లు తదితర లావాదేవీలు కలిపి ఆ మొత్తం రూ.7వేల కోటుŠల్ దాటి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచే రూ.1,703 కోట్ల ఆదాయం ఇక, జిల్లాల వారీ రిజిస్ట్రేషన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోని 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోనే జరుగుతున్నాయి. ఈ జిల్లా రిజిస్ట్రేర్ పరిధిలో ఆగస్టు నాటికి 1.07లక్షల డాక్యుమెంట్ల లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,703 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం దాటిన జిల్లాల్లో మేడ్చల్ కూడా ఉంది. ఇక్కడ 70వేలకు పైగా లావాదేవీలు జరగ్గా రూ.1,100 కోట్ల వరకు ఆదాయం వచ్చి ఉంటుందని అంచనా. ఇక, రాష్ట్రంలో అతి తక్కువగా హైదరాబాద్–1 పరిధిలో లావాదేవీలు జరిగాయి. ఇక్కడ గత ఐదు నెలల్లో 9,148 లావాదేవీలు మాత్రమే జరిగాయి. కానీ ఆదాయం మాత్రం రూ. 185 కోట్ల వరకు వచ్చింది. అదే వరంగల్ జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో 40వేలకు పైగా లావాదేవీలు జరిగినా వచ్చింది అంతే రూ.188 కోట్లు కావడం గమనార్హం. అంటే హైదరాబాద్–1 పరిధిలో ఒక్కో లావాదేవీ ద్వారా సగటు ఆదాయం రూ. 2.02 లక్షలు వస్తే, వరంగల్ జిల్లాలో మాత్రం రూ.40 వేలు మాత్రమే వచ్చిందని అర్థమవుతోంది. బంజారాహిల్స్ టాప్..ఆదిలాబాద్ లాస్ట్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా సగటు డాక్యుమెంట్ ఆదాయం బంజారాహిల్స్ (హైదరాబాద్–2) జిల్లా పరిధిలో నమోదవుతోంది. ఖరీదైన ప్రాంతంగా పేరొందిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే లావాదేవీల ద్వారా ఒక్కో డాక్యుమెంట్కు సగటున రూ.2.3లక్షలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు ఇక్కడ 16,707 లావాదేవీలు జరిగాయని, తద్వారా రూ. 396.56 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, డాక్యుమెంట్ సగటు ఆదాయం అతితక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో వస్తోంది. ఇక్కడ సగటున ఒక్కో డాక్యుమెంట్కు రూ.23వేలకు కొంచెం అటూ ఇటుగా ఆదాయం వస్తోంది. డాక్యుమెంట్ల వారీగా పరిశీలిస్తే రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, ఖమ్మం చివరి స్థానంలో ఉంది. ఖమ్మం జిల్లా రిజిస్ట్రేర్ కార్యాలయ పరిధిలో గత ఐదు నెలల కాలంలో కేవలం 20వేల పైచిలుకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. -
బాలాపూర్ గణనాథుడు.. ఈసారి స్పెషల్ ఇదే
బాలాపూర్ గణనాథుని వేడుకలకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏటా గణేశుడి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వామి వారి చేతిలోని లడ్డూకు ఎక్కడా లేని డిమాండ్ ఉంటుంది. ఈసారి ఐదు తలల నాగరాజు పడగల కింద స్వామివారిని సుందరంగా రూపొందించారు. విజయవాడ కనకదుర్గ ఆలయ నమూనాలో మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. కోల్కతాకు చెందిన కళాకారులు 11 రోజులుగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 18 ఫీట్ల ఎత్తుతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్లో విషాదాంతమైన బాలుడి మిస్సింగ్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కిరాణా షాప్కు వెళ్లిన బాలుడు బన్నీ..ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో వెదికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ టీమ్ సాయంతో ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. -
హైదరాబాద్లో మరో భారీ భూ వేలంపాట
సాక్షి, హైదరాబాద్: నగరం శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా మొకిలా వద్ద మూడు వందల పాట్ల అమ్మకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. మూడు వందల ప్లాట్లలో 98,975 గజాలను అమ్మకానికి పెట్టిన సర్కార్.. ఈ లేఔట్లో మూడు వందల నుంచి 5 వందల గజాల ప్లాట్స్ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి ఆగస్ట్ 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. రూ. 1,180 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలంలో పాల్గొనే వారు EMD రూ. 1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. చదరవు గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ధరగా నిర్ణయించారు. మొకిలా మొదటి ఫేజ్లో గజానికి అత్యధిక ధర 1లక్ష 5వేలు కాగా, అత్యల్పంగా 72వేలు నిర్ణయించారు. ఫెజ్ వన్లో గజంపై ప్రభుత్వానికి సరాసరిగా రూ. 80,397 ఆదాయం వచ్చింది. ఇప్పుడు 98,975 గజాలకు 8 వందల కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. చదవండి: బుద్వేల్ భూం భూం.. -
రేవంత్రెడ్డి చంద్రబాబు శిష్యుడే !
వికారాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నారా చంద్రబాబునాయుడి శిష్యుడేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బీమా, రైతు బంధు పథకాలను ఎత్తేయడం ఖాయమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చన్గోముల్లో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్య రథ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేవంత్రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ఉచిత విద్యుత్తు ప్రస్తావన లేదన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.... మూడు పంటల బీఆర్ఎస్ కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకే విద్యుత్తు కొంటున్నామని అన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే వ్యక్తి ఎంపీ రంజిత్రెడ్డి అని అన్నారు. సొంత డబ్బులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ మేఘమాల, మార్కెట్కమిటీ చైర్మన్ అజారుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్రెడ్డి, ఉపాధ్యక్షుడు రహీస్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
HYD: మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ డ్రగ్స్ మాఫియా కదలికలు పెరిగిపోతుండడం కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో భారీగా డ్రగ్స్ని పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. స్థానికంగా జిమ్ నిర్వహించే ట్రైనర్ నితీష్, రాహుల్తో పాటు సోహెల్ అనే ముగ్గురిని ఈ వ్యవహారానికి సంబంధించి అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఆ ఇంజెక్షన్స్ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదీ చదవండి: నగరంలో ‘బ్లాక్మెయిల్’ విలేకరుల అరెస్ట్ -
ధరణి పోర్టల్పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. ఆ గ్రామ పరిధిలో ఉన్న 146 ఎకరాల భూదాన్ భూములను ధరణి పోర్టల్లో నిషేధిత జాబితా నుంచి తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని అన్నారు. ఇందులో మంత్రి కేటీఆర్ అనుచరులు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలది కీలకపాత్ర అని ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర లేకపోతే వెంటనే దీనిపై విచారణకు ఆదేశించాలని, ఇందుకు కారణమైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్, ఉపాధ్యక్షుడు హర్కర వేణుగోపాల్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఎలాంటి లావాదేవీలు వద్దొన్న భూదాన్ బోర్డు ‘తిమ్మాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 146 ఎకరాల భూదాన్ భూములున్నాయని అప్పటి కందుకూరు ఎమ్మార్వో 2007లో కలెక్టర్కు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ భూములను కాపాడాలని అప్పడు ఎమ్మెల్యే హోదాలో ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. భూదాన్ బోర్డు కూడా ఈ భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించవద్దని మహేశ్వరం సబ్ రిజి్రస్టార్కు లేఖ రాసింది. ఈ మేరకు స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ సదరు గ్రామంలోని సర్వే నంబర్లన్నింటినీ నిషేధిత జాబితాలో చేర్చింది..’అని రేవంత్ తెలిపారు. ధరణి వచ్చిన తర్వాతే... ‘2020లో ధరణి పోర్టల్ను తీసుకువచ్చిన తర్వాత ఈ భూములను నిషేధిత కేటగిరీ నుంచి తొలగించారు. 2021లో ఎం.శివమూర్తి పేరిట బదిలీ చేశారు. వాటి విలువ రూ.1,000 కోట్లు ఉంటుంది. రిజి్రస్టేషన్ల శాఖ పరిధిలో ఉన్నప్పుడు నిషేధిత జాబితాలో ఉన్న భూములు ధరణిలో నిషేధిత జాబితాలో ఎందుకు లేవు? ఈ భూములను కొల్లగొట్టింది కేటీఆర్ అనుచరులే. ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ అంటుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తోంది అందుకే. తమ వ్యవహారాలు బయటకు వస్తాయనే ఆలోచనతోనే తమకు బంగారు బాతు లాంటి ధరణిని వెనకేసుకు వస్తున్నారు..’అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ధరణి బాధితులు 20 లక్షల మంది ‘రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు ధరణి బాధితులయ్యారు. తండ్రి చనిపోతే కొడుకు పేరిట భూమి బదిలీకి కూడా అవకాశం లేకుండా పోయింది. ధరణి రద్దయితే రైతుబంధు, రైతుబీమా రాదంటూ సీఎం హోదాలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 2018లో ఈ ప్రభుత్వమే రైతుబంధు, రైతుబీమా మొదలుపెట్టింది. అప్పటి నుంచి 2020 వరకు ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఆ మూడేళ్ల పాటు వచి్చన రైతుబంధు, బీమా ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఎందుకు రావు? కాంగ్రెస్ పార్టీ ధరణి లేనప్పుడే 2009–10లో రూ.74 వేల కోట్ల రైతు రుణమాఫీని చేసింది. విదేశీ కంపెనీ చేతుల్లోకి రైతుల సమాచారం! కేసీఆర్ రైతులను బెదిరించేలా చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది. రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల సమాచారం అంతా విదేశీ కంపెనీకి వెళ్లింది. ఇలా చేయడం క్రిమినల్ చర్యల పరిధిలోనికి వస్తుంది. ఇప్పుడు ధరణిని రద్దు చేస్తే ఈ బాగోతమంతా బయట పడుతుందనే కేసీఆర్ తదితరులు పెడ»ొబ్బలు పెడుతున్నారు..’అని రేవంత్ అన్నారు. కిషన్రెడ్డి సెంట్రల్ విజిలెన్స్కు లేఖ రాయాలి ‘స్వగ్రామంలో భూములు అన్యాక్రాంతమవుతుంటే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన వెంటనే సెంట్రల్ విజిలెన్స్ విచారణ కోరుతూ లేఖ రాయాలి. మేము అధికారంలోకి వచ్చాక రంగారెడ్డి, మేడ్చల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై విచారణ జరిపిస్తాం, తప్పులు చేసిన కలెక్టర్లు, సీసీఎల్ఏను ఊచలు లెక్కపెట్టిస్తాం. కేసీఆర్కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే నూతన సాంకేతిక విధానంతో మరో విధానాన్ని తీసుకువస్తాం. టైటిల్ గ్యారంటీ విధానాన్ని తెస్తాం. రిజి్రస్టేషన్ చేసి ఫీజు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఆ భూముల విషయంలో జవాబుదారీతనంగా ఉండాలనేది మా విధానం..’అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కష్టాలు వస్తాయని అంటున్న కేసీఆర్కు ఊచలు లెక్కపెట్టే కష్టాలు మాత్రం వస్తాయని, చర్లపల్లి జైల్లో ఆయనకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని, బిడ్డ, అల్లుడు, కొడుకు అందరూ అక్కడే ఉండవచ్చని ఎద్దేవా చేశారు. -
రానున్న 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ శివారు కొంగరకలాన్లో ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ చైర్మన్ యాంగ్ లియూ, సీఈవోలు, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణం, తయారీ ప్లాంట్లను విస్తరించడంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలోలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్కాన్ హామీ ఇచ్చిందని తెలిపారు. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని కేటీఆర్ అన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు . చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలోని ఐటీ ఉద్యోగాల్లో ప్రతి మూడింట్లో ఒక ఉద్యోగం మనదేనని చెప్పారు చదవండి: కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్, 'కారు'కు ఫియర్.. -
మీర్పేట్లో దారుణం.. కన్న బిడ్డలపై తల్లి కర్కశం, ఇద్దరు పిల్లల్ని చంపి..
సాక్షి, రంగారెడ్డి: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్డే రోజే ఓ తల్లి ఘోరానికి పాల్పడింది. క్షణికావేశంలో 9 నెలలు మోసి కన్న పేగు బంధాన్ని తెంచుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను వాటర్ బకెట్లో ముంచి వారిని తిరిగిరాని లోకాలకు పంపించింది. అనంతరం తను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాల్లోకి వెళితే.. మీర్పేట్లో నివాసముంటున్న శ్రీను నాయక్కు తన భార్య భారతి(26)తో ఇటీవల గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో విసిగిపోయిన భారతి భర్త మీద కోసం ఆదివారం తన ఇద్దరు పిల్లల్ని వాటర్ బకెట్లో ముంచి ప్రాణాలు తీసింది. తను ఆత్మహత్యాయత్నం చేయగా.. పక్కనే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివాహిత పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి.. -
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. భవిష్యత్తులో పరిస్థితి అంతే!
సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వేగంగా.. జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్మెంట్వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, సరూర్నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. వేగంగా పడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఏవీఎన్రెడ్డి విజయం
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వీరిలో ఏవీఎన్రెడ్డి 7505 ఓట్లు (మొదటి ప్రాధాన్యత) సాధించగా, గుర్రం చెన్నకేశవరెడ్డి 6584 ఓట్లు పొందారు. యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్రెడ్డి 4569 ఓట్లు పొందారు. మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్రెడ్డికి అతి తక్కువగా 1,236 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక హర్షవర్థన్రెడ్డికి 1907 ఓట్లు రాగా, భుజంగరావు 1103 ఓట్లు వచ్చాయి. కాసం ప్రభాకర్కు 764 ఓట్లు సాధించగా, ఎ.వినయ్బాబు 568 ఓట్లు సాధించారు. ఎస్ విజయ్కుమార్ 313 ఓట్లు సాధించగా, లక్ష్మీనారాయణ 212 ఓట్లు , ఎ.సంతోష్కుమార్ 160 ఓట్లు, అన్వర్ఖాన్ 142 ఓట్లు, డి.మల్లారెడ్డి 69, ప్రొఫెసర్ నథానియ ల్ 98, మేడిశెట్టి తిరుపతి 57, జి. వెంకటేశ్వర్లు 47, చంద్రశేఖర్రావు 41, పార్వతి 20, కె. సత్తెన్న 6, ఎల్ వెంకటేశ్వర్లు 14 ఓట్లు పొందగా, త్రిపురారి అనంతనారాయణ్ ఒకే ఓటుతో సరి పెట్టుకున్నారు. -
Hyderabad: వివాహిత కిడ్నాప్.. కారులో తిప్పుతూ లైంగిక దాడి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పీరం చెరువు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. బలవంతంగా మహిళతో మద్యం తాగించిన దుండగులు.. ఆమె వద్ద బంగారం దోచుకుని చివరికి గండిపేట వద్ద వదిలిపెట్టారు. నార్సింగి పోలీసులకు బాధితురాలి భర్త ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం.. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్–రంగారెడ్డి– హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, హైదరాబాద్ స్థానికసంస్థల నియోజకవర్గానికి 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 తేదీ వరకు (సెలవు దినాలు మినహా) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం మూడో అంతస్తులోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులు.. ►ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల నిర్వహణకు అంశాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. వివరాలిలా ఉన్నాయి. ►జి.వెంకటేశ్వర్లు (స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకర ణ): బ్యాలెట్పత్రాలు, బ్యాలెట్బాక్సుల తయారీ. ►పి.సరోజ(అడిషనల్ కమిషనర్, పరిపాలన): ఎన్నికల సామాగ్రి సేకరణ. ►సంధ్య(జేసీ, శానిటేషన్): ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది. ►పద్మజ( సీఎంఓహెచ్):హెల్త్కేర్ కార్యక్రమాలు,కోవిడ్ నిబంధనలు. ► కె.నర్సింగ్రావు:( డీఈఈ, ఐటీ): వెబ్క్యాస్టింగ్,ఐటీ సంబంధిత అంశాలు. ►శ్రుతిఓజా (అడిషనల్ కమిషనర్), సౌజన్య( పీడీ), యూసీడీ: శిక్షణ కార్యక్రమాలు ►ఎన్.ప్రకాశ్రెడ్డి (డైరెక్టర్, ఈవీడీఎం): ప్రవర్తన నియమావళి, శాంతిభద్రతలు,వాహనాలు ►మహ్మద్ జియా ఉద్దీన్(ఈఎన్సీ): పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ►ముర్తుజాఅలీ(సీపీఆర్ఓ): ఓటరు అవగాహన కార్యక్రమాలు, మీడియాసెల్, పెయిడ్న్యూస్ ►బాషా(ఎస్టేట్ ఆఫీసర్): 24 గంటల ఫిర్యాదుల విభాగం, కాల్సెంటర్ ఫిర్యాదుల పరిష్కారం ►మహేశ్ కులకర్ణి( చీఫ్వాల్యుయేషన్ఆఫీసర్): రిపోర్టులు ► విజయభాస్కర్రెడ్డి(పర్సనల్ ఆఫీసర్): పోస్టల్బ్యాలెట్ 25న స్థానిక సంస్థల ఓటర్ల తుది జాబితా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలో 118 మంది ఓటర్లున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, రాజ్యసభల సభ్యులు ఓటర్లు. ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు ఈనెల 23వ తేదీ వరకు స్వీకరించి తుదిజాబితా 25న వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోటాలోని ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్జాఫ్రి పదవీకాలం మే 1వ తేదీతో ముగియనున్నందున ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు. -
Vikarabad: ‘ప్రియురాలిలో అమ్మా నాన్నల ప్రేమను చూశా.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని ప్రేమించి వివాహం చేసుకుంటుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలప్పడ్డాడు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మాధవరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ గ్రామానికి చెందిన కటిక కృష్ణాజీ కుమారుడు ప్రవీణ్కుమార్ (26) బీఈడీ పూర్తి చేశాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు సరూర్నగర్ శ్రీనివాస కాలనీలోన ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. బీఈడీ చదివే సమయంలో పరిచయమైన ఓ యువతిని ప్రేమించాడు. నాలుగు సంవత్సరాలుగా వీరు కలిసిమెలసి ఉంటున్నారు. అయితే కొంత కాలంగా తనను కాదని వేరే యువకుడిని యువతి ప్రేమిస్తుండటంతో ప్రవీణ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున ఒక సెల్ఫీ వీడియా తీసి, సూసైడ్ నోట్ రాసుకున్నాడు. సెల్ఫీ వీడియోను తన స్నేహితులు, బంధువులకు పంపంచి..వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. అనంతరం నైలాన్ తాడుతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. వాట్సాప్ స్టేటస్లో వీడియో చూసిన స్నేహితులు ప్రవీణ్ ఉండే గదికి చేరుకుని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ రాసిన సూసైడ్ నోట్ను స్వా«దీనం చేసుకున్నారు. తనతోనే జీవితం ఊహించుకున్నా ‘చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయాను. బీఈడీలో పరిచయం అయిన యువతిని మనసారా ప్రేమించాను. ఇద్దరం నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం. అమ్మ, నాన్నల ప్రేమను తాను చూపించింది. నా జీవితం మొత్తాన్ని తనతో ఊహించుకున్నాను. ఆ అమ్మాయి లేకుండా బతకలేను. వేరొకరితో ప్రేమలో పడటాన్ని జీర్ణించుకోలేక పోతున్నా... అందుకే చనిపోతున్నా. నన్ను క్షమించండి. మిస్ యూ ఫ్రండ్స్...నా చివరి చూపు చూసేందుకు రండి..బై.’ అని ప్రవీణ్కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. చదవండి: Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం -
తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న భారతీ హోలికెరి.. మహిళా శిశు సంక్షేమ వాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. ► ప్రస్తుత హన్మకొండ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు.. నిజామాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్.. హన్మకొండ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్గా బదిలీ. అలాగే హైదరాబాద్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు ► ప్రస్తుత వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా.. కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత జగిత్యాల జిల్లా కలెక్టర్ జీ రవి.. మహబూబ్నగర్ కలెకర్ట్గా బదిలీ. ► ప్రస్తుత మహబూబ్నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు.. సూర్యాపేట కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ. ► జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ బి సంతోష్.. మంచిర్యాల కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజార్షి షా.. మెదక్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.. వికారాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ. ► ప్రస్తుత కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు జగిత్యాల ఇన్చార్జ్ కలెక్టర్గా అదనపు బాధ్యతలు. ► ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి వరుణ్ రెడ్డి.. నిర్మల్ జిల్లా కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్.. ఆదిలాబాద్ కలెక్టర్గా బదిలీ ► ప్రస్తుత మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్.. వనపర్తి కలెక్టర్గా బదిలీ కలెక్టర్ల బదిలీ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి -
పెళ్లి చేసుకోవాలని వివాహితపై ఒత్తిడి.. ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్తో
సాక్షి, రంగారెడ్డి: ఫేస్ బుక్ పరిచయం ఓ వివాహితను ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కందుకూరు మండలం గుమ్మడవెళ్లి గ్రామానికి చెందిన మహిళ స్థానిక ఎంబీఆర్ నగర్లో నివాసం ఉంటోంది. భర్త రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల కూతురు ఉంది. ఈమెకు ఫేస్బుక్ ద్వారా మంచాల మండలం రంగాపూర్కు చెందిన శివకాంత్(28)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని బెదరింపులకు పాల్పడుతున్నాడు. సోమవారం ఏకంగా వివాహిత ఇంట్లోకి చొరబడి స్క్రూ డ్రైవర్తో ఆమె మెడ, చెంప, కూడి చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధిత మహిళ, ఆమె అమ్మమ్మ కేకలు వేయడంతో నిందితుడు పారిపోయేందుకు యత్నించాడు. అదే భవనంలో ఉన్న వారు నిందితున్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామకృష్ణ తెలిపారు. చదవండి: Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ.. -
మొన్న పూజిత.. నేడు అమీక్ష
సాక్షి, హైదరాబాద్: అన్నంలో పురుగులు వస్తున్నాయని ఇటీవల 4వ తరగతి విద్యార్థిని పూజిత నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. తాజాగా 2వ తరగతి చదువుతున్న మరో చిన్నారి ఇంటి పక్కన గొడవ జరుగుతుంది, వచ్చి ఆపాలని రాత్రి 11 గంటలకు డయల్ 100కు కాల్ చేసిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలు.. ప్రశాంతిహిల్స్ రోడ్ నం–6కు చెందిన అమీక్ష (7) టీచర్స్కాలనీలోని భారతి స్కూల్లో 2వ తరగతి చదువుతోంది. ఆదివారం రాత్రి ఇంటి పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ఇద్దరి కూలీలు గొడవ పడుతున్నారు. గొడవ జరుగుతున్నట్లు గ్రహించిన చిన్నారి అమీక్ష రాత్రి 11 గంటలకు తండ్రి సెల్ఫోన్ తీసుకొని డయల్ 100కు కాల్ చేసి ఇక్కడ గొడవ జరుగుతుంది.. వెంటనే వచ్చి గొడవను ఆపాల్సిందిగా కోరింది. బాలిక ఫిర్యాదు చేయడంతో మీర్పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవ పడుతున్న ఇద్దరు కూలీలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. తొందరగా స్పందించినందుకు థ్యాంక్యూ అంకుల్ అని చిన్నారి చెప్పినట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. అమీక్షను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఆపద వచ్చినా డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. -
ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్య రహిత ప్రాంతం.. నగరానికి కూతవేటు దూరం.. వెరసి అతితక్కువ ధరకే హెచ్ఎండీఏ లేఅవుట్లో అమ్మకానికి ప్లాట్లు.. అంటూ రియల్ ఎస్టేట్ రంగంలోని కొంతమంది అక్రమార్కులు ప్రకటనలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పిగ్లీపూర్లో ప్లాట్లు కొనుక్కునేందుకు తొందరపడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..! రియల్ ముఠా చీకటి ఒప్పందం..? హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో 20ఏళ్ల కిత్రం చేసిన ప్లాట్లనే కబ్జా చేసి అప్పటి లేఅవుట్ల ఆనవాళ్లు కనిపించకుండా నూతన హంగులతో ముస్తాబు చేస్తు న్న రియల్ మోసగాళ్లు తాజాగా హెచ్ఎండీఏ ప్లాట్లు గా తిరిగి విక్రయించేందుకు తెగబడుతున్నారు. పిగ్లీపూర్ గ్రామంలో కొన్ని రియల్ ముఠాలు కొంతకాలంగా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరో సారి వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఒకప్పడు వివాదరహితంగా ఉన్న పిగ్లీపూర్లోని భూములన్నీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయి. పిగ్లీపూర్ రెవెన్యూ సర్వే నెం.12, 14, 46, 51లోని పాత లేఅవుట్లను, పార్కు స్థలాలతో పాటు ప్రభు త్వ, భూదాన్భూములు ఆక్రమించుకుంటున్న రియల్ మాఫియా హెచ్ఎండీఏ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చీ కటి ఒప్పందం చేసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. లే అవుట్లలోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డబుల్ లేఅవుట్లు పిగ్లీపూర్లో రెండు, మూడేళ్లుగా హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో చేపడుతున్న లేఅవుట్లన్నీ డబుల్, త్రి బుల్ లేఅవుట్లే. 20, 25 ఏళ్ల కిత్రం చేసిన పంచాయ తీ లేఅవుట్లనే హెచ్ఎండీఏ లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లలోని ప్లాట్లను ప్లాన్ మ్యాప్లో చూపించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నెంబర్లలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత వచ్చి న భూ వివాదాలు, ఫిర్యాదుల కారణంగా హెచ్ఎండీఏ అధికారులు ఎల్పీ నెంబర్ను రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వదిలేశారంటే అక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. చదవండి: Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం ఎక్కువ కమీషన్ ఆశ చూపి.. పాత లేఅవుట్లలోని ప్లాట్లను ఆక్రమించుకుని వాటి ఆనవాళ్లు లేకుండా చేసి నకిలీ పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడం కబ్జాదారుల పని... అనంతరం ఎక్కువ కమీషన్ ఆశచూపి ఈ డబుల్ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించే బాధ్యత మార్కెటింగ్ కంపెనీలకు అప్పగించి చేతికి మట్టి అంటకుండా కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుని పేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్లాట్లు విక్రయాలు పూర్తి అయ్యేంత వరకూ రియల్ మాఫియా ముఠా సభ్యులు ఎక్కడా తమ పేర్లు వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారినే టార్గెట్ చేసుకుని ప్లాట్లు విక్రయిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడి వివాదాస్పద భూముల వల్ల భవిష్యత్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ప్లాట్లు కొనేముందు అన్ని విషయాలను పరిశీలించడంతో పాటు ప్లాట్లు చేస్తున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. -
యువతి కిడ్నాప్ కేసు.. నవీన్రెడ్డి రిమాండ్కు తరలింపు
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి మంగళవారం సాయంత్రం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మొబైల్ లోకేషన్ ఆధారంగా గోవాలోని బీచ్లో అరెస్ట్ చేసిన ఆదిభట్ల పోలీసులు బుధవారం హైదరాబాద్కు తరలించారు. సరూర్ నగర్ ఓస్ఓటీ కార్యాలయంలో నవీన్ రెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. కిడ్నాప్ జరిగిన డిసెంబర్9న వైశాలిని మన్నెగూడలో వదిలిన నవీన్ రెడ్డి గోవా పారిపోయాడు. నవీన్రెడ్డిపై వరంగల్, హైదరాబాద్, విశాఖలో కేసులు నమోదయినట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వైశాలిని కిడ్నాప్ చేసినట్లు నవీన్రెడ్డి ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ కేసులో నవీన్రెడ్డిన రిమాండ్కు తరలించాం. నవీన్రెడ్డితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న రూమన్, పవన్ల కోసం గాలిస్తున్నామని సీపీ పేర్కొన్నారు. కాగా నవీన్ రెడ్డి వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఆరు నెలలుగా నిందితుడికి వైశాలి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వైశాలికి దగ్గరయ్యేందుకు నవీన్ రెడ్డి తన స్నేహితుల సాయం తీసుకున్నట్లు వెల్లడైంది. వైశాలి కదలికలను సంధ్య అనే యువతి ద్వారా తెలుసుకుని ఆమెను వెంటబడ్డాడు. వీళ్లిద్దరిని కలిపేందుకు సంధ్య పలుమార్లు యత్నించింది. నవీన్తో గొడవ తర్వాత మాట్లాడేందుకు వైశాలి ఇష్టపడలేదు. యువతి మధ్యవర్తిత్వం పనిచేయకపోవడంతో వైశాలి ఇంటి వద్ద షెడ్ ఏర్పాటు చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
రంగారెడ్డి యువతి కిడ్నాప్ కేసు.. ఎట్టకేలకు నవీన్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆధిభట్ల యువతి వైశాలి కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గోవాలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా కాండోలిమ్ బీచ్ దగ్గర నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉబ్లీ, పనాజీ మీదుగా నవీన్ రెడ్డి గోవా వెళ్లిన్నట్లు గుర్తించారు. అతని దగ్గరున్న 5 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవన్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కాగా ఈ కేసులో మంగళవారం ఉదయమే పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడలో యువతి వైశాలి డిసెంబర్ 9న కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. యువతితో పరిచయం ఉన్న నవీన్ రెడ్డి అతని అనుచరులతో కలిసి ఒక్కసారిగా ఆమె ఇంటిపై దాడికి తెగబ్బారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు. తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నవీన్ రెడ్డి, అతని స్నేహితులు అదే రోజు సాయంత్రం మళ్లీ కారులో హైదరాబాద్ తీసుకొచ్చారు. రాత్రి సమయానికి యువతిని పోలీసులు రక్షించారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన ఆదిభట్ల పోలీసులు ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నవీన్ రెడ్డిని తాజాగా పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు -
యువతి కిడ్నాప్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు తాజాగా రిమాండ్ రిపోర్టును విడుదల చేశారు. ఈ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. సాక్షి చేతికి అందిన వైశాలి కేసు రిమాండ్ రిపోర్టులో.. ‘గతేడాది బొంగులూరులోని ఆర్డీ స్పోర్ట్స్ అకాడమీలో ఇద్దరి మధ్య పరిచయం. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరుచూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేశాడు. పరిచయాన్ని అడ్డుగా పెట్టుకొని వైశాలితో కలిసి ఫోటోలు తీసుకున్నాడు. మధ్యలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. దీంతో వైశాలి తల్లిదండ్రులు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని చెప్పింది. వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. వారు పెళ్లికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. వైశాలి ఇంటి వద్ద దాడికి పాల్పడుతున్న నవీన్ గ్యాంగ్ వైశాలి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి ఇద్దరు దిగిన ఫోటోలను వైరల్ చేశాడు. అయిదు నెలల కిత్రం వైశాలి ఇంటి ముందు స్థలం లీజుకు తీసుకుని షెడ్డు వేశాడు. ఆగస్టు 31న గణేష్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ చేశాడు. వైశాలి ఫిర్యాదుతో నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈనెల 9న వైశాలికి నిశ్చితార్థం జరుగుతున్నట్లు తెలుసుకున్నాడు. యువతిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాడిలో ధ్వంసమైన ఇంట్లోని సామాగ్రి వారం ముందు నుంచే వైశాలి కిడ్నాప్కు ప్లాన్ చేశాడు. దీనికోసం తన అనుచరులతో పాటు మిస్టర్ టీ స్టాళ్లలో పనిచేసే సిబ్బందిని ఉపయోగించుకున్నాడు. కిడ్నాప్లో ఆరుగురు కీలకంగా వ్యవహరించారు. నవీన్రెడ్డి, రుమాన్, చందూ, సిద్ధూ, సాయినాథ్, భాను ప్రకాష్తో కలిసి వైశాలి కిడ్నాప్కు ప్లాన్ వేశారు. వైశాలితోపాటు చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురిచేసేలా పథకం రచించారు. చదవండి: ముగిసిన మైత్రీ మూవీ మేకర్స్ ఐటీ రైడ్స్, కీలక పత్రాలు, హార్డ్డిస్క్లు స్వాధీనం డిసెంబర్ 9వ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 40 మందితో కలిసి వైశాలిని కిడ్నాప్ చేశాడు. ఇంటి వద్ద పార్క్ చేసిన అయిదు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. యువతి ఇంటిపై దాడి చేసి వస్తువులను సీసీటీవీ కెమెరాలను నాశనం చేశారు. డీవీఆర్లు ఎత్తుకెళ్లారు. వైశాలిని కిడ్నాప్ చేసి కారులో నల్గొండ వైపు తీసుకెళ్లారు.తమ కోసం పోలీసులు వెతుకుతున్నారనే విషయాన్ని నవీన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఫోన్లు స్విచ్ఛాఫ్ పెట్టుకున్నారు. అనంతరం నల్గొండ వద్ద అతని స్నేహితులు కారు నుంచి దిగి పారిపోయారు. నవీన్ మరో స్నేహితుడు రుమాన్ వోల్పో కారులో వైశాలిని హైదరాబాద్ తీసుకొచ్చారు. కిడ్నాప్ జరిగిన సాయంత్రానికి తాను క్షేమంగా ఉన్నట్లు వైశాలి.. తండ్రికి కాల్ చేసి చెప్పింది. రాత్రి 8.37 నిమిషాలకు మన్నెగూడలో ఉన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి వైశాలిని ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసున నమోదు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు వైశాలి కిడ్నాప్ కేసులో నిందితులను కస్టడీ కోరుతూ ఇబ్రహీంపట్నం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. నిందితులను 5 రోజుల కస్టడీ కోరుతూ ఆదిభట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఏ3 భాను ప్రకాశ్, ఏ4 సాయినాథ్, ఏ8 ప్రసాద్, ఏ9 హరి, ఏ30 విశ్వేశ్వర్ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలైంది. -
నవీన్ రెడ్డితో పెళ్లి కాలేదు : వైశాలి
-
యువతి కిడ్నాప్ కేసు.. ‘హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు, కొరికారు’
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్కు గురైన యువతి వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా యువతి శనివారం తొలిసారి మీడియా ముందుకు వచ్చింది. నవీన్ రెడ్డితో తనకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ప్రేమించలేదని సంచలన విషయాలు బయటపెట్టింది. నవీన్ తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘మాతో కలిసి నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు. నాకు నవీన్ అంటే ఇష్టం లేదు. నేనంటే ఇష్టమని చెబితే పేరెంట్స్ను అడగమని చెప్పా. ఇష్టం లేదని చెపుతున్నా వినిపించుకోలేదు. నా ఇష్టంతో పనిలేదని చెప్పాడు. నా ఇష్టంతో సంబంధ లేకుండా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నేను ఒప్పుకోకపోవడంతో దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. నా పేరుతో నకిలీ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసి నా మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడు. నాకు ఇష్టం ఉంటే నా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. నవీన్తోనా పెళ్లి జరగలేదు. పెళ్లైందని చెప్పడం నిజం కాదు. నాతో పెళ్లి జరిగిందని చెబుతున్న రోజు ఆర్మీ కాలేజీలో డెంటల్ ట్రీట్మెంట్లో ఉన్నాను. పెళ్లి జరిగిందని చెప్పి ఫోటోలు మార్ఫింగ్ చేసి నా భవిష్యత్తును నాశనం చేశాడు. తను చెప్పినట్టు వినకుంటే మా నాన్నను చంపేస్తామని బెదిరించాడు. ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం కానీ నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్లలేదు. నా కంట్రోల్లో ఉంటేనే మీ ఇళ్లు సేఫ్గా ఉంటుందని నవీన్ బెదిరించాడు. 10 మంది నాపై దాడి చేసి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లారు. నాన్ను చాలా ఘోరంగా ట్రీట్ చేశారు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావ్ అని నవీన్రెడ్డి ఒక్కడే నన్ను కారులోనే ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నాకు దక్కకుంటే...నిన్ను ఎవరికీ దక్కనివ్వను అని చిత్రహింసలకు గురి చేశాడు. మా నాన్న కూడా చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశా. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పుడు చర్యలు తీసుకుంటే నాపై దాడి జరిగేది కాదు. అంతమంది ఉన్నప్పుడే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. నాకు ఇప్పుడు సెక్యూరిటీ అవసరం. నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశాడు. నన్ను కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి.’ అని డిమాండ్ చేశారు. చదవండి: టెక్కీ భర్త నిర్వాకం.. స్నేహితులతో పడుకోవాలని భార్యను బలవంతం -
Adibatla: యువతి కిడ్నాప్ వ్యవహారం.. ప్రధాన నిందితుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించామని చెప్పారు. మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరు గంటల్లోనే బాధితురాలిని రక్షించినట్లు తెలిపారు. యువతిని తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించినట్లు వెల్లడించారు.. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని.. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడేలా చేస్తామన్నారు. 10 సెక్షన్ల కింద కేసుల నమోదు చేస్తామన్నారు. కిడ్నాప్కు వినియోగించిన రెండు కార్లను స్వాధీనం చేస్తున్నారు. బాధితురాలి ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరా సహా నిందితులు వాడిన ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కిడ్నాప్కు ముందు జరిగిన పలు కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. చదవండి: ఆర్థిక అవసరాల కోసం నా కొడుకును వాడుకున్నారు: నవీన్రెడ్డి తల్లి ఆవేదన దాడికి ముందు ఏం జరిగిందంటే! ‘యువతి ఇంటిపై దాడి చేసే ముందు నవీన్ రెడ్డీ అందర్నీ పార్టీ పేరుతో తన ఆఫీస్కు పిలిపించుకున్నాడు. టీస్టాల్లో పనిచేసే సిబ్బందితోపాటు మరికొంతమంది బిహారీలను కార్యాలయానికి రమ్మని చెప్పాడు. పార్టీ పేరుతో మద్యం ఏర్పాటు చేసి.. తరువాత మద్యం మత్తులో ఉన్న వారందరినీ కారులో తీసుకొని వైశాలి ఇంటికి వచ్చాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే యువతి ఇంటికి వెళ్లి దాడి చేశాడు. ముందుగా నవీన్ రెడ్డి తన అనుచరులతో దాడికి పాల్పడగా.. తరువాత వెనకాల ఉన్న అందరూ కూడా దాడి చేశారు. వైశాలి కిడ్నాప్ తరువాత అందరూ వివిధ మార్గాల్లో పారిపోయారు’ అని పోలీసుల దర్యాప్తులో తేలింది. కాగా శుక్రవారం ఆదిభట్లలోని యువతి ఇంట్లోకి బలవంతంగా చొరబడిన దుండగుల బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.డీసీఎం, కార్లలో సినీ ఫక్కీలోఎంట్రీ ఇచ్చిన దాదాపు వందమంది యువకులు.. యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డు వచ్చిన కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఇంట్లోని వస్తువులు, సీసీ కెమెరాలు, కార్లను ధ్వంసం చేశారు. అమ్మాయిని తీసుకెళ్లిన వ్యక్తిని మిస్టర్ టీ ఓనర్ నవీన్రెడ్డిగా పోలీసులు గుర్తించారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. అంతేగాక వైశాలికి ఇటీవలే మరో యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే, వైశాలిని నవీన్ రెడ్డి కిడ్నాప్ చేశాడు. గతంలో నవీన్రెడ్డిపై ఆదిభట్ల పీఎస్లో ఫిర్యాదు చేసినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు.. పక్కా స్కెచ్తో!
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్లలోని మన్నెగూడలో కిడ్నాప్ అయిన డాక్టర్ వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. యువతిని పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. పట్టపగలే 100 మంది ఇంట్లోకి వచ్చి యువతిని కిడ్నాప్ చేయడం వెనక స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నాప్కు పాల్పడిన నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు. తన కూతురు కిడ్నాప్కు మరికొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. కూతురిని నవీన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఒత్తిడి చేశారని తెలిపారు. నవీన్ రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లిచూపులు ఉన్నాయని తెలిసే ఇదిలా ఉండగా.. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని గత ఆరు నెలలుగా నవీన్ రెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ గతంలో వైశాలి, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే వైశాలి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని టీస్టాల్ ఏర్పాటు చేశాడు. మరో వ్యక్తితో వివాహం చేసుకునేందుకు వైశాలి సిద్ధపడిందని, ఈ రోజు పెళ్లిచూపులు ఉన్నాయని తెలుసుకున్న నవీన్ రెడ్డి 100 మంది కిరాయి గుండాలతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలు, సెల్ఫోన్లు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వైశాలి తండ్రిని, అడ్డుకోబోయిన పలువురు స్థానికులను కూడా చితకబాదారు. యువతి ఇంటి సమీపంలోనే టీస్టాల్ నడుపుతున్న నవీన్ రెడ్డి.. అక్కడికి వచ్చే వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్కు డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే 40 మందికి పైగా యువకులను గుర్తించారు. కిడ్నాప్ తర్వాత అమ్మాయిను నవీన్ రెడ్డికి అప్పగించి యువకులు పరారయ్యారు. పథకం ప్రకారమే సెల్ ఫోన్లు వాడకుండా స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకవద్దని వైశాలి ఇంటివద్ద పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. కిడ్నాప్ కేసు కొలిక్కి సంచలనం సృష్టించిన డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేయడంతో సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమెను ట్రేస్ చేశారు. యువతి నల్గొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే నల్గొండ పోలీసులకు సమాచారం ఇచ్చిన రాచకొండ పోలీసులు వైశాలి ఉన్న స్పాట్కు తండ్రితోపాటు వెళ్లారు. కిడ్నాపర్ నవీన్ను అదుపులోకి తీసుకొని.. వైశాలిని రక్షించారు. కాగా అంతకుముందే వైశాలి తన తల్లిదండ్రులకు కాల్ చేసి సేఫ్గా ఉన్నట్లు, ఆందోళన చెందవద్దని చెప్పిన సంగతి తెలిసిందే. -
రంగారెడ్డి: డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. అపహరణకు గురైన యువతి వైశాలి తన తండ్రి దామోదర్కు ఫోన్ చేసింది. తను సిటీలోనే సేఫ్గానే ఉన్నానని తండ్రికి చెప్పింది. తన గురించి ఆందోన చెందవద్దంటూ పేర్కొంది. మరోవైపు యువతి కిడ్నాప్ ఘటనతో తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో ఉద్రిక్తత నెలకొంది. యువతి కిడ్నాప్కు గురైందన్న విషయం తెలుసుకున్న బంధువులు ఆమె బంధువులు భారీగా తరలివచ్చారు. తీవ్ర ఆగ్రహంతో కిడ్నాప్ చేసిన నవీన్రెడ్డి టీస్టాల్ను తగలబెట్టారు. తమ కూతురు కిడ్నాప్కు సీఐ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సీఐని సస్పెండ్ చేయాలంటూ యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. నవీన్ రెడ్డి గ్యాంగ్ ఇంటిపై దాడి చేస్తున్న సమయంలో పోలీసులకు కాల్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ సాగర్ రాహదారిపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నాకు దిగారు. దీంతో సాగర్ రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గతంలో నవీన్రెడ్డిపై ఆదిభట్ల పీఎస్లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో డెంటల్ డాక్టర్ వైశాలి కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. డీసీఎం, కార్లలో వచ్చిన 100 మందికి పైగా యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. -
రంగారెడ్డిలో యువతి కిడ్నాప్ కలకలం.. సినిమా స్టైల్లో 100 మందితో వచ్చి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి రాగన్న గూడలో ఓ యువతి కిడ్నాప్గు గురైంది. సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన 100 మంది యువకులు.. ఒక్కసారిగా యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డువచ్చినవారిపై దాడి చేయడమే కాకుండా ఇంట్లోని వస్తువులు, ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకోబోయిన యువతి తల్లిదండ్రులు, పక్కింటి వ్యక్తులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలికి చేరుకున్నారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు తెలిపారు. యువతని కిడ్నాప్ చేసింది టీ టైం ఓనర్ నవీన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. 100 మంది యువకులు తన కూతురు వైశాలిని కిడ్నాప్ చేసినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా తెలుస్తోంది. నవీన్ రెడ్డి, వైశాలి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. అయినా పెళ్లి చేసుకోమని నవీన్ పదే పదే యువతి వెంటపడుతున్నాడు. శుక్రవారం రోజు వివాహ సంబంధం కోసం మరో పెళ్లివారు వైశాలి ఇంటికి వస్తున్నారని ముందే పసిగట్టి నవీన్ రెడ్డీ అమ్మయి ఇంటి దగ్గరికి వందకుపైగా గుండాలతో వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేశాడు. దీనిపై కేసు చేసుకున్న ఆదిభట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరిపై పీడీయాక్ట్
సాక్షి, రంగారెడ్డి: గుట్టుచప్పుడు కాకుండా ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మీర్పేట పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఎల్లంపేటకు చెందిన గంధ భవానీ(25) తన స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లా అన్నవరంకు చెందిన కసిరెడ్డి దొరబాబు (23)తో కలిసి మీర్పేట టీకేఆర్ కళాశాల సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తోంది. సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడిపేందుకు ఇతర ప్రాంతాల నుంచి మహిళలను రవాణా చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మీర్పేట పోలీసులు అక్టోబరు 13వ తేదీన ఇంటిపై దాడి చేసి నిర్వాహకులు గంధ భవానీ, కసిరెడ్డి దొరబాబును అరెస్ట్ చేసి.. నగరానికి చెందిన ఇద్దరు మహిళలను రక్షించారు. భవిష్యత్లో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడకుండా సీపీ ఆదేశాల మేరకు పోలీసులు భవానీ, దొరబాబుపై బుధవారం పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. చదవండి: మహిళా యూట్యూబర్పై ముంబై ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్.. -
నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం..‘కాల్మొక్తా.. కాపాడన్నా’
సాక్షి, రంగారెడ్డి: ‘కాల్మొక్తా కాపాడన్నా’.. అంటూ ఓ యువకుడు మంటల్లో కాలిపోతూ వేడుకున్నాడు. తను పనిచేసే పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్ మోసం చేశారని ఆరోపించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లేడ్ చౌదరిగూడ మండలం లచ్చంపేట గ్రామానికి చెందిన కమ్మరిపేట లక్ష్మి, నర్సింలుకు ముగ్గురు సంతానం. చిన్న కుమారుడు తిరుమలేశ్ (27) ఐదేళ్లుగా వనంపల్లి శివారులోని జీబీ బేకర్స్ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గత జూలైలో పరిశ్రమలో పనిచేస్తుండగా చేయి ప్రమాదవశాత్తు మిషన్లో పడి గాయాలపాలయ్యాడు. పరిహారం ఇవ్వడంతోపాటు ఉద్యో గం పర్మినెంట్ చేస్తామని పరిశ్రమ యాజమాన్యం, మేనేజర్ మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఈ విషయమై తిరుమలేశ్ కొంతకాలంగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. యాజమాన్యంతో మాట్లాడతానంటూ మల్లికార్జున్ మభ్యపెడుతూ వచ్చాడు. శనివారం మరోసారి గుర్తు చేయగా ‘పరిహారం లేదు, ఏమీ లేదు.. నీ చావు నీవు చావు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం పరిశ్రమలో పనిచేసేందుకు యథావిధిగా తిరుమలేశ్ వెళ్లగా లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురై తుమ్మలపల్లి శివారు కంకల్ దారిలోని ఎల్లమ్మ దేవాలయం దగ్గరలో ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. నా చావుకు మల్లికార్జున్ సార్ కారణం.. లాల్పహాడ్ వైపు నుంచి యెన్కెపల్లి వైపు ట్రాక్టర్ డోజర్తో వెళ్తున్న లచ్చంపేట గ్రామానికి చెందిన వడ్డెగారి శ్రీనివాస్ మంటల్లో కాలిపోతున్న తిరుమలేశ్ను చూశాడు. ఏమైంది.. ఎందుకిలా చేశావు అనగా ‘కాల్మొక్తా అన్నా.. నన్ను కాపాడు’ అంటూ అరిచాడు. వెంటనే స్థానికుల సాయంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన చావుకు మల్లికార్జున్ సార్ కారణం అంటూ తిరుమలేశ్ ఆత్మహత్యాయత్నానికి ముందు తన మొబైల్లో స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు తిరుమలేశ్ను వెతుకుతున్న క్రమంలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలిసింది. మల్లికార్జున్తోపాటు లేబర్ కాంట్రాక్టర్ వెంకట్రెడ్డి, అసిస్టెంట్ బాలకృష్ణ వేధింపులే కారణమని బాధితుడి సోదరుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సక్రమ్, షాద్నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఉస్మానియాలో చికిత్స పొందుతున్న తిరుమలేశ్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమ యాజమాన్యంతోపాటు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి -
బీజేపీలో కలవరం.. కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతాపార్టీ జిల్లా (గ్రామీణ) అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అలకబూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుక వహించిన బొక్క.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో పార్టీగా రెండుగా చీలడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నర్సింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్ కన్వీనర్ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవంలేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోషం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకింత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లుబాటు కాకపోవడంతో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్కా కొన్నిపేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు. పార్టీలో తన మాట చెల్లుబాటుకాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా.. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కానీ, పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాలను తెచ్చిపేట్టే అవకాశం లేకపోలేదు. శిక్షణ తరగతులకు దూరంగా.. క్షేత్రస్థాయి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శామీర్పేటలో పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కేడర్ ఈ శిబిరానికి హాజరైంది. బొక్కా నర్సింహారెడ్డి మాత్రం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి అందెల శ్రీరాములు, తూళ్ల దేవేందర్గౌడ్ తనయుడు వీరేందర్గౌడ్ కూడా పోటీపడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత కేడర్ను తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గపోరు కూడా ఆయన మనస్తాపం చెందటానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
Hyderabad: టీచర్ల నిర్వాకం.. విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు..!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో సర్కారు బడుల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కనీస అవసరాలకు నిధులు విదిల్చని సర్కారు తీరు, విద్యాశాఖాధికారుల ప్రేక్షక పాత్ర నిరుపేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విద్యార్ధులతో పారిశుద్ధ్య పనులు చేయించడం విస్మయానికి గురిచేస్తోంది. కరోనా కంటే ముందు సర్కారు బడుల్లో పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నా.. ఆ తర్వాత సరైన నిర్వహణ లేకుండా పోయింది. ఒక వైపు ఉపాధ్యాయుల కొరతతో బోధన అంతంత మాత్రం కాగా, మరోవైపు వసతుల లేమి, పారిశుధ్య పనులు కూడా సమస్యగా తయారయ్యాయి. పాఠశాల నిర్వహణకు నిధులేవీ..? గత రెండేళ్లుగా పాఠాశాల నిర్వహణకు నిధుల కొరత వెంటాడుతోంది. గతంలో స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రతి పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రభుత్వం నిధులు కేటాయించేది. 1 నుంచి 15 మంది విద్యార్థులు గల పాఠశాలకు ఏడాదికి రూ.12,500, 16 నుంచి 100 మంది విద్యార్థులుంటే రూ.25,000, అదేవిధంగా 101 నుంచి 250 మంది ఉంటే రూ.50,000, 251 నుంచి 1000 మంది ఉంటే రూ,75,000, వెయ్యికి పైగా విద్యార్థులు గల పాఠశాలలకు రూ. లక్ష కేటాయించేవారు. ఆయా స్కూళ్లకు ఇచి్చన నిధులను రిజిస్టర్లు, చాక్పీస్లు, విద్యుత్ బిల్లులు, కంప్యూటర్ల మరమ్మతుల ఖర్చుతోపాటు, స్కావెంజర్ల వేతనాలు చెల్లింపునకు వినియోగించేవారు. మొత్తం మీద విడుదలైన నిధులను హెచ్ఎంలు సర్దుబాటు చేస్తూ పనులను పూర్తి చేసేవారు. స్కావెంజర్లు లేక.. సర్కారు బడుల్లో తరగతి గదులు, మరుగుదొడ్లను శుభ్రం చేసే ఒక్కో స్కావెంజర్కు రూ.2,500 నుంచి రూ.3000 చెల్లించేవారు. కరోనాతో 2020 మార్చిలో పాఠశాలలు మూతపడినప్పటి నుంచి స్కూల్ మెయింటనెన్స్ నిధుల విడుదల నిలిచిపోయింది. దీంతో స్కావెంజర్ల సమస్య ఏర్పడింది. రెండేళ్లుగా స్కూల్ మెయింటెనెన్స్ నిధులను ప్రభుత్వం ఇవ్వకపోవడంతో కొన్ని స్కూళ్లలో టీచర్లు సొంతంగా డబ్బులు సమకూర్చుకుని స్కావెంజర్లను నియమించుకున్నారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్ధులతో తరగతి గదులు, టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సర్కారు బడులు ఇలా ►మహానగర పరిధిలో సుమారు 2497 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 3.67 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ►హైదరాబాద్ జిల్లాలో 691 పాఠశాలల్లో 1,12, 686 మంది విద్యనభ్యసిస్తున్నారు. ►రంగారెడ్డిలో 1301 స్కూళ్లలో 165,856 మంది విద్యార్థులు చదువు తున్నారు. ►మేడ్చల్లోని 505 బడుల్లో 90,358 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. సరూర్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్లు, స్కావెంజర్లు లేకపోవడంతో విద్యార్థినులతో తరగతి గదులు, టాయిలెట్లు శుభ్రం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచి్చంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు. తరగతి గదులు శుభ్రం చేస్తే తప్పేంటని, ఇష్టం లేకుంటే స్కూల్ నుంచి టీసీ తీసుకెళ్లండని ఆయన దురుసుగా సమాధానం ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. నగరంలో సుమారు 40 శాతం పైగా స్కూళ్లల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్స్టాగ్రామ్లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
అయ్యో దేవుడా!.. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ప్రాచీన ఆలయాలు
ఇది నందివనపర్తిలోని ఓంకారేశ్వరాలయం. తాడిపర్తి, నస్దిక్సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద గ్రామాల పరిధిలో ఈ గుడికి సంబంధించిన 1,450 ఎకరాల భూమి ఉంది. సుమారు 1,200 మంది రైతులు ఇందులో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. కౌలు ద్వారా వచ్చిన సొమ్ముతో ఏటా దేవుని కల్యాణం, ఉత్సవాలు నిర్వహించాల్సి ఉంది. కానీ కొంత కాలంగా రైతులు కౌలు చెల్లించడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా పైసా రావడం లేదు. దీంతో వేడుకల సంగతి పక్కన పెడితే.. కనీసం ధూపదీప నైవేద్యాలకు సైతం నోచుకోవడం లేదు. కొందుర్గు మండలం పెండ్యాలలోని లక్ష్మీనర్సింహ్మస్వామి దేవాలయం ఇది. ఈ గుడి పేరున 360 ఎకరాల భూమి ఉంది. కొందుర్గులోని కొంత భాగం, లూర్థునగర్ కాలనీలు ఇందులోనే వెలిశాయి. ప్రçస్తుతం 312 మిగిలింది. కౌలు డబ్బులతో ఆలయ నిర్వహణ కొనసాగాలి. మండల కేంద్రంలోని గుడి పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ.. చారిత్రాత్మకమైన పెండ్యాల ఆలయం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ దేవుడికి దీపం పెట్టే దిక్కు లేకుండాపోయింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్ జిల్లాలోని పలు దేవాలయాలు ధూపదీప, నైవేద్యానికి నోచుకోవడం లేదు. ఆలయ ఖజానాలో పైసా లేకపోవడం, భక్తుల నుంచి ఆశించిన మేరకు కానుకలు రాకపోవడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా ఆయా దేవాలయాల్లో కొలువైన దేవుళ్లతో పాటు నిత్యం కైంకర్యాలు నిర్వహించే పూజారులకు సైతం ఉపవాసం తప్పడం లేదు. ఆలయాల నిర్వహణ, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, ఒత్తులు, నూనె, హారతి కర్పూరం బిల్లలు, ఇతర పూజా సామగ్రి కోసం అప్పులు చేయక తప్పడం లేదు. s నాలుగు మాసాలుగా.. ఆలయాల్లో పని చేస్తున్న పూజారుల జీవనభృతి కోసం 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం «ధూపదీప నైవేద్య పథకాన్ని తీసుకొచి్చంది. ఇందులో భాగంగా పూజారులకు మొదట్లో రూ.2,500 ప్రోత్సాహకంగా ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి వచి్చన కేసీఆర్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.6 వేలకు పెంచింది. ఇందులో రూ.2 వేలు ధూపదీప నైవేద్యాలకు, రూ.4 వేలు పూజారుల నెలవారీ గౌరవ వేతనంగా చెల్లించారు. గత నాలుగు నెలలుగా ఈ ప్రోత్సాహకం అందడం లేదు. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్ నుంచే నేరుగా ఈ ప్రోత్సాహాకాలు మంజూరయ్యేవి. ప్రస్తుతం ఈ బాధ్యతలను ఫైనాన్స్ విభాగానికి అప్పగించింది. దీంతో నిధుల జారీలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. నెలవారీ ప్రోత్సాహకాలు అందకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,679 ఆలయాల్లో పని చేస్తున్న 3,600 మంది పూజారులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. శివారులో అధ్వానం జీహెచ్ఎంసీ పరి«ధిలో 1,736 ఆలయాలను ధూప, దీప, నైవేద్య పథకం(డీడీఎన్ఎస్)లో చేర్చేందుకు ప్రభుత్వం అవకాశం కలి్పంచి, ఆ మేరకు రూ.12.5 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం తీసుకొన 43 రిజిస్ట్రేషన్ ప్రక్రియపై కమిటీలకు అవగాహన లేకపోవడం, ఉన్న వాళ్లు కూడా ఆలయంలోని విగ్రహాలు, ఇతర వస్తువులు, నిత్య కైంకర్యాల ద్వారా లభించే కానుకలు, హుండీ ఆదాయం సహా స్థిరచరాస్తుల వివరాలను పక్కగా లెక్క చూపించాల్సి వస్తుందనే భయంతో ఇందుకు వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఇప్పటి వరకు కేవలం 400 ఆలయాలే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. మేడ్చల్ జిల్లాలో 101 ఆలయాలు, రంగారెడ్డి జిల్లాలో 140 ఆలయాలకు అవకాశం కల్పించినా.. మెజార్టీ ఆలయ కమిటీలు ఇందుకు సుముఖత చూపలేదు. దీంతో ఆయా ఆలయాలను నమ్ముకుని జీవిస్తున్న పేద బ్రాహ్మణులకు నెలవారీ ప్రోత్సాహకం అందకుండా పోతోంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్లోని ఆలయాల నిర్వహణ కొంత మెరుగ్గా ఉన్నా.. మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాల పరిస్థితి అధ్వానంగా మారింది. రాజకీయ నిరుద్యోగులకు అడ్డా నిత్యం ఆధ్యాత్మికతతో వెల్లివిరియాల్సిన పలు ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు వేదికలుగా మారాయి. కనీస భక్తి భావం లేని వాళ్లు పాలక మండళ్లలో సభ్యులుగా చేరుతున్నారు. సాధారణ భక్తులు సమరి్పంచే విరాళాలు, నిత్య కైంకర్యాలు, ఇతర సేవల ద్వారా లభించే ఆదాయం పక్కదారి పడుతున్న దాఖలాలు జిల్లాలో కోకొల్లలు. కర్మన్ఘాట్లోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయం సహా ఇంజాపూర్ శ్రీవెంకటేశ్వరాలయం, ఆమనగల్లులోని వీరభద్రస్వామి దేవాలయం, శంషాబాద్ సమీపంలోని నర్కుడ రామాలయం, కడ్తాల్లోని మైసిగండి ఆలయం, కాటేదాన్లోని శివగంగ ఆలయాలు రాజకీయ నిరుద్యోగులకు నిలయాలుగా మారాయి. ఆలయ పూజారులు కూడా ప్రత్యేక పూజలకు టికెట్లు కొనుగోలు చేసిన వాళ్లను, హుండీల్లో భారీగా కానుకలు సమరి్పంచిన సామాన్య భక్తులను పట్టించుకోకుండా.. పాలక మండలి సభ్యులు, వారి బం«ధుమిత్రులు, ప్రముఖుల సేవల్లోనే తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అప్పులు చేయాల్సి వస్తోంది పట్టణ ప్రాంతాల్లోని ఆలయాలకు భక్తులు రెగ్యులర్గా వస్తుంటారు. కానీ మారుమూల ప్రాంతాల్లోని ప్రాచీన ఆలయాలకు పెద్దగా రారు. ప్రత్యేక పూజలు, హుండీ ఆదాయం అంతగా ఉండదు. ఫలితంగా ఆలయాల నిర్వహణ, ధూప, దీప, నైవేద్యాలకు ఇబ్బందులు తప్పడం లేదు. పూలు, పండ్లు, పూజ సామగ్రి కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. – సునిల్జోషి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం పేద బ్రాహ్మణులు నష్టపోతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలోని 1,736 ఆలయాలకు డీడీఎన్ఎస్లో చేరే అవకాశం కల్పిస్తే.. 400 దరఖాస్తులు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి 1,263 ఆలయాలకు అవకాశం కల్పించగా.. ఆరు వేల అప్లికేషన్లు అందాయి. ఆస్తులు, ఆదాయం భారీగా ఉన్న ఆలయాలు ఇందులో చేరడం లేదు. ఫలితంగా పేద బ్రాహ్మణులు ఇబ్బంది పడాల్సివస్తోంది. - వాసుదేవశర్మ, ధూప, దీప, నైవేద్య అర్చక సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాకు సంబంధం లేదు: రాహుల్ గాంధీ
సాక్షి, రంగారెడ్డి: విద్వేష రాజకీయాలు దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ ప్రక్షాళన చేస్తామని వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని తెలిపారు. దేశ సమగ్రతకు, సమైక్యత కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సోమవారం తిమ్మాపూర్లో రాహుల్ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం కార్పోరేట్ వర్గాల కోసమే పనిచేస్తోందని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలకు అంత డబ్బు ఎలా వస్తోందని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పార్టీకి ఎలాంటి అవగాహన లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. .కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ‘నితీష్, టీఆర్ఎస్తో మాట్లాడితే మాట్లాడుకోవచ్చని, దాంతో తమకు సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోంది. దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేస్తోంది. విద్యను ప్రైవేటీకరణ చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలను ఖర్గే చూసుకుంటారు. భారత్ జోడో యాత్ర క్రీడా యాత్ర కాదు. దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులపై పోరాట యాత్ర. దేశంలో బీజేపీ హింసను ప్రేరేపిస్తోంది. బీజేపీపై పోరాటం కోసమే నా భారత్ జోడో యాత్ర. ప్రజలు కాంగ్రెస్తో విడిపోలేదు. ప్రజలతో కనెక్ట్ కావడానికే యాత్ర. బీజేపీ విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ. కశ్మీర్ వెళ్లిన తర్వాత నేనేం అనుకుంటున్నా అనేది చెప్తా.’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. చదవండి: ‘ఎర’ రాజకీయంపై జోరుగా చర్చ.. వీడని చిక్కు.. ఎవరికి లక్కు! -
దావత్ @మునుగోడు!.. నాటుకోడి మాంసం, మద్యం, కల్లుతో విందులు
సాక్షి, రంగారెడ్డి: ‘మనుగోడు పోదాం చలో..చలో.. ఎంజాయ్ చేద్దాం పదో.. పదో’.. అనే నినాదం ప్రస్తుతం జిల్లాలో మార్మోగుతోంది. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలక్షన్ పుణ్యాన రాజకీయ పార్టీల నేతలు పండుగ చేసుంటున్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీఎస్పీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే ఆయా పార్టీల శ్రేణులకు కలిసొచ్చింది. జిల్లాలోని అధికార పార్టీకి చెందిన మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు నిత్యం వారికి కేటాయించిన గ్రామాల్లో డోర్ టు డోర్ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి పలువురు నేతలు అక్కడకు వెళ్తున్నారు. కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రచార బాట పట్టారు. బీఎస్పీ నుంచి సైతం స్థానిక నేతలు తరలివెళ్తున్నారు. నిత్యం ఉదయం 7గంటలకే సాగర్రోడ్డు నుంచి మాల్ మీదుగా మునుగోడులోని గ్రామాలకు చేరుకుంటున్నారు. రాత్రి వేళ తిరిగి వస్తున్నారు. ఇలా వారం రోజులుగా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు ఆయా పార్టీలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, పార్టీ సీనియర్లు వందలాది మంది ప్రచారానికి వెళ్తున్నారు. నాటు కోడి.. భలే క్రేజీ మునుగోడు ప్రచారంలో విందు కోసం నాటు కోడి మాంసం క్రేజ్గా మారింది. నగరం నుంచి మునుగోడు ప్రచారానికి వెళ్తున్న ప్రజాప్రతినిధులకు, పార్టీ పెద్దలకు విందులో కచ్చితంగా నాటు కోడి మాంసం ఉండేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే గ్రామాల్లో పార్టీ శ్రేణులకు ముందుగానే సమాచారం ఇచ్చి.. ఈ రోజు మా నేత వస్తున్నాడు.. నాటు కోడి మాంసం ఉండేలా చూడు బ్రదర్.. ఖర్చు ఎంతైనా చూసు్కందాం అని సూచిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ నాటు కోళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. భోజనం ఏర్పాట్లు చేసే నిర్వాహకులు నిత్యం రంగారెడ్డి జిల్లాలోని యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్, నల్గొండ జిల్లా పరిధిలోని చింతపల్లి, దేవరకొండ తదితర మండలాల్లోని గ్రామాలకు వెళ్లి నాటుకోళ్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో మాంసం ఉన్న నాటు కోడి ధర రూ.2 వేలు పలుకుతోంది. రెండు కిలోల కోడిని రూ.5 వేలకు పైగా పెట్టి కొనుగోలు చేస్తున్నారు. నాటుకోడి మాంసంతో పాటు విలువైన మద్యం, కల్లు, మటన్, చికెన్తో విందు ఆరగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్, చేతి ఖర్చుల కోసం నిత్యం రూ.వేలల్లో జేబు నింపుకొంటున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా తమకు అక్కర్లేదు.. నిత్యం విందు భోజనం, చేతి ఖర్చులు అందుతున్నాయా..? లేదా..? అనే విధంగానే అన్ని పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు. చుక్కలు చూపిస్తున్న ఓటర్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో జిల్లా నేతలకు మునుగోడు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఏ పార్టీ వారు వెళ్లి అడిగినా.. మీకే మా మద్దతు ఓటుకు రేటెంత అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు సదరు గ్రామాల్లోని తమ బంధువులు, తెలిసిన వాళ్లను తీసుకెళ్లి అయ్యా.. అమ్మా అంటూ బతిమాలుతున్నారు. డబ్బులిచ్చి ఓటర్ల ఇళ్లల్లోనే విందులు ఏర్పాటు చేస్తూ మచ్చిక చేసుకుంటున్నారు. మునుగోడు ఓటర్లను యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మాడ్గుల్, కడ్తాల్ మండలాల పరిధి లోని గ్రామాలకు తీసుకువచ్చి మీ ఓట్లన్నీ మా పార్టీకే వేయాలి.. మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పు అని మద్యం తాగించి, డబ్బులు ఇస్తున్నారు. మునుగోడు పోరుతో మద్యం, చికెన్, మటన్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
Shamshabad: వాట్సాప్లో అమ్మకం.. గేదెల ఫొటోను చూపించి..
సాక్షి, రంగారెడ్డి: వాట్సాప్లో అమ్మకానికి పెట్టిన గేదెలను కొనడానికి యత్నించిన ఓ రైతు సైబర్ నేరగాళ్లకు రూ.1,31,500 సమర్పించుకున్నాడు. పోలీసుల చెప్పిన వివరాల మేరకు... కవ్వగూడకు చెందిన రైతు బొద్దం శ్రీకాంత్ యాదవ్ వాట్సాప్ నంబరుకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నుంచి ఈ నెల 6న హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి గేదెల ఫొటోలు పోస్టు చేసి, రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయని వాటి ధర రూ.1,10,000గా చెప్పాడు. గేదెలు కొనేందుకు శ్రీకాంత్ ఆసక్తి చూపడంతో సదరు వ్యక్తి ముందుగా రూ.10 వేలు చెల్లించాలని చెప్పాడు. అందుకు ఒప్పుకుని ఫోన్పే ద్వారా పలుసార్లు రూ.9వేలు పంపించాడు. గేదెలు పంపించడానికి బోర్డర్ చార్జీలు, జీఎస్టీ కలిపి అదనంగా రూ.11,500 అవుతుందని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించాడు. గేదెలు ఇంటికి పంపించిన తర్వాత రూ.లక్ష ఇవ్వవచ్చని, మిగిలిన మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని షరతు పెట్టారు. దీంతో ఈ నెల 10న గేదెలు పంపిస్తున్నట్లు చెప్పడంతో తన చిరునామా వివరాలు అందజేశాడు. ఇలా శ్రీకాంత్ను నమ్మించి పలుసార్లు మొత్తంగా రూ.1,31,500 వసూలు చేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అధికార పార్టీలో ఈడీ కుదుపు.. కేడర్లో ఆందోళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన మంగళవారం ఈడీ ముందు హాజరయ్యారు. జిల్లా పార్టీ అధినేతపైనే మనీలాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ నోటీసులు జారీ చేయడంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. మంచిరెడ్డి కిషన్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో రెండోసారి విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది. సర్వత్రా చర్చనీయాంశం 2015లో ఇండోనేషియా వేదికగా గోల్డ్మైన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతోపాటు మనీ లాండరింగ్కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆయనకు నెల రోజుల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా వివరణ కూడా ఇచ్చారు. సంతృప్తి చెందని ఈడీ స్వయంగా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చే యడంతో ఆయన ఈడీ ముందు హాజరవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్లలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఇటీవల ఈడీ విచారించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి శ్రీనివాస్తోనూ మంచిరెడ్డికి సంబంధాలున్నాయని, ఈ కేసులోనూ ఆయనను విచారించే అవకాశాలున్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు 2014లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో మంచిరెడ్డి సహా పలువురు పర్యటించారు. ఈ సందర్భంగా వినియోగించిన వ్యయంపై అనుమానాలు రావడం.. ఈ నిధులు విదేశాల నుంచి వచ్చినట్లు ఆరోపణలు రావడం కూడా ఈడీ విచారణకు కారణంగా కనిపిస్తోంది. ఈడీ మాత్రం మంచిరెడ్డిని ఏ కేసులో విచారించారనేదానిపై ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రజలకు వివరణ ఇవ్వాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అక్రమ సంపాదనపై ఈడీ విచారణ.. గతంలో వచ్చిన జూదం, భూ ఆక్రమణలపై ఇబ్రహీంపట్నం ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ఒక ప్రజాప్రతినిధిగా జవాబుదారీగా ఉండాలని హితవుపలికారు. ఆయనపై ఇది కొత్త ఆరోపణ కాదని, అనేక భూ తగాదాల్లో ప్రజల పక్షం కాకుండా రియల్టర్ల పక్షాన నిలబడినట్లు విమర్శలు ఉన్నాయని తెలిపారు. తాజాగా ఖానాపురం గ్రామ ప్రజల విషయంలోనూ ప్రజల పక్షాన లేరన్నారు. వరుస ఆరోపణల నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. -
Ranga Reddy: ఫాస్ట్ ట్యాగ్ విషయంలో గొడవ.. కొట్టుకున్న సర్పంచ్, టోల్ ప్లాజా సిబ్బంది
సాక్షి, రంగారెడ్డి: షాద్ నగర్ పట్టణ పరిధిలోని 44 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న రాయికల్ టోల్ ప్లాజా వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ ప్లాజా సిబ్బందికి, జడ్చర్ల పరిధిలోని నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ ప్రనిల్ చందర్కు మధ్య వాగ్వివాదం జరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకున్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్ టోల్ ప్లాజా వద్ద వెళ్తుండగా అతని ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు అయిపోయాయి. అతను రీఛార్జ్ చేసుకునే క్రమంలో కొంత ఆలస్యం అయింది. వెనుక వాహనాల వారు హారన్స్ కొడుతుండడంతో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో టోల్ ప్లాజా సిబ్బందికి ఇతనికి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు దూషించుకోవడంతో గొడవ ప్రారంభమైంది. చదవండి: హైదరాబాద్లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్తో గొడవ అయితే సర్పంచ్ ప్రనిల్ చందర్ సర్పంచుల సంఘంలో నాయకుడిగా ఉన్నారు. సర్పంచ్ ప్రనిల్ చందర్పై దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న ఆయన అనుచరులు, స్నేహితులు రాయికల్ టోల్ ప్లాజా వద్దకు వచ్చి టోల్ ప్లాజా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రనిల్ చందర్ తరపున అనుచరులు హంగామా సృష్టించి, టోల్గేట్ క్యాబిన్లను అద్దాలను ధ్వంసం చేశారు. పరస్పర దాడులతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సంఘటనా స్థలానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలిరావడంతో ప్రనిల్ తో పాటు పలువురికి గాయాలు కూడా అయ్యాయి. -
మెడిసిన్ చదివి రెండేళ్లుగా ఇంటి వద్దే.. సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లి
సాక్షి, రంగారెడ్డి: ఇంటినుంచి వెళ్లిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తల్లిదంండ్రులకు సందేశం పంపిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్పల్లి శ్రీరాంకాలనీకి చెందిన తాడాల శ్రీనివాస్రావు కుమార్తె ప్రత్యూష(24) మెడిసిన్ కోర్సు చదివి రెండేళ్లుగా ఇంటివద్దే ఉంటుంది. ఈనెల 18న ఉదయం 10గంటలకు మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ కాలేజీలో సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని వెళ్లిన ప్రత్యూష 19వ తేదీన ఉదయం 8గంటలకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో మెసేజి పెట్టింది. ఆందోళనకు గురైన తల్లి గంగాభవానీ పహాడీషరీఫ్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు.. ‘పట్నం’ మున్సిపాలిటీలో ముదిరిన వైరం
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): ‘పట్నం’ పురపాలక సంఘం పాలక వర్గం వ్యవహారశైలి రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ చైర్పర్సన్ కప్పరి స్రవంతితో అమీతుమీ తేల్చుకునేందుకు అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మూకు మ్మడిగా మంత్రి సబితారెడ్డికి ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 24 మంది కౌన్సిలర్లకు ఆరుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు ఉండగా మిగతా వారంతా అధికార టీఆర్ఎస్కు చెందిన వారే. చైర్ పర్సన్, అధికార పార్టీ కౌన్సిలర్ల మధ్య ఆరు నెలలుగా వైరం కొనసాగుతోంది. అదికాస్తా తీవ్రరూపం దాల్చింది. అక్రమ వసూళ్లతోపాటు మున్సిపాలిటీలో రూ.2 కోట్లకు పైగా తప్పుడు బిల్లులు, రికార్డులు సృష్టించి చైర్పర్సన్ అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్కు ఫిర్యాదు చేయగా మే 26న మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన రికార్డులను సీజ్ చేసి వెంట తీసుకెళ్లారు. అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని చైర్ పర్సన్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఏమైందో తెలియదుగానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అనంతరం చైర్పర్సన్పై చర్యలు తీసుకోవాలంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు కలెక్టర్ అమయ్కుమార్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, సీడీఎంఏ అధికారుల కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికార చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశాలకు డుమ్మా కొట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట చైర్పర్సన్ అవినీతిపై నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంకుస్థానలు, ప్రారంభోత్సవాలకు ఎవరివారే అన్నట్లు వ్యవహరించారు. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరితో కౌన్సిలర్లు జతకట్టారు. ఒకే పనిని చైర్పర్సన్, వైస్ చైర్మన్ వేర్వేరుగా చేపట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అధికార పార్టీ కౌన్సిలర్ల మద్దతు లేకున్న చైర్ పర్సన్ ఒంటరిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటుండంతో కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. రూటు మార్చిన కౌన్సిలర్లు చైర్పర్సన్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారికంగా చర్యలు లేకపోవడంతో కౌన్సిలర్లు రూటు మార్చారు. కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు. చైర్పర్సన్పై చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ల పదవులకు రాజీనామాలు చేస్తామని ఏకంగా మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే సమక్షంలోనే తెగేసి చెప్పారు. చైర్ పర్సన్ అవినీతి, అక్రమాలతో పార్టీకి, తమకు చెడ్డపేరు వస్తోందని మంత్రి దృష్టికి తెచ్చారు. ఒక్కసారిగా 15 మంది కౌన్సిలర్లు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే కోణంలో అధికార పార్టీ నేతలు ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కిషన్రెడ్డి కనుసన్నల్లోనే..! ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే మాట కాదని చైర్పర్సన్పై ఫిర్యాదు చేసేంత సాహసానికి కౌన్సిలర్లు ఒడిగట్టరనే వాదన వినిపిస్తోంది. చైర్ పర్సన్ అవినీతి చిట్టా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ఫిర్యాదుల పర్వానికి కౌన్సిలర్లు తెరలేపారని.. ఆమె వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేకు నచ్చడం లేదనే చర్చ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో చైర్పర్సన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లడం లేదని తెలుస్తోంది. రోజురోజుకూ ముదిరిపాకాన పడి తారాస్థాయికి చేరిన మున్సిపాలిటీ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో వేచి చూడాలి. -
కు.ని. విషాద ఘటన.. అయ్యో దేవుడా! ఈ పిల్లల బతుకులెట్లా?
మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతలను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో నలుగురు తల్లులు మృత్యువాతపడటం యావత్ రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, ఇబ్రహీంపట్నం: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించడంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలిన అవుతపురం లావణ్య (22) అంత్యక్రియలు సీతారాంపేటలో ప్రశాంతంగా ముగిశాయి. లావణ్యకు ఇద్దరు కుమార్తెలు అక్షర (6), భావన (4) కుమారుడు యశ్వంత్ (ఏడు నెలలు) ఉన్నారు. చివరి చూపుల సందర్భంగా అత్తమామలు,, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఏమి జరిగిందో తెలియని పసిమొగ్గలను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. బరువెక్కిన హృదయంతో ఓదార్చారు. అసలు ఏం జరిగిందో తెలియక పసిమొగ్గలు దీనంగా చూస్తుండటాన్ని అందరినీ కదిలించింది. తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయిందని, ఇక తాము చూడ లేమని తెలియని ఆ చిన్నారులను చూసి చలించి పోయారు. భర్త లింగస్వామి ఓ రైతు వద్ద జీతం చేస్తూ అతని వ్యవసాయ పనులు చేస్తుంటాడు. సొంత ఇల్లు కూడలేని దీనస్థితి ఆ కుటుంబానిది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తలకొరివి పెట్టిన మామ కట్టుకున్న భర్త, కన్న కుమారుడు ఉన్నప్పటికీ అర్ధంతరంగా తనువు చాలించడంతో లావణ్య మామ యాదయ్య అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించారు. ఏడు నెలల బాబు చేతిని ముట్టించి దహన సంస్కారాల కార్యక్రమంలో మామ యాదయ్య ముందు నడిచాడు. ఏ జన్మలో రుణపడి ఉన్నానో నంటూ కో డలి మృతదేహం చుట్టూ తిరిగి దహన సంస్కా రాలు చేయడం అక్కడున్న వారిని కదిలించింది. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ను ఓదార్చుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు నిత్యారెడ్డి లింగంపల్లిలో సుష్మ అంత్యక్రియలు మంచాల: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మృతి చెందిన మైలారం సుష్మ స్వగ్రామం లింగంపల్లిలో మంగళవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలకు వివిధ గ్రామాల నుంచి ప్రజా ప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మ కూతురు శాన్వి, కుమారుడు శ్రేయన్ అమ్మ కావాలని ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యారెడ్డి.. సుష్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం సుష్మ భర్త ఈశ్వర్, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కొంత ఆర్ధిక సాయం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యమే కారణమని జెడ్పీటీసీ ఆరోపించారు. ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సర్పంచ్ వినోద మూర్తి, ఎంపీటీసీ జయనందం తదితరులు పాల్గొన్నారు. మౌనిక పిల్లలు పిల్లల ఆమయాక చూపులు అదే విధంగా మాడ్గుల మండలం కొలుకుల పల్లి పంజాయతీ పరిధిలోని రాజీవ్ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్ నాయక్తో పెళ్లి జరిగింది. వీరికి మాను శ్రీ(3), గౌతమ్(15 నెలలు) ఇద్దరు పిల్లలు. శ్రీనివాస్ నాయక్ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అయితే మౌనిక తల్లి తిరిగిరాదని లోకాలకు వెళ్లిందని తెలియక పిల్లలు అమాయక చూపులు చూస్తున్నారు. భర్త శ్రీనివాస్ నాయక్ సైతం కన్నీటి పర్యంతమవుతున్నాడు. మమత, ఇద్దరు పిల్లలు భర్తకు చేదోడువాదోడు ఇక ఇదే మండలం నర్సాయపల్లికి చెందిన మమత, మల్లేష్ గౌడ్లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్. వర్షిత్(4), విహాన్(2). పేద కుటుంబానికి చెందిన మల్లేష్ గౌడ్ వ్యవసాయం చేసుకుంటూ డీసీఎం వ్యాన్ నడుపుకుంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదుడో వాదోడుగా ఉండే మమత ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు, భర్త భోరున విలపిస్తున్నారు. -
తలనరుక్కుని.. చేతిలో పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: దేవుడిని చేరేందుకు ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూశాయి. ఆత్మార్పణ శిలలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బయటపడినా.. ఇవి తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టుగా ఉన్న అరుదైన శిల్పాలు కావటం విశేషం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు యాదేశ్వర్ దండేకర్ వీటిని రాచకొండ గుట్టల్లో గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. జిల్లాలోని మంచాల మండలం లోయపల్లి సోమన్నగుట్ట వద్ద ఐదు ఆత్మాహుతి శిల్పాలు వెలుగు చూశాయని తెలిపారు. వీటిలో వీరులు అంజలిఘటిస్తూ కూర్చుని ఉండగా, వారి కీర్తి ఆచంద్రతారార్కం అని చెప్పేందుకు గుర్తుగా తలపై సూర్య, చంద్రుల చిత్రాలున్న రెండు శిల్పాలున్నాయన్నారు. ఇక తలలు నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టు మరో రెండు శిల్పాలున్నాయని, అందులో ఒకటి ధ్వంసమైందని చెప్పారు. ఇవి చాళుక్యుల శైలిలో ఉన్నాయని, 14–15 శతాబ్దాలకు చెందినవై ఉంటాయని వివరించారు. -
మూడేళ్ల క్రితం పెళ్లి.. రెండేళ్ల పాప.. భార్యతో గొడవపడి..
సాక్షి, రంగారెడ్డి: భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ బాలాజీనగర్లో నివసించే ఆవుల శివకుమార్(30), హారికలు భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్ల పాప ఉంది. శివకుమార్ టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శివకుమార్ బెడ్రూంలోని ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. 2 నెలల క్రితం మరో వ్యక్తితో వెళ్లిందని..
సాక్షి, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలతో సహా ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు మండలం నాగాలదిన్నెకు చెందిన కీరసాకరే రామకృష్ణ బతుకుదెరువు కోసం వచ్చి లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంతో కలిసి పెద్దంబర్పేట్లోని శాంతినగర్లో అద్దె కుంటున్నాడు. భార్య స్వప్న (32) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్గా పనిచేస్తుంది. వారికి కూతురు లావణ్య (14), కొడుకు ప్రవీణ్ (12) ఉన్నారు. జులై 27న పనికి వెళుతున్నానని పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన స్వప్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్క తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్వప్న రెండు నెలల క్రితం రాము అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లిందని ప్రస్తుతం అతనిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ -
మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు వేధింపులు
సాక్షి, హైదరాబాద్: భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను పట్టించుకోకుండా మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య మహిళా సంఘాల నాయకులతో కలిసి ఇంటి ఎదుట ఆందోళనకు చేపట్టింది. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన దేవులపల్లి వేణుకుమార్ (46), కల్పన (42)కు 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కూతురు సంతానం. కొంతకాలంగా బడంగ్పేట శివనారాయణపురంలో నివాసమున్నారు. వేణుకుమార్ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో వేణు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని భార్య కల్పన ఆరోపిస్తూ గతంలో వరంగల్లోని మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వేణుపై కేసు నమోదు చేయడంతో పాటు కోర్టులో మెయింటెనెన్స్ కేసు నడుస్తోంది. తనను దూరం పెట్టాలనే ఉద్ధేశంతో మూడేళ్లుగా తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని కల్పన శుక్రవారం స్థానిక మహిళా సంఘాల నాయకులతో కలిసి శివనారాయణపురంలోని భర్త ఇంటికి వచ్చి బైఠాయించి పోలీసులు, కోర్టు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ ఫిర్యాదులు చేయగా కేసు విచారిస్తున్నామని సీఐ తెలిపారు. చదవండి: బిహార్లో కల్తీ మద్యం కలకలం.. 11మంది మృతి -
‘నా మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వద్దు’
సాక్షి, హైదరాబాద్: అత్తింటి వేధింపులతో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్నగర్కు చెందిన ఖాజా మోయియుద్దీన్ అన్సారీ ఐదో కుమార్తె ఫిర్దోస్ అన్సారీ (29) వివాహం రెండేళ్ల క్రితం మహ్మద్ సుల్తాన్ పటేల్తో జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. కొన్నాళ్లుగా భార్యపై అనుమానంతో భర్త వేధించసాగాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలంటూ సుల్తాన్తో పాటు అతని తల్లి కూడా వేధించారు. వేధింపులు తట్టుకోలేక ఫిర్దోస్ తల్లిగారింటికి వచ్చి నివాసం ఉంటోంది. అయినప్పటికీ సుల్తాన్ షాహిన్నగర్ వచ్చి తరచూ భార్యతో గొడవపడి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల ఒకటిన రాత్రి సుల్తాన్ భార్యను ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి వెళ్లాడు. దీంతో జీవితంపై విరక్తిచెందిన ఫిర్దోస్ మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. గన్తో బెదిరించేవాడు.. తన మృతదేహం దరిదాపుల్లోకి కూడా అత్తింటివారిని రానివ్వరాదంటూ.. తాను అనుభవించిన నరకాన్ని ఫిర్దోస్ డైరీలో రాసింది. గన్తో బెదిరించి చిత్రహింసలకు గురిచేశాడని రాశారు. ఎన్నో హత్యలు చేశానని, ఎవరికీ భయపడనని అంటూ కొట్టేవాడని పేర్కొన్నారు. -
సినీ పెద్దలకు ఆ భూమిపై హక్కుల్లేవు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి వ్యవహారంలో పలువురు సినీ పెద్దలకు ఎలాంటి హక్కులు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఖానామెట్లో చట్ట ప్రకారం హక్కులు లేని భూమిని నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాలు కొనుగోలు చేశారని నివేదించింది. చదవండి: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? సదరు భూ హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్ సంతకాలకు పొంతన లేదన్నారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్లు పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. సైన్యంలో జవాన్లకు 5 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధనని, కమాండర్ ఇన్ చీఫ్ నరసింహనాయక్కు ఇది వర్తించదని చెప్పారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్ శాఖ నిర్ధారించడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరారు. రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరుల వాదనల నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. -
Ranga Reddy: కాంగ్రెస్లో ‘కుర్చీ’లాట!
మునిసిపల్ అధ్యక్ష పదవి కోసం ముసలం పుట్టి.. ముదిరి పాకానపడుతోంది. నువ్వానేనా అంటూ ‘కుర్చీ’కోసం పార్టీ పెద్దల చుట్టూ ఆశావహులు వరుస కట్టగా.. పార్టీ శ్రేణులు మాత్రం పోటీదారుల పట్ల పెదవి విరుస్తున్నారు. స్వలాభం కోసమే తప్ప.. పార్టీ భవిష్యత్ పట్టని వారికి పీఠం కట్టబెట్టొద్దంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో ముసలం ముదురుతోంది. పార్టీ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ తీవ్రమైంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు పండాల శివగౌడ్ పార్టీ కార్యకలాపాలపై చొరవ చూపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలప్పుడు ఈ పదవిలో శివగౌడ్ను నియమించారు. మున్సిపాలిటీ పరిధిలో పార్టీని సమన్వయంతో ముందుకు తీసుకేళ్ళడం, పటిష్టపరచడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించడంలో ఆయన విఫలమైయ్యాడని కార్యకర్తలు విమర్శిస్తున్న నేపథ్యంలో కొత్త వ్యక్తిని నియమించేందుకు అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో ఆశలు మొలకెత్తుతున్నాయి. కాంగ్రెస్ తరపున కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ వర్గానికి చెందిన ఎండీ గౌస్ కొంతకాలంగా అధ్యక్ష పదవి కోసం తహతహలాడుతూ ప్రయత్నాలు చేస్తున్నాడని, అదేవిధంగా కౌన్సిలర్ ఆకుల మమత భర్త ఆనంద్ నేను సైతం అంటున్నట్లు సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు! అధ్యక్ష పదవి పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆనంద్ వరెస్స్ గౌస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆనంద్, గౌస్ల మధ్య తీవ్ర పోటీ ఉందని, ఇందు కోసం ఇరువురు పార్టీ పెద్దల దర్శనం కోసం రాష్ట్ర రాజధాని కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తుండటంతో పార్టీలో వార్ మొదలైంది. ఆనంద్కు పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టొద్దని పలువురు ఆ పార్టీ కౌన్సిలర్లు అధిష్ఠానానికి విన్నవించినట్లు సమాచారం. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ నాయకత్వలోపం స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల ముందు పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కార్యకర్తలను ఏకతాటిపై నడిపించే నాయకత్వం లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ చతికిలపడిపోయింది. 24 స్థానాల్లో కేవలం 6 కౌన్సిలర్ల స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. తాజాగా ఆకుల ఆనంద్కు అధ్యక్ష పదవి ఇచ్చే అంశంపై విభేదాలు తలెత్తుతున్నాయి. కొంతమంది కౌన్సిలర్లు ఆనంద్ అభ్యర్తిత్వాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మున్సిపాలిటీలో పార్టీ ఏ దారిన వెళుతుందో వేచిచూడాల్సిందే.ఇదిలా ఉండగా మున్సిపాలిటీలో బలంగా ఉన్న పార్టీ రోజురోజుకూ బలహీనపడిపోతుండంతో పార్టీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ కౌన్సిలర్లకు టీఆర్ఎస్ గాలం పార్టీలో అటు నియోజకవర్గ స్థాయిలో, ఇటు మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో గ్రూప్ తగాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆపార్టీలోని లొసుగులను అధికార పార్టీ టీఆర్ఎస్ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను కారెక్కించే దిశగా రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు కౌన్సిలర్లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వినికిడి. ఇదే జరిగితే మున్సిపాలిటీలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్: ఘాటెక్కి.. చప్పబడ్డ విష్ణు విందు) -
Hyderabad: కారు దిగిన మేయర్.. కాంగ్రెస్లో చేరిక
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డికి రాజీనామా లేఖ పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడంగ్పేట కార్పొరేషన్ అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన తాను ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అహర్నిశలు కష్టపడ్డామని, అంకితభావంతో సేవలు అందించామన్నారు. ఆత్మాభిమానం చంపుకోలేకే టీఆర్ఎస్ను వీడి తిరిగి కాంగ్రెస్లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాగా మేయర్తో పాటు 23వ కార్పొరేటర్ రాళ్లగూడం సంతోషి శ్రీనివాస్రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్రెడ్డి సైతం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వీరంతా సోమవారం హస్తినలో రాహుల్గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. -
రంగారెడ్డి: టీఆర్ఎస్ నేతల్లో పీకే ఫీవర్!
అధికార పార్టీ నేతలకు ప్రశాంత్ కిషోర్(పీకే) ఫీవర్ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు. అంతర్గత కుమ్ములాట చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. ‘పట్నం’ దాటని జిల్లా సారథి ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం. చదవండి: గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..! -
3 నెలల కిత్రమే ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి.. భర్తతో గొడవపడి
సాక్షి, రంగారెడ్డి: తల్లిదండ్రులు లేనిది చూసి ఓ యువతి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామానికి చెందిన బులిగం బాలరాజ్ కుటుంబ సభ్యులతో కలిసి అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉండేవారు. బాల్రాజ్కు సాగరిక అనే కుతురు ఉంది. మూడు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ఎడ్ల అంజి అనే యువకుడిని ప్రమ వివాహం చేసుకుంది. అప్పట్లోనూ మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఉప్పునుతల మండలం, అయ్యవారిపల్లిలో నివాసం ఉండేవారు. అంజితో సాగరిక గొడవపడి పది రోజుల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 5న ఇంట్లో ఎవరి లేని సమయంలో సాగరిక(19) బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందోనని కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల వారిని బంధువులను అడిగిన ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి బాలరాజు సోమవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు విచారిస్తున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు. -
వివాహేతర సంబంధం.. పెళ్లి చేసుకోవాలని కోరడంతో..
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధమే మహిళ హత్యకు దారితీసింది. మే 27న షాబాద్ పహిల్వాన్ చెరువులో పడి మృతి చెందిన ఓ మహిళ కేసును పోలీసులు మొదట అనుమానాస్పద ఆత్మహత్యగా భావించి కేసు నమోదు చేసి విచారణ చేయగా ఇది హత్యగా తేలింది. సదరు మహిళతో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తే హత్యచేసినట్లు విచారణలో రుజువైంది. దీంతో షాబాద్ పోలీసులు సోమవారం ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. షాబాద్ సీఐ అశోక్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పహిల్వాన్ చెరువులో మే 27న బైండ్ల భారతమ్మ(30) మృతదేహం లభించిన విషయం విదితమే. అయితే పోలీసులు అమె మృతికి సంబంధించిన విషయాలు తెలియకపోవటంతో అనుమానాస్పద ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో మృతురాలి ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేయగా ఈ కేసులో ఆమెతో అక్రమసంబంధం పెట్టుకున్న షాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్, అతనికి సహకరించిన కమ్మరి లక్ష్మీబాయి, స్నేహితుడు సయ్యద్ సాదుల్లా హుస్సేన్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ముగ్గురు నిందితులను పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. షాబాద్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గపూర్ 15ఏళ్లుగా చికెన్షాపు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగేళ్ల కిత్రం వివాహమైంది. కానీ ఇతనికి పెళ్లికి ముందు నుంచే మృతురాలు బైండ్ల భారతమ్మతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమె ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఈ విషయం నలుగురికి తెలిసి పరువు పోతుందనే భయంతో ఆమెను ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గత నెల 22న ఆమె గపూర్కు పోన్ చేయటంతో ఆమెను షాబాద్కు రమ్మనాడు. షాబాద్లో అతనికి తెలిసిన కుమ్మరి లక్ష్మీబాయి ఇంటికి పిలిపించాడు. చదవండి: మసాజ్ పేరుతో దారుణం.. భారత్ పరువు తీస్తున్నారు కదరా అయ్యా.. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడే ఆమె ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. మృతురాలి ఒంటిపై ఉన్న 3 గ్రాముల పుస్తెను సహకరించినందుకు లక్ష్మీబాయి తీసుకుంది. మృతదేహాన్ని తన స్నేహితుడైన సయ్యద్ సాదుల్లా హుస్సేన్ సహాకారంతో గోనే సంచిలో పెట్టుకొని స్కూటర్పై తీసుకెళ్లి షాబాద్ పహిల్వాన్ చెరువులో పడేశాడు. కానీ పోలీసులు మృతురాలి ఫోన్కాల్ డాటా ఆధారంగా ఆరోజు ఆమె చేసిన ఫోన్ నెంబర్ల ఆధారంగా కేసు విచారించారు. దీంతో చివరిగా చేసిన ఫోన్ గపూర్ది కావటంతో అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో ఆయనతో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజులకే..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లయిన పన్నెండు రోజు లకే నూరేళ్లు నిండాయి. బైక్ను యూ టర్న్ను తీసుకుంటుండగా ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మొయినాబాద్మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కుమ్మరి పరంధామ(23) ప్రగతి రిసార్ట్స్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి గతనెల 25న వివాహం జరిగింది. మొయినాబాద్ మండలం జీవన్గూడలో ఉన్న బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్కు ఆదివారం రాత్రి వచ్చాడు. ఫంక్షన్కు వచ్చిన బంధువులను హిమాయత్నగర్ చౌరస్తాలో దింపేందుకు సోమవారం సాయంత్రం బైక్పై వచ్చాడు. వారిని దింపి తిరిగి జీవన్గూడకు వెళ్లేందుకు చౌరస్తాలో బైక్ యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే సమయంలో మండల పరిధిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చెందిన బస్సు నగరం వైపు అతివేగంతో వెళ్తూ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో అతను రోడ్డుపై పడిపోవడంతో నడుము భాగం పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, బస్సుకు చెందిన ప్రైవేట్ కళాశాల ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి వద్ద ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. చదవండి: కేఏపాల్తో మా కుటుంబానికి ప్రాణహాని.. నా భర్తను విడిపించండి’ -
భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్లో
సాక్షి, రంగారెడ్డి: కేశంపేట మండల కేంద్రంలోని కొనాయపల్లి సర్పంచ్ భయ్యా మల్లేశ్ తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన పాదయాత్రలో సర్పంచ్ పాల్గొన్నారు. అంతేకాకుండా కాషాయ జెండా పట్టుకుని పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు.. శనివారం జరిగిన కాంగ్రెస్పార్టీ రచ్చబండలో సైతం సర్పంచ్ పాల్గొనడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని పార్టీ అధికారంలోకి రావాలంటూ ప్రసగించారు. పదిహేను రోజుల వ్యవధిలోనే పార్టీలు మారడంతో గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు. చదవండి: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఫ్లైబిగ్ విమానానికి తప్పిన ప్రమాదం. -
భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది
సాక్షి, హైదరాబాద్: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం 10 మందిని రిమాండుకు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకా రం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థలవివాదం నడుస్తోంది. మూడు రోజుల కిందట రాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి -
కోట్ల అక్రమ ఆస్తులు.. శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మాజీ పంచాయతీ అధికారి దుబ్బుడు సురేందర్ రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించిన అధికారులు సురేందర్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. కాగా సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డికి సంబంధించిన నివాసంలో సోదాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి నివాసంలో భారీగా ఆస్తులు, నగలను అధికారులు గుర్తించారు. ఇంట్లో 60 తులాల బంగారం, బ్యాంక్ లాకర్స్లో 129.2 తులాల బంగారం, నాలుగు ఓపెన్ ప్లాట్స్, 4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 2,31,63,600 అక్రమ ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. సురేందర్ రెడ్డి అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. చదవండి: బ్యాంక్కు షాకిచ్చిన క్యాషియర్.. ఐపీఎల్ బెట్టింగ్లో.. -
పెళ్లై రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదని..
సాక్షి, రంగారెడ్డి: పెళ్లి జరిగి రెండేళ్లవుతున్నా అక్క కాపురం చక్కబడటం లేదన్న మనస్తాపంతో తమ్ముడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన చేవెళ్ల మండలంలోని గుండాల అనుబంధ గ్రామమైన లక్ష్మీగూడలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. లక్ష్మీగూడకు చెందిన కొలన్ శేఖర్రెడ్డికి కుమారుడు శ్రీకాంత్రెడ్డి(30), కూతురు మాధవి ఉన్నారు. శ్రీకాంత్రెడ్డి డిగ్రీ వరకు చదువుకొని వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మాధవికి రెండేళ్ల కిత్రం శంకర్పల్లి మండలం సింగపూర్ గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డితో వివాహం జరిపించారు. కొంత కాలంగా అదనపుకట్నంతో పాటు భూమి కూడా ఇవ్వాలని భర్త నుంచి వేధింపులు పెరిగాయి. పలుమార్లు గ్రామ పెద్దల సమయంలో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. మాధవి ఆరోగ్యం కూడా క్షీణించడంతో అక్క జీవితం ఏమవుతుందోనని శ్రీకాంత్రెడ్డి మదనపడసాగాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం స్నేహితుల వద్దకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు డ్రిప్ పైపుతో ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా -
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్: సీన్ ఉంటే.. సినిమా హిట్టే
సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఆదర్శంగా.. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. రెండుసార్లు ఉత్తమ అవార్డులు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. -
ప్రీ వెడ్డింగ్ షూట్లో అపశ్రుతి.. కాబోయే జంటపై తేనెటీగల దాడి
ఇటీవలి కాలంలో ఫోటోషూట్లు ఎక్కువయ్యాయి. ఏ చిన్న వేడుకైనా కూడా ఫోట్ షూట్ ఉండాల్సిందే అనేంతగా రోజులు మారిపోయాయి..కొత్త కొత్త ఆలోచనలతో వినూత్నంగా చేసుకుంటున్న ఈ ఫోటోషూట్లు ప్రస్తుతం ట్రెండ్గా మారాయి. పుట్టినరోజులు, ముఖ్యంగా పెళ్లి చేసుకోవాలనుకునే కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ కచ్చితంగా పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఫోటో షూట్ పేరుతో ప్రమాదలను కొనితెచ్చుకుంటున్నారు. జాగ్రత్తలు మరిచి ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు. సాక్షి, అబ్దుల్లాపూర్మెట్ : ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్లో అపశ్రుతి చోటుచేసుకుంది. తేనెటీగలు దాడి చేయడంతో స్వల్ప గాయాలతో బయటపడిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ రాక్టౌన్ కాలనీకి చెందిన అనురాగ్రెడ్డి, శివానికి వివాహం కుదిరింది. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం ఈనెల 11న కోహెడలోని ఔటర్ పరిసరాల్లోకి వచ్చారు. ఫొటో షూట్లో నిమగ్నమైన సమయంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో అక్కడే ఉన్న పోలీస్ కంట్రోల్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. స్వల్ప గాయాలు కావడంతో పోలీసు సిబ్బంది సహకారంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అదే రోజు సాయంత్రం డిశ్చార్జి అయినట్లు తెలిసింది. చదవండి: అదృశ్యమైన సస్పెండ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య? -
కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ..
సాక్షి, షాద్నగర్: కన్నకూతురును కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రి కర్కశంగా ఆ చిన్నారి ఉసురు తీశాడు. ఈ ఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయత్రం వెలుగుచూసింది. ఫరూఖ్నగర్ మండలం బాపన్గుట్ట తండాకు చెందిన నరేశ్, రజిత దంపతులకు కూతురు ప్రియ (9 నెలలు) ఉంది. తన కూతురు కనిపించడంలేదని నరేశ్ ఆదివారం షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ట్ టీం ,డాగ్ స్క్వార్డ్తో రంగంలోకి దిగిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు 24 గంటల్లో కేసును చేధించారు. ప్రియ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మార్చి హత్యకు గల కారణాలను ఏసీ కుశల్కర్ మంగళవారం మీడియాకు వెల్లాడించారు. రెండేళ్ల కిత్రం నరేశ్, రజితకు వివాహమైనట్లు తెలిపారు. అయితే నరేశ్ వ్యవహారశైలిని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా, చిన్నారిని తానే హత్యచేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో పరీక్షల్లో ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయ్యినట్లు, దీనితో అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తమకు ఏమైనా అయితే పాప పరిస్థితి ఏంటని అనాలోచితంగా ఆలోచించిన నరేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. హంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత! -
కోకాపేటలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి.. ఆ టైమ్లో బాయ్ఫ్రెండ్
సాక్షి, రంగారెడ్డి: స్పాలో పనిచేస్తున్న అస్సాంకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మిజోరం రాష్ట్రానికి చెందిన రోసీ (23) తన స్నేహితురాలు లాల్వెన్తో కలిసి నెల రోజుల క్రితం కోకాపేటలోని ఐఎస్ఏ స్పాలో థెరపిస్టుగా చేరారు. స్పా యజమాని ఆనందరావు కోకాపేటలో వారికి ఓ గది ఇప్పించారు. అయితే రోసీ ఆదివారం గదికి రాలేదు. దీంతో స్నేహితురాలు సోమవారం స్పాకు వెళ్లి రాత్రికి వచ్చింది. రోసీ మంగళవారం ఉదయం పార్సిల్లో ఏదో తెప్పించుకొని తిన్నది. ఆ సమయంలో గదిలో ఆమెతో పాటు నాగాలాండ్కు చెందిన ప్రియుడు లన్సో ఉన్నాడు. పార్సిల్లో వచ్చింది తిని బాత్రూంకు వెళ్లిన రోసీ ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో లన్సో డోర్ తొలగించి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. అంతేకాకుండా బాత్రూంలో ఇంజెక్షన్ సిరంజి, మాత్రలు కనిపించాయి. దీంతో లన్సో వెంటనే 108 ద్వారా సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ధృ వీకరించారు. మృతురాలి బంధువు బినిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: అమ్మమ్మ పాలకూర కావలంటూ.. పుస్తెలతాడుతో.. -
దేశానికే గర్వకారణం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. చినజీయర్ స్వామి వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకోసం మహాద్భు త కృషి చేశారని కొనియాడారు. జీయర్ బోధనలకు తెలంగాణ కేంద్రం కావడం గొప్ప విషయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సామాజిక సమతను కొనసాగిస్తాం ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రశాంత నిలయంగా మారుతుందని అన్నారు. ఆ మహామూర్తి బోధనలు వెయ్యేళ్ల తర్వాత మళ్లీ ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేళ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. అనతి కాలంలోనే ఈ ప్రాంతం ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందు తుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను కొనసాగిస్తామని చెప్పారు. చినజీయర్ స్వామి బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ మహా ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు తమ కుటుంబం తరఫున పండ్లు, ఫలాల ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు ఉన్నారు. కుటీరానికి ఆహ్వానించి..ఆశీర్వదించి శ్రీరామనగరం సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులను త్రిదండి చినజీయర్ స్వామి తన కుటీరానికి ఆహ్వానించారు. ఆశీర్వచనాలు అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకుంటోందని తెలిపారు. సమారోహానికి వస్తున్న భక్తులకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతోందని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షురావును చినజీయర్ స్వామి అభినందించారు. ‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులను పుణికి పుచ్చుకున్నావు..’ అంటూ ప్రశంసించారు. సీఎం పర్యటనలో ముఖ్యాంశాలివే – సాయంత్రం 4 గంటలకు సీఎం శ్రీరామనగరం చేరుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. – భద్రవేదికపై ఆశీనులైన భగవత్రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. చిన జీయర్తో కలిసి ప్రదక్షిణలు చేశారు. – అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రతిష్ట ప్రారంభ సూచికగా 1,260 కేజీల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగంటను మోగించి గంటానాదం చేశారు. – రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ట స్థలాన్ని పరిశీలించి, రామానుజ జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్ను తిలకించారు. 108 దివ్య దేశాల సమూహం, వాటి ప్రాముఖ్యతను సీఎంకు చినజీయర్ వివరించారు. – రామానుజుల జీవిత చరిత్రను తెలియజేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని సీఎం వీక్షించారు. – మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు కూడా సీఎం వెంట ఉన్నారు. -
ముచ్చింతల్లో సీఎం కేసీఆర్.. సమతామూర్తి స్పూర్తి విగ్రహ పరిశీలన
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్కు చేరుకున్నారు. ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సమతా మూర్తి కేంద్రాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కేసీఆర్. చిన్నజీయర్ స్వామితో కలిసి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహం చుట్టూ కేసీఆర్ తిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ముచ్చింతల్ గ్రామంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు కొనసాగనున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరిగింది. ఈ హోమాన్ని ఏక కాలంలో ఐదు వేల మంది రుత్వికులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ముచ్చింతల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw — Telangana CMO (@TelanganaCMO) February 3, 2022 -
Hyderabad: ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి.. శవమై తేలి..
సాక్షి, నందిగామ (హైదరాబాద్): ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన ఓ యువకుడు గ్రామ సమీపంలో ఓ నీటి గుంతలో శవమై తేలిన సంఘటన మండల పరిధిలోని నర్సప్పగూడలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ రామయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగిలి ఉదయ్(21) హైదరాబాద్లోని మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ (తృతీయ సంవత్సరం) చదువుతున్నాడు. సంక్రాంతి పండగకు ఇటీవలే ఊరికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ద్విచక్ర వాహనం తీసుకొని వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. తెలిసిన వారి వద్ద, బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామ శివారులోని చేగూరు రోడ్డులోని టెక్స్టైల్ పార్క్లో గతంలో తీసిన పెద్ద నీటి గుంత వద్ద ఉదయ్ తీసుకెళ్లిన బైక్ను స్థానికులు గుర్తించారు. సోమవారం సాయంత్రం గజఈత గాళ్లతో గాలించారు. అప్పటికే చీకటి పడడంతో ప్రయత్నం విరమించారు. మంగళవారం ఉదయం యువకుడు శవమై తేలాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి పెద్దనాన్న యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: క్రెడిట్ కార్డు చార్జీలు తెలుసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేస్తుండగా.. -
బ్రిటన్ నుంచి వచ్చి తలకొండపల్లెలో విద్యాసాయం
-
పోలీసులకే షాక్ ఇచ్చిన దొంగ.. పోలీస్ స్టేషన్ ఎదుటే..
సాక్షి, మొయినాబాద్: ఓ దొంగ పోలీసులకే షాక్ ఇచ్చాడు. ఎక్కడో చాటుమాటున దొంగతనం చేస్తే కిక్ ఏముంటుందనుకున్నాడో ఏమో... ఏకంగా ఠాణా ఎదుట నిలిపి ఉంచిన స్కూటిని అపహరించి పోలీసులకు సవాల్ విసిరాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన మంగలి నర్సింలు ఓ కేసు విషయంలో మూడు రోజుల క్రితం మొయినాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీస్స్టేషన్ ఎదుట తన టీవీఎస్ స్కూటీని పార్కుచేసి లోపలికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చి చూడగా స్కూటీ కనిపించలేదు. కొద్దిదూరంలో మరో స్కూటీ పార్కుచేసి ఉంది. మళ్లీ.. మళ్లీ రావొద్దు తన స్కూటీ పోయిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి దానిని పోలీస్స్టేషన్ ఎదుట పార్కుచేసి నర్సింలు స్కూటీని తోసుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమరాల్లో రికార్డు అయింది. రెండు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను బాధితుడి చేతిలో పెట్టారు. తన స్కూటీ కోసం నర్సింలు రోజూ పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతుండడంతో మళ్లీమళ్లీ రావద్దని.. స్కూటీ దొరికినప్పుడు పిలుస్తామని పోలీసులు చెప్పి పంపడం గమనార్హం. పోలీస్స్టేషన్ ఎదుట వదిలేసి వెళ్లిన స్కూటీ ఎవరిదనే విషయమై ఆరా తీస్తే అది ఆంధ్రప్రదేశ్కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. పోలీస్స్టేషన్ ముందు నుంచి స్కూటీ చోరీకి గురవగా.. తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచి దొంగిలించారని ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయడం గమనార్హం. చదవండి: న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్ -
మద్యంమత్తులో స్కూటీని ఢీ కొట్టిన కారు
-
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న కారును లారీ ఢీ కొట్టడంతో..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్ఆర్ నుంచి కోహెడ వెళ్లే దారిలో ముందు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆగి ఉన్న కారును వెనక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే మంచు ఎక్కువ ఉండటం కారణంగా వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: చత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ చదవండి: కేపీహెచ్బీ కాలనీ: హాస్టల్లో యువతి ఆత్మహత్య -
డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి..
సాక్షి,పహాడీషరీఫ్(రంగారెడ్డి): ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ గృహిణి కనిపించకుండా పోయిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన సయ్యద్ యాసిన్ తొమ్మిదేళ్ల క్రితం సాల్హె బాన్ (27)ను వివాహం చేసుకోగా ప్రస్తుతం నలుగురు పిల్లలు సంతానం. కాగా ఇటీవల చిన్న విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఈ నెల 22న ఉదయం 7 డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా భార్య కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం సాధ్యమైన అన్ని ప్రాంతాలలో వెతికినా జాడ కనిపించలేదు. ఈ విషయమై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో కానీ, 94906 17241 నంబర్లో కానీ సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. చదవండి: నువ్వు లేకపోతే బతకలేనని, నమ్మించి శారీరకంగా లోబర్చుకుని.. -
మహిళను బైక్పై ఎక్కించుకొని.. మద్యం తాగించి.. స్పృహ కోల్పోడంతో
సాక్షి, రంగారెడ్డి: నమ్మించి, మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడలో ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. చివరకు సీసీ కెమెరాల ఆధారంగా దొరికిపోయిన నిందితుడు.. ఇంటి అప్పు తీర్చేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి, షాబాద్ సీఐ అశోక్ గురువారం తెలిపారు. షాబాద్ మండలం పోతుగల్కు చెందిన కామారెడ్డి జయమ్మ (40) ఈనెల 20న శంకర్పల్లి మండలం బుల్కాపూర్లో బంధువుల గృహప్రవేశానికి వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కేశపల్లి మల్లారెడ్డి.. తానూ బుల్కాపూర్ వెళ్తున్నానని చెప్పి ఆమెను బైకుపై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెకు మద్యం తాగించాడు. దీంతో జయమ్మ స్పృహ తప్పి పడిపోవడంతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్పృహలోకి వచ్చిన జయమ్మ ప్రతిఘటించింది. దీంతో చీరకొంగు మెడకు బిగించి హతమార్చాడు. తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు నగలతో పాటు కాళ్ల కడియాలు, పట్టాగొలుసులు తీసుకుని పరారయ్యాడు. కాగా, జయమ్మ భర్త జంగయ్య.. భార్య కనిపించట్లేదని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో.. పోలీసులు సీసీ పుటేజీలు పరిశీలించగా, కేశపల్లి మల్లారెడ్డి ఆమెను బైకుపై తీసుకువెళ్తున్నట్టు కనిపించింది. దీంతో మల్లారెడ్డిని గురువారం అదుపులోకి తీసుకుని విచారించగా, ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఈ ఘటనకు పాల్పడినట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిట్లు ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ అశోక్ మీడియాకు వెల్లడించారు. చదవండి: దారుణం: ఇద్దరి పిల్లలకు విషమిచ్చి.. ఆపై ఉరేసుకున్న తండ్రి -
హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం
సాక్షి, రంగారెడ్డి: ఐదు రోజుల క్రితం మంచాల కేజీబీవీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైందని మంచాల ఎస్సై రామన్గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న సమ్రీన్(14), 8వ తరగతి చదువుతున్న నుస్రాత్(13) పారిపోయారు. ఇందులో నుస్రాత్ను మంగళవారం శంషాబాద్లోని వారి బంధువుల ఇంట్లో గుర్తించినట్లు వెల్లడించారు. సమ్రీన్ ఆచూకీ లభించలేదని నల్గొండలోని వారి బంధువులకు ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం లభించిందన్నారు. చదవండి: ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్రూంలోకి వెళ్లి.. -
కడుపునొప్పి పేరుతో భర్తను బయటకు పంపి.. క్షణాల్లో పెళ్లికూతురు మాయం
సాక్షి, హైదరాబాద్: ‘బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని అత్తగారింటికి వచ్చిన నవ వధువు భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారైంది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి తనకు పెళ్లి సంబంధం చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు. అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు. ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహా కుటుంబ సభ్యులు విజయ వాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంటలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9 గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చి రాగానే.. ‘పాత ఇంటిని చూసి బంగ్లా అంటివి.. ఇదేమి ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపు నొప్పి వస్తుంది మాత్రలు తేవాలని చెప్పి ఇంటి నుంచి అతడ్ని బయటికి పంపించింది. చదవండి: మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి.. వివస్త్రగా ఉండడం చూసి వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయా నని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయమై సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పిన మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు. చదవండి: ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. కళ్లలో కారం చల్లి.. -
ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్రూంలోకి వెళ్లి..
సాక్షి,పహాడీషరీఫ్( రంగారెడ్డి): తరచూ ఫోన్ మాట్లాడుతుందని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ డిగ్రీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ బి.భాస్కర్ వివరాల ప్రకారం.. మల్లాపూర్ బాలాజీనగర్ ప్రాంతానికి చెందిన పోలోజు ఆంజనేయచారి కుమార్తె దివ్యశ్రీ (21) డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తరచూ ఫోన్ మాట్లాడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు వెళ్లి వాష్రూంలోనే ఉరేసుకుంది. ఆంజనేయచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో.. శంకర్పల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శంకర్పల్లి పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. శంకర్పల్లి సీఐ మహేశ్గౌడ్ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రానికి చెందిన ఆంజనేయులు (28), స్వరూప దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానం. తరుచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నాడు. అర్ధరాత్రి భార్య చూసే సరికి భర్త మరొక గదిలో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి.. -
కాలుష్యంతో కిరికిరి.. నిత్యం ఉక్కిరిబిక్కిరి
పచ్చని పంట పొలాల్లో కాలుష్యం చిచ్చు పెట్టే పరిశ్రమలు ఓ వైపు.. అర్ధరాత్రి అయితే చాలు భగభగ మండే లెడ్డు బట్టీల కాలుష్యం మరో వైపు .. వెరసి మండల ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న లెడ్డు బట్టీలు.. నిబంధనలను తుంగల్లో తొక్కి యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. – నందిగామ మండల కేంద్రమైన నందిగామతో పాటు జంగోనిగూడ, నర్సప్పగూడ, చేగూరు, వీర్లపల్లి, మోత్కులగూడ, అప్పారెడ్డిగూడ, మేకగూడ, రంగాపూర్ తదితర గ్రామాలలో సుమారు 100 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇందులో స్పాంజ్ ఐరన్, ఐరన్, టెక్స్టైల్స్, ఫార్మ, ప్లైఉడ్, అల్యూమినీయం, నూనె డబ్బల తయారీ, ప్యాకింగ్ కవర్స్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. విచ్చలవిడిగా లెడ్డు బట్టీలు.. ►జంగోనిగూడ అక్రమ లెడ్డు బట్టీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ►జంగోనిగూడ నుంచి తీగాపూర్ కు వెళ్లే రహదారిలో అక్రమంగా మూడు లెడ్డు బట్టీలను ఏర్పాటు చేశారు. అవి రాత్రయితే చాలు బట్టీలు వెలుగుతూనే ఉంటాయి. ►అయ్యప్ప స్వామీ దేవాలయం సమీపంలోని పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో అక్రమ లెడ్డు బట్టీలు నడిపిస్తున్నారు. చదవండి: Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..? లెడ్డు బట్టీలతో ఘాటైన వాసనలు.. లెడ్డు బట్టీలలో పాడైపోయిన బ్యాటరీలను పగులగొట్టి అందులోని మెటీరియల్ సేకరిస్తారు. వీటిని బోగ్గుతో కాల్చి కరగబెట్టి లెడ్డును వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో బ్యాటరీలను బొగ్గుతో కాలుస్తున్న క్రమంలో విపరీతమైన నల్లటి పొగ, దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పొగ సమీపంలోని గ్రామాలు, వ్యవసాయ పంటపొలాలలో పడి ఆ ప్రాంతమంతా కాలుష్యంతో మునిగిపోతోంది. చేగూరులో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ రాత్రి వేళల్లోనే.. అక్రమ లెడ్డు బట్టీలు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు నిర్వహిస్తుంటారు. జంగోనిగూడ శివారులోని ఓ లెడ్డు బట్టిలో గతంలో జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అంతేకాకుండా రాత్రి వేళ్లలో మాత్రమే కొనసాగుతున్న లెడ్డు బట్టిలలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు వీర్లపల్లి, నందిగామ, నర్సప్పగూడ తదితర గ్రామాల శివార్లలో ఉన్న ఐరన్ పరిశ్రమల వల్ల వీపరీతమైన పొగ, దుమ్ము ధూళీ రావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేగూరుకు రాత్రి వేళల్లో వెళ్లాలంటే విపరీతమైన పొగతో రోడ్డు సైతం కనపడని దుíస్థితి నెలకొంటోంది. చదవండి: చెరువులో ఈతకొడుతూ.. టీఆర్ఎస్ నాయకుడి కన్నుమూత మృతి చెందుతున్న మూగజీవాలు స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం కారణంగా పచ్చని గ్రాసంపై నల్లటి బూడిద కణాలు పడి వాటిని తిన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు నర్సప్పగూడ, వీర్లపల్లి గ్రామాల మధ్య వెలసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో ఆయా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంట పొలాలతో పాటు గ్రామంలోని ఇళ్లపై నల్లటి బూడిద పడుతోంది. ఈ విషయమై సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – గోవిందు అశోక్ కుమార్, సర్పంచ్, నర్సప్పగూడ చర్యలు చేపడతాం స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు వీపరితమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఇటీవల ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను. రెండు మూడు రోజులలో ల్యాబ్ టెక్నిషియన్స్ను తీసుకొని పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. – దయానంద్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి -
అబ్దుల్లాపూర్మెట్లో లారీ బీభత్సం.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అబ్దుల్లాపూర్మెట్ కూడలి వద్దకు రాగానే అదుపుతప్పి పాదాచారులపై దూసుకెళ్లింది. ఓ బుల్లెట్ బైక్ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లెట్పై ఉన్న విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సిరిసిల్లా జిల్లా ప్రగతి నగర్కు చెందిన ప్రణయ్ గౌడ్(20)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకులు ఫెయిల్ కావడంతోనే లారీ అదుపు తప్పినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
నార్సింగిలో బైక్ను ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి
సాక్షి, రంగారెడ్డి: హైదరాబాద్లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. 12 గంటల వ్యవధిలోనే రెండు రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున బంజారాహిల్స్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన మరవక ముందే రంగారెడ్డి జిల్లాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూవీ టవర్స్ వద్ద సోమవారం మధ్యాహ్నం కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న దంపతులు ఘటనాస్థలంలోనే మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకాపేట నుంచి భార్యభర్తలు తమ యాక్టివా స్కూటీపై పని నిమిత్తం గచ్చిబౌలి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి అతి వేగంగా వస్తున్న కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన దంపతులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులను దంపతులు దుర్గం రాజు, మౌనికగా పోలీసులు గుర్తించారు. మౌనిక నార్సింగి మున్సిపాలిటీలో పనిచేస్తోంది. అలాగే నిందితుడిని సంజీవ్గా గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో కారు నడపడంతో ఈ ప్రమాదం జరిందని తెలిపారు. నిందితుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 108 చూపించింది. దీంతో సంజీవ్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, -
భార్య మరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని ఉరేసి చంపి.. ఏమీ ఎరగనట్లు!
సాక్షి, రంగారెడ్డి: కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. అనుమానంతో భార్యను ఉరేసి చంపాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఈ సంఘటన మహేశ్వరం మండల పరి ధిలోని మాణిక్యమ్మగూడలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కందుకూరు మండలం చిప్పలపల్లికి చెందిన అల్వాల నర్సింహకు మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన లక్ష్మమ్మ అలియాస్ మంగమ్మ (30)తో 2005లో వివాహమైంది. పెళ్లయిన కొన్ని రోజులకే నర్సింహ అత్తగారి ఊరికి మకాం మార్చాడు. దంపతులిద్దరూ అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నర్సింహ మేస్త్రి, డ్రిల్లింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం భార్య ఫోన్కు గుర్తు తెలియని కాల్ రావడాన్ని గమనించిన నర్సింహ.. అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరు ఫోన్ చేస్తున్నారని నిత్యం వేధించేవాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఇదే విషయమై భార్యతో గొడవ పెట్టుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరోసారి గొడవకు దిగాడు. కోపోద్రిక్తుడై క్షణికావేశంలో విద్యుత్ వైర్తో లక్ష్మమ్మ మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. చదవండి: హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం అనంతరం ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని నమ్మబలికాడు. ఏమీ ఎరగనట్లు చుట్టుపక్కల వారికి తన భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. మృతురాలి తల్లికి అనుమానం వచ్చి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. తమదైనశైలిలో విచారించారు. దీంతో తానే హత్య చేసినట్లు నర్సింహ నేరం అంగీకరించాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ తెలిపారు. చదవండి: అల్వాల్లో రియల్టర్ విజయ్ భాస్కర్రెడ్డి దారుణ హత్య -
దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు
సాక్షి, షాద్నగర్: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ విషాదాంతానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యా యి. నలుగురు మృగాళ్ల వికృత చేష్టలకు ఆమె అసువులుబాసినా మహిళా రక్షణ చట్టాలకు ‘దిశా’నిర్దేశం చేసింది. ఆమె మరణించిన కూతవేటు దూరంలోనే ఆ నలుగురికీ పడిన శిక్ష చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై.. షాద్నగర్ శివారులో ముగిసి.. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించిన ఈ ఘటనను ఓసారి నెమరువేసుకుంటే.. చదవండి: ‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో దిశ అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్లి నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసింది. కాపుకాసిన ఆ నలుగురు ఆమెను బలవంతంగా ఓ పాడుబడిన ప్రహరీ పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి అంతమొందించారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని లారీలో తెచ్చి షాద్నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం దిశను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్థలికి తీసుకొచ్చారు. పోలీసులపై దాడి చేసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయింది. దిశ హత్య ఘటన ఎంతగా కదిలించిందంటే ఎన్కౌంటర్ను ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ హత్యోదంతం చట్టాలకు దిశానిర్దేశం చేసింది. కొత్త చట్టాలకు రూపకల్పన దుర్మార్గుల చేతిలో కిరాతకంగా బలైన దిశ పేరిట ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లు, పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి సంఘటనలపై వేగంగా తీర్పు ఇచ్చి నిందితులకు శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఎక్కడున్నది వాహనాల ద్వార ఎక్కడికి వెళ్తున్నది ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని రక్షించేలా ప్రత్యేక యాప్లను క్రియేట్ చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలను కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇదీ పరిస్థితి దిశ ఘటన తర్వాత కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్థి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత కూడా ఆగడాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని సాక్షిగా జరిగిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సాగుతున్న విచారణ దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. -
కారణం ఏదైనా వారే టార్గెట్: కిడ్నాప్లు.. హత్యలు.. లైంగిక దాడులు
సాక్షి, పహాడీషరీఫ్: పాత కక్షలు.. ఆస్తి తగాదాలు.. ఇంట్లో గొడవలు.. ఇలా కారణమేదైనా చిన్నారులు బలవుతున్నారు. తరచూ ఏదో ఒక చోట కిడ్నాప్లు.. హత్యలు.. వారిపై జరుగుతున్న లైంగిక దాడులే ఇందుకు నిదర్శనం. దగ్గరి బంధువులు, పక్కిళ్ల వారే ఘాతుకాలకు పాల్పడుతుండడంతో ఎవరిని నమ్మాలో.. నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి. మత్తులో మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. నగర శివారులో వెలుగుచూస్తున్న ఘటనలు తల్లిదండ్రులను కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా బాబాయి ముసుగులో పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం.. ముఖ్యంగా పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ల వయసు నుంచే చిన్నారులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తూ.. ఇంటర్నెట్ మాయా ప్రపంచానికి వారిని బానిసలుగా మారుస్తున్నారు. ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులను గంటల తరబడి పట్టించుకోని సందర్భాలు నెలకొంటున్నాయి. పిల్లలను ఓ కంట కనిపెట్టాలని నిపుణులు, పోలీసులు సూచిస్తున్నారు. మత్తుకు చిత్తవుతున్న యువత మాదకధ్రవ్యాలకు అలవాటు పడి యువత పెడదోవ పడుతోంది. 15 ఏళ్ల వయసులోనే మద్యం తాగడం.. చెడు స్నేహాలు.. గంజాయి, వైట్నర్ లాంటి మత్తుపదార్థాలకు బానిలవుతున్నారు. బర్త్డేలు, ఫంక్షన్ల పేరుతో హంగామా చేస్తున్నారు. ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మచ్చుకు కొన్ని ఘటనలు ► 2021 నవంబర్ 20న పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీరాం కాలనీలో లక్కీ అనే నాలుగేళ్ల బాలుడిని బాబాయి వీరేశ్ దారుణంగా హత్య చేశాడు. ►2019 మే 8న రాత్రి పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి జల్పల్లిలోని వాదే ముస్తఫా బస్తీలో కూల్డ్రింక్ కోసం వెళ్లిన యాసిన్ అనే ఏడేళ్ల బాలు డిపై స్థానికంగా ఉండే యువకుడు లైంగిక దాడికి పాల్పడి దారుణంగా హతమార్చాడు. ►2014 సెప్టెంబర్ 22న ప్రభాకర్, ఉమారాణిల కుమారుడు కరుణాకర్(10)ను మల్లికార్జున్, మోహన్ కిడ్నాప్ చేసి బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో అదేరోజు దారుణంగా హత్య చేశారు. అనంతరం రూ.2 లక్షలు కావాలంటూ పది రోజుల పాటు తల్లిదండ్రులను ముప్పు తిప్పలు పెట్టారు. ►2014 ఏప్రిల్ 5న ఇంటి ముందు ఆడుకుంటున్న రాజు, సుజాత దంపతుల కుమారుడు డి.కార్తీక్ (10)ను బంధువైన శివకుమర్ (22) కిడ్నాప్ చేసి రూ.2 లక్షలు డిమాండ్ చేశాడు. తల్లిదండ్రుల నుంచి సమాధానం వచ్చేలోపే బాలుడిని షాద్నగర్లో దారుణంగా బండరాయితో మోది హత్య చేశాడు. ►2017 జూన్ 28న ఆటోడ్రైవర్ మహ్మద్ జమీల్ ఖాన్ కుమారుడు మహ్మద్ ఖాన్(10)కు ఇంటి పక్కన ఉండే 17 ఏళ్ల యువకుడు చాక్లెట్ ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. ►2017 మార్చి 28న నమాజ్కని వెళ్లిన బండ్లగూడకు చెందిన మహ్మద్ యవరుద్దీన్ కుమారుడు రఫి(7)ని పొరుగింట్లో ఉండే మునీర్ సోని (20) టీవీలో ప్రసారమయ్యే క్రైం పెట్రోల్ సీరియల్ను అనుసరించి దారుణంగా హత్య చేశాడు. మా నాన్న ప్లాటు అమ్మాడని.. కోటి రూపాయలు వచ్చాయని చెప్పిన పాపానికి డబ్బుల కోసం ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. ►2010 డిసెంబర్లో చిట్టీ డబ్బులు ఇవ్వడం లేదని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి సదరు ఏజెంట్ కుమారుడిని కిడ్నాప్ చేసి బీచ్పల్లి కృష్ణానది వద్ద దారుణంగా హత్య చేశాడు. -
Ranga Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..మళ్లీ ఆ ఇద్దరే
సాక్షి, రంగారెడ్డి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను అధికార టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఇప్పటికే మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు మరోసారి అవకాశం కల్పించింది. మహబూబ్నగర్ నుంచి ఇదే జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డికే మళ్లీ చాన్స్ ఇచ్చింది. వీరంతా సోమవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థుల పేర్లను ప్రకటించ లేదు. ఆయా పార్టీలకు ఓట్లు తక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా తెలిసింది. ఆయా పార్టీలు స్థానిక సంస్థల ఫోరం ప్రకటించిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశం ఉంది. ఇదీ లెక్క.. ► ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 1,179 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 627 మంది మహిళలు, 552 మంది పురుషులు ఉన్నారు. ► 310 మంది కార్పొరేటర్లు, 432 మంది కౌన్సిలర్లు, 384 మంది ఎంపీపీలు, 33 మంది జెడ్పీటీసీలు, 20 మంది ఎక్స్అఫీషియోలు ఉన్నారు. ► ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి, వాటికి 21, 22 తేదీల్లో స్క్రూట్నీ నిర్వహించి 23న తుది జాబితా ప్రకటించనున్నారు. ► ఈ నెల 16 ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదే రోజు నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరించి, 24న పరిశీలించి, 26న ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ► ఎన్నికల కోసం రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, కీసర, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, కందుకూరు, చేవెళ్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► డిసెంబర్ 10న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. -
అవి చిత్తు కాగితాలు కాదండి.. విద్యార్థుల సర్టిఫికెట్లు
సాక్షి, రంగారెడ్డి: ఈ చిత్రాన్ని చూసి ఏవో చిత్తుకాగితాలు ఏరుకుంటున్నారు అనుకుంటున్నారా.. కాదండి అవి విద్యార్థుల భవిష్యత్ను నిర్ణయించే సర్టిఫికెట్లు. ఓ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి ఇది అద్దం పడుతోంది. కొందుర్గు మండల కేంద్రంలోని అద్దె భవనంలో కొనసాగిన ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల రెండేళ్లుగా మూతబడింది. విద్యార్థుల సర్టిఫికెట్లు అందులోనే ఉండిపోయాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో ఇంటి యజమాని ఆదివారం కూల్చివేసేందుకు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ బీరువాలో ఉన్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఒక్కసారిగా కుప్పలుగా బయటపడ్డాయి. విషయం ఆ నోటా.. ఈ నోటా.. వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది అంతే అందుబాటులో ఉన్న విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తీసుకునేందుకు కళాశాల భవనానికి పరుగులు పెట్టారు. చెత్త కుప్పల్లా పడి ఉన్న కాగితాల్లో ఇలా తమ సర్టిఫికెట్లను వెతుక్కున్నారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్పై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడంపై మండిపడుతున్నారు. సర్టిఫికెట్ల భద్రత పట్టదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒరిజినల్స్ అన్నీ భద్రంగా ఉన్నాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. -
‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా’.. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా..’అంటూ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ను బెదిరించిన ఘటనలో షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. ఆదివారం మధ్యాహ్నం వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు షాద్నగర్ మీదుగా జడ్చర్ల వైపు వెళుతోంది. వెనుక నుంచి ఎక్స్యూవీ వాహనంలో వచ్చిన వ్యక్తులు షాద్నగర్ పరిధిలోని బూర్గులగేటు సమీపంలో జాతీయ రహదారిపై తమ వాహనాన్ని అడ్డంగా నిలిపారు. చదవండి: ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. ఎమ్మెల్యే వాహనానికే సైడ్ ఇవ్వవా.. అంటూ బస్సు డ్రైవర్ రఘువర్ధన్రెడ్డితో దుర్భాషలాడారు. కర్రతో ఆయనపై దాడికి యత్నించారు. తాము ఎమ్మెల్యే అ నుచరులమంటూ హల్చల్ చేశారు.ఈ దృశ్యాల ను కొందరు ప్రయాణికులు సెల్ఫోన్లో చిత్రీకరించడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. స్పందించిన ఎండీ వీసీ సజ్జనార్ బస్సు డ్రైవర్పై దాడికి యత్నించిన ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. డ్రైవర్పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బెదిరింపులకు పాల్పడిన వారిపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయాలని ఆయన సూచనతో షాద్నగర్ డీఎం శివశంకర్, డ్రైవర్ రఘువర్ధన్రెడ్డి ఆదివారం రాత్రి షాద్నగర్ పోలీసులకు ఎక్స్యూవీ వాహనం నంబర్ (టీఎస్ 09 ఎఫ్ఏ 0809 ) ఆధారంగా ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఐపీసీ 341, 353, 506, 290, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుందరయ్య తెలిపారు. బెదిరింపులకు పాల్పడిన వారు హైదరాబాద్ ముషీరాబాద్ పరిధిలోని రాంనగర్ చెందిన వినోద్గా గుర్తించారు.ఈమేరకు అతడితోపాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దాడికి యత్నించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు విషయాన్ని ఎండీ సజ్జనార్ సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చట్టం తన పని తాను చేస్తుంది. చట్టాన్ని పౌరులెవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. చట్టంముందు అందరూ సమానులేననన్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. పత్తి చేనులోకి తీసుకెళ్లి
సాక్షి, రంగారెడ్డి: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన భర్తను చంపేసింది. ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన శేఖర్, మాధవి వివాహేతర సంబంధం నెరుపుతున్నారు. ఈవిషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఆన్లైన్లో ఫోన్ బుక్ చేసి.. నగదు పోగొట్టుకున్న యువతి తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగానే అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్ పథకం పన్నారు. ఈక్రమంలో గురువారం రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి పంటలో వెంకటయ్యను చంపేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. చదవండి: పట్టపగలే సినీ ఫక్కీలో ఘరానా మోసం -
ఓటు హక్కు లేదా..? ఇలా నమోదు చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నెల 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్ ఓటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ ఓటర్ల జాబితా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా గతంలో ఓటు హక్కు పొందలేకపోయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు ఈ నెల 6, 7, 27, 28 వ తేదీలలో డిసెంబర్లో రెండు రోజుల పాటు అధికారులు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రంగారెడ్డి మాడ్గుల మండలంలోని 33 గ్రామపంచాయతీలలో 35,245 మంది ప్రస్తుత ఓటర్లు ఉండగా, అందులో 18,738 మంది పురుష ఓటర్లు, 16,500 మహిళ ఓటర్లు, 7 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మండలంలో గ్రామాల్లో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్ పరిధిలో బీఎల్ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు నేరుగా వెళ్లి నమోదు.. ఓటరు నమోదు, మార్పుల, చేర్పులు, అభ్యంతరాలపై పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు. పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసుకోవచ్చు. జాబితాలో అభ్యంతరాలుంటే తెలపవచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో నమోదై ఉన్నట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. తాను కోరుకున్న చోటుకు తమ పేరు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు ఇలా.. డిసెంబర్ 15వ తేదీ లోపు ఓటరుగా ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోదల్చినవారు ముందుగా ఠీఠీఠీ.ఛ్ఛి్టౌ్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్ చేసి ఆప్లోడ్ చేయాలి. వీటిని సంబం«ధిత అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15 న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి పేరు నమోదు చేసుకునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్ సర్టిఫికెట్ లేదా ఆధార్కార్డు ఉండాలి. దరఖాస్తు ఫారాలను పూరించి ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. యువత సద్వినియోగం చేసుకోవాలి మండలంలోని 50 పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఓలను నియమించాం. వారు ప్రతి పోలింగ్బూత్లో అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నమోదు, సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్పులు, చేర్పులు ఉంటే ఆన్లైన్ ద్వారా దరఖాçస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యత గుర్తించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకోసం తమతమ పేర్లు నమోదు చేసుకోవాలి. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
తీసుకుంది 64వేలు.. మూడేళ్లకు రూ.1.11 లక్షలు..లబోదిబోమన్న రైతు
సాక్షి, రంగారెడ్డి: ఓ రైతు బ్యాంకులో తీసుకున్న రుణానికి మూడేళ్లలో అసలు, వడ్డీ కలిపి రెట్టింపు అయ్యాయి. ఈ ఘటన నాగసమందర్ ఎస్బీఐలో శుక్రవారం వెలుగు చేసింది. మండల పరిధిలోని కొండాపూర్కలాన్ గ్రామానికి చెందిన రైతు బి. కాళికారెడ్డి నాగసమందర్ ఎస్బీఐలో పాత అప్పు 68,932 ఉండగా జూలై 21 2017లో మరో రూ. 58 వేల అప్పు తీసుకున్నట్లుగా క్రియేట్ చేసి అప్పును రూ. 1,11,234కు పెంచారు. రైతు సెల్కు ఈ సమాచారం రావడంతో వెంటనే బ్యాంకుకు వచ్చి మేనేజర్కు ఫిర్యాదు చేశారు. చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట విషాదం అక్టోబర్ 3 2018లో రూ. 58 వేలకు బదులుగా రూ. 42,300 అకౌంట్లోంచి తీసివేసి వడ్డీతో పాటు మిగిలిన రూ. 15,700 రైతు కాళికారెడ్డికి అంటగట్టారు. ఇదే విషయాన్ని రైతు కాళికారెడ్డి శుక్రవారం బ్యాంకు మేనేజర్ తిలక్ దృష్టికి తీసుకెళ్లాడు. అప్పటి మేనేజర్ చేసిన పొరపాటు అయ్యి ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్న అప్పును తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో లబోదిబోమంటూ ఆందోళనకు దిగాడు. జరిగిన అన్యాయం విషయమై లెటర్ రాసి ఇవ్వు విచారణ జరుపుతామంటూ చెప్పి పంపించారు. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి విచారణ చేపడతాం తప్పుఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని మేనేజర్ తిలక్ తెలిపారు. రైతు బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తామన్నారు. అతని అకౌంట్లో ఉన్న మొత్తం రుణాన్ని చెల్లింంచాల్సిందేనని పేర్కొన్నారు. పొరపాటుగా వేసిన డబ్బుల్ని పాత మేనేజర్ చెల్లించాల్సి ఉంటుందన్న ప్రశ్నకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. -
తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి
సాక్షి, మోమిన్పేట: బండ రాయితో మోది యువకుడిపై దాడి చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కేసును మోమిన్పేట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సీఐ వెంకటేశం కేసు వివరాలు వెల్లడించారు. నవాబ్పేట మండలం ఎల్లకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు శివశంకర్(30)కు వెల్దుర్తి గ్రామానికి చెందిన శివలీలతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కూమార్తె ఉన్నారు. శివశంకర్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. దీంతో విసుగు చెందిన శివలీల ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది. తన తల్లిగారింటి పక్కనే ఉన్న జహంగీర్తో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. చదవండి: కూకట్పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. ఇదిలా ఉండగా ఏడు నెలల క్రితం శివలీల భర్త శివశంకర్ వద్దకు వచ్చింది. అప్పుడప్పుడు జాహంగీర్ శివలీల వద్దకు వచ్చిళ్తుండేవాడు. ఇది గమనించిన శివశంకర్ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇది తట్టుకోలేక శిశలీల ప్రియుడు జాహంగీర్తో భర్తను హత్య చేసేందుకు పథకం పన్నారు. పథకం ప్రకారం ఈ నెల 26న జహింగీర్.. శివశంకర్ను తన స్కూటీపై తీసుకువెళ్లి మద్యం తాగించాడు. అనంతరం నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లి తలపై రాళ్లతో బాదాడు. ఈ విషయమై శివలీలకు చెప్పి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. కొన ఊపిరితో ఉన్న శివశంకర్ను మరుసటి ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆదే రోజు చికిత్స పొందుతూ శివశంకర్ మృతి చెందాడు. మృతుడి అక్క సునంద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో భార్య శివలీల ఫోన్ తీసుకొని విచారణ చేపట్టగా హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఆమె వెల్లడించింది. ఈ మేరకు శివలీల, జహంగీరును ఆదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు. -
విద్యార్థిపై టీచర్ కర్కశం.. ఉమ్ము కింద పడిందని...
సాక్షి,శంకర్పల్లి: తరగతిగదిలోకి వచ్చేందుకు అనుమతి అడుగుతుంటే నోట్లో నుంచి ఉమ్ము కింద పడిందని ఆగ్రహించిన ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిపై కర్కశం ప్రద ర్శించారు. విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయిలు, లత దంపతుల కుమారుడు సంజీవ్కుమార్ (8) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. చదవండి: అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. తరగతి గదిలోకి వచ్చేందుకు ఉపాధ్యాయురాలు శ్వేతను అనుమతి అడుగుతున్న క్రమంలో అతని నోట్లో నుంచి ఉమ్ము కింద పడింది. దీంతో ఆగ్రహించిన ఆమె కర్రతో చితకబాదారు. చేతులు, కాళ్లు, ముఖంపై కొట్టడంతో చర్మం కమిలిపోయింది. సాయంత్రం ఇంటికి వచి్చన బాలుడి ఒంటిపై ఉన్న దెబ్బలు చూసి చలించిపోయిన తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై టీచర్ను నిలదీయగా.. మీ అబ్బాయికి క్రమశిక్షణ లేదు అందుకే కొట్టానని బదులిచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: ఇద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని.. సస్పెన్షన్ వేటు విద్యార్థి సంజీవ్కుమార్ను చితకబాదిన ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాధికారి సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి అక్బర్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతపై డీఈవో సుశీందర్రావు గురువారం వేటు వేశారు. -
‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే..
సాక్షి, మొయినాబాద్: ‘అమ్మా..నేను చనిపోతున్నా..’ ఓ వివాహిత తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది. అంతలోనే ఫోన్కట్ చేసి చెప్పినంత పనిచేసింది. పెళ్లయిన పదకొండు నెలలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటన మొయినాబాద్ మండల చిలుకూరులో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన శ్రావణి (26)తో చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్రెడ్డి వివాహం గత సంవత్సరం నవంబర్ 27న జరిగింది. పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబం వారు 40 తులాల బంగారం, రూ.40 లక్షలు నగదు, తూప్రాన్లో ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు. కొన్ని రోజులు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. శ్రావణి ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించిన చుట్టుపక్కల వారు, ఆమె అత్త కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చదవండి: ఉషా అందుకు నిరాకరిచండంతో.. చెరువు వద్దకు పిలిచి.. శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు తల్లికి ఫోన్ చేసి.. శ్రావణి బుధవారం తల్లి పద్మకు ఫోన్చేసి మాట్లాడింది. నేను చనిపోతాను అంటూ ఏడుస్తూ ఫోన్ కట్చేసింది. కొద్ది సేపటి తరువాత తల్లి మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదు. అంతలోనే ఉరివేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధించేవాడని.. దసరా పండుగకు ముందు శ్రావణిని కొట్టాడని బంధువులు ఆరోపించారు. అతడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. శవాన్ని తరలించవద్దంటూ ఆందోళన పరారీలో ఉన్న భర్త రాజశేఖర్రెడ్డిని పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించవద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. శ్రావణి తల్లి, బంధువులు రాకముందే శవాన్ని ఎందుకు కిందికి దింపారని నిలదీశారు. రాత్రి 8 గంటల వరకు కూడా శ్రావణి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. భర్తను పట్టుకొచ్చే వరకు శవాన్ని తరలించేదిలేదని పోలీసులను కూడా అడ్డుకున్నారు. -
‘వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ’
సాక్షి,మహేశ్వరం( హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. బీజేపీతో వైఎస్సార్టీపీ పొత్తు ఉంటుందని టీఆర్ఎస్ అనడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. షర్మి ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నాగారం, కొత్త తండా చౌరస్తా, డబిల్గూడ చౌరస్తా, మన్సాన్పల్లి చౌరస్తా, మన్సాన్పల్లి, కేసీ తండా చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేసులకు భయపడి ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్షాల వద్దకు వెళ్లి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా ఉన్నా.. తమకు భవిష్యత్తులో అవసరమొస్తారనే ఉద్దేశంతో ఏమీ అనడం లేదన్నారు. కేసీఆర్ ఫాం హౌస్లకు సాగునీరు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క నిత్యం ఏదో ఒకచోట నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే, తాను పాదయాత్ర నిలిపివేసి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ పాలనలో సువర్ణ పాలన కొనసాగిందని, వైఎస్సార్టీపీకి ఆవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు, కూలీలతో షర్మిల ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. భారీయెత్తున ప్రజలు హాజరైన సభలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవారెడ్డి, ఏపూరి సోమన్న, పిట్ట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పాదయాత్రలో ఉన్న షర్మిలను ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ విజయమ్మ వేర్వేరుగా కలుసుకుని మాట్లాడారు. చదవండి: పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల ∙ -
వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి..
శంషాబాద్ రూరల్: ‘కేసీఆర్ సర్కారు పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.. ఇందుకోసం మనమంతా చేయి చేయి కలపాలి’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. రెండు సార్లు కేసీఆర్కు ఓటేసి తెలంగాణ ప్రజలు మోసపోయారని, మరోసారి అలా కాకుండా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ‘ప్రజా ప్రస్థానం’మహా పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో శనివారం స్థానికులతో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పరిపాలన చేస్తున్నారా.. గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో నిద్రపోతున్న కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్ హయంలో రెండేళ్లకోసారి నోటిఫికేషన్ ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. జంబో డీఎస్సీ ద్వారా 58 వేల టీచరు ఉద్యోగాలను ఒకే సారి భర్తీ చేసిన ఘనత వైఎస్సార్కు దక్కుతుందన్నారు. రైతులకు ఒకేసారి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసిన వైఎస్సార్, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా పాలన సాగించారని పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు. కేజీ టు పీజీ చదువులెక్కడ.. ‘కేజీ టు పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. కాని తెలంగాణలో పిల్లల చదువుల కోసం తల్లులు తాళీబొట్టు అమ్ముకుంటూ ఫీజులు కడుతున్న పరిస్థితులు ఉన్నాయి’అని షర్మిల ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉందన్నారు. ఏ ఒక్క విషయంలో తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఆదుకున్నారో చెప్పాలన్నారు. ఇందుకోసమేనా కేసీఆర్ను సీఎం చేసింది అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణ మాఫీ, పావలావడ్డీ రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్.. ఇలా ప్రతి వర్గానికి మేలు చేసి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎలాంటి చార్జీలు పెంచకుండానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ‘మళ్లీ అదే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి నేను వచ్చాను’అని స్పష్టం చేశారు. తొండుపల్లి శివారు నుంచి శనివారం ప్రారంభమైన షర్మిల పాదయాత్ర గొల్లపల్లి, రషీద్గూడ, హమీదుల్లానగర్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ మీదుగా రాత్రికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చేరుకుంది. ఆయా గ్రామాల్లో వృద్ధులు, మహిళలు వారి సమస్యలను షర్మిలకు విన్నవించుకున్నారు. -
భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య
సాక్షి, మీర్పేట: పక్కింటి వారితో జరిగిన గొడవలో ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ తల్లి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మొగుళ్లవంపు గ్రామానికి చెందిన బిట్టు జంగమ్మ(52) భర్త కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో తన ఇద్దరు కుమారులు, కుమార్తెను తీసుకుని బతుకుదెరువు కోసం 7 ఏళ్ల క్రితం మీర్పేట లెనిన్నగర్ మురళీకృష్ణనగర్లో ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తుండగా, పెద్ద కుమారుడు మహేష్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, చిన్న కుమారుడు మధు మెకానిక్ పనిచేస్తున్నాడు. చదవండి: ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య జంగమ్మ ఇంటిని నిర్మిస్తున్నప్పటి నుంచి పక్కింటికి చెందిన సంగం సుజాతతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనెల 18న ఇంటి ఆవరణలోకి నీరు వచ్చాయనే కారణంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో జంగమ్మ కుమారులు మహేష్, మధు సుజాతపై దాడి చేశారు. తనను అవమానపరిచేలా దుస్తులను చించివేశారని ఆరోపిస్తూ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవలో జంగమ్మ చెవికి కూడా రక్తగాయాలు అయ్యాయి. ఎస్ఐ బద్యానాయక్ విచారణ జరిపి మహేష్, మధును అరెస్ట్ చేసి 20న తేదీ రిమాండ్కు తరలించారు. చదవండి: తమతో పాటు ఆశ్లీల చిత్రాలు చూడలేదని.. బాలికను కిరాతకంగా రాళ్లతో కొట్టి.. భర్త చనిపోవడం, ఇద్దరు కుమారులు జైలుకు వెళ్లడంతో జంగమ్మ తీవ్ర మనోవేదనకు గురైందని స్థానికులు చెప్పారు. కుమారులను రిమాండ్కు తరలిస్తుండగా బెయిలు ఇప్పించాలని లాయర్ను తీసుకుని ఠాణాకు వెళ్లి పోలీసులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో నిరాశకు గురైంది. ఈక్రమంలో గురువారం తెల్లవారుజామున మీర్పేట రైతుబజార్ సమీపంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గొడవకు సంబంధించి సంగం సుజాత బంధువులు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
రెండోరోజు ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. -
రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..
సాక్షి,నందిగామ(రంగారెడ్డి): కోవిడ్ టీకా తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మేకగూడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మేకగూడకు చెందిన చిగుర్లపల్లి మానస (32) మంగళవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన క్యాంప్లో వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకుంది. ఇంటికి వెళ్లిన ఆమె గంట తర్వాత స్పృహతప్పి పడిపోయింది. ( చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లాడు.. తెల్లారేసరికి! ) కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం షాద్నగర్లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మానస వ్యాక్సిన్ తీసుకోవడంతోనే మృతి చెందిందా.. లేక అనారోగ్యంతో మృతి చెందిందా అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విచారణ జరుపుతాం.. మానస గత నెల 18న మొదటి డోస్ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఈరోజు రెండో డోసు తీసుకుంది. డోస్ తీసుకున్న గంట తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందిందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మానసకు ఇచ్చిన వ్యాక్సిన్ వాయిల్లో తొమ్మిది మందికి టీకాలు ఇవ్వడం జరిగింది. మిగతా ఎనిమిది మంది ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలా చనిపోయిందో విచారణ జరుపుతాం. – డాక్టర్ దామోదర్, జిల్లా ఉప వైద్యాధికారి చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. -
హైదరాబాద్లో విషాదం: గాలిపటం ఎగురవేస్తూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడీ కాలనీలో చోటుచేసుకుంది. మంగళవారం నాడు అరవింద్(7) అనే చిన్నారి ఇంటి సమీపంలో గాలి పటం ఎగురవేస్తూ పక్కనే ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కలా వెతికారు. అయినప్పటికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్ ఎక్కడ? అయితే ఈ రోజు ఉదయం సెప్టిక్ ట్యాంక్లో పడి ఉన్న బాలుడిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజాసమస్యలు నేను చూపిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ అంతా ఎంతో సుభిక్షంగా ఉందని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదేపదే చెబుతున్నారు. నేను పాదయాత్రకు వెళ్తున్నా..దమ్ముంటే నాతో కలిసి పాదయాత్రకు రండి. చేసిన అభివృద్ధిని మీరు చూపించండి. ప్రజా సమస్యలను నేను చూపిస్తా. మీరు చెప్పినట్లు తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే..నా ముక్కు నేలకురాసి, ఇంటికెళ్లిపోతా. అదే సమస్యలున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్, మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేస్తారా?..’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బుధవారం చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల కు, హత్యలకు కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల. చిత్రంలో వైఎస్ విజయమ్మ తదితరులు నిధులు ఆయన ఇంటికి : ‘దివంగత నేత వైఎస్సార్ హయాం లో రూ.33 వేల కోట్ల అంచనాతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసం రీడిజైన్ చేసి, లక్షా 33 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు కేసీఆర్ ఇంటికెళ్లగా..నీళ్లు ఆయన ఫాంహౌస్కు, నియామకాలు ఆయన కుటుంబసభ్యులకు వెళ్లాయి. ప్రజా సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పాదయాత్రను ప్రారంభిస్తున్నా..’ అని షర్మిల చెప్పారు. కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న రేవంత్రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉంది. ఆయన రాహుల్ మాట వినక పోయినా..కేసీఆర్ మాట వినితీరాల్సిందే. కేసీఆర్ అవినీతి చిట్టా చేతిలో ఉందంటూ బీజేపీ అధినేత బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దు..’ అని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు తల్లి విజయమ్మ సహా షర్మిల సభావేదికపైకి చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం తొలుత విజయమ్మ, ఆ తర్వాత షర్మిల మాట్లాడారు. అనంతరం విజయమ్మ పాదయాత్రను ప్రారంభించి, షర్మిలను ఆశీర్వదించారు. కాగా ఎర్రోనికోటాల, కందవాడ, నారాయణదాసుగూడల మీదుగా చేవెళ్ల–మెయినాబాద్ శివారులోని నక్కలపల్లి బస కేంద్రానికి సాయంత్రం 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. తొలిరోజు మొత్తం పది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అప్పగిస్తున్నా.. ఆశీర్వదించండి: విజయమ్మ పాదయాత్ర ప్రారంభ సభలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ‘చేవెళ్లకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర సహా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు కూడా ఈ గడ్డ నుంచే ప్రారంభించారు. ఆయన అడుగులో అడుగు వేసేందుకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఆయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ షర్మిలను మీకు అప్పగిస్తున్నా. మీరంతా ఆమెకు అండగా నిలవండి. ఆశీర్వదించండి..’ అని పిలుపునిచ్చారు. -
తహశీల్దార్ కార్యాలయానికి అల్లు అర్జున్
సాక్షి, హైదరాబాద్: పుష్ప సినిమా షూటింగ్తో బిజీగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో సందడి చేశారు. శంకర్పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్ ఆర్డర్ను శంకర్పల్లి తహశీల్దార్ సైదులు బన్నీకి అందజేశారు. చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్ వైరల్ అయితే ఎమ్మార్వో కార్యాలయానికి అల్లు అర్జున్ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొన్నారు. చదవండి: ‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్, బాలీవుడ్ భామ షాకింగ్ రెమ్యూనరేషన్! ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఏం జరిగినా హుజురాబాద్లో గెలిచేది ఆయనే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
సాక్షి, రంగారెడ్డి: తాను ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై కన్ఫ్యూజన్లో ఉన్నట్లు కేటీఆర్ బినామీ మీడియాలో తనపై దుష్ట్రచారం చేస్తున్నారని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. తనకంటూ ఓ స్పష్టత ఉందన్నారు. సోమవారం బంజారాహిల్స్లో సీనియర్ నాయకులు సురేష్రెడ్డి, కొండా రాందేవ్రెడ్డి, రౌతు కనకయ్య, బీమేందర్రెడ్డి, కొండా కృష్ణారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అనేక సమీకరణాలు జరుగనున్నాయని, అధికారం కోసం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ ఏదో ఒక జాతీయ పారీ్టతో జతకట్టే అవకాశం ఉందని.. ఇది తేలిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పని చేసే పారీ్టలోనే చేరనున్నట్లు ప్రకటించారు. అది బీజేపీనా.. కాంగ్రెసా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ అందుకే ఆ పార్టీని వీడాను.. ఉద్యమ పార్టీగా చెప్పుకొంటున్న టీఆర్ఎస్లో ప్రస్తుతం తెలంగాణ వాదులెవరూ లేరని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకరిద్దరు ఉన్నా వారికి ఎలాంటి అధికారం లేదని అధికారమంతా తండ్రీ కొడుకులకే పరిమితమైందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ చేతుల్లో బందీగా మారిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగానే ఆ పార్టీని వీడాల్సి వచి్చందన్నారు. నా మద్దతు ఈటలకే వందల కోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా హుజురాబాద్లో గెలిచేది మాత్రం ఈటల రాజేందరేనని జోస్యం చెప్పారు. బీజేపీలో చేరకపోయినా తన సంపూర్ణ మద్దతు ఆయనకేనని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు తనకు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. తాను మాత్రం ఆయనకు అనుకూలంగా పని చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: ఎన్నిక వచ్చినప్పుడల్లా సవాలేనా?: ఎమ్మెల్సీ కవిత రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం కేసీఆర్ సీఎం అయ్యాక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు తీరని అన్యాయం చేశారన్నారు. రూ.15,000 కోట్లు ఖర్చు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ను చేపట్టారని ఆరోపించారు. జిల్లాకు సాగునీరిస్తానని చెప్పి, ఎడారిగా మార్చేశారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికొదిలేసి జిల్లాలో కొత్తగా మరో మూడు ఆస్పత్రులు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
తండ్రి గేమ్ ఆడొద్దన్నాడని ఇంటర్ విద్యార్థిని దారుణం..
సాక్షి, రంగారెడ్డి : సెల్ఫోన్లో గేమ్స్ ఆడొద్దని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యారి్థని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాపూర్కు చెందిన వెల్దుర్తి మనోహరాచారి, లావణ్య దంపతులు. పదేళ్లుగా మీర్పేట సర్వోదయనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమార్తెలు కౌశికి (17), అనుశ్రీ, కుమారుడు రేవంత్ ఉన్నారు. పెద్ద కుమార్తె కౌశికి ఐఎస్సదన్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరచూ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతుండడాన్ని గమనించిన తండ్రి ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో గేమ్స్ ఆడడం ఆపేసి పడుకోవాలని మందలించి బయటకు వెళ్లాడు. చదవండి: ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది! మనస్తాపానికి గురైన కౌశికి క్షణికావేశంలో బెడ్రూంలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. గదిలో నుంచి అరుపులు వినపడడంతో గమనించిన తల్లి కిటికీలోంచి చూడగా కౌశికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. అదే గదిలో పడుకున్న చిన్న కుమార్తె అరుపులకు లేచి గడియ తీసింది. వెంటనే తల్లి స్థానికుల సాయంతో కౌశికిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్రెడ్డి తెలిపారు. చదవండి: చెరువులో మునిగి నలుగురు హైదరాబాద్ యువకులు మృతి -
మహిళా ఆర్ఎంపీ నెంబర్ తీసుకుని.. ఫోన్లు, మెసేజ్లు.. ఏకంగా క్లినిక్కు వెళ్లి..
సాక్షి, మొయినాబాద్(రంగారెడ్డి): మహిళా ఆర్ఎంపీ డాక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్థించిన వ్యక్తిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దమంగళారంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారం గ్రామానికి చెందిన దళిత మహిళ(28) ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ గ్రామంలోనే క్లినిక్ నడుపుతుంది. అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్రెడ్డి అనే వ్యక్తి గత వారం రోజుల క్రితం క్లినిక్కు వెళ్లి చూపించుకున్నాడు. అదే సమయంలో ఆమె సెల్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ప్రతిరోజు ఫోన్లు చేస్తూ, మెసేజ్లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఈనెల 17న మళ్లీ క్లినిక్కు వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. లైంగిక దాడికి యత్నించడంతో ఆమె ప్రతిఘటించి క్లినిక్ నుంచి వెళ్లగొట్టింది. రాత్రి ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కుటుంబ సభ్యులు అతన్ని అడగడానికి ఇంటికి వెళ్లగాఅప్పటికే అతడు పరారయ్యాడు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితురాలి వాంగ్మూలం మేరకు అతనిపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్తో టీచర్పై.. కుటుంబం ఆత్మహత్య: తండ్రి వివాహేతర సంబంధమే కారణం! -
చెప్పులను పట్టుకోవాలని.. చెరువులోకి వెళ్లిన ఇద్దరు బాలురు
సాక్షి, హయత్నగర్/లింగోజిగూడ: జారిన చెప్పులను పట్టుకోవాలని ప్రయత్నించి చెరువులో మునిగి బాలుడు మృతి చెందగా చెట్టుకొమ్మను పట్టుకొని మరో బాలుడు తన ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ ఘటన మంగళవారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తట్టిఅన్నారం హనుమాన్నగర్ కాలనీలో నివాసం ఉండే రావుల వాసుదేవరెడ్డి కుమారుడు ధీరజ్రెడ్డి భార్య సింధుతో కలిసి గతంలో ఆస్ట్రేలియా వెళ్లారు. వీరికి కుమారుడు రావుల రిషిత్రాంరెడ్డి(8). ఆస్ట్రేలియాలో ఉండగానే సింధు మృతి చెందడంతో కుమారుడిని తీసుకొని మూడేళ్ల క్రితం ఇండియాకు తిరిగి వచ్చి తండ్రి వాసుదేవారెడ్డి వద్ద ఉంటున్నారు. అనంతరం ధీరజ్రెడ్డికి బెంగళూర్లో ఉద్యోగం రావడంతో తన కుమారుడిని తాత వద్దే వదిలేసి వెళ్లాడు. రిషిత్ ప్రస్తుతం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. బెంగళూరు నుంచి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న ఆయన వారం క్రితమే తిరిగి వెళ్లాడు. చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు ! మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రిషిత్ తన స్నేహితుడు మేఘనాథ్ను తీసుకొని సైకిల్పై బయటకు వెళ్లాడు. కాలనీకి ఆనుకొని తట్టిఅన్నారం ఊర చెరువు ఉండటంతో ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలోకి నీరు వచ్చి చేరింది. రిషిత్ సైకిల్ తొక్కుతుండగా మేఘనాథ్ వెనుక కూర్చున్నాడు. చెరువు సమీపంలోకి రాగానే సైకిల్ అదుపు తప్పి నీటిలో పడ్డారు. రిషిత్ చెప్పులు ఊడిపోవడంతో వాటిని తీసుకునేందుకు ఇద్దరూ చెరువు లోపలికి వెళ్లారు. లోతు ఎక్కువ ఉండటంతో రిషిత్ నీటిలో మునిగిపోగా మేఘనాథ్ పక్కనే ఉన్న చెట్టును పట్టుకొని ఉండి పోయాడు. సాయంత్రం సమయంలో అక్కడి నుంచి అరుపులు వినిపిస్తుండటంతో స్థానికంగా ఉన్న దేవాలయానికి వచ్చిన వారు బాలుడిని గమనించి స్థానికులకు విషయం చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ కృష్ణ, వి.మధు, రాణి తాడు సాయంతో మేఘనాథ్ను రక్షించారు. అక్కడే చెట్లలో ఇరుక్కుపోయిన రిషిత్ను కూడా బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం.. కారణం అదేనా?
శంషాబాద్(హైదరాబాద్): రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో రాత్రి పూట రక్షణగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వికారాబాద్ జిల్లా ఎన్కతల గ్రామానికి చెందిన ఆశయ్య(48) చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయంలో సెంట్రీ విధులు నిర్వర్తించడానికి ఆయా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లకు రోజువారీగా కేటాయిస్తారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు డ్యూటీ నిమిత్తం ఆశయ్య శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చాడు. సాయంత్రం ఉద్యోగులంతా వెళ్లిన తర్వాత ఒక్కడే ఉన్నాడు. ఆదివారం ఉదయం మరో ఎక్సైజ్ కానిస్టేబుల్ కార్యాలయానికి వచ్చే సరికి ఓ గదిలో ఆశయ్య ఫ్యాన్కు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆశయ్యకు అతిగా మద్యం తాగే అలవాటున్నట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగిన తర్వాతే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అతడికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉండడంతో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా గుండె ఆపరేషన్ చేసుకున్న తనకి సెంట్రీ విధులు వేయడంపై కూడా మనస్తాపంతో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కత్తులు పట్టుకొని బాలీవుడ్ డైలాగులు.. వాట్సాప్ స్టేటస్ -
రంగారెడ్డి జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రియల్ రంగం
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలో రియల్ రంగం మళ్లీ ఊపందుకుంది. కోవిడ్ ఉధృతి, వరుస లాక్డౌన్ల కారణంగా కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రియల్ వ్యాపారం క్రమంగా పుంజుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు జిల్లాలో జరిగిన రిజి్రస్టేషన్లు, వాటి ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయాన్ని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతుంది. ఈ ఐదు మాసాల్లో 95,049 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా, భూ క్రయవిక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.1,088 కోట్ల ఆదాయం సమకూరింది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక భూ క్రయవిక్రయాలు జరిగిన జిల్లాల్లో రంగారెడ్డే టాప్లో ఉండటం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో మేడ్చల్ ఉంది. కోవిడ్లోనూ పెట్టుబడుల వరద ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ అనుబంధ రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపింది. అనేక సంస్థలు సంక్షోభంలో కూరుకుపోయాయి. లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఈ క్లిష్ట సమయంలోనూ రంగారెడ్డి జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తక్కువ ధరకే కావాల్సినంత భూమిని ప్రభుత్వం సేకరించి ఇస్తుండటం, ప్రత్యేక పారిశ్రామిక వాడల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, 24 గంటల కరెంట్ సరఫరా, సబ్సిడీ, పన్నుల నుంచి మినహాయింపు, రక్షణ పరంగా ఈ ప్రాంతం అనుకూలంగా ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. టాటా, పీ అండ్ జీ, విప్రో, పోకర్ణ గ్రానైట్స్, ప్రీమియర్ ఎనర్జీస్, చిర్పాల్ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందుకు వచ్చాయి. గతంలో వ్యవసాయ భూములు ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో జరుగుతుండేవి. ప్రస్తుతం ధరణి రాకతో తహసీల్దార్ కార్యాలయాల్లోనూ భూముల రిజి్రస్టేషన్ల ప్రక్రియ సులభతరమైంది. భూముల ధరలను కూడా ఇటీవల ప్రభుత్వం సవరించింది. స్టాంప్ డ్యూటీని 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. ఫలితంగా 2019తో పోలిస్తే ఈ సారి రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ల సంఖ్య తగ్గినా.. స్టాంప్డ్యూటీ పెంపుతో ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు స్థాయిలో రావడం విశేషం. మచ్చుకు కొన్ని సంస్థలు జిల్లాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా ఔటర్ రింగ్రోడ్డు ఉండటం పారిశ్రామిక వేత్తలకు కలసి వచి్చంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుండటంతో ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కూడా జిల్లాపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ కంపెనీలకు సమీపంలో ఆకర్షణీయంగా రియల్ వెంచర్లు చేసి క్రయవిక్రయాలు జరిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని రైతుల భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీగా కాసులు వచ్చి చేరుతున్నాయి. ► ప్రముఖ బహుళజాతి కంపెనీ అమేజాన్ కందుకూరు మండలం మీర్ఖాన్పేట్, షాబాద్, చందనవెల్లి, యాచారంలోని మేడిపల్లిలో డాటా సెంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ► ఇబ్రహీంపట్నం సమీపంలో 19,333 ఎకరాల్లో రూ.64 వేల కోట్ల వ్యయంతో ఫార్మాసిటీ వస్తుంది. దీని ద్వారా 1.70 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ►శంకర్పల్లి కొడకల్ వద్ద రూ.800 కోట్లతో మేధా ఆధ్వర్యంలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతోంది. ►అబ్ధుల్లాపూర్మెట్ బాటసింగారంలో రూ.35 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో, ఇబ్రహీంపట్నంలోని మంగల్పల్లిలో 22 ఎకరాల్లో రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. ►ఇప్పటి వరకు టీఎస్ఐపాస్ కింద రూ.19,0028 కోట్ల పెట్టుబడితో 892 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 2.92 లక్షల మందికి ఉపాధి లభించింది. మరో రూ.3,971 కోట్ల పెట్టుబడి తో 11 భారీ పరిశ్రమలు రాబోతున్నాయి. వీటి ద్వారా 7,460 మందికి ఉపాధి లభించనుంచనుంది. -
పెళ్లి దుస్తుల్లోనే విగతజీవిగా ప్రవళిక.. పాడె మోసిన ఎమ్మెల్యే ఆనంద్
సాక్షి, వికారాబాద్: వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయిన సంఘటనతో మోమిన్పేట, రావులపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. మోమిన్పేటకు చెందిన సింగిడి దర్శన్రెడ్డి కుమార్తె ప్రవళికను మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్రెడ్డికి ఇచ్చి శుక్రవారం వివాహం జరిపించారు. ఆదివారం ఉదయం తమ బంధువులతో కలిసి మోమిన్పేటకు వచ్చిన నవాజ్రెడ్డి విందు ముగించుకుని సాయంత్రం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తిమ్మాపూర్ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంత చెప్పినా వినకుండా కారు డ్రైవర్ రాఘవేందర్రెడ్డి వాహనాన్ని వాగు దాటించే ప్రయ త్నం చేశాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు రెండో సోదరి శ్వేత మృతిచెందారు. బాలుడు శశాంక్రెడ్డి ఆచూకీ లభ్యం కాలేదు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే.. పెళ్లి కారు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమవారం ఉదయమే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో కలిసి గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. వాగు ప్రవాహం, బురద నీటిలో నాలుగు కిలోమీటర్లు నడిచారు. వధవు ప్రవళిక, పెళ్లి కొడుకు అక్క శ్వేత మృతదేహాలు దొరకడంతో స్వయంగా పాడెకట్టి, ఒడ్డుకు చేర్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మోమిన్పేటలో ప్రవళిక అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ప్రవళిక పెళ్లి దుస్తుల్లోనే విగత జీవిగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టించింది. నవ వధువు తల్లిదండ్రులు రోధించిన తీరు కలచివేసింది. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సబితా వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని, రావులపల్లిలో వరుడు నవాజ్ రెడ్డి కుటుంబాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ఆమెతోపాటు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మేతుకు ఆనంద్ ఉన్నారు. అదే విధంగా శంకర్పల్లి మండలం కొత్తపల్లి ఎల్లమ్మ వాగులో కారులో గల్లంతై మృతి చెందిన ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య కుటుంబ సభ్యులను కూడా మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు పడే సమయంలో రోడ్లపై, కల్వర్టుల వద్ద వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ చెప్పినట్లు వెల్లడించారు. డ్రైవర్ బతికే ఉండు.. వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ రాఘవేందర్రెడ్డి ఆదివారం రాత్రే ప్రమాదం నుంచి బయటపడ్డాడని డీఎస్పీ సంజీవరావు తెలిపారు. మర్పల్లి పీఎస్లో సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కిలోమీటర్ దూరం వెళ్లి, చెట్టు కొమ్మలకు తట్టుకుని ఆగిందన్నారు. ఈ సమయంలో డ్రైవర్ కారులో నుంచి నీటిలో దూకి, ఈదుకుంటూ వెళ్లి రెండు గంటల పాటు చెట్టు కొమ్మలు పట్టుకుని ఉన్నాడన్నారు. వరద తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఒడ్డుకు చేరుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తనకు ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని భయపడి అదే రాత్రి అంరాద్కుర్దు గ్రామానికి వెళ్లి బంధువుల ఇంట్లో దాక్కున్నట్లు స్పష్టంచేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి రాఘవేందర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుడి దుర్మరణం మోమిన్పేట మండల పరిధిలోని ఏన్కతలకు చెందిన శామల వెంకటయ్య(60) ఆదివారం గ్రామానికి చెందిన శ్రీనివాస్, సాయిలతో కలిసి కారులో కౌకుంట్లకు బయలుదేరారు. తిరిగి వచ్చే క్రమంలో శంకర్పల్లి మండలం కొత్తపల్లి వద్ద కారు వరద నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో శ్రీనివాస్, సాయి ప్రాణాలతో బయటపడగ వెంకటయ్యమృతి చెందాడు. సోమవారం ఏన్కతలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా..
సాక్షి, కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్(23) బేగకరికంచె సమీపంలోని అమెజాన్ కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామం నుంచి విధులకు హాజరుకావడానికి మధ్యాహ్నం సమయంలో బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో రాచులూరు–కటికపల్లి మార్గంలో కటికపల్లి నుంచి మట్టిలోడ్తో వస్తున్న టిప్పర్, బైక్ను ఢీకొనడంతో టిప్పర్ చక్రాల కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడికి తండ్రి, చెల్లెలు ఉన్నారు. నెలరోజుల క్రితమే మృతుడి తల్లి ఆండాలు చనిపోవడం, ఇప్పుడు కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. గ్రామస్తులు,బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి -
కనెక్షన్ల పేరుతో కలెక్షన్.. మేం ఫిక్స్ చేసిందే రేటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: కొత్త విద్యుత్ లైన్లు.. మీటర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. అడిగినంత ఇచ్చేందుకు నిరాకరించిన వారికి కొర్రీలు పెట్టి రోజుల తరబడి కనెక్షన్లు జారీ చేయడం లేదు. జిల్లా పరిధిలోని చంపాపేట, గచ్చిబౌలి, శంషాబాద్, రాజేంద్రనగర్, సరూర్ నగర్, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కందుకూరు, సైబర్సిటీ డివిజన్లలో పని చేస్తున్నఇంజనీర్లపైపెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. చర్యలు తీసుకోవాల్సిన యాజమాన్యమే పరోక్షంగా వారికి సహకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ► ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి భిన్నమైంది. అంతర్జాతీయ విమానాశ్రయం సహా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు, ఐటీ అనుబంధ కంపెనీలు, భారీ పరిశ్రమలు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ► ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ వ్యాపారానికే కాకుండా అంతర్జాతీయ పారిశ్రామిక రంగానికి కేంద్ర బిందువుగా మారింది. ► కొత్తగా అనేక వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. ► వ్యవసాయం సహా మరే ఇతర రంగం మనుగడైనా విద్యుత్పైనే ఆధారపడి ఉంటుంది. ► గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వారి అవసరాల కోసం విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా డిస్కంకు దరఖాస్తు చేసుకుంటున్నాయి. ► 18 మీటర్లు దాటిన బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్, మున్సిపాలిటీ, ఎయిర్పోర్ట్ అథారిటీల నుంచి ఎన్ఓసీ తప్పనిసరి. ► ప్రస్తుత భవనాల్లో చాలా వరకు నిబంధనల మేరకు లేకపోవడం విద్యుత్ ఇంజనీర్లకు కలిసివస్తోంది. ► కొత్త లైన్లు సహా కొత్త మీటర్ల జారీ, ప్యానల్ బోర్డులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలను సాకుగా చూపి కనెక్షన్ల జారీలో జాప్యం చేస్తున్నారు. ► క్షేత్రస్థాయిలోని ఏఈ వేసిన ఎస్టిమేషన్ ఛార్జీలను చెల్లించినప్పటికీ ఇంజనీర్లు మాత్రం పైసా విదల్చనిదే ఫైలు ముందుకు కదపడం లేదు. ఒక్కో పనికి ఒక్కో రేట్ ఫిక్స్ ► జిల్లాలో మొత్తం 17,18,745 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో సైబర్ సిటీలో 5,51,107, రాజేంద్రనగర్లో 5,36,743, సరూర్నగర్ సర్కిల్ పరిధిలో 6,30,895 కనెక్షన్లు ఉన్నాయి. ► ఒక్కో సర్కిల్ పరిధిలో నెలకు సగటున రెండు వేల కొత్త కనెక్షన్లు వస్తుంటాయి. ► కొత్త మీటర్ జారీకి రూ.1000 నుంచి రూ.1,500 వసూలు చేస్తుండగా, ప్యానల్ బోర్డుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకుంటున్నారు. ► ఇక అపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ కావాలంటే మీటర్లు, ప్యానల్ బోర్డు సహా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫ్రార్మర్లకు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తుండడం విశేషం. ► తుర్కయంజాల్, తుక్కుగూడ, బడంగ్పేట్, మీర్పేట్, పెద్ద అంబర్పేట్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, కొత్తూరు, బండ్లగూడ జాగీర్, నానక్రాంగూడ, నార్సింగి, రాజేంద్రనగర్, మెయినాబాద్, షాద్నగర్ తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజనీర్లపై ఉన్నతాధికారులకు ఎక్కువగా ఈ తరహా ఫిర్యాదులు అందుతున్నాయి. పెండింగ్లో 3,589 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు ► వరి, ఇతర పంటలు సాగు చేసుకునేందుకు జిల్లాలో ఇప్పటికే వేలాది మంది రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ► సైబర్సిటీలో 909, రాజేంద్రనగర్లో 1,712, సరూర్నగర్లో 968 దరఖాస్తులు పెండింగ్లో ఉండటం గమనార్హం. ► ఐపీడీఎస్ పథకం కింద డిస్కం జిల్లాకు సరఫరా చేసిన ట్రాన్స్ఫార్మర్లను వాణిజ్య, పారిశ్రామిక, బహుళ అంతస్తుల భవనాలకు మళ్లించి రూ.లక్షలు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ► కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని, ఎస్టిమేషన్ మేరకు బిల్లు చెల్లించిన రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ► 2021–22 వార్షిక సంవత్సరంలో 2,300 కనెక్షన్లు జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించి ఇప్పటి వరకు 1,377 కనెక్షన్లు మాత్రమే జారీ చేశారు. -
పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య
సాక్షి, అబ్దుల్లాపూర్మెట్:మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో ఇంట్లోని నీటి ట్యాంకులో రెండు నెలల చిన్నారి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా చిన్నారి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీ వీడింది. ఈ ఘటనను పోలీసులు హత్యకేసుగా తేల్చారు. తమకు పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి మేనమామ, అత్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే వారిని అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. విషయంలోకి వెళితే.. అనాజ్పూర్కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్పూర్లోని పుట్టింట్లో తమ్ముడు బాల్రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో బాలుడు విగతజీవిగా తేలాడు. చదవండి: దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో -
అనాజ్ పూర్ లో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన దుండగులు
-
తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే..
సాక్షి, తలకొండపల్లి( రంగారెడ్డి జిల్లా): తెల్లవారితే.. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని మెదక్పల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగంగౌడ్ దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్గౌడ్(26) గతంలో నగరంలో పనిచేస్తుండేవాడు. కొన్నిరోజల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. శుక్రవారం అతడి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కందుకూరు మండలం కొత్తగూడెంకు చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు 20 రోజుల కితం నిశ్చితార్థం కూడా చేశారు. అయితే, బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీకాంత్గౌడ్ భోజనం చేసి తమ పాత ఇంట్లో నిద్రించాడు. గురువారం తెల్లవారుజామున అతడి అన్న ప్రభాకర్గౌడ్ వెళ్లి నిద్రలేపి అతడి వద్ద ఉన్న బైకు తాళంచెవి తీసుకొని పొలానికి వెళ్లాడు. మేడికొమ్మ తీసుకొచ్చి కొత్త ఇంట్లో పందిరి వేసేందుకు సిద్ధం చేశాడు. తిరిగి 5 గంటలకు ప్రభాకర్గౌడ్ పాతఇంటికి వెళ్లి పెళ్లికొడుకును చేసేందుకు శ్రీకాంత్గౌడ్ను నిద్రలేపే యత్నం చేయగా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు బోరుమన్నాడు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడి సెల్ఫోన్, ఆత్మహత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ తెలిపారు. కాగా, శ్రీకాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అతడి ఇష్టం మేరకే పెళ్లి.. శ్రీకాంత్గౌడ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి అభీష్టం మేరకే.. అతను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు మృతుడి సోదరుడు ప్రభాకర్ తెలిపాడు. శ్రీకాంత్గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి : 27 రోజులు.. 27 లక్షలు... ఐనా దక్కని ప్రాణం...! -
సీఐ చాంబర్లో కాలుతో తన్ని.. బూతులు తిట్టిన బీజేపీ నేత’
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో గిరిజనుడిని మాడ్గుల సీఐ పోలీస్ స్టేషన్లో విచారణ చేస్తుండగా.. అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు ఆ గిరిజనుడిని కాలుతో తన్నిన దృశ్యాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మాడ్గుల మండలం ఇరి్వన్ పంచాయతీ పరిధిలోని గాంగ్యానగర్తండాకు చెందిన వడ్త్యావత్ శంకర్(28) ఏప్రిల్ 19న హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనపై మాడ్గుల సీఐ ఉపేందర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీఐ చౌటకుంట తండాకు చెందిన ప్రత్యక్ష సాక్షిగా భావించిన మేరావత్ పాండు అనే వ్యక్తిని ఇటీవల పోలీస్ స్టేషన్కు పిలిపించి తన ఛాంబర్లో మాజీ ప్రజాప్రతినిధి, మరో బీజేపీ నాయకుడి ముందు విచారణ చేపట్టారు. విచారణ సమయంలో కుర్చీలో కూర్చున్న బీజేపీ నాయకుడు.. విచారణ ఎదుర్కొంటున్న పాండును వెనక నుంచి కాలుతో తన్నుతూ అసభ్యకరంగా దూషించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. కాగా మాడ్గుల పోలీస్ స్టేషన్లో మేరావత్ పాండును కాలితో తన్ని బూతులు తిట్టిన బీజేపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు నేనావత్ హన్మానాయక్రాథోడ్ శుక్రవారం డిమాండ్ చేశారు. నేను గమనించలేదు: సీఐ పాండును బీజేపీ నాయకుడు తన చాంబర్లో తన్నినట్లు తాను గమనించలేదని సీఐ ఉపేందర్రావు చెప్పారు. దీనిపై పాండు ఫిర్యాదు చేస్తే సదరు నాయకుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: దేవరయాంజల్: పేపర్ వార్తల ఆధారంగా జీవోలు ఇస్తారా? -
గేదె గడ్డి మేసిన వివాదం, సోదరుడిపై హత్యాయత్నం
సాక్షి, రాజేంద్రనగర్: గేదెలు వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేసిన విషయమై ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాస్తా హత్యాయత్నానికి దారితీసింది.. బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఏసీపీ సంజయ్కుమార్ తెలిపారు. వివరాలు.. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఎం.బాల్రాజ్ అలియాస్ బాలయ్య (38), ఎం.రమేష్(37) వరుసకు సోదరులు. రమేష్కు చెందిన 3 గేదెలు బుధవారం రాత్రి వ్యవసాయ వర్సిటీలో గడ్డిమేశాయి. ఈ విషయాన్ని బాలయ్య వర్సిటీ అధికారులకు తెలపడంతో రమేష్కు అపరాధరుసుం విధించారు. ఇదేవిషమై గురువారం ఎన్ఐఆర్డీ కమాన్ వద్ద బాల్రాజ్, రమేష్ మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. బాల్రాజ్ తనవెంట తెచ్చుకున్న కొడవలితో రమేష్పై దాడి చేశాడు. స్థానికులు బాల్రాజ్ను నియంత్రించి కొడవలిని లాగివేయడంతో ప్రమాదం తప్పింది.తీవ్రంగా గాయపడ్డ రమేష్ను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా బాల్రాజ్.. రమేష్పై దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న రాజేంద్రనగర్కు చెందిన నారాయణ, నరేష్ ధైర్యంగా ముందుకు వెళ్లి బాల్రాజ్ను అడ్డుకుని గాయపడ్డ రమేష్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్ వారిని అభినందించారు. గతంలో బాల్రాజ్పై హత్యారోపణలు.. కాగా బాల్రాజ్పై గతంలో రెండు హత్యారోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. రాజేంద్రనగర్ ప్రాంతంలో బాల్రాజ్ నిత్యం మద్యం తాగి దౌర్జన్యం చేయడంతో పాటు దాడులకు పాల్పడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. సోదరుడిపై దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
కొడంగల్ రూరల్: వారసత్వంగా తన తండ్రికి చెందాల్సిన ఆస్తిని..ఇవ్వడం లేదన్న మనస్తాపంతో టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని హస్నాబాద్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. కొడంగల్ పట్టణానికి చెందిన కాంసన్పల్లి వెంకటయ్య కుమారుడు నిఖిల్ (16) చిన్నప్పటి నుంచి తన అమ్మమ్మ ఊరైన హస్నాబాద్లో నివాసం ఉంటూ అక్కడే పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు కాంసన్పల్లి వెంకటయ్య, అంజమ్మ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వెంకటయ్య తల్లిదండ్రులకు సంబంధించిన భూమి విషయంలో వెంకటయ్య, అతని అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ విషయంపై ఇటీవల పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సమయంలో నిఖిల్ తన పెదనాన్నలతో మాట్లాడి వారసత్వంగా తమకు చెందాల్సిన భూమిని తమ తండ్రి పేరున పట్టా చేయాలని అడగ్గా.. సరేనని చెప్పిన వారు కాలయాపన చేస్తుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి హస్నాబాద్లోని ఆరుబయటే నిద్రించిన నిఖిల్ రాత్రికి రాత్రి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున వృద్ధురాలు లేచి చూడగా..నిఖిల్ చెట్టుకు వేలాడుతూ కన్పించడంతో స్థానికుల సాయంతో కిందకు దించారు. అయితే అప్పటికే నిఖిల్ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతుడి అమ్మమ్మ బెస్త చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. చదవండి: ఎకరా పొలం ఉన్నా బతికేటోళ్లం! -
భార్యతో గొడవ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్మ
పటాన్చెరు టౌన్ : భార్యతో గొడవపడి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాల్తూరు గ్రామానికి చెందిన అల్లూరి నాగవెంకట సత్యభార్గవ్ (27) చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సత్యభార్గవ్ నాలుగు నెలల క్రితం అదే జిల్లాకు చెందిన బంధువుల అమ్మాయి మంజును హైదరాబాద్ ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చెన్నై వెళ్లి ఇద్దరికి నచ్చజెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరిలో సత్యభార్గవ్ భార్య మంజుతో కలసి పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం సాయికాలనీకి వచ్చి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో 21వ తేదీన సత్యభార్గవ్ భార్య మంజు గొడవపడ్డారు. దీంతో సత్యభార్గవ్ తన తమ్ముడికి ఫోన్ చేసి ఇంట్లో గొడవ జరిగిందని నేను స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సోమవారం మృతుడి తమ్ముడు రవితేజ ఇంద్రేశం ఇంటికి రాగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా హాల్లో సీలింగ్కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేçహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నా: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (రాజన్న) రాజ్యం రావాలని, ఆయన సంక్షేమ పాలన తేవాలని వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. క్షేత్రస్థాయిలో మీతోడు ఉంటే అది సాధ్యమని నమ్ముతున్నానని వెల్లడించారు. శనివారం లోటస్ పాండ్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో వైఎస్సార్ అభిమాన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. బ్యాండ్ మేళాలు, లంబాడీ నృత్యాలతో కార్యాలయ ఆవరణ అంతా అభిమానులతో సందడిగా మారింది. వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం షర్మిల మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజలందరినీ ప్రేమించారన్నారు. ప్రతీ రైతు రాజు కావాలనే తపనతో రైతు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారన్నారు. అందుకే ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక అనేక మంది తెలంగాణలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లోటస్ పాండ్ ఆవరణలో వైఎస్సార్ అభిమానులకు అభివాదం చేస్తున్న షర్మిల డబ్బుల్లేక చదువు ఆపేయొద్దని, ప్రతీ పేద విద్యార్థి ఉచితంగా చదువుకునేలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెచ్చారని గుర్తు చేశారు. పేదవాడికి అనారోగ్యం వస్తే నేనున్నా అనే భరోసా ఇస్తూ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని, సొంత ఇళ్లు ఉండాలని గృహాలు నిర్మించి ఇచ్చారని వివరించారు. ఇలా ఎన్నో పథకాలు తెచ్చారు కాబట్టే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. రాజన్న బిడ్డ ఒక్క మాట పిలవగానే మనస్ఫూర్తిగా వచ్చినవారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. రాజన్న తెచ్చిన పథకాలన్నీ టీఆర్ఎస్ పాలనలో అందుతున్నాయా అని ప్రశ్నించారు. వారికి ఇచ్చిన 11 ప్రశ్నలకు ఫీడ్ బ్యాక్ అందించాలని కోరారు. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకోసం రూ.1,250 కోట్లు కేటాయించారని కొండా రాఘవరెడ్డి అన్నారు. ముస్లిం మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఔటర్రింగ్ రోడ్డు, గిరిజనులకు పోడు భూములు ఇచ్చారని అన్నారు. జై తెలంగాణ... జై జై తెలంగాణ.. జోహార్ వైఎస్సార్ అన్న షర్మిల నినాదాలతో సభ దద్దరిల్లింది. సమావేశంలో వెల్లాల రామ్మోహన్, భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 11 ప్రశ్నల ఫీడ్ బ్యాక్ ఇది.. ►రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏమిటి? వాటిని ఎలా తీర్చుకోవాలి? ►మీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతంలో వైఎస్సార్ చేసిన పనులు ఏమిటి? ►మనం తీసుకున్న రాజకీయ నిర్ణయం గురించి సామాన్య ప్రజలు ఏం అనుకుంటున్నారు? ►అధికారంలో ఉన్న కేసీఆర్/టీఆర్ఎస్ని మనం ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? ►రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి? మీరిచ్చే సలహాలు ఏమిటి? ►తెలంగాణ సమాజం/ ఉద్యమకారుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఏమిటి? వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే రాష్ట్ర స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే జిల్లా స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే అసెంబ్లీ, నియోజవర్గ స్థాయిలో పోరాడాల్సిన అంశాలు ఏమిటి? ►సంస్థాగతంగా బలపడటానికి, క్యాడర్ నిర్మాణానికి చేయాల్సిన పనులు ఏమిటి? ►వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరిచ్చే సలహాలు ఏమిటి? -
మాయగాళ్లు, ఖాళీ ప్లాట్లు కనిపిస్తే చాలు..
సాక్షి, మీర్పేట: ఖాళీ ప్లాట్లపై కన్నేసి యజమానులకు తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లను విక్రయించి మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మంది ముఠా సభ్యుల్లో ఇద్దరిని మీర్పేట పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నాదర్గుల్కు చెందిన వల్లాల ప్రేమ్కుమార్ (45), బాలాపూర్కు చెందిన చెరుకూరి కిరణ్కుమార్, శ్రీనివాస్నాయక్, కృష్ణారెడ్డి, హేమలత, నరేష్, వి.శివారెడ్డి, ఏ.సంతోష్, ఎలిమినేటి సుకుమార్రెడ్డిలు కలిసి 1980–90 నాటి వెంచర్లలోని ఖాళీ ప్లాట్లపై కన్నేసి వాటికి సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసి అసలు యజమానులకు తెలియకుండా ఇతరులకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. కాగా సికింద్రాబాద్ పద్మారావునగర్కు చెందిన అక్కాచెళ్లెల్లు తుమ్మల రమాదేవి, తుమ్మల యహేమలతలకు చెందిన మీర్పేట నందిహిల్స్ సర్వే నం.29లో రెండు ప్లాట్ల (నం–21, 22)కు సైతం 1985 నాటి నిజమైన పత్రాలను పోలి ఉండేలా నకిలీ పత్రాలను తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ప్లాట్ల యజమానులు రమాదేవి, హేమలత వెంటనే మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెరుకూరి కిరణ్కుమార్తో కలిసి మొత్తం 8 మంది సభ్యులు మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిలో ఏ3గా ఉన్న వల్లాల ప్రేమ్కుమార్, ఏ6గా ఉన్న ఎలిమినేటి సుకుమార్రెడ్డిలను శుక్రవారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నకిలీ పత్రాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో హస్తినాపురం మాజీ కార్పొరేటర్ సోదరుడు కూడా ఉన్నాడని సీఐ పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు నుంచి దూకిన వ్యక్తి మృతి
సాక్షి, కొడంగల్ రూరల్ : బస్సు నుంచి కిందకు దూకి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని రావులపల్లిలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావులపల్లి గ్రామ స్టేజీలో దౌల్తాబాద్ మండలం గోకఫస్లాబాద్ గ్రామానికి చెందిన పొలంసాయన్నోళ్ల రాములు (50)ను ఆయన భార్య మదారమ్మ ఆర్టీసీ బస్సులో ఎక్కించింది. అయితే బస్సు ప్రయాణిస్తున్న సమయంలో రాములు బస్సు నుంచి కిందకు దూకాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థంలోనే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష్య సాక్షుల కథనం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్రెడ్డి తెలిపారు. -
కల్తీ కల్లు కలకలం.. 183 మందికి అస్వస్థత
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో కల్లు సేవించి ఓ వ్యక్తి మృతి చెందడం. ఒకేసారి 183 మంది అస్వస్థతకు గురవడం కలకలం రేపింది. బాధితులు ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోవడం.. వాంతులు, మూర్చతో గిలగిలా కొట్టుకోవడం చూసి జనం బెంబేలెత్తిపోయారు. వెంటనే వారిని వికారాబాద్, హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. అలాగే.. 11 కల్లు దుకాణాలు, ఒక డిపోను అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. నవాబ్పేట మండలం చిట్టిగిద్ద కల్లుడిపో నుంచి నవాబ్పేట, వికారాబాద్ మండలాల్లోని 11 గ్రామాలకు ప్రతిరోజు కల్లు సరఫరా అవుతోంది. శుక్రవారం సాయంత్రం కల్లు సేవించినవారు చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇలా ఈ డిపో పరిధిలో మొత్తం 183 మంది అస్వస్థతకు గురయ్యారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి మృతి చెందాడు. నవాబ్పేట మండలంలో 119 మంది, వికారాబాద్ మండలంలో 64 మంది అస్వస్థతకు గురైన వారిలో ఉన్నారు. కాగా, ఆయా ఆస్పత్రుల్లో 57 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు. పెండ్లిమడుగుకు చెందిన కిష్టారెడ్డి కల్తీ కల్లు కారణంగానే మృతి చెందాడా? లేదా అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని పేర్కొన్నారు. మత్తు మందే కారణమా..? కల్లు సేవించిన 183 మంది అస్వస్థతకు మత్తు మందు కారణమని తెలుస్తోంది. మత్తు మోతాదు తక్కువ అయితే కల్లుతాగిన వారిలో విత్డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయని, ప్రస్తుతం వీరంతా ఈ లక్షణాల కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అధికారులు చెబుతున్నారు. కాగా, కల్తీ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డిపో, 11 కల్లు దుకాణాలు సీజ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఖురేషీ తెలిపారు. చిట్టిగిద్ద కల్లుడిపో, 11 గ్రామాల్లోని కల్లు దుకాణాలను సీజ్ చేశామన్నారు. కల్లు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. కల్తీకల్లుగా నిర్ధారణ అయితే డిపో నిర్వాహకులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, రైతు కిష్టారెడ్డి కల్లు తాగి మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సంజీవరావు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం: సబిత వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని శనివారం మంత్రి సబితారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపినట్లు పేర్కొన్నారు. -
‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’
సాక్షి, రంగారెడ్డి: రైతుల పట్ల సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల అభివృద్ధికి పాటుపడాల్సిన సర్కార్.. రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తుందని విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని సభ పెట్టి మరీ తిట్టి.. రైతుల బంద్కు మద్దతు తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు అదే నూతన వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. స్వయాన రైతును అని చెప్పకునే కేసీఆర్కు రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. (చదవండి: టీఆర్ఎస్కు షాక్.. మున్సిపల్ చైర్మన్ గుడ్బై) రైతుల పొట్ట కొట్టే నూతన చట్టాలకు మద్దతు ఇవ్వడం బాధాకరమన్నారు. ఎక్కడ తను చేసిన అవినీతి బయటపడుతుందోనని భయపడి కేసీఆర్ ఇప్పుడు మోదీ పంచన చేరాడని విమర్శించారు. రాష్ట్రంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారని వారిని జీవితాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగాథంలోకి నెట్టుతున్నాయని మండిపడ్డారు. రైతులకు అండగా ఉండేందుకు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలుకు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఐకేపీ కేంద్రాలను ఇకపై రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం దారుణమన్నారు.(చదవండి: కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి) కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథలో లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ కేసీఆర్.. రైతులకు ఇచ్చిన రూ.7500 కోట్లు ప్రభుత్వానికి నష్టమని తెలపడంపై మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన నిధులను నష్టంగా భావిస్తున్న కేసీఆర్కు కర్షకుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. దేశానికే అన్నం పెడుతున్న రైతన్న నోట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మట్టి కొడుతున్నాయని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో నూతన చట్టాల అమలును విరమించుకోకుంటే ఢిల్లీ తరహాలో రైతు ఉద్యమం చేపడుతామని కోమటిరెడ్డి స్పష్టంచేశారు. ఎల్ఆర్ఎస్పై హైకోర్టులో వేసిన పిటిషన్ జనవరి 9న విచారణ ఉందని, ఆ విషయంలో న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టవద్దని తెలిపారు. త్వరలోనే ఎల్ఆర్ఎస్ రద్దు కొరకు బాధితులతో కలిసి నిరాహార దీక్ష చేయనున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్ర సర్కార్ దిగిరాకపోతే ప్రగతిభవన్ ముట్టడితో పాటు పోరాటాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణ మారిందన్నారు. అప్పుల బాధలతో రైతులు, ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి భ్రష్టుపడిందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రైతులు, యువతకు న్యాయం చేస్తామని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భరోసా ఇచ్చారు. -
టీఆర్ఎస్కు షాక్.. మున్సిపల్ చైర్మన్ గుడ్బై
సాక్షి, హైదరాబాద్ : దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వరుస ఓటములను ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఊహించిన షాక్ ఎదురైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. గతకొంతగా ఆ పార్టీ నాయకత్వ తీరుతో తీవ్రంగా విభేదిస్తున్న మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక ప్రవీణ్ గౌడ్ సోమవారం రాజీనామా సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందిన ప్రవీణ్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేతలతో విభేదించిన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. (మేయర్ ఎన్నిక.. కార్పొరేటర్లకు 5కోట్లు) -
సీఐపై కిరోసిన్ దాడి.. హత్యాయత్నం కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : జవహర్నగర్ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్పై కిరోసిన్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న మేడ్చల్ జిల్లా జవహర్నగర్లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. (కూల్చివేతలో ఉద్రిక్తత) ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్ అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆక్రమణదారులు పూనమ్ చంద్, నిహాల్ చంద్, శాంతిదేవి, నిర్మల్, బాల్సింగ్, చినరాం పటేల్, గీత, గోదావరి, యోగి కమల్, మదన్పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. వీరితోపాటు స్థానిక నాయకులు శంకర్, శోభారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్కాజ్గిరి డీసీపీ రక్షితామూర్తి దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. భూ కబ్జాదారుల దాడిలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్ అరుణ్ సికింద్రాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటన నేపథ్యమిదీ.. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబర్ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్కుమార్ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్ కేంద్రంగా మున్సిపల్ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్నగర్ వాసి పూనమ్ చంద్ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్ అధికారులను పూనమ్ చంద్ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు విసిరారు. -
కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది
సాక్షి, షాద్నగర్ : ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది.. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది... ఓ అమ్మాయి పట్ల జరిగిన దారుణ మారణ కాండ ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురయ్యేలా చేసింది.. దిశ ఉదంతం.. మహిళ రక్షణ దిశగా పోలీసులకు కొత్త దిశను చూపింది.. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై షాద్నగర్ శివారులలో ముగిసిన దిశ విషాదం వెలుగు చూసి నేటికి ఏడాది అయ్యింది. ప్రతి ఒక్కరినీ కదిలించి కన్నీటితో ముంచిన ఈ ఘటన తరువాత జరిగిన పరిణామాలను ఓసారి నెమరేసుకుంటే.. 2019 నవంబర్ 27న సుమారు 8.30 గంటల ప్రాంతంలో అత్యవసర పరిస్దితుల్లో స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్ళిన దిశ నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చిన దిశ తన స్కూటీని తీసుకొని ఇంటికి వెళ్లాలని ప్రయత్నించింది. ఆ సమయంలో ఆ నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. అక్కడితో ఆగకుండా ఆమె ప్రాణాలను సైతం బలితీసుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్నగర్ శివారులోని చటాన్పల్లి బైపాస్ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్ 28న తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం నలుదిశలా పాకింది. ఈ దారుణం ప్రతి గుండెను కదిలించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (దిశ.. కొత్త దశ) ఎన్నో మలుపులు దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు నవంబర్ 29న షాద్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకరావడంతో ఇక్కడే వారిని ఎన్కౌంటర్ చేయాలని వేలాది మంది జనం పోలీస్స్టేషన్ ముందు ధర్నాను నిర్వహించారు. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లురువ్వడం, చెప్పులు విసరడంతో లాఠీ చార్జీ జరిగింది. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అదేరోజు నిందితులను తహిసీల్దార్ ఎదుట హాజరు పర్చారు. దీంతో 14రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు నిందితులను భారీ బందోబస్తు మధ్య షాద్నగర్ నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. డిసెంబర్ 2న నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు షాద్నగర్ కోర్టులో ఫిటీషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 3న కోర్టు పదిరోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. హంతకులు ఉపయోగించిన లారీలో కీలమైన ఆధారాలను డిసెంబర్ 5న సేకరించారు. షాద్నగర్ డిపో ఆవరణలో ఉంచిన లారీలో క్లూస్టీం బృందం ఆధారాలను సేకరించింది. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారు జామున నలుగురు నిందితులను సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు చటాన్పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. దీంతో నిందితులు పోలీసుల పైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు. నలుగురు నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. డిసెంబర్ 7న ఢిల్లీ నుండి మానవహక్కుల కమీషన్ బృందం దిశను ఆహుతి చేసిన ప్రాంతాన్ని, నిందితులు ఎన్కౌంటర్ జరిగిన స్ధలాన్ని పరిశీలించారు. డిసెంబర్ 9న దిశనను హతమార్చిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని క్లూస్టీం 3డీ స్కానర్తో చిత్రీకరించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన క్లూస్టీం బృందం చటాన్పల్లి బ్రిడ్డి వద్దకు చేరుకొని పరిశీలించారు. దిశను దహనం చేసిన ప్రదేశంతో పాటుగా, హంతకులను ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని పూర్తిగా 3డీ స్కానర్తో చిత్రీకరించారు డిసెంబర్ 11,15 తేదీల్లో క్లూంటీం బృంందాలు ఎన్కౌంటర్ ఘటనా స్ధలానికి వచ్చి మరిన్ని ఆధారాల కోసం వెతుకులాడాడు. డిసెంబర్ 23న ఎన్కౌంటర్కు గురైన మృతదేహాలకు హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎన్కౌంటర్కు గురైన మృతుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూకర్ సీబీఐ మాజీ డైరక్టర్ కార్తీకేయన్, వీఎన్ బాంబే హైకోర్టు మాజీ జడ్జి రేఖలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు విచారణ నిమిత్తం గత జనవరిలో హైదరాబాద్కు వచ్చారు. (వారిని ఏ తుపాకీతో కాల్చారు?) చట్టాలకు దిశ జాతీయ రహదారి పై టోల్ గేట్కు కూత వేటు దూరంలో జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాలుగా మారింది. పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ నేపధ్యంలోనే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ మహిళ రక్షణ దిశగా పోలీసులు కొత్త అడుగులు వేయడం ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగ రిత్యా బయటికి వెళ్లే మహిళల స్వీయ రక్షణ కోసం యాప్లు ఏర్పాటు చేయడం, కళాశాలల్లో మహిళా రక్షణ దిశగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిలో చైతన్యం తీసుకరావడం మహిళల నుండి పిర్యాదులు వస్తే వెంటనే స్వీకరించడం, వెంటనే దర్యాప్తు ప్రారంభించడం వంటి కార్యక్రమాలను విసృతం చేశారు. పోలీసు పెట్రోలింగ్లో సైతం వేగం పెంచారు. మరో వైపు పోలీసుల అప్రమత్తత దిశ నిందితుల ఎన్కౌంటర్ల ప్రభావం కారణంగా ఏడాది కాలంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల వంటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయనే చెప్పవచ్చు. అయితే మహిళలు కూడ ఒంటరిగా ఉన్న సమయంలో, రాత్రివేళల్లో బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని అత్యవసర పరిస్ధితుల్లో పోలీసు సేవలను వినియోగించుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. మహిళల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్ధించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు -
మైనర్తో అసభ్య చాటింగ్
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికతో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన యువకుడిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన భోపాల్ పోలీసులు శనివారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామానికి చెందిన సాయినాథ్రెడ్డిని అరెస్టు చేశారు. భోపాల్ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మైనర్ బాలికకు సాయినాథ్రెడ్డి నకిలీ ఫేస్బుక్ ఖాతా నుంచి అసభ్యకర మెసేజ్లు పెడుతున్నాడు. దీంతో సదరు బాలిక అక్టోబర్లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. (చదవండి: తోబుట్టువుల మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు) పోలీసులు ఫేస్బుక్ చాటింగ్ ఆధారంగా విచారణ చేపట్టగా, కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ఫేస్బుక్ ఐడీ నుంచి మెసేజ్లు వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలికను విచారించగా.. తన ఫేస్బుక్ ఖాతాను సాయినాథ్రెడ్డి సాయంతో తెరిచానని చెప్పడంతో శనివారం పోలీసులు సాయినాథ్రెడ్డిని అరెస్టు చేసి భోపాల్ తీసుకెళ్లారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని వారు తెలిపారు. కాగా తనను అనుమానిస్తున్నారని భావించిన ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలిక శనివారం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం శంషాబాద్ లీమ్స్ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: భార్య నగ్న వీడియోలు యూట్యూబ్లో..) -
భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా
షాద్నగర్ టౌన్ : తప్పుడు పత్రాలతో రుణాలు కొట్టేస్తూ, రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బు ఎగ్గొట్టే నైజం ఆ భర్తది. ఆ మోసాలకు వంతపాడే పాత్ర అతని భార్యది. ఇలా వీరిద్దరూ కలిసి రూ.5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరుపెట్టారు. చివరకు గుట్టురట్టయి పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం వివరాలను బుధవారం షాద్నగర్ ఏసీపీ సురేందర్ విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థను ఏర్పాటుచేసి షాద్నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే ఇవి గ్రామాలకు చివరన ఉండటంతో అమ్ముడుపోక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మోసానికి తెరలేచిందిలా.. షాద్నగర్ పరిధి సోలీపూర్ గ్రామ శివారులో ప్రభాకర్ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొని వెంచర్ వేసి, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన రుణం కోసం 2015లో షాద్నగర్లోని ఇండియన్ బ్యాంక్ను ఆశ్రయించారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించడంతో పాటు బోగస్ వ్యక్తుల్ని, వారి ఆధార్కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించి.. విడతలవారీగా రూ.5 కోట్లకుపైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో దివాకర్సింగ్కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్న వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అపార్ట్మెంట్ నిర్మాణదారుడు కిరణ్కుమార్రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్మెట్, కేపీహెచ్బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభాకర్ దంపతులు ఎంతకీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు. మోసం చేశారని గుర్తించి గత అక్టోబర్లో బ్యాంకు మేనేజర్ మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రభాకర్ దంపతులను అరెస్టు చేసేందుకు ఈనెల 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. ప్రభాకర్ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్నగర్ పట్టణ సీఐ శ్రీధర్కుమార్, సిబ్బంది చాకచక్యంగా వారిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. -
బెస్ట్ స్టూడెంట్.. జామకాయలు అమ్ముతూ..
సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): ఆమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. అయినా... తమ తోటలో పండే ఆర్గానిక్ జామకాయలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మాచర్ల రామన్న బర్కత్పురలో నివాసముంటున్నారు. ఈయన కూతురు అశ్రిత. తల్లి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేదు అయినప్పటికి అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్లింగంపల్లిలోని సుందరయ్యపార్కు ముందు ఆర్గానిక్ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. అశ్రిత ఇటీవల వెలుపడ్డ నీట్ పరీక్షా ఫలితాల్లో 843వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఎటువంటి బిడియం లేకుండా పార్కుల ముందు తమతోటలో కాసే జామకాయలను విక్రయిస్తూ మన్నన పొందుతోంది. రోజూ ఏదో ఒక పార్కు ముందు జామకాయలను విక్రయిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అశ్రితకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. చదవండి: నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల