నెల క్రితమే తల్లి మృతి: బాధను దిగమింగుకుని డ్యూటీకి వెళ్తుండగా.. | Young Man Died In Road Accident In ranga Reddy | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ చక్రాల కిందపడి.. యువకుడి దుర్మరణం 

Aug 30 2021 12:27 PM | Updated on Aug 30 2021 2:56 PM

Young Man Died In Road Accident In ranga Reddy - Sakshi

శ్రీనాథ్‌ (ఫైల్‌) 

సాక్షి, కందుకూరు: రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టిప్పర్‌ చక్రాల కిందపడి ఓ యువకుడు దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన తిరుగమళ్ల శ్రీనాథ్‌(23) బేగకరికంచె సమీపంలోని అమెజాన్‌ కంపెనీ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం గ్రామం నుంచి విధులకు హాజరుకావడానికి మధ్యాహ్నం సమయంలో బైక్‌పై బయలుదేరాడు.

మార్గమధ్యలో రాచులూరు–కటికపల్లి మార్గంలో కటికపల్లి నుంచి మట్టిలోడ్‌తో వస్తున్న టిప్పర్, బైక్‌ను ఢీకొనడంతో టిప్పర్‌ చక్రాల కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడికి తండ్రి, చెల్లెలు ఉన్నారు. నెలరోజుల క్రితమే మృతుడి తల్లి ఆండాలు చనిపోవడం, ఇప్పుడు కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతుంది. గ్రామస్తులు,బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్‌ చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు. సీఐ కృష్ణంరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
చదవండి: సూర్యాపేటలో సమాజం తలదించుకునే ఘటన
తీవ్ర విషాదం: వాగులో కొట్టుకుపోయిన కారు.. నవ వధువు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement